'ఇప్పుడు ఆస్ట్రేలియాలో టైమ్ ఎంతో తెలుసా? రాత్రి 12 అయింది. నా ప్రోగ్రామ్స్ సోఫియాని కనుక్కుని కాల్ చేయమని ఇప్పటికి నీకు వంద సార్లు చెప్పాను. రేపు ఇక్కడ కాన్ఫరెన్స్ అయ్యాక ఇండియాకి స్టార్ట్ అవుతాను. బై' అని భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన తల్లి చిరాకుపడి కాల్ కట్ చేయడంతో నిరాశగా
బెడ్ మీద వాలిపోయాడు రాహుల్. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో సింగిల్ పేరెంట్ అయింది ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘనా వర్మ. ఎవరెంత ప్రయత్నించినా ఆమె జీవితంలో మరొకరికి చోటివ్వలేదు.
రాకేష్ వర్మ జీవించి ఉన్నప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మొదలైన వ్యాపారం కేవలం ఆమె అంకితభావంతో ఈ రోజు
లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్న మహా వ్యాపార సామ్రాజ్యంగా వివిధ రంగాల్లోకి విస్తరించింది. 'రెజెంట్స్ యూనివర్సిటీ'లో చేసిన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఆమెకు అక్కరకొచ్చింది. కిచెన్ నుంచి లక్సరీ కార్ వరకూ.. భారతీయలు వాడే వస్తువులు 'వర్మ గ్రూప్' తయారుచేసేవే అంటే అతిశయోక్తి కాదు.
ఫ్లయిట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే తన స్టాఫ్'తో కలిసి బయట వేచి ఉన్న వాహనాల శ్రేణి దగ్గరకు కదిలింది మేఘనా. 'శేషగిరి గారు, రోల్స్ రాయిస్ లేటెస్ట్ ఆర్మర్డ్ కార్ బుక్ చేయమన్నాను ఏమైంది?' అని తన మేనేజర్'ని అడిగిందామె. చేశానమ్మా.. కాకపోతే టాక్స్ ఇబ్బందులున్నాయి, నేను
ఇప్పటికే మినిస్టర్ సెక్రెటరీతో మాట్లాడి రిక్వెస్ట్ లెటర్ పెట్టాను. రేపో ఎల్లుండో అప్రూవ్ అయిపోతుందమ్మా అని వినయంగా జవాబిచ్చారు. ఆమె ఫోన్ మోగడంతో హలో అంది అటు నుంచి స్టేట్ సీఎం. సరే సర్ అని కాల్ పెట్టేసి డ్రైవర్, సీఎం ఇంటికి పోనీయ్ అంది మేఘన.
హ్యాండ్ బ్యాగులో ఫోన్ మోగడంతో బయటకు
తీసి హలో అంది సోఫియా. రాహుల్ ఎక్కడ? వాడి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది అంటూ మరో ఫోన్ నుంచి పరిశ్రమల మంత్రికి డయల్ చేసిందామె. మేడమ్, నిన్నటి నుంచి ఇంటికి రాలేదు.. డోంట్ డిస్టర్బ్ మీ అని మెసేజ్ మాత్రమే ఇచ్చారు రాహుల్ అంది సోఫియా. సరే అని కట్ చేసి సర్, సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది,
సీఎంగారు రావట్లేదు, మీరైనా తప్పకుండా రావాలి అని కాసేపు మాట్లాడింది. కాల్ కట్ చేసి శేషగిరిగారు పార్టీకి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. నందవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టు ఎటువంటి ఇష్యుస్ లేకుండా మనకే శాంక్షన్ చేస్తా అన్నాడు సీఎం. ఆయనకి 24 Cr క్యాష్ పంపండి అని ఆర్డర్ వేసి డ్రైవర్ కారు
ఆఫీసుకి పోనీయ్ అంది. మేడమ్, మీరు కొంచెం రిలాక్స్ అవటం బెటరేమో అని పి ఎస్ శ్రావణి అనగానే నో నో.. కొన్ని డాక్యుమెంట్స్ సైన్ చేసి ఈ రోజే ఢిల్లీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీకి పంపాలి. ఇంతలో ఆఫీస్ రాగానే యూ గయ్స్ క్యారీ ఆన్. బై అని లోపలికి నడిచింది మేఘన.
నా మీద నమ్మకం ఉంటే కూర్చో బేబీ.
ఈ రోజు అన్వర్ టీమ్'ని మనం ఓడిస్తున్నాం అంతే అన్నాడు రాహుల్ ఖరీదైన హయబుస స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని రేస్'కి సిద్ధమవుతూ. ఛలో నీ ఇష్టం అని సిగరెట్ (లోపలున్నది గంజాయి) గట్టిగా దమ్ములాగి అతనికి అందించింది రితిక. 'నషా' నెత్తికెక్కేసరికి గట్టిగా నవ్వసాగాడు. ఆల్ సెట్ అని మెసేజ్ రాగానే
రేస్'కి రంగం సిద్ధమైంది. అప్పుడు సమయం రాత్రి 9.
ఇది ట్రై చేయండి సర్ బాటర్ ఫ్రైడ్ ఫిష్ విత్ చీస్ సాస్, కాంటినెంటల్ స్పెషల్ అంటూ మంత్రిగారికి దగ్గరుండి కేర్ తీసుకుంటోంది మేఘనా. కాన్ఫిడెన్షియల్ బిజినెస్ పార్టీ కాబట్టి అక్కడ అతిథులు ఇరవై మందికి మించి లేరు. విదేశీ మద్యంతో
పాటు మంత్రిగారి 'ఇతరత్రా' అవసరాలకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు శేషగిరి చేశారు. యాంకర్ కాదుగా? శేషగిరిని అడిగారు మంత్రి. కాదండీ, ఈ మధ్యే దిగుమతైన ఒక ముంబై హీరోయిన్. ఏం ప్రాబ్లెం లేదు సర్ అన్నాడు శేషగిరి.
అప్పుడే ఆ పెద్ద హాల్లో ఉన్న నాలుగు టీవీల్లో ప్రసారమైన బ్రేకింగ్ న్యూస్ సోఫియా
ముందుగా గమనించింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ'కి కంపెనీ ఇస్తున్న మేఘన దగ్గరకు కంగారుగా వెళ్లి మేడమ్.. అని పిలిచి టీవీ స్క్రీన్ వైపు చూపుడు వేలెత్తింది. అది చూసిన వెంటనే ఆమె చేతిలో ఉన్న కోక్ గ్లాస్ కింద పడి ఒక్కసారిగా ముక్కలైంది ఆమె హృదయంలానే.
వెయిట్ చేయండి మేడమ్ సర్ బిజీగా ఉన్నారు
అన్న హోమ్ సెక్రటరీ సమాదానానికి కోపం వచ్చినా నియంత్రించుకుని అపాయింట్మెంట్ ఉందని చెప్తున్నాను కదా అంది చిరాగ్గా. అది ఆయన మాకు చెప్పాలి మేడమ్ సారీ అని వెళ్ళిపోయాడు. సీఎంకు కాల్ చేస్తే ఏదో మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లారని సమాధానం వస్తోంది. పరిశ్రమల మంత్రి అసలు రెస్పాన్డ్ కాట్లేదు.
పీఎం సెక్రటరీ కూడా అందుబాటులో లేడు. ఇప్పుడు తన కొడుకుని ఎలా కలవాలి? రాహుల్'ని ఎలా కాపాడుకోవాలి? అన్న ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కసాగింది. మేడమ్, ఐజీ లైన్లో ఉన్నారు అని ఫోన్ అందించింది శ్రావణి. మాట్లాడాక సరే సర్ అని కట్ చేసి కార్ ఎక్కి కూర్చుని ఐజీ ఆఫీసుకి పోనీయ్ అంది
కంగారుగా. మేఘనా వర్మ దగ్గర గత ఆరేళ్లుగా పని చేస్తోన్న శ్రావణి, సోఫియా లాంటి వాళ్ళు ఆమెను అలా బేలగా, డీలాగా ఎన్నడూ చూడలేదు. మేడమ్ వాటర్ అని బాటిల్ అందించగానే నీరు నిండిన కళ్ళతో రాహుల్ బయటకు వస్తాడు కదా అని ఆడిగేసరికి శ్రావణి దాదాపు ఏడ్చేసింది.
అరవై గ్రాముల కొకైన్, నలభై గ్రాముల
గంజాయి రాహుల్ దగ్గర దొరికాయి. పైగా మద్యం సేవించి ఉన్నట్లు వైద్య నివేదికలో ఉంది. పెడలింగ్ కేస్ బుక్ చేసే అవకాశం ఉన్నా ఇంకా చేయలేదు మేడమ్. ఆల్రెడీ నాకు పెద్ద వాళ్ళు కాల్ చేసి మీకు హెల్ప్ చేయమన్నారు కానీ చనిపోయిన అమ్మాయి మైనర్ కావడం చేత పెద్ద రచ్చ జరుగుతోంది. HRC కూడా ఇన్సిడెంట్
రిపోర్ట్ అడుగుతోంది. చాలా మేనేజ్ చెయ్యాలి. సిస్టం గురించి నేను మీకు చెప్పాలా? పైగా NCB టేకోవర్ చేసుకున్న కేసు అని తల గోక్కున్నాడు. మేఘన వెంటనే శేషగిరి వైపు చూడగానే ఒక భారీ క్యాష్ బండిల్ ఐజీకి అందించాడు. పొద్దుపోయాక మీరు, మీ సెక్రటరీ మాత్రమే రండి. అబ్బాయిగారి దగ్గరకు నేనే స్వయంగా
తీసుకెళ్తాను అన్నాడు బండిల్ సొరుగులో పెడుతూ.
ఐయామ్ వెరీ సారీ మిసెస్ వర్మ ఇప్పటికే ఈ కేస్ నేషనల్ ఇంట్రెస్ట్ అయింది. వుయ్ ఆర్ హెల్ప్'లెస్ నౌ అని ఫోన్ పెట్టేసాడు పీఎం సెక్రటరీ. ఏం చెయ్యాలో తోచక గోడకున్న రాహుల్ జయంట్ సైజ్ ఫోటోను చూస్తూ వెక్కివెక్కి ఏడవసాగింది. 'నేనిక్కడ ఉండలేను.
ప్లీస్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లు మమ్మీ' అని గట్టిగా అరుస్తున్న రాహుల్ కలలో కనిపించేసరికి ఉలిక్కిపడి లేచింది మేఘన. ఇంతలో ఫోన్ మోగడంతో హలో అంది. మేడమ్ టైమ్ అవుతోంది. నేను హాల్లో వెయిట్ చేస్తున్నాను అని శ్రావణి అనగానే గివ్ మీ టూ మినిట్స్ అని టవల్ తీసుకుని బాత్రూం వైపు నడిచింది.
రాహుల్'కి ఇష్టమైన రొయ్యల బిర్యానీ చేయించి తీసుకెళ్తే జైల్ అధికారులు లోనికి అనుమతించలేదు. ఓ పెద్దగదిలో మెష్ ఉన్న ఇనువచువ్వలకు అటు వైపు కొడుకుని చూసి ఆ స్ట్రాంగ్ ఉమన్ తట్టుకోలేకపోయింది. మమ్మీ అని గట్టిగా అరుస్తూ ఆ ఇరుకు మెష్ నుంచి తల్లి వేళ్ళను తాకటానికి రాహుల్ ఆర్తిగా ట్రై
చేస్తున్నాడు. రాడీ, డోంట్ క్రై బేటా, మమ్మీ వచ్చేసింది. త్వరలోనే నిన్ను బయటకు తీసుకొస్తాను అని అణిచిపెట్టుకున్న దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా రోదించసాగింది. మమ్మీ మమ్మీ ప్లీస్.. నన్ను తీసుకెళ్లిపో అని పిచ్చిగా అరవసాగాడు. మరో వైపు కుప్పకూలబోయిన మేఘనను గబుక్కున పట్టుకుంది శ్రావణి.
కళ్ళు తెరిచేసరికి విశాలమైన తన గదిలో ఉందామె. పక్కనే శ్రావణిని చూసి రాహుల్.. అంది. ఆమె మౌనంగా తలదించుకుంది. మెల్లగా వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది మిసెస్ వర్మ. డాక్టర్స్ వెళ్ళిపోయాక పర్సనల్ బార్ నుంచి వోడ్కా తీసుకుని పెగ్ ఫిక్స్ చేసి తాగ సాగింది. మేడమ్, మనం గట్టిగా ప్రయత్నిద్దాం అంది
సోఫియా. ఆమె వైపు చూసి నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వి వాళ్ళు నా కొడుకుని ఎరగా వేసి నన్ను పట్టుకున్నారు సోఫియా. ఇదొక పొలిటికల్ గేమ్. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించడానికి వాళ్లకు అవకాశం దొరికింది. ఈ వ్యవస్థను శాసిస్తూ వచ్చిన నాకు నేనెంత సామాన్యురాలినో తెలియచేసే ప్రయత్నం ఇది.
