Discover and read the best of Twitter Threads about #సీమచరిత్ర

Most recents (24)

గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).

తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)

తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
ఎవరా గొప్ప బ్రాహ్మణుడు ?

స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.

'జయన్ గొండచోళమండలం'లోని 'పేరుంబాణప్పాడి'లోని 'వెంకటకొట్టం'లోని 'శిలైనాడు'లోని 'తిరువిప్పిరంబేడు'
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని
Read 5 tweets
శ్రీశైల పంచ మఠాలు

1. ఘంటా మఠం
2. సారంగధర మఠం
3. భీమాశంకర మఠం
Read 6 tweets
ప్రపంచ సాహిత్యంలో అతిపెద్ద పదం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ప్రకారం ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో నైనా సరే ఉపయోగించబడ్డ అతిపెద్ద పదం కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల భార్య తిరుమలాంబ రచించిన సంస్కృత చంపూ కావ్యం 'వరదాంబికా పరిణయం'లోనిది. ImageImage
అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది. Image
ఇప్పటివరకు ఏ భాషలోనైనా వచ్చిన సాహిత్యంలో ఇన్ని అక్షరాలతో వాడబడిన పదం మరొకటి లేదు.. ఈ వరదాంబిక కడప జిల్లా చెన్నూరు సీమను, ప్రకాశం జిల్లా కొచ్చర్లకోట సీమను ఏలిన సలకం వారి ఆడపడుచు.

చిత్రం: reddit.com/r/interestinga… Image
Read 4 tweets
ఒంటిమిట్ట రామాలయం కట్టించింది ఎవరు ?

స్థానిక చరిత్రలు ఒంటిమిట్ట కోదండ రామాలయం బుక్కరాయల సోదరుడు / కుమారుడు కంపరాయలు కట్టించినట్టు చెబుతాయి. అయితే ఒంటిమిట్ట కైఫీయత్తు మాత్రం ఒంటిమిట్ట ఆలయాన్ని సంపెట నల'కంపరాయలు' కట్టించినట్టు చెబుతుంది. శాసన, కైఫీయత్తుల ప్రకారం సంపెట నలకంపరాయలు ImageImage
కృష్ణదేవరాయలు - అచ్యుతదేవరాయల కాలం నాటి సామంత రాజు (పైన పేర్కొన్న బుక్కరాయల కంపరాయలకు సుమారు 200 సంవత్సరాల తరువాత వాడు).

ఆలయం కట్టించినది సంగమ వంశ కంపరాయలా (14వ శతాబ్దం) లేక సంపెట వంశ కంపరాయలా (16వ శతాబ్దం) అన్నది తేల్చడానికి ఎటువంటి శాసన ఆధారాలు లేవు.
ఒంటిమిట్ట ఆలయం గురించి పేర్కొన్న మొదటి శాసనం సదాశివరాయల కాలంలో శక 1472/ప్ర.శ 1550 పులపత్తూరు శాసనం. సంగమ కంపరాయలు ఈ ఆలయం కట్టించినట్లైతే సుమారు 200 సంవత్సరాల వరకు ఎందుకని ఈ ఆలయానికి సంబంధించిన శాసనాధారాలు లేవన్న ప్రశ్నకు సమాధానం లేదు. 16వ శతాబ్దంలో సంపెట కంపరాయలు కట్టించినట్లయితే
Read 6 tweets
కర్నూలు రాజ్య రక్షణకై రణరంగాన వీరమరణం పొందిన కడప రాజు - మట్ల తిరువెంగళనాథ రాజు

మట్ల తిరువెంగలనాథుడు తండ్రికి మట్ల అనంతరజుకు తగ్గ మానధనుడు. ఒకనాడు కందనూరి (కర్నూలు) రాజు ఆరవీటి గోపాలరాజు తిరువెంగళనాథుడితో - మీ తాత(మట్ల ఎల్లమరాజు), తండ్రి(మట్ల అనంతరాజు)
గొప్ప పరాక్రమవంతులు. నీవు చిన్నవాడివి. అనవసరపు శౌర్య ప్రదర్శనకు యత్నించకుండా సమయోచితానుసారము కాలము గడిపితే మంచిది అని హితువు చెప్పగా ఆ మాటలగొకు నొచ్చుకున్న తిరువెంగళ హనాథరాజు కందనూరు గోపాలరాజుతో మీరు మమ్మల్ని బాలురుగా అనుకున్నప్పటికీ మీ వంటి వారికి శత్రువుల నుండి ప్రమాదం
పొంచి ఉన్నప్పుడు మీ వైపున నిలవడానికి మేము వెనుకాడము అని చెప్పినాడట. వెంకటపతిరాయల నిర్యాణం అనంతరం శక 1541 సిద్ధార్థి సంవత్సరంలో బీజాపూరు సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా తరపున అబ్దుల్ హుస్సేన్, అబ్దుల్ మహమ్మద్, అబ్దుల్ వహాబ్ ఖాన్ అనే 3 సర్దార్లు సైన్యంతో కర్నూలు కోటను చుట్టుముట్టగా,
Read 7 tweets
తలయేరు గుండు

ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద బండను తలయేరు గుండు అంటారు అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తరువాత ఈ తలయేరు గుండును చూడవచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. ఏడుకొండలు ఎంతో శ్రమతో ఎక్కి, దిగే భక్తులకు తలనొప్పి, ఒంటినొప్పులు మోకాళ్ల నొప్పులు
వంటివి రాకుండా ఉండడానికి తమ తలను మోకాళ్ళను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారు అలా చేస్తే ఒంటినొప్పులు రావని ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్లు ఆ గుండుకు ఆనించి ఆనించి ఏర్పడిన గుంతలను మనం నేటికీ చూడవచ్చు. దీనికే మరొక కథ కూడా ఉంది
మాదిగ రామయ్య అనే శ్రీవారి భక్తుడు స్వామివారికి ముత్యాలు గవ్వలు వంటివి జోడించి ఎంతో అందంగా చెప్పులు కుట్టించేవాడు. ఏదో కారణం వలన ఆ చెప్పులు కుట్టే పనికి ఆటంకం ఏర్పడింది. ఆ బాధతో ఆ వృత్తి వారు అక్కడున్న రాతిబండకు తలలు బాదుకోవడం వలన ఆ బండకి గుంతలు ఏర్పడి అదే తలయేరు బండ అయ్యింది
Read 5 tweets
అవ్వాచారి కోన అక్కగార్లు.

ప్రతీ రోజూ రాత్రి తిరుమల శ్రీవారు పవళింపు సేవ అయిపోయాక, ఆనందనిలయానికి బీగం (తాళం ) వేసి కిందకి నడక మార్గాన వస్తూ అవ్వాచారికోన అక్కగార్లకు బీగించెవులు(తాళం చెవి) ఇచ్చి అలా కిందకి నడుచుకుంటూ వచ్చి అలిపిరి దగ్గర ఉన్న పాదాల మండపంలో ఉన్న తన మెట్లు(చెప్పులు)
వేసుకుని అలా నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వద్దకు వెళ్లి, రాత్రి అమ్మవారితో ఉండి తిరిగి ఉదయాన పాదాల మండపంలో చెప్పులు వదిలి నడుచుకుంటూ పైకి ఎక్కి అక్కగార్ల వద్ద బీగించెవి తీసుకుని సుప్రభాత వేళకు ఆనంద నిలయం చేరుకుంటాడట. అలా స్వామి కూడా కొండను చెప్పులు లేకుండానే ఎక్కుతాడని
స్వామి వారి ఆలయ బీగించెవులకి అవ్వాచారి కోన అక్కగార్లు కాపలాగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈసారి మీరు తిరుమల కాలినడక మార్గాన వెళ్ళినప్పుడు మోకాళ్ళ పర్వతానికి ముందు ఘాట్ రోడ్లో వచ్చే అక్కగార్లను దర్శించి వారి ఆశీస్సులు తీసుకోండి

మూలం: తిరుపతి కథలు - ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి
Read 4 tweets
దేవబ్రాహ్మణ అగ్రహారాల సీమ - కమలాపురం

కడప జిల్లాలోని కమలాపురం మరియు కమలాపురం చుట్టుపక్కల చాలా ప్రధాన గ్రామాలు బ్రాహ్మణులకు, కవులకు లేదా ఆలయాలకు సర్వమాన్యాలుగా / అగ్రహారాలుగా ఇవ్వబడిన గ్రామాలు. వీటిల్లో అనేక గ్రామాలకు ఇప్పుడున్న పేరు కాకుండా దానసమయంలో ఇవ్వబడిన పేర్లు ఉండేవి -a 🧵
1. కమలాపురం-మండల/తాలూకా కేంద్రం

పుష్పగిరి క్షేత్రం ఉన్న కుసుమాచల పర్వతానికి పశ్చిమాన పాపాగ్ని పాగేరు అనే నదుల మధ్య ఉండే కమలాపురం గ్రామం పుష్పగిరిలో ఉన్న బ్రహ్మదేవ ప్రతిష్ట కమలేశ్వర స్వామికి పడితరానకు నడిచేది. పుష్పగిరిలోని కమలేశ్వర స్వామి పేరిటే ఈ ఊరికి కమలాపురం అనే పేరొచ్చింది
2. కోగటం / కోకటం

ఇతర పేర్లు : కమలాజీపురం, శఠగోపపురం

విజయ సింగ్ మహారాజు వకీలు కమలాజీ అనే అతను ఈ గ్రామాన్ని అగ్రహారంగా చేయించాడని అక్కడ స్థలీకులు చెప్పుకుంటున్నారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ కూకటం గ్రామాన్ని అల్లసాని పెద్దనకి సర్వమాన్ని అగ్రహారంగా ధారపోసి ఇచ్చినాడు
Read 25 tweets
శ్రీశైల ఘంటా మండపంలో లభించిన తామ్ర శాసనం

Śrīśailam copper plate grant of Kopaṇa,

This set of copper plate is recovered recently during the course of renovation work in Ghanṭā-maṭhaṁ at Śrīśailam, Kurnool district, Andhra Pradesh.
It is dated Śōbhakṛt, Vaiśākha, śu. 15, written in Sanskrit language and Nāgarī characters of the 15th-16th century C.E.

It records the gift of a village Yaḍadapura situated in Yalabarga for providing food offerings, burning perpetual lamp and conducting festivities to the god
Siddhēśvara in the village by the king Chāḷukya Kōpaṇāśraya, son of Satyapratāpa, grandson of Kōpaṇa, on the occasion of Vaiśākha Pūrnima. The villages Sōḍapalli, Balagere and Būdiguppa are mentioned as the boundaries of the gifted village.
Read 4 tweets
పొన్నియిన్ సెల్వన్ - రాయలసీమ

చోళ చక్రవర్తి రాజరాజ చోళ / అరుళ్ మొళి వర్మన్ / పొన్నియిన్ సెల్వన్ జీవిత కథ ఆధారంగా ఇటీవల వచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ -1 / PS -1.

రాజరాజ చోళుడి సహా అనేక మంది చోళ చక్రవర్తులు రాయలసీమను పాలించారు. ఇక్కడి శివాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు.
వారు / వారి సామంతులు / వారి అధికారులు వేయించిన అనేక శాసనాలు నేటికీ సీమలో అనేక చోట్ల లభిస్తున్నాయి.

అయితే ఈ రాజరాజ చోళ / పొన్నియిన్ సెల్వన్ జేజి / నాయనమ్మ వైదుంబల ఆడపడుచు.

వైదుంబులు రాయలసీమ ప్రాంతాన్ని ముఖ్యంగా కడప, చిత్తూరు ప్రాంతాలను 9- 12 వ శతాబ్దాలలో ఏలినవారు.
ఒకప్పటి కడప - చిత్తూరు జిల్లాలలోని కలకడ, చిప్పిలి, పొత్తప్పి, ఆండపురం వీరి ప్రధాన పట్టణాలు. పొన్నియిన్ సెల్వన్ అబ్బ / తాత (తండ్రి సుందర చోళుడి తండ్రి) అరింజయుడు వైదుంబుల ఆడపడుచు కళ్యాణి అనే యువరాణిని పెండ్లాడాడు. అరింజయుడు, కళ్యాణి ల కుమారుడే సుందర చోళుడు (సినిమాలో ప్రకాశ్ రాజ్)
Read 4 tweets
'యాడికి' పట్టణానికి ఆ పేరేలా వచ్చింది ?

