@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Techie_Researcher_Archivist

May 2, 2022, 33 tweets

పుణ్యక్షేత్ర సింహాచలం
*************************
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము , సింహచలం అనే గ్రామంలో విశాఖపట్టణం నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలొని పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము . ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే
1/n

వరహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు . ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది . ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి . తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం ( 52 కోట్ల రూపాయలు ) కలిగిన దేవాలయము . సంవత్సరానికి
2/n

12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది ; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది . నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు . ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది . స్థలపురాణం : సింహాచలం చరిత్ర ఆధారాలతో
3/n

సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తున్నది . కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు . సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం . ఇక్కడ శ్రీమహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలశాడు .
4/n

ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి . తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు . అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు . చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు . కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని
5/n

విష్ణుమూర్తి రక్షిస్తాడు . విసిగిన హిరణ్యకశిపుడు ' విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా , ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా ? చూపించు'మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి , హిరణ్యకశిపుని సంహరించి , ప్రహ్లాదుడిని రక్షించాడు . స్థలపురాణం
6/n

ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది .
7/n

అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు . విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది . ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి
8/n

దేవాలయాన్ని నిర్మించాడు . ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది . స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతొ పూత పూస్తుంటారు . వరాహము నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో ( ఆసనంలో ) వరాహము తల సింహం తోక మనిషి శరీరంతో ఉంటుంది .
9/n

మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది . శాసన సమృద్ధి : క్రీ.శ .1087 : సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు . స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం . ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది .
10/n

క్రీ.శ .1198 : " వాయు స్ఫటికామలాభవపుషే సింహాచలస్థాయినే " = సింహాద్రి నాధుని స్పాటికామలాభ వపువుగా వర్ణించబడింది .

క్రీ.శ .1266 : గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామివారికి
11/n

సమర్పిస్తాడు .
క్రీ.శ .1268 : ఒక శాసనం ఈనాటికీ వ్యవహారంలో ఉన్న అడవివరాన్ని పేర్కొన్నది
క్రీ.శ .1201 మరియు 1291 : రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన , అధ్యయన వైభవాన్ని తెలియజేస్తున్నాయి .
12/n

క్రీ.శ .1293 : అక్షయ తృతీయనాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ , ఆనాడే పాయసము,అప్పాలు మొదలైన పణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.
క్రీ.శ.1342: స్వామికి ఒక మహారాణి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది.అందులో బంగారు పొగడపూల మాల మరియు సంపెంగ మాల లున్నాయి
13/n

క్రీ.శ .1350 : వీరనరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవునికి అనేక సమర్పణలు కావిస్తూ వేయించిన శాసనం .
క్రీ.శ. 1371 : సింహాచలం అన్న పేరు సింహికారోగిరిః నుండి వచ్చినట్లు చెబుతోంది .
క్రీ.శ. 1394 : సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనటం జరిగింది . ఈదేవాలయము లాంగూల గజపతిచే
14/n

నిర్మించబడినది పలు శాసనములు తెలుపుచున్నవి . ఈ ఆలయమునందలి శాసనకాలము క్రీ.శ .1100 నుండి 7 శతాబ్దములవరకు వరకు వ్యాప్తము . తూర్పుగాంగులు , రెడ్డిరాజులు , నందపురమును పాలించిన శిలావంశయుజులు , మత్స్య వంశీయులు , గజపతులు స్వామికి అనేకదానములు గావించిరి.శక సం .
15/n

1438,1441 లలో కృష్ణ దేవరాయలు స్వామిని సేవించినాడు .
శక సం . 1438 లో శ్రీకృష్ణదేవరాయలు చిన్నాదేవీ తిరుమలదేవీ సహితుడై ఇక్కడకేతించి స్వామిని అనేక అలంకారములు అర్పించెను.కైంకర్యములను అర్పించెను. అనేక గ్రామములను
క్రీ.శ.1441లో ధారపోసినాడు.గజపతులు పతనమైన తరువాత కుతుబ్ షాహీ వంశము
16/n

వారు ఈప్రదేశముపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకొనినారు.క్రీ.శ .1604 లో పద్మనాయక కులుడను విప్పర్ణ గోత్రుడును అగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్యనైవేద్య రాగభోగములను పునరుద్ధరించి అవి యవిచ్చిన్నముగా జరుగునిమిత్తము నరవ అను గ్రామమును సమర్పించెను .
17/n

మధ్య యుగమున ఈక్షేత్రము విద్యా కేంద్రమని పెక్కు శాసనములవలన అవగతమగుచున్నది . శక సం . 1275 లో గంగానరసింహ భోగకాలమున పురాణములు పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చునిమిత్తము శృఈ భండారమున 52 మాడలను గంగాదేవి యొసగినది.శా.సం .1305 లో సంహాచల మందలి బ్రాహ్మణులకు వేదము చెప్పుటకు జంపూ
18/n

మహాసేనాపతి యొడ్య పెద్దిభట్టును నియమించెను.పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయశాఖలను బోధించు బ్రాహ్మణులకు అదేవిధముగా నారాయణా సేనాపతి నిబంధముల నిచ్చెను . కూచిమంచి తిమ్మయ్యకవి ( 1690-1757 ) కట్టమూరి కామేశ్వర కవి ( 1830-90 ) సింహాచల మాహాత్మ్య శ్రీ
19/n

లక్ష్మీనృసింహ చరిత్రము లనుపేర పేర రచించిన ప్రబంధముల సింహశైల మహాత్మ్యమును వర్ణించిరి . కూచిమంచి తిమ్మకవి 5 అశ్వాసముల కావ్యముగా తెలుగులో రచియించి గౌరీవల్లభునికి అంకితమిచ్చినాడు . ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు - వారు సమర్పించిన కానుకలు : విశిష్టాద్వైతమునకు నకు ఆద్యుడైన
20/n

రామానుజులవారు శైవగమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి ( ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం ) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు . క్రీ.శ. 1098 నాటి చోళరాజు కుళూత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్టు విశదమవుతుంది .
21/n

మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11 వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు , 13 వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది . ఈ ఆలయ ప్రాంతంలోనున్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి .
22/n

శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు ( క్రీ.శ. 1516 మరియు క్రీ.శ .1519 లో ) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు . స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు .
23/n

ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది . 14-15 శతాబ్దములలో [1428] కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని , సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయల విజయధ్వజము శిలా శాసనము ఉంది .ఇదేకాక,క్షేత్ర పరిసరాలలో క్రీ.శ. 1098 తరువాత చెక్కిన దాదాపు ఐదు వందల శిలా శాసనాలు ఉన్నాయి .
24/n

గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు . ఆలయవిశేషాలు : గాలి గోపురము - సింహ ద్వారం సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా , పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది .
26/n

సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే , పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం . కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి . కప్ప స్తంభం దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది .
27/n

ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది .ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం . సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం .పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు
28/n

కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది . జల ధారలు సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది . సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం . ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి . వీటిలో కొన్ని : గంగధార , ఆకాశధార , చక్రధార , మధవధార , సీతమ్మధార లు . భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి ,
29/n

దైవదర్శనం చేసి తరిస్తారు . స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు . ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది . స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు .
30/n

ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది . భైరవ వాక సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవద్వారం ఉంది . ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది . ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు .
31/n

13-16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందినది . వరాహ పుష్కరిణి : వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది . ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు . ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది .
32/n

గిరిప్రదక్షిణ : ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి , కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి , కొండపైన స్వామిని దర్శించడం . ఆషాఢ
పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు .
33/n

కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు . 32 క్.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు . గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు , మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు
#End

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling