రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. పాడిపంటలకు, ధన-ధాన్య-వస్తు-వాహనాలకు కొరత లేకుండా ప్రజలు శాంతిసౌభాగ్యాలతో కులాసాగా ఉన్నారు. పరిశ్రమలు పరిఢవిల్లుతున్నాయి. ఖజానాలో డబ్బులు ఏరులై పారుతున్నాయి. 2024 నాటికి పూర్తయ్యే కలగా 2014లో నేను ఊహించిన నవ్యాంధ్ర ఇది.1
ఆ కల ఓ కల్లయ్యింది 2019కి. ఉన్న ఆదాయ వనరులను ఒక్కటొక్కటిగా నరుక్కుంటున్న ప్రభుత్వం. ఇకపై అప్పులు పుట్టని పరిస్థితి. పుండుపై పుట్రగా, ఇప్పుడు కరోనా మహమ్మారి. ద్వేషంతో మొదలయ్యే ఆలోచనల పర్యవసానం దారుణంగానే ఉంటుంది. ఆంధ్రులం నేర్చుకోవాల్సిన పాఠం ఇది.2
కష్టపడి సంపాదించేవాడు ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాడు. రోజంతా అడుక్కుతినే వ్యక్తి కూడా మిగులు డబ్బులు ఉన్నా, తనకు అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చులు చేస్తాడు. నిన్న వంద రూపాయలు వచ్చినప్పుడు ఏవి తిన్నాడో, ఈరోజు మూడొందలు వచ్చినా అవే తింటాడు.3
ఎందుకంటే, రేపటి బ్రతుకు ఎలా ఉంటుందో భరోసా లేదు కాబట్టి, రేపటి వరకు బ్రతకటానికి, సాధ్యమైనంత వరకు సొమ్ములు దాచుకోవాలనే ఎవరైనా ప్రయత్నిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఇలా జాగ్రత్తపడ్తుంటే, మరి లోటు బడ్జెట్తో మొదలైన ఓ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? ఆదాయ వ్యయాలు ఎలా చూసుకోవాలి?4
అందుకనే, వచ్చీరాగానే ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలేసాడు చంద్రబాబు. పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించటం, అవసరమైన అనుమతులు వెంటనే అందించటం లాంటి పనులన్నీ త్వరితంగా పూర్తిచేసాడు.5
ప్రత్యేకహోదా ఇవ్వకుండా అయిదేళ్ళు సహకరించని కేంద్రం, రాజధాని విషయంలో ఒకఅడుగు ముందుకేస్తే కేసు, మరోఅడుగు వెనకకు వేస్తే మరో కేసు ఇలా వేధించుకుతిన్న ప్రతిపక్షాలు, వీటికితోడు ప్రకృతిబీభత్సాలు. ఇన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య కూడా సాధ్యమైనంత మేరా రాష్ట్రానికి ఓ నమ్మకాన్ని వెలిగించాడు.6
బాబుతో పోలిస్తే, ముఖ్యమంత్రి పదవి ఎక్కిన జగన్కి ప్రభుత్వాన్ని నడపటం నల్లేరు మీద బండి వ్యవహారమే. ఎందుకంటే, ప్రత్యేకహోదా లేకపోయినా పక్కరాష్ట్రాలతో పోరాడిమరీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాడు బాబు. ఉద్యోగుల జీతభత్యాలపరంగా, ప్రజలకు అవసరమైనంతమేరా సంక్షేమ కార్యక్రమాలపరంగా ఏలోటూ రానీలేదు.7
ఏమాత్రం బుర్ర ఉన్నవాడు ముఖ్యమంత్రి అయినా, బాబు వేసిన పునాదుల మీద ఈపాటికే అద్భుతమైన రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఉండేవాడు. ఒప్పందం చేసుకున్న కంపెనీలతో త్వరితగతిన పరిశ్రమలు మొదలు పెట్టి ఉండేవాడు. కేంద్రంలో ఉన్నది మిత్రపక్షమే కాబట్టి హాయిగా నిథులు తెచ్చుకుని ఉండేవాడు.8
జగన్చేసిందేమిటి? బాబు ముద్ర ఉన్నదనుకున్న ప్రతిదాన్ని కూలదోస్తున్నాడు. ప్రజావేదిక కూల్చాడు, రాజధానిని రణరంగంలా మార్చాడు. 45 ఏళ్ళకే పెన్షన్లా! చర్చిలో ఫాదర్కి, మసీదులో ముల్లాకి, గుళ్ళల్లో పూజారికి గౌరవవేతనమట! ఎవరి డబ్బు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు?9
పరిపాలనకు కొత్తవాడు అని కొన్ని అంచనాల విషయంలో మినహాయింపు ఇవ్వాలనుకున్నా, అసలంటూ ఒక లక్ష్యమే లేకుండా మొదలైన పరిపాలనలో రాష్ట్రం అధ:పాతాళానికి దిగజారిపోతున్నది. తెలుగుదేశం చేసిన ప్రతి పనిని అవినీతిగా చూపించాలనే వృధా ప్రయత్నాలలో ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది.10
ఏమీ చెప్పలేని స్థితిలో కొందరు అధికారులుంటే, అవకాశంగా మలుచుకునేందుకు తోడేళ్ళల్లా కాచుకుకూర్చున్నారు మరికొందరు అధికారులు. ఇక పోలీసుల తీరు చెప్పనక్కరలేదు. రాష్ట్రంలో స్త్రీలకు రక్షణ లేదు కానీ, సోషల్మీడియాలో అధికారపార్టీని వేధిస్తున్నారని, సామాన్య ప్రజలపై కేసులు పెడుతున్నారు!11
రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే సంకల్పం ఉంటే ఫర్వాలేదు. కానీ బాబు మీది ద్వేషంతో రాష్ట్రాన్ని కూలగొడుతున్నామనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం అయిదేళ్ళల్లో చేసిన అప్పులు, ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదికే చేసింది. మరింత అప్పులు పుట్టే అవకాశాలు మృగ్యం.12
అప్పు చేసి పప్పు కూడు సంక్షేమ పథకాలకు పెట్టే డబ్బు జగన్కు ఓట్లుగా మారతాయేమోగానీ, అవి రాష్ట్ర సమాధికి కొట్టే సీలలు అని ప్రజలకు అర్థం కావటంలేదు. ఇది కోరితెచ్చుకున్న కొరివి కాబట్టి అయిదేళ్ళు పూర్తిగా అనుభవించక తప్పదు. కనీసం వచ్చేసారైనా, ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తారని ఆశిద్దాం.13
కుల మతాల ఆధారంగా సమాజాన్ని చీల్చే రాజకీయాలు చెల్లిపోయే రోజులు వచ్చాయి. సమయం ఇప్పటికైనా పూర్తిగా మించిపోలేదు. ఇకనైనా నిర్మాణాలను కూల్చడాలు, పాడుబెట్టటాలు, రంగులు మార్చటాలు మానేసి, నిర్మాణాత్మకమైన వ్యూహంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తేనే ప్రజలు ఆదరిస్తారని జగన్ గుర్తించాలి. 14
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1976వ సంవత్సరంలో 42వ సవరణ ద్వారా, మన రాజ్యంగపు ఉపోద్ఘాతంలో (ప్రస్తావన, ప్రవేశిక) ’సోషలిస్ట్’, ’సెక్యులర్’ అనే పదాలు ఇందిరాగాంధీ చొరవ వల్ల చేర్చబడ్డాయి. అసలు ఈ ’సెక్యులర్’ అన్న పదాన్ని ఏ అర్థంలో అక్కడ ప్రస్తావించారు? మనం అర్ధం చేసుకున్నదానికి ఈ అర్ధానికి తేడా ఏమైనా ఉన్నదా?1
మన రాజ్యాంగ నిర్మాతలు మొట్టమొదటి ప్రవేశికలో మన దేశాన్ని, సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగానే అభివర్ణించారు కానీ, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా వ్రాయలేదు. అంటే, అప్పటికి వాళ్ళకు ఆ పదాలు తెలియకనా? ఆ విషయాన్ని ఆ వాదులాటని ప్రస్తుతానికి పక్కనపెడదాం.2
’సెక్యులర్’ గురించి మాట్లాడుకుందాం. ’సెక్యులర్’ అన్న పదానికి తెలుగులో ’లౌకిక’ అని అర్ధం చెబుతారు కానీ, ప్రస్తుత సందర్భానికి అది సరైన అర్ధం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే, ’లౌకిక’ అన్న తెలుగుపదానికి అర్ధం లోకంలో తెలిసిన, లోకంలో ప్రసిద్ధి పొందిన అనే అర్ధాలే వస్తున్నాయి.3