Discover and read the best of Twitter Threads about #సీమపట్టణాలు

Most recents (4)

'యాడికి' పట్టణానికి ఆ పేరేలా వచ్చింది ?

యాడికి -

భైరవకొండ సమీపంలోని మాత్యేని కోట అనే పేరు గల కొండ మీద మాల్యవంతుడు అనే మిక్కిలినేని కమ్మ నాయకుడు ఉండేవాడు. అతన్ని అండలో అనేకమంది వేటగాళ్లు ఉండేవారు. వారు ఉదయమంతా తలో దిక్కుకు వేటకు వెళ్లి, సాయంత్రం గ్రామం చేరేవారు.
ఒక నాడు మాల్యవంతుడు ఈ వేటగాళ్లను పిలిచి తాను మాత్యేని కోట సమీపంలో ఒక గ్రామము నిర్మించదలచానని, మీరంతా వేట నిమిత్తం అరణ్యాలలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి, గ్రామం కట్టడానికి ఉత్తమమైన ప్రాంతం తనకు తెలియపరచమని వారిని అడిగాడు.
వారు తామంతా వేటకు వెళ్లి, గ్రామం నిర్మించడానికి అనువైన ప్రాంతాన్ని వెతికి మాల్యవంతుడికి విన్నవిస్తామని చెప్పి తలో దిక్కూ వేటకు వెళ్లారు.

ఆ సాయంత్రం కిలారి నాయుడు అనే వేటకాడు తప్ప మిగతా వారంతా మాత్యేని కోట చేరుకున్నారు.
Read 9 tweets
హిందూపురం - సూగూరు

రాయలసీమలోని ప్రముఖ పట్టణాలలో అతి నూతనమైన పట్టణాలలో ఒకటి హిందూపురం (పుట్టపర్తి కూడా ఆ కోవలోకే వస్తుంది). హిందూపురం ఏర్పడేకంటే ముందు అక్కడ 'సూగూరు' అనే ఊరు ఉండేది. 18వ శతాబ్దంలో మరాఠా సర్దారు మురారి రావు గుత్తి కోట నుండి పరిపాలన చేసే కాలంలో,
వారికి, మైసూరు సుల్తానులకు నిత్యం యుద్ధాలు జరిగేవి. రాజ్యరక్షణకు, మైసూరు సుల్తానులను ఎదుర్కొనేందుకు మురారి రావు తండ్రి సిద్ధోజి నేతృత్వంలో పెద్ద సైనిక పటాలంతో ఈ సూగూరు పరిసరాల్లో చాలా కాలం ఉండేదట. సైనికులకు అవసరమైన సేవలు అందించేందుకు అనేక వృత్తుల వారు కూడా సూగూరుకు వచ్చి ఉండేవారు
సిద్ధోజీ, అతని సైన్యం సూగూరును వదిలిపెట్టి వెళ్లినా, వారు అక్కడే స్థిరపడినారు. తరువాత గుంతకల్ - బెంగళూరు రైల్వే లైను హిందూపురం మీదుగా వెళ్లడం వల్ల, బెంగుళూరుకు సమీపంగా ఉండటం వల్ల, కాలక్రమేణా హిందూపురం / సూగూరు వాణిజ్య కేంద్రంగా ఎదిగి, పెద్ద పట్టణం అయ్యింది.
Read 5 tweets
కార్వేటినగరం

పద్మావతీ అమ్మవారి తండ్రి ఆకాశరాజు. వారి వంశస్థులు నారాయనవనం రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఒకనాడు నారాయనవనం రాజులు వేటకు అడవికి వెళ్లగా అక్కడ ఒకచోట వారి వేటకుక్కలని ఒక కుందేలు తరమడం చూసి, రాజధాని నిర్మించడానికి అదే ఉత్తమమైన ప్రదేశంగా భావించి అక్కడ అడవిని నరికించి ImageImage
ఒక నగరం నిర్మించారు. 'కాడు' (తమిళంలో అడవి ) 'వెట్టి' (తమిళంలో నరికి) నిర్మించిన 'నగరం' కాబట్టి కాడువెట్టినగరం అయ్యి అదే కాలక్రమేణా కార్వేటినగరం అయ్యింది.

మరొక కథనం ప్రకారం 'కాడు' లో 'వేట్టై' (తమిళంలో వేట) వెళ్లిన తరువాత నిర్మించిన 'నగరం' కాబట్టి కార్వేటి నగరం అయ్యింది.
ఇంకొక కథనం ప్రకారం నగర పొలిమేరల్లో ఉన్న 'కార్వేటమ్మ' పేరు మీద కార్వేటి నగరం అయ్యింది.

కార్వేటినగరం ముందు ఉత్తర ఆర్కాటు జిల్లాలో ఆ తరువాత చిత్తూరు జిల్లాలోని ఒక జమీందారీ. ఇక్కడి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం.
#సీమపట్టణాలు #సీమచరిత్ర #chittoor
Read 3 tweets
రాయలసీమలో ‘ఫైజ్ హిసార్’ అనే పట్టణం ఎక్కడ ఉందో తెలుసా ?

అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికే మైసూరు సుల్తానుల పాలనలో ‘ఫైజ్ హిసార్’ అనే పేరు ఉండేది(Faiz Hisar - The Fort of Bounty / The Fort of Abundance / Citadel of Grace)
ఫైజ్ హిసార్ అంటే గెలుపు కోట / విజయ కోట / సంపద కోట అని అర్థం
ఇక్కడ మైసూరు రాజ్య టంకాశాల (నాణేలు ముద్రించే ప్రాంతం / Mint ) ఉండేది. 1758లో మరాఠాల పరం అయ్యింది. 1775లో తొమ్మిది నెలల ముట్టడి తరువాత మురారి రావు నుండి హైదరాలీ స్వాధీనపరుచుకున్నాడు. 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయేవరకు మైసూరు రాజ్యంలో భాగంగా ఉండేది. 1799లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా
కంపెనీ (EEIC) మరియు నిజాం కి జరిగిన
ఒప్పందం ప్రకారం గుత్తి నిజాం పరం అయ్యింది. 1800లో నిజాం గుత్తిని EEIC కి ధారాదత్తం చేశాడు. హైదరాలీ అక్రమించుకోవడానికి ముందే గుత్తిలో టంకశాల ఉండేది. కొండపైన గౌతమఆశ్రమం ఉండటంవల్ల గుత్తికోటకే జగతాపి గుత్తి దుర్గం/గౌతమ దుర్గం అనే పేర్లు కూడా ఉంది
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!