డేల్యుజనల్ డిజార్డర్ - ఒక వ్యక్తి బలీయమైన,దుర్భేద్యమైన ఒక అపనమ్మకం పెంపొందించుకుని,ఆ నమ్మకం దృష్ట్యా ప్రవర్తించటం.ఇదొక మానసిక వ్యాధి. దీనికి వైద్యం ఉంది.ఉదాహరణకి,సాధారణంగా అనుమానం జబ్బు కొంతమందికి ఉంటుంది.భార్య ఏతప్పూ చేయనప్పుడుకూడా ఎటువంటి ఆధారం లేకుండా అనుమానించే భర్తలు ఉంటారు.
వీళ్ళు భార్య సెల్ ఫోన్లో నంబర్లను, సందేశాలను అనుమతి లేకుండా చూడడం, వెంబడించటం, నిఘా పెట్టించటం, నిజం చెప్పమని నిలదీయటం, మరీ మితి మీరితే హింసించడం, చివరకు హతమార్చడం జరుగుతుంది. ఆల్కహాల్ కి అలవాటు పడ్డవారిలో ఇది కొంచెం ఎక్కువ. దీనినే ఒథెల్లో సిండ్రోమ్ అని కూడా అంటారు.
వీరికి ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వారి అపనమ్మకం గానీ, అనుమానం గానీ మార్చుకోరు. ఈ మానసిక వ్యాధి రావటానికి చదువు, స్థాయి, డబ్బు, ఉద్యోగం ఏవీ అడ్డంకి కావు. ఎవరికైనా రావచ్చు. ఒంటరి జీవితం, అభద్రతా భావం, ఆత్మన్యూనత మొదలైనవి కారణాలు కాకపోయినా అవి ఈ జబ్బు కి దోహద పడొచ్చు.
ఈ వ్యాధి కౌన్సిలింగ్ తో సాధారణంగా నయం కాదు, మందులు వాడవలసిన అవసరం ఉంది, అది కూడా దీర్ఘకాలం. చిత్తూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మూఢనమ్మకం అనేది ఒక చిన్న భాగం మాత్రమే, ఈ సంఘటన జరగటానికి మూల కారణం ఈ మానసిక వ్యాధి. ఇందులో ప్రధానంగా ఇంటి పెద్దకి ఉన్న అపనమ్మకాన్ని మిగిలిన
కుటుంబ సభ్యులు కూడా గాఢంగా నమ్ముతారు. భార్య, భర్త మాత్రమే నమ్మితే దాన్ని ఫోలీ డ్యూక్స్ అనీ, ఇల్లింటి పాదీ నమ్మితే ఫోలి ఎ ఫ్యామిలీ అనీ అంటారు. ఇందులో ఇంటి పెద్ద చెప్పింది మిగిలిన వాళ్ళు ఏమాత్రం ప్రతిఘటించ కుండా తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ వ్యాధికి గురైన కుటుంబం సాధారణంగా ఒంటరిగా
ఉంటారు, ఎవరినీ ఇంటికి రానివ్వరు, వాళ్ళు అరుదుగా బయటికి వస్తారు, ఎవరితో మాట్లాడారు. కొన్నాళ్లకి వాళ్ళ భోజన అలవాట్లలో మార్పులు వస్తాయి. వాళ్ళ జీవన విధానంలో మార్పులు వస్తాయి. వీళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి గానీ, లేదా భోజనం మానేసి గానీ, లేదా సామూహిక ఆత్మహత్య చేసుకుని గానీ మరణిస్తారు.
అపనమ్మకం అనేది ఆయా సంస్కృతిని బట్టి ఉంటుంది. వాళ్ళు ఉండే భౌగోళిక, సాంస్కృతిక పరిధిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన దేశంలో క్షుద్రపూజలు అని,చేతబడి అని ఉంటాయి. కాథలిక్ దేశాల్లో సాతాను అని, అలాగే దేవుడ్ని నమ్మని వాళ్ళలో గ్రహాంతర వాసులు అని రకరకాలు. కాబట్టి నమ్మకంలో విషయం మాత్రమే తేడా
ఈ చిత్తూరు ఘటన మాత్రమే కాకుండా దేశంలో చాలాచోట్ల ఇటువంటి సంఘటనలు జరిగాయి. అయితే చాలాసార్లు ఇంట్లో అందరూ చనిపోయాక చాలా రోజులకు వాసన వచ్చి బయటకి తెలుస్తుంది. అలాగే ఇంట్లో కుళ్లుతున్న దేహాన్ని ఉంచి మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడే నివసిస్తున్న ఘటనలు.
