స్వామివారి సన్నిధిలో అటువంటి భక్తుల ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర నిత్య అన్నదానం పథకం 1985 ఏప్రిల్6 వ తేదీన రోజూ రెండు వేలమందికి ఉచిత భోజనం అందించేవిధంగా మొదలైంది. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన అన్నదాన పథకం ఇంతితై వటుడింతై అన్నవిధంగా
నేడు మూడు పూటలా రోజుకు సుమారు 1,70,000 మందికిపైగా, వారాంతరాల్లో 2 లక్షలకు పైగా భక్తులకు తితిదే భోజనం అందిస్తోంది. మొదట్లో పరిమిత టోకెన్లు ఇచ్చేవారు, తరువాత దర్శనం చేసుకునేవారికే టోకెన్లు ఇచ్చేవారు. ఇప్పుడు దర్శనంతో సంబంధం లేకుండా, అనేక చోట్ల అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు.
వందల మంది తితిదే ఉద్యోగులు, వేల మంది శ్రీవారి సేవకులు ఈ యజ్ఞంలో భాగం పంచుకుంటున్నారు.
తరువాత పథకం అమలుకు 1994 ఏప్రిల్ 1 న శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్ట్ మొదలైంది. 20 ఏళ్ల తరువాత, 2014 ఏప్రిల్ 1 నుండి ఆ ట్రస్ట్ పేరు “శ్రీవెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్”గా మార్చారు
పేరుకు తగ్గట్టుగానే భక్తులు తితిదే భక్తులకు అందించే భోజనాన్ని శ్రీవారి ప్రసాదంగానే భావిస్తారు. నిత్యాన్నదాన కాంప్లెక్ లో మాత్రమే కాకుండా క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్సు, CROవద్ద, PAC వద్ద ఇలా అనేక ప్రదేశాలలో తితిదే భోజనం, పాలు వంటివి భక్తులకు అందజేస్తోంది
పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక కిచెన్ తో, ఒకే సారి వేల మంది తినే విధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం కాంప్లెక్ ను తితిదే నిర్మించింది. నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు 2011 జులై 7న ఈ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.
ఈ అన్నదానం కాంప్లెక్ లో ప్రతిరోజూ 50 వేలకు మంది పైగానే భోంచేస్తుంటారు. మూడుపూటలా భోజనంతో పాటు (బ్రేక్ఫాస్ట్, రెండు పూటలా భోజనం) భక్తులకు తితిదే పాలు కూడా అందిస్తోంది.
తితిదే తిరుమలలోనే కాక తిరుపతిలోనూ మరియు కొన్ని అనుబంధ ఆలయాలలో కూడా నిత్య అన్నదానం కార్యక్రమం చేపడుతోంది.
ఈ అన్నప్రసాద యజ్ఞాన్ని చేస్తోన్న తితిదేకి విరాళాల రూపంలో అనేక మంది భక్తులు, దాతలు తమ వంతు చేయూతను ఇస్తున్నారు.
తితిదేకి, అటువంటి భక్తులందరికీ వెంకటేశ్వర నిత్య అన్నదాన పథకం ప్రారంభమైన ఈ రోజు (ఏప్రిల్ 6) - ధన్యవాదాలతో - అన్నదాతా సుఖీభవ
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ప్రకారం ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో నైనా సరే ఉపయోగించబడ్డ అతిపెద్ద పదం కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల భార్య తిరుమలాంబ రచించిన సంస్కృత చంపూ కావ్యం 'వరదాంబికా పరిణయం'లోనిది.
అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది.
ఇప్పటివరకు ఏ భాషలోనైనా వచ్చిన సాహిత్యంలో ఇన్ని అక్షరాలతో వాడబడిన పదం మరొకటి లేదు.. ఈ వరదాంబిక కడప జిల్లా చెన్నూరు సీమను, ప్రకాశం జిల్లా కొచ్చర్లకోట సీమను ఏలిన సలకం వారి ఆడపడుచు.