యాడికి -

భైరవకొండ సమీపంలోని మాత్యేని కోట అనే పేరు గల కొండ మీద మాల్యవంతుడు అనే మిక్కిలినేని కమ్మ నాయకుడు ఉండేవాడు. అతన్ని అండలో అనేకమంది వేటగాళ్లు ఉండేవారు. వారు ఉదయమంతా తలో దిక్కుకు వేటకు వెళ్లి, సాయంత్రం గ్రామం చేరేవారు.
ఒక నాడు మాల్యవంతుడు ఈ వేటగాళ్లను పిలిచి తాను మాత్యేని కోట సమీపంలో ఒక గ్రామము నిర్మించదలచానని, మీరంతా వేట నిమిత్తం అరణ్యాలలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి, గ్రామం కట్టడానికి ఉత్తమమైన ప్రాంతం తనకు తెలియపరచమని వారిని అడిగాడు.
వారు తామంతా వేటకు వెళ్లి, గ్రామం నిర్మించడానికి అనువైన ప్రాంతాన్ని వెతికి మాల్యవంతుడికి విన్నవిస్తామని చెప్పి తలో దిక్కూ వేటకు వెళ్లారు.

ఆ సాయంత్రం కిలారి నాయుడు అనే వేటకాడు తప్ప మిగతా వారంతా మాత్యేని కోట చేరుకున్నారు.
Read 9 tweets
'సైరా' సినిమాలో బాలుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని వారసులు లేని నొస్సం పాలేగాడు(నరసింహారెడ్డి తాత) జయరామిరెడ్డి దత్తత తీసుకున్నాడని, బ్రిటీషు వారి అరాచకాల గురించి నరసింహారెడ్డి జయరామిరెడ్డిని ప్రశ్నించి, మీరెందుకు వారిని ఎదురించట్లేదు అని అడిగితే, తెల్లవాళ్లు బలవంతులని
వాళ్లని ఎదురించలేక వారిచ్చే తవర్జీ (పెన్షన్) తీసుకోవాల్సి వస్తోందని జయరామిరెడ్డి చెప్తాడు.

చారిత్రకంగా ఈ రెండూ శుద్ధ తప్పులు.

1. జయరామిరెడ్డికి నరసింహారెడ్డి అని ఒక కొడుకు ఉండేవాడు. అతడిని నొస్సం నరసింహారెడ్డి అని అనేవారు. జయరామిరెడ్డి మరణాంతరం ఈ నొస్సం నరసింహారెడ్డి పాలేగాడు
అయ్యాడు. కనుక జయరామిరెడ్డికి వారసులు లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని దత్తత తీసుకున్నారు అన్నది పూర్తిగా అవాస్తవం.

2. 1800లో సీమ బ్రిటీషు వారి చేతుల్లోకి వెళ్లగా, అంతకు చాలా సంవత్సరాల ముందే జయరామిరెడ్డి మరణించాడు. అంతే కాక 1846లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మరణించేనాటికి మధ్యవయస్కుడు
Read 4 tweets
Images of Gods and Goddesses from Rayalaseema - A compendium of 100 years old photos

రాయలసీమలోని దేవుళ్ల ప్రతిమలు - 100 సంవత్సరాల క్రితం నాటి ఫోటోల సమాహారం

నరసింహోద్భవం, అహోబిలం
ఉగ్రనారసింహ, అహోబిలం
యోగ నరసింహ, తిరుపతి
Read 17 tweets
రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారి ఎన్నిక - విశేషాలు

ఫిబ్రవరి 11, 1977 భారతదేశ 5 వ రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆకస్మికంగా మరణించారు. అప్పటికి ఎమర్జెన్సీ ఇంకా అమలులో ఉంది. తాత్కాలికంగా నాటి ఉపరాష్ట్రపతి శ్రీ BD జత్తి గారు రాష్టపతిగా ప్రమాణస్వీకారం చేశారు.
తరువాత కొంతకాలానికే సార్వత్రిక ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ఓడిపోయి జనతాపార్టీ గెలిచి, మొరార్జీ దేశాయి గారు ప్రధాని అవ్వడం జరిగింది. ఆ ఎన్నికలో నంద్యాల నుండి ఎన్నికై నీలం సంజీవరెడ్డి గారు లోకసభ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు.
ఆ తరుణంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో అధికారపక్ష, విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఏకగ్రీవంగా భారతదేశ 6 వ రాష్ట్రపతిగా సంజీవరెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. అప్పటికే ఆయన 1969లో రాష్ట్రపతిగా పోటీచేసి ఆ ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Read 20 tweets
హిందూపురం - సూగూరు

రాయలసీమలోని ప్రముఖ పట్టణాలలో అతి నూతనమైన పట్టణాలలో ఒకటి హిందూపురం (పుట్టపర్తి కూడా ఆ కోవలోకే వస్తుంది). హిందూపురం ఏర్పడేకంటే ముందు అక్కడ 'సూగూరు' అనే ఊరు ఉండేది. 18వ శతాబ్దంలో మరాఠా సర్దారు మురారి రావు గుత్తి కోట నుండి పరిపాలన చేసే కాలంలో,
వారికి, మైసూరు సుల్తానులకు నిత్యం యుద్ధాలు జరిగేవి. రాజ్యరక్షణకు, మైసూరు సుల్తానులను ఎదుర్కొనేందుకు మురారి రావు తండ్రి సిద్ధోజి నేతృత్వంలో పెద్ద సైనిక పటాలంతో ఈ సూగూరు పరిసరాల్లో చాలా కాలం ఉండేదట. సైనికులకు అవసరమైన సేవలు అందించేందుకు అనేక వృత్తుల వారు కూడా సూగూరుకు వచ్చి ఉండేవారు
సిద్ధోజీ, అతని సైన్యం సూగూరును వదిలిపెట్టి వెళ్లినా, వారు అక్కడే స్థిరపడినారు. తరువాత గుంతకల్ - బెంగళూరు రైల్వే లైను హిందూపురం మీదుగా వెళ్లడం వల్ల, బెంగుళూరుకు సమీపంగా ఉండటం వల్ల, కాలక్రమేణా హిందూపురం / సూగూరు వాణిజ్య కేంద్రంగా ఎదిగి, పెద్ద పట్టణం అయ్యింది.
Read 5 tweets
రాయలసీమను పాలించిన కొన్ని రాజవంశాల చిహ్నాలు / లాంఛనాలు / పతాకాలు

1. రేనాటి చోడులు
2. బాదామి చాళుక్యులు
3. చోళులు
Read 9 tweets
*Vakuḷamāta temple inscription from Pērūru,Tirupati district,A.P*

This inscription is engraved on a rock in front of the gopura of Vakuḷamāta temple,Pērūru, Tirupati district, Andhra Pradesh.
It is written in Tamil language and characters and belongs to the 20th regnal year (1198 C.E) of Kulottuṅga Chola III

It is damaged and records the installation of the deities Añchādavinna(Kara)pperumāl and his wife (pirāttiyār) in the Añchādavinnakar temple of
Talaiyur-perur in Kudavūr-nādu of Tiruvēńgada kōttam, Jayańgondachōlamandalam by a certain person from Puliyūr kōttam.

#సీమశాసనాలు #సీమచరిత్ర

Source : ASI
Read 4 tweets
శ్రీకృష్ణదేవరాయల ఆగ్రహం - పుష్పగిరి అగ్రహారం

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక అదిశకంర పీఠం కడప జిల్లాలోని పుష్పగిరి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ సముదాయం పుష్పగిరి. శైవమత కేంద్రంగా, నివృత్తి సంగమంగా, హరిహర క్షేత్రంగా, అదిశంకర పీఠంగా వెలసిల్లిన పుష్పగిరి ImageImage
ఒకప్పుడు నిత్యం వేదపారాయణంతో మారుమోరోగిన అగ్రహారం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్రలోనూ, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి జీవిత చరిత్రలోనూ పుష్పగిరి అగ్రహారం ప్రస్తావన ఉంది.
వీరబ్రహేంద్ర స్వామి తన ప్రియశిష్యుడు సిద్దయ్య తో కలిసి పుష్పగిరి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని అవహేళన చేసిన పుష్పగిరి బ్రాహ్మణులు స్వామివారి ఆగ్రహానికి లోనయ్యి, వారి ఇళ్లు తగలబడ్డ తరువాత తమ తప్పు తెలుసుకుని స్వామికి శిష్యులుగా మారినట్టు బ్రహ్మంగారి చరిత్ర చెబుతుంది.
Read 14 tweets
కంబదూరులోని కళ్యాణి చాళుక్య చక్రవర్తి నాలుగవ సోమేశ్వరుడి శాసనం

Sōmēśvara IV inscription from Kambaduru, Anantapur District, Andhra Pradesh

This inscription is found near the Akkamma temple in the village Kambaduru, Anantapur district, Andhra Pradesh.
It is written in Kannaḍa language and characters, dated in Śaka 1108, Viśvāvasu, Chaitra Śu 15, Monday (Irregular) = 1186 C.E. April 5, (However the week day was Saturday)

Records the gift of 6 Khanduga _ of wet land to the god Kamblēśvara of Kambadahola after laving the feet
of Yogiramadeva of Rumam, on the occasion of lunar eclipse by mahāmaṇḍalēśvara Tribhuvana Malla Bhōgadēva Cholamahārāja ruling from Henjēṛu under the Kalyāni Chālukya king Sōmēśvara IV.

#సీమశాననాలు #సీమచరిత్ర

కర్టెసీ: ASI
Read 4 tweets
అనంతపురం అపర భగీరథుడు - చిక్కప్ప ఒడయార్

విజయనగర సామ్రాజ్యాన్ని బుక్కరాయలు పాలించే కాలంలో నేటి నంద్యాల జిల్లా నందవరం గ్రామంలో నందవరీక బ్రాహ్మణ దంపతులు అయిన శింగప్ప, మేళమ్మ దంపతులకు నందవరం చౌడేశ్వరీ దేవి కృప చేత ఒక మగశిశువు జన్మించాడు. ఆ దంపతులకు చిక్కప్ప అని పేరు పెట్టారు.
ఆ బాలుడికి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి శింగప్ప మరణించడంతో, నందవరంలో జీవనోపాది లేక చిక్కప్పను తీసుకుని మేళమ్మ విజయనగర రాజధాని హంపి చేరుకుంది. బాల చిక్కప్ప ఒకనాడు పంపా తీరంలోని కోదండరామ స్వామి ఆలయం సమీపంలో ఒక మర్రిచెట్టు వద్ద ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడే నిద్రకు ఉపక్రమించాడు.
ఆ మర్రిచెట్టు పక్కనే ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలోని పాము బయటకు వచ్చి నిదురిస్తున్న చిక్కప్ప ముఖంపై ఎండ పడుతుండటంతో తన పడగను అడ్డుపెట్టి ఎండ పడకుండా ఆపింది. అటుగా వెళ్తోన్న పాములు అందించే నాగజోగి అనే వాడు ఈ దృశ్యం చూసి ఈ బాలుడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు అని తలచాడు.
Read 20 tweets
మనం మరచిన చరిత్ర

ఈ ఫోటోలోని వ్యక్తి ముండ్లూరి గంగప్ప గారు. బళ్ళారి నియోజకవర్గం నుండి 1952లో మద్రాసు శాసనసభకు ఎన్నికయినవారు.