నా డబ్బు, నా ఛారిటీస్, నా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ నా కొడుకును కాపాడలేకపోతున్నాయి సోఫియా, ఇదే విషాదం అంటే. ప్రపంచంలో ఏ మూల ఏ టెండర్ ఎవరు ఎంత కోట్ చేసారో తెలుసుకోగల నేను నా కొడుకు మాత్రం ఏం చేస్తున్నాడో, ఏం చదువుతున్నాడో తెలుకోలేకపోయాను. ఇట్స్ అబ్సల్యూట్లీ మై అట్టర్ ఫెయిల్యూర్
సోఫియా అని డ్రింక్ సిప్ చేసింది. ఎవరి కోసం ఈ సంపద, బంగళా, వైభోగం!? అని రోధిస్తున్న ఆమె వైపు చూస్తూ నిలబడింది సోఫియా.
'నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు గొప్పగా బ్రతుకు లేదా వేరే వారి బ్రతుకును కించపరుచు. ఈ రెండూ ప్రపంచానికి తెలియాలంటే అటెన్షన్ అవసరం'
౼ హరీష్ మీనన్
ట్విటర్ వల్ల ఉపయోగాలు ఏంటి? తమ తమ భావాలను వ్యక్తపరచటానికి ఒక చక్కని వేదిక. చాలా మంది ఇంట్రవర్ట్స్ తమ పేర్లు మార్చుకుని ఇక్కడ
చెలరేగిపోతుంటారు. నా లోంటోళ్లు ఏదైనా ఆలోచన వస్తే కథ, కవితా రూపంలో ఇక్కడ ట్వీట్ చేస్తుంటారు. మన సోషల్ సైడ్ బయటపెట్టే ప్లేస్ మాత్రమే కాకుండా తమలా ఆలోచించే మరో వ్యక్తి ఈ భూమ్మీద ఉన్నారా? అని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక మాధ్యమం ట్విటర్.
ఈ మధ్య ఒక వ్యక్తితో సంవాదం జరిగినప్పుడు
'ఎన్నడైనా పిల్లికి బిచ్చం వేశావా' అని అడిగాడు. సాయం చేస్తే ఇక్కడ ట్విట్టర్లో పెడితేనే అది సాయం అన్న ఒకరకమైన స్టేట్ ఆఫ్ మెంటల్ థింకింగ్'లో ఉన్నాడు అని అర్ధమైంది. అతని నేపథ్యం (pun intended) నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని తప్పుపట్టను. ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవటానికి డబ్బు సాయాన్ని
విషయాన్ని బోధించే వాడు ఉపాధ్యాయుడు అయితే విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా చేసే వాడు గురువు.
గరికపాటి నరసింహారావుగారి లాంటి అవధానులు, గురువులు నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దైనందిన జీవనంలో అప్లై చేసుకోవచ్చు. 'నేను ఆయన చెప్పేది నమ్మను, మా ఇంట్లో ఇలా చెయ్యం' అని మీరంటే అది మీ
ఖర్మ అంటాను. ఆ మధ్య మెడిసిన్ చేసిన బ్రాహ్మణ అమ్మాయి 'కేరళ వాళ్లకు హిందూ మతం మీద ఇంత ద్వేషం ఎందుకు' అని కామెంట్ చేసింది. కేరళ వాళ్లంతా క్రిస్టియన్స్ అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. నేను కల్పించుకునే సరికి కాసేపు వాదించి నన్ను బ్లాక్ చేసింది. ఇలాంటి సూక్ష్మజీవులు వేరే బావి తవ్వుకుని అక్కడ
బతకాలి. దేనికి పనికొచ్చింది ఆ డాక్టర్ చదువు?
గరికపాటిగారు చెప్పేదంతా నిజమే అని నేను అనను. చాలా విషయాల మీద ఆయనకున్న పరిజ్ఞానాన్ని తార్కిక బుద్దితో విశ్లేషించి వివరిస్తారు. ఏది మంచిది అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. ఉదాహరణకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ఆయన చేసిన ప్రసంగం నాకు
"మనిషి భావోద్వేగాల వలనే సమాజం, వ్యవస్థ మనుగడ సాగించేది అని ప్రజలు అనుకుంటారు. కానీ, అది అబద్ధం. వ్యవస్థను ఆపరేట్ చేసేది చట్టం".
