'నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు గొప్పగా బ్రతుకు లేదా వేరే వారి బ్రతుకును కించపరుచు. ఈ రెండూ ప్రపంచానికి తెలియాలంటే అటెన్షన్ అవసరం'
౼ హరీష్ మీనన్
ట్విటర్ వల్ల ఉపయోగాలు ఏంటి? తమ తమ భావాలను వ్యక్తపరచటానికి ఒక చక్కని వేదిక. చాలా మంది ఇంట్రవర్ట్స్ తమ పేర్లు మార్చుకుని ఇక్కడ
చెలరేగిపోతుంటారు. నా లోంటోళ్లు ఏదైనా ఆలోచన వస్తే కథ, కవితా రూపంలో ఇక్కడ ట్వీట్ చేస్తుంటారు. మన సోషల్ సైడ్ బయటపెట్టే ప్లేస్ మాత్రమే కాకుండా తమలా ఆలోచించే మరో వ్యక్తి ఈ భూమ్మీద ఉన్నారా? అని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక మాధ్యమం ట్విటర్.
ఈ మధ్య ఒక వ్యక్తితో సంవాదం జరిగినప్పుడు
'ఎన్నడైనా పిల్లికి బిచ్చం వేశావా' అని అడిగాడు. సాయం చేస్తే ఇక్కడ ట్విట్టర్లో పెడితేనే అది సాయం అన్న ఒకరకమైన స్టేట్ ఆఫ్ మెంటల్ థింకింగ్'లో ఉన్నాడు అని అర్ధమైంది. అతని నేపథ్యం (pun intended) నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని తప్పుపట్టను. ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవటానికి డబ్బు సాయాన్ని
విషయాన్ని బోధించే వాడు ఉపాధ్యాయుడు అయితే విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా చేసే వాడు గురువు.
గరికపాటి నరసింహారావుగారి లాంటి అవధానులు, గురువులు నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దైనందిన జీవనంలో అప్లై చేసుకోవచ్చు. 'నేను ఆయన చెప్పేది నమ్మను, మా ఇంట్లో ఇలా చెయ్యం' అని మీరంటే అది మీ
ఖర్మ అంటాను. ఆ మధ్య మెడిసిన్ చేసిన బ్రాహ్మణ అమ్మాయి 'కేరళ వాళ్లకు హిందూ మతం మీద ఇంత ద్వేషం ఎందుకు' అని కామెంట్ చేసింది. కేరళ వాళ్లంతా క్రిస్టియన్స్ అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. నేను కల్పించుకునే సరికి కాసేపు వాదించి నన్ను బ్లాక్ చేసింది. ఇలాంటి సూక్ష్మజీవులు వేరే బావి తవ్వుకుని అక్కడ
బతకాలి. దేనికి పనికొచ్చింది ఆ డాక్టర్ చదువు?
గరికపాటిగారు చెప్పేదంతా నిజమే అని నేను అనను. చాలా విషయాల మీద ఆయనకున్న పరిజ్ఞానాన్ని తార్కిక బుద్దితో విశ్లేషించి వివరిస్తారు. ఏది మంచిది అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. ఉదాహరణకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ఆయన చేసిన ప్రసంగం నాకు
'ఇప్పుడు ఆస్ట్రేలియాలో టైమ్ ఎంతో తెలుసా? రాత్రి 12 అయింది. నా ప్రోగ్రామ్స్ సోఫియాని కనుక్కుని కాల్ చేయమని ఇప్పటికి నీకు వంద సార్లు చెప్పాను. రేపు ఇక్కడ కాన్ఫరెన్స్ అయ్యాక ఇండియాకి స్టార్ట్ అవుతాను. బై' అని భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన తల్లి చిరాకుపడి కాల్ కట్ చేయడంతో నిరాశగా
బెడ్ మీద వాలిపోయాడు రాహుల్. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో సింగిల్ పేరెంట్ అయింది ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘనా వర్మ. ఎవరెంత ప్రయత్నించినా ఆమె జీవితంలో మరొకరికి చోటివ్వలేదు.
రాకేష్ వర్మ జీవించి ఉన్నప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మొదలైన వ్యాపారం కేవలం ఆమె అంకితభావంతో ఈ రోజు
లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్న మహా వ్యాపార సామ్రాజ్యంగా వివిధ రంగాల్లోకి విస్తరించింది. 'రెజెంట్స్ యూనివర్సిటీ'లో చేసిన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఆమెకు అక్కరకొచ్చింది. కిచెన్ నుంచి లక్సరీ కార్ వరకూ.. భారతీయలు వాడే వస్తువులు 'వర్మ గ్రూప్' తయారుచేసేవే అంటే అతిశయోక్తి కాదు.
"మనిషి భావోద్వేగాల వలనే సమాజం, వ్యవస్థ మనుగడ సాగించేది అని ప్రజలు అనుకుంటారు. కానీ, అది అబద్ధం. వ్యవస్థను ఆపరేట్ చేసేది చట్టం".
దాదాపుగా ఇదే అర్ధం వచ్చేలా ఒక లైన్ 'రీడర్' ఇంగ్లీషు సినిమాలో ఉంది. ఆర్యన్ ఖాన్ కేసు ఫాలో అవుతుంటే అది నిజం అనిపిస్తోంది. అదే సమయంలో మరి లక్షల కోట్ల
కుంభకోణాలు చేసిన.. చేస్తున్న రాజకీయ నాయకుల పట్ల చట్టాలు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు అని నా లాంటి సామాన్యులకు సందేహం రావటం చాలా సహజమే.
సాధారణ పౌరుల పై ఒక్క పోలీస్ కేసు రిజిస్టర్ అయ్యున్నా పాస్ పోర్టు జారీ చేయరాదు, అలాగే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అంటోంది మన చట్టం. మరి
మన నాయకులు ఆర్ధిక నేరాలకు పాల్పడతారు, దర్యాప్తులో బయటపడ్డ వాళ్ళ అక్రమాస్తులను ED జప్తు చేసుకుంటుంది. కానీ ఆ నేరస్తులు జైల్లో శిక్షలు అనుభవిస్తూ.. బెయిల్ మీద బయటకు వస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు! ఆ హక్కు ఎవరు కల్పించారు? మళ్ళీ మన రాజ్యాంగమే!
'అదుపూ పొదుపూ లేని ఆనందం కావాలి' నాకిష్టమైన ఒక తెలుగు పాటలో పల్లవి లైన్స్ అవి. ఈ భూమ్మీద ఊపిరి తీసుకుంటున్న ప్రతీ మనిషి లక్ష్యం అదే. అయితే సుఖం వేరు ఆనందం వేరు. సౌకర్యం సుఖాన్నిస్తే సుఖం ఆనందాన్నిస్తుంది.
'ఆనందంగా జీవించటం ఎలా'
హిట్ సినిమా సూత్రం (formula) ఏంటో ఇంత వరకు ఎవరూ
కనుగొనలేదు అలాగే ఇది కూడా. కొందరికి ఆనందం అంటే అప్పులు లేకపోవడం, ఇంకొందరికి అప్పులు పుట్టటం.. మరికొందరికి తమ హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటం. మొక్కలకు నీరు పోస్తూ ఆనందించే వాళ్ళు, సంగీతం వింటూ ఇదే ఆనందం అనే వాళ్ళు కూడా ఉంటారు. సాయంత్రం అఫిస్ నుంచి తిన్నగా తమ 'అడ్డా'కు చేరి
చిన్ననాటి స్నేహితులతో కలిసి రెండు పెగ్గులు వేసి, నాలుగు దమ్ములు కొట్టడం కూడా ఒక వర్గం ఆనందం అనే అంటారు! నిజానికి మనం జీవించే ఉన్నాం అన్నది 'రియలైస్' అయితే ప్రతీ క్షణం ఆనందంగా ఉండటానికి ఒక చక్కని కారణం దొరికినట్టే. రియలైస్ అవ్వాలి అంతే!
ఒక సమాజంగా మనకు ఏం కావాలి అని ఆలోచించటం మానేసి అనేకానేక అంశాల వలన కులాలుగా.. వర్గాలుగా విడిపోయి 'మాకు' ఏం కావాలి అని మనుషులు ఆలోచించటం మొదలుపెట్టాక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనివార్యమైంది, ప్రజాస్వామ్యం కొత్తరూపు దిద్దుకుంది.
సమకాలీన రాజకీయాలను చూస్తే వర్గాల స్థాయి దాటి 'నాకేంటి'
అనే దగ్గరకు చేరింది.. పోరు వ్యక్తిగతమైపోయింది. ఒక విధమైన అనిశ్చిత వాతావరణం కనిపిస్తోంది.
ఒకనాడు చంద్రబాబు చేసిన అవే తప్పుల్ని జగన్ పునరావృతం చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అవేంటంటే తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లోనూ, వ్యాపారల్లోనూ (కాంట్రాక్ట్స్) పెద్దపీట వేయటం. మార్కెట్
యార్డు చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టుల నుంచి అన్నీ స్థానాల్లోనూ వారి మనుషుల్ని నియమించడం. ఈ పిచ్చి ఎంత వరకూ వెళ్లిందంటే ఇది వరకెన్నడూలేని విధంగా లెక్కకు మించి ప్రభుత్వ సలహదారులను నియమించి వారికి లక్షల్లో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థను