బళ్ళారిని మైసూరు రాష్ట్రంలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

1955లో మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ (ఫజల్ అలీ కమీషన్) బళ్లారిని, తుంగభద్రా
ప్రాజెక్టును ఆంధ్రాలో (సీమలో) కాలపాలని చెప్పినప్పటికీ నాటి కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సును అంగీకరించక బళ్లారిని మైసూరు రాష్ట్రంలోనే కొనసాగించాలని నిర్ణయించడంతో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బళ్ళారిని ఆంధ్రాలో కలపాలి అనే నినాదం మీద ఉపఎన్నికలకు వెళ్ళారు
ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ పాల్గొనలేదు. బళ్ళారిలో ఆంధ్రుల అభ్యర్థిగా గంగప్ప గారు, కన్నడిగుల అభ్యర్థిగా HS గౌడ తలపడ్డారు.

హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికలలో గౌడగారికి 31708
వోట్లు రాగా, గంగప్ప గారికి 28917 ఓట్లు రాగా, స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఆంధ్రుల అభ్యర్థి గంగప్పగారు ఓడిపోయారు.
Read 4 tweets
హంపి Hampi

నాడు -నేడు / Now and Then -1

లోటస్ మహల్ - Lotus Mahal (Queens' Zenana)
రాణుల జనానాలో బురుజు - Watch Tower in Queens' Zenana
తులాపురుషదాన మంటపం - King's Balance
Read 6 tweets
మనం మరచిన ధర్మదాతలు

The man who once saved Bellary from an epidemic - Right Honorable Kolachalam Venkatrao

శ్రీ కోలాచలం వెంకట్రావు స్వాతంత్ర సమరయోధులు, ధర్మదాత, ప్రముఖ న్యాయవాది, ది లయన్ ఆఫ్ ది బార్, సంఘ సంస్కర్త, భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నాయకులలో ఒకరు,
రాజనీతి దురంధరులు, బళ్ళారి మాజీ మున్సిపల్ ఛైర్మన్. విజయనగర సామ్రాజ్య ఆస్థానంలోని విద్వాంసులు మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి వంశంలో కోలాచలం వెంకట్రావు గారు 1850 ఫిబ్రవరి 28న బళ్ళారి లో జన్మించారు. వీరి తండ్రి కోలాచలం సేతుపతి శాస్త్రి అనెగొంది సంస్థానంలో దివాన్ గా ఉండేవారు.
వీరి సోదరులు ఆంధ్రచరిత్రనాటకపితామహుడు కోలాచలం శ్రీనివాసరావు గారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, అనంతపురం- బళ్ళారిలలో తొలి వైద్యురాలల్లో ఒకరు అయిన డా. నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి వీరి భార్యకు మేనకోడలు.

1902 వ సంవత్సరంలో బళ్లారిలో ప్లేగు వ్యాధి దావానలంలా వ్యాపించింది.
Read 12 tweets
Chronogram - ఒక విశిష్ట సాహితీ శాసన ప్రక్రియ
ఈ కింది పద్య పదాలను చూడండి

అద్రిగజాగ్నిసోములన్‌
లుడు దేవనిధినయనేందు
రసర్తు నయనేందుభిః

ఈ మూడు పద్య పాదాలు వరుసగా క్రీ. శ 1465, క్రీ.శ 1369, క్రీ.శ 1344 సంవత్సరాలను సూచిస్తాయి.
ఈ విధంగా కాలాన్ని/ సంవత్సరాలను అంకెలలో కాక సంకేత పదాలతో వాక్యాలతో తెలియజేయడాన్ని chronogram అంటారు.

శాసనాలలో / కావ్యాలలో మొదట సంవత్సరం / కాలం సూచించేవారు కాదు. ఆ తరువాత పలానా రాజు పట్టాభిషిక్తుడై పలనా సంవత్సరాలు అయిన తరువాత అని వాడేవారు. ఆ తరువాత ‘శక’ సంవత్సరాలు మొదలయ్యాయి.
శాసనాలలో శాలివాహక శకంతో పాటు 1126, 1232 అంటూ అంకెలు పేర్కొని ఆయా కాలాన్ని సూచించేవారు.

అయితే కొందరు కవులు, శాసన కర్తలు తమ కావ్యాలలో, శాసనాలలో కాలాన్ని నేరుగా అంకెలలో సూచించకుండా పైన చెప్పిన విధంగా Chronograms వాడి వాక్యాలలో తెలియజేసేవారు.
Read 10 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!