దాదాపుగా ఇదే అర్ధం వచ్చేలా ఒక లైన్ 'రీడర్' ఇంగ్లీషు సినిమాలో ఉంది. ఆర్యన్ ఖాన్ కేసు ఫాలో అవుతుంటే అది నిజం అనిపిస్తోంది. అదే సమయంలో మరి లక్షల కోట్ల
కుంభకోణాలు చేసిన.. చేస్తున్న రాజకీయ నాయకుల పట్ల చట్టాలు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు అని నా లాంటి సామాన్యులకు సందేహం రావటం చాలా సహజమే.
సాధారణ పౌరుల పై ఒక్క పోలీస్ కేసు రిజిస్టర్ అయ్యున్నా పాస్ పోర్టు జారీ చేయరాదు, అలాగే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అంటోంది మన చట్టం. మరి
మన నాయకులు ఆర్ధిక నేరాలకు పాల్పడతారు, దర్యాప్తులో బయటపడ్డ వాళ్ళ అక్రమాస్తులను ED జప్తు చేసుకుంటుంది. కానీ ఆ నేరస్తులు జైల్లో శిక్షలు అనుభవిస్తూ.. బెయిల్ మీద బయటకు వస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు! ఆ హక్కు ఎవరు కల్పించారు? మళ్ళీ మన రాజ్యాంగమే!
'అదుపూ పొదుపూ లేని ఆనందం కావాలి' నాకిష్టమైన ఒక తెలుగు పాటలో పల్లవి లైన్స్ అవి. ఈ భూమ్మీద ఊపిరి తీసుకుంటున్న ప్రతీ మనిషి లక్ష్యం అదే. అయితే సుఖం వేరు ఆనందం వేరు. సౌకర్యం సుఖాన్నిస్తే సుఖం ఆనందాన్నిస్తుంది.
'ఆనందంగా జీవించటం ఎలా'
హిట్ సినిమా సూత్రం (formula) ఏంటో ఇంత వరకు ఎవరూ
కనుగొనలేదు అలాగే ఇది కూడా. కొందరికి ఆనందం అంటే అప్పులు లేకపోవడం, ఇంకొందరికి అప్పులు పుట్టటం.. మరికొందరికి తమ హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటం. మొక్కలకు నీరు పోస్తూ ఆనందించే వాళ్ళు, సంగీతం వింటూ ఇదే ఆనందం అనే వాళ్ళు కూడా ఉంటారు. సాయంత్రం అఫిస్ నుంచి తిన్నగా తమ 'అడ్డా'కు చేరి
చిన్ననాటి స్నేహితులతో కలిసి రెండు పెగ్గులు వేసి, నాలుగు దమ్ములు కొట్టడం కూడా ఒక వర్గం ఆనందం అనే అంటారు! నిజానికి మనం జీవించే ఉన్నాం అన్నది 'రియలైస్' అయితే ప్రతీ క్షణం ఆనందంగా ఉండటానికి ఒక చక్కని కారణం దొరికినట్టే. రియలైస్ అవ్వాలి అంతే!
ఒక సమాజంగా మనకు ఏం కావాలి అని ఆలోచించటం మానేసి అనేకానేక అంశాల వలన కులాలుగా.. వర్గాలుగా విడిపోయి 'మాకు' ఏం కావాలి అని మనుషులు ఆలోచించటం మొదలుపెట్టాక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనివార్యమైంది, ప్రజాస్వామ్యం కొత్తరూపు దిద్దుకుంది.
సమకాలీన రాజకీయాలను చూస్తే వర్గాల స్థాయి దాటి 'నాకేంటి'
అనే దగ్గరకు చేరింది.. పోరు వ్యక్తిగతమైపోయింది. ఒక విధమైన అనిశ్చిత వాతావరణం కనిపిస్తోంది.
ఒకనాడు చంద్రబాబు చేసిన అవే తప్పుల్ని జగన్ పునరావృతం చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అవేంటంటే తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లోనూ, వ్యాపారల్లోనూ (కాంట్రాక్ట్స్) పెద్దపీట వేయటం. మార్కెట్
యార్డు చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టుల నుంచి అన్నీ స్థానాల్లోనూ వారి మనుషుల్ని నియమించడం. ఈ పిచ్చి ఎంత వరకూ వెళ్లిందంటే ఇది వరకెన్నడూలేని విధంగా లెక్కకు మించి ప్రభుత్వ సలహదారులను నియమించి వారికి లక్షల్లో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థను