@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Techie_Researcher_Odisha_Bharata handle by: BM Adhikari

Aug 4, 2021, 19 tweets

శ్రీముఖలింగేశ్వర దేవాలయం : శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు ' పంచపీఠ ' స్థలముగా ప్రసిద్ధం . దీనినే ముఖలింగ క్షేత్రమని కూడా పిలుస్తారు . ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది .
1/n

ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ , జైన , హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది . చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు . నగరం , కళింగనగరం , కళింగదేశ నగరం , కళింగవాని నగరం , నగరపువాడ , త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది .
2/n

ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం,జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి.వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి.వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీశ9వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని,అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు
3/n

భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది . వీరిద్దరూ కళింగరాజులు . కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది . క్షేత్ర పురాణము : ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు . ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు .
4/n

ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది . ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు . ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు . ఇప్పచెట్టును సంస్కృతంలో ' మధుకం ' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని
5/n

అంటారు . ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి . ఇక్కడి అమ్మవారు వరాహిదేవి , సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి , మహేశ్వరి , కౌమారి , వైష్ణవి , ఇంద్రాణి . వీరు పార్వతీదేవి అవతారాలు . ఇక్కడి శిల్పాలలో వరాహావతారం , వామనావతారం ,
6/n

సూర్య విగ్రహం వుండటం విశేషం . భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది . ఇక్కడ కుమారస్వామి , దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ , గణపతి విగ్రహాలున్నాయి . సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది . ముఖమండపం లేదు . ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు . ఇది ఒకేరాయి . ఒకసారి
7/n

పిడుగుపడి ,ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది .ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు .అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో , ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం , ప్రజ్ఞ అర్థం అవుతాయి
8/n

ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం , వినాయకుడు , కాశీ అన్నపూర్ణ , నటరాజు , కొమారస్వామి , హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి . కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది . మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది .
9/n

చరిత్ర :
ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది . తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి , తన రాజధానిని క్రీ.శ .1135 లో ఒరిస్సా లోని కటక్ నగరమునకు మార్చిన
10/n

పిదప ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది . ఆనాటి వైభవుమునకు తాత్కారణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నవి.ముఖలింగం లోని పాశుపత శైవమత ప్రాబల్యమునకు నిదర్శనముగ అచ్చటి ఆలయములలో లకుశీలుడు విగ్రహములు పెక్కు ఉన్నాయి . లకుశీలుడు తను మత స్థాపకుడనియు ,
11/n

అతడు శివుని అవతారమనియు పాశుపత శైవమతస్థులు నమ్ముదురు . శైవమత గ్రంథములలో కూడా లకులీశుడు శివుని అవతారమనియు పేర్కొనబడెను.లింగ పురాణములో లకులీశుడు శివునియొక్క 28 వ అవతారముగ చెప్పబడెను.కాని లకులీశుడు మానవుడనియు , అతడు గుజరాత్ రాష్ట్రములోని కాయారోహణము
12/n

( కార్వాన్ ) పట్టణమున క్రీ.శ. 2 వ శతాబ్దములో జనించెననియు మనకు శాసనముల ఆధారముగ తెలియుచున్నది . లకులీశుడు ఎల్లప్పుడు లకుటమును ధరించుటచే ఆతనికి ఆ పేరు వచ్చెను . అతడు పాశుపత శైవమత సిద్ధాంతములకు ఒక రూపము తెచ్చి , ఆ మతప్రచారము చేసెను . లకులీశుని శిష్యులలో ముఖ్యులు
13/n

కుశినుడు , మిత్రుడు , గార్గుడు , కౌరుస్యుడు అనువారు . లకులీశుని నిరంతర కృషివలన ఆతని శిష్యులును , పాశుపత శైవ మతస్థుల సంఖ్యయు నానటికి పెరిగెను . మధ్యయుగము నాటికి పాశుపత శైవమతమునకు బహుళ ప్రాచుర్యము లభించి , ఆ మతస్థులలో లకులీశుడు దైవసంభూతుడే అను నమ్మకము గాఢముగ ఏర్పడెను .
14/n

మధ్యయుగ కాలములో పాశుపత శైవమతము గుజరాత్ , రాజస్థాన్ , రాష్ట్రములనుండి మధ పదేశ్ , అస్సాం , బెంగాల్ , ఒరిస్సా , ఆంధ్ర , తమిళనాడు , మైసూరు ప్రాంతములకు వ్యాపించి జనాదరణ పొందెను . ముఖలింగ ప్రాంతమునకు పాశుపత శైవ మతము క్రీ.శ 8 వ శతాబ్దములో ఒరిస్సానుండి వ్యాపించెను .
15/n

ముఖలింగములోని లకులీశుని విగ్రహములు భువనేశ్వరములోని లకులీశుని బిగ్రహములకు పోలిఉండును.ఇదే ఇక్కడి ముక్య విగ్రహము . గుజరాత్ లోను సోమేశ్వరాలయంలో ఈయని పద్మాసనమున కూర్చొని ఉన్న విగ్రహము ఉంది.ఆతనికి నాలుగు చేతులు ఉన్నాయి . రెండు చేతులు ధర్మచక్ర ప్రవర్తన ముద్రను చూపుచున్నవి .
16/n

మిగిలిన రెండు చేతులలో అక్షమాల , త్రిశులము ఉన్నాయి . ఆతని ఫాలభాగమున త్రిత్రము ఉంది.అతడు ఊర్ధ్వ లింగముతో చెక్కబడి ఉన్నాడు.ఆతని రెండు కళ్ళు సగము మూయబడి యోగముద్రలో ఉన్నట్లు ఉంది . అతను ఎల్లప్పుడు ధరించు లకుటము అతని ఎడమ భుజముపై ఆసించబడి , ఎడమ చేతితో చుట్టబడి ఉంది .
17/n

ఈవిధముగా ముఖలింగములో చెక్కుటవలన శిల్పి ఆతనిని శివుని అవతారముగా భావించానాడని చెప్పవచ్చును . ఈయన విగ్రహమునకు క్రింది భాగమున ఆతని శిష్యులు నల్గురు పద్మపు కాడకు రెండు వైపుల ఆశీనులై ఉన్నారు . ఆగూటి చుట్టును పాశుపత శైవమత గురువులు చిత్రములు చెక్కబడి ఉన్నాయి .
18/n

సోమేశ్వరాలయం లకులీశుని విగ్రహము ప్రాముఖ్యత ఏమనగా ఇచట ఈతడు చతుర్భుజుడుగా చెక్కబడియున్నాడు . ఇలా మరియొకచేట కనబడలేదు . ముఖలింగం లోని దేవాలయములు క్రీ.శ. 9 వ శతాబ్దమునుండి 11 వ శతాబ్దపు మధ్యకాలములో కట్టబడినవి.వాటిలో చివరిదైన సోమేశ్వరాలయము క్రీ.శ. 11 వ శతాబ్దమునాటిది
🙏

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling