*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.
*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.
*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.
*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.
*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.
*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.
*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.
*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.
*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.
*
11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.
*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)
*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.
*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.
*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.
*
16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.
*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.
*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.
*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.
*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.
*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.
*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.
*28.* భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.
*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.
*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.
*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.
*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.
*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.
*
100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.
*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).
*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).
*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).
*105.* తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)
*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).
*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.
*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
వేదవ్యాసుడు.
🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
-రజాకార్లు మెట్టుగూడ !
(Dr. #Shrimati Suri, Surgeon, Secunderabad, గారి
అనుభవం వారి మాటల్లో)
@ 1948 ప్రథమార్థంలో ... ఒక రోజు మధ్యాహ్నం నాన్నకి ఒక ముస్లిం స్నేహితుడు చెప్పాడు: "దీక్షితులు గారు, ఈ రాత్రి రజాకార్లు మెట్టుగూడ ప్రాంతంలో హిందూ కుటుంబాల మీద దాడి చేయాలనుకుంటున్నారు.
మీరు జాగ్రత్తగా ఉండండి ..." నాన్న ఇంటికి వస్తూనే చెప్పారు. "ఈ రాత్రికి మనం మన ఇల్లు వదిలేస్తున్నాం. అంతా సవ్యంగా జరిగితే తిరిగి మన ఇంటికి వస్తాం. లేదంటే లేదు. ...!!" తెలంగాణ అంతా రజాకార్ల దురాగతాలతో అట్టుడికిపోతోంది.
వేలాది హిందువుల కుటుంబాలు బలైపోతున్నాయి. నిద్రలోనే నరికివేయబడిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. . హిందువులు ఎక్కడ ఉన్నా రజాకార్ల దాడి వార్తలతో భయపడి పోతున్నారు. నిజాం ప్రభుత్వమే రజాకార్లను పోషిస్తోందన్న ప్రచారంతో హిందూ కుటుంబాలు వణికిపోతున్నాయి... అప్పుడు మేం మెట్టుగూడలో ఉండేవాళ్ళం.
🚩🚩
ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను.
♥ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
🚩
క్రింద చెప్పిన మంత్రమును చదువుతూ ముమ్మారు సూర్యునకు అర్ఘ్యము నీయవలెను.
దశావతార స్తుతి:-10.-
(కల్కి అవతారం .)
-
"శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!
-
-
కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము.
కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన.
కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం.
కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావు.
🚩🚩🚩♥-సత్యం -శివము - సుందరం -♥🚩🚩🚩
సత్యం:-
➡ మన జన్మ ని మనమే ఎన్నుకుని వచ్చాము. సృష్టి జగదీశ్వర సంకల్పం.
➡ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అందరికీ ఈశ్వరుడే గురువు.
➡ ఒకరు ఇంకొకరిని, ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఉన్నది ఈశ్వరుడు మాత్రమే.
➡ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. జగజ్జీవేశ్వరులుగా ఉన్నదంతా బ్రహ్మమే.
➡ మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే. మనమంతా లేనివారమే.
జ్ఞానం:-
➡ అందరి దగ్గర నుండి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. జగజ్జనని శివజ్ఞాన ప్రదాయిని.
➡ సమయం క్షణమైనా వృధా ఎప్పుడూ చేయరాదు. కాలమే భగవత్స్వరూపము.
➡ శక్తి అణుమాత్రమైనా వృధా ఎప్పుడు చేయరాదు. అణువునందు మహత్తునందు నిండి ఉన్నది పరమాత్మయే.
➡ ఈ వర్తమాన జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవాలి. దక్షిణామ్మూర్తి కృపచే మౌనవ్యాఖ్యను పొందాలి.
అనంతం :
🚩కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ .
రెండు రోజుల క్రితం #ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ఇచ్చిన వాక్సిన్ ని రాష్ట్రాలు వృధా చేస్తున్నాయని అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
దీనిమీద కొంతమంది చదువుకున్న శుంఠ లు పోస్టలు పెడుతూ అలా ఎలా వృధా అవుతాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
.
1.కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండు వాక్సిన్లు వరుసగా 5ml మరియు 10ml వయాల్స్ [Vial అంటే సీసా l లలో వస్తాయి. 2. ఒక్కో వ్యక్తికి వాక్సిన్ ఇవ్వాల్సిన పరిమాణం 0.5 ml ఒక డోసు గా ఇవ్వాల్సిఉంటుంది. కోవాక్సిన్ 5 ml వయల్ లో వస్తుంది
కాబట్టి 10 మందికి 0.5 ml డోసులు ఇస్తే ఒక సీసా అయిపోతుంది అలాగే కొవీషీల్డ్ అయితే 20 మందికి సింగిల్ డోస్ గా ఇవ్వవచ్చు. 3. ఒకసారి వయాల్ ఓపెన్ చేస్తే 4 గంటలలోపే వాడేయాలి ఆ తరువాత ఆ సీసా లో ఉన్న వాక్సిన్ చెడిపోతుంది.