Discover and read the best of Twitter Threads about #kadapa_temples

Most recents (3)

ప్రొద్దుటూరు అమ్మవారిశాల

కడప జిల్లాకు ప్రొద్దుటూరు వాణిజ్య కేంద్రం వంటిది. బంగారం, బట్టలు, ఫైనాన్స్ వ్యాపారానికి ప్రొద్దుటూరు కేంద్రం. అందుకే అందరూ ప్రొద్దుటూరుకు పుత్తడిపురి / పసిడిపురి అని కూడా అంటారు. అటువంటి ప్రొద్దుటూరుకి మరో పేరు కూడా ఉంది. అదే “రెండవ మైసూరు”. ImageImage
దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరులో ఎంత ఘనంగా జరుగుతాయో, ఇటువైపు ప్రొద్దుటూరులో అంత ఘనంగా జరుగుతాయి.

వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో ఆర్య వైశ్య కుటుంబాలు అధికంగానే ఉంటాయి. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు.
ప్రొద్దుటూరులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం (స్థానికంగా అమ్మవారిశాల అని పిలుస్తారు ) అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. వందకుపైగా సంవత్సరాల చరిత్ర ఈ ఆలయం సొంతం

#KnowRayalaseema #Kadapa_Temples #Rayalaseema_Temples #Proddutur #Kadapa #Ravishing_Rayalaseema
Read 7 tweets
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
Read 23 tweets
ఒంటిమిట్ట కోదండ రామాలయం

గుత్తి, పామిడి, గండికోట, ఒంటిమిట్ట క్షేత్రాల మధ్య సామీప్యం ఏమిటి?
ఒంటిమిట్టకి ఆ పేరు ఎలా వచ్చింది?
రఘువీరా! జానకీనాయకా! అనే మకుటంతో శ్రీమదొంటిమిట్ట రఘువీర శతక కర్త ఎవరు?
ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం రాత్రిపూట ఎందుకు జరుగుతుంది?
(1/n)
#Vontimitta #Kadapa
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని మీద అన్నమాచార్యులు రచించిన కీర్తనలు ఏవి?

భారాతావనిలో అత్యంత గొప్ప ఆలయాల్లో ఒకటి (One of the Greatest Pagodas in the whole of India) అని ఒంటిమిట్ట క్షేత్రాన్ని కొనియాడిన విదేశీయుడు ఎవరు?

ఒంటిమిట్టలో భక్తులకు బావి తవ్వించిన ముస్లిం పాలకుడు ఎవరు?
2/n
రామ తీర్థం – లక్ష్మణ తీర్థం

త్రేతాయుగంలో వనవాస సమయంలో దండకారణ్యలో సీతారామలక్ష్మణులు సంచరిస్తుండగా, సీతమ్మవారి దప్పిక తీర్చడానికి రాములవారు ఎక్కుపెట్టిన బాణం వాళ్ల భూమిలోనుంచి ఉబికి వచ్చిన నీరు వల్ల ఇక్కడ రెండు మడుగులు ఏర్పడ్డాయి. అవే రామ తీర్థం మరియు లక్ష్మణ తీర్థం.

3/n
Read 25 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!