కొంతకాలం క్రితం బొబ్బిలిలో ఒక కుటుంబం ఇలాగే ఒంటరిగా ఉంటే వాళ్ళని పోలీసుల సహాయంతో బయటకు రప్పించారు స్థానికులు. అలాగే మొన్న ఆస్ట్రేలియా లో కూడా ఒక తల్లి, ముగ్గురు బిడ్డలతో ఇంట్లో చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.
ఈ మానసిక వ్యాధిని చాలా తీవ్రంగా పరిగణించాలి.దీనికి వైద్యం ఉంది. ఇందుకోసం ఆ కుటుంబాన్ని ఆసుపత్రిలో చేర్చి, ముందు వాళ్ళను విడదీసి ఉంచాలి కొన్నిరోజులు. ఇంటి యజమాని లేదా ముఖ్య వ్యక్తికి వైద్యం చెయ్యటం ద్వారా అందరికీ నయం అవుతుంది. మంచి ఫలితం ఉంటుంది. అందువలన తొలి దశలో గుర్తించటం అవసరం
ఇప్పుడున్న కరోనా వలన ఒంటరి జీవితం, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న తప్పుడు సమాచారం,ఇతర మతాల పైన ద్వేషం, పొరుగింటి వారిపై అసూయ ఇటువంటివి అన్నీ కూడా మనలోని అభద్రతా భావాన్ని కొంచెం కొంచెం గా పెంచి మానసిక వ్యాధికి కారణం అవుతాయి.అందువలన ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవాలి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
హౌస్ సర్జన్ గా ఉన్నప్పుడు, ఒకరోజు కార్డియాలజీ విభాగంలో నైట్ డ్యూటీ. ఆ రాత్రి అప్పటికే అడ్మిట్ అయినవాళ్లలో ఇద్దరు చనిపోగా, ఒకర్ని చాలాసేపు రిససిటేట్ చేసి బ్రతికించారు మా కార్డియాలజీ పీజీ, మెడిసిన్ పీజీలిద్దరూనూ, నేనేదో ఉడతా భక్తి సాయం. అప్పటికి ఉదయం 6గం కావస్తోంది,
అప్పుడే ఆ రిససిటేట్ అయిన రోగిని స్టెబిలైజ్ చేస్తున్నారు, ఇంతలో వార్డుకి ఒక కొత్త పేషెంట్ను ఇద్దరు ఆడవాళ్లు ఒక స్ట్రెచర్ పై తోసుకుంటూ వచ్చారు. వాళ్ళు చాలా గాభరాలో ఉన్నారు, కార్డియాలజీ పీజీ నాతో ఇలా అన్నారు, "నువ్వెళ్ళి చూడు, స్పృహలో లేకపోతే వెంటనే CPR చెయ్యు, నేను వచ్చేస్తాను"
నేనెళ్ళి చూసాను, అతను స్పృహలో లేడు, నాడి చూసాను, అందలేదు. వెంటనే CPR మొదలుపెట్టాను. ఆ వ్యక్తి వయసు నలభై ఉంటుంది. తెల్ల బనీను, గళ్ళ చొక్కా, లుంగీ వేసుకున్నాడు, అప్పటికే అతని చొక్కా బనీను చెమటతో బాగా తడిసిపోయాయి. అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు, తల పక్కకి తిరిగి ఉంది. అతను ఒక మోస్తరు
గురక గురించి.
సాధారణంగా మనం పీల్చే గాలి ముక్కునుంచి, గ్రసని అక్కడ్నుంచి శ్వాసనాళం గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ గ్రసని అనేది కొన్ని కండరాల సముదాయం. ఇవి మనం మేల్కొని ఉన్నప్పుడు సంకోచించి గ్రసనిని తెరిచి ఉంచి గాలి వెళ్లేలా చేస్తుంది. అయితే రాత్రిళ్ళు ఈ కండరాలు పట్టు తప్పడం
వలన గాలి వెళ్లే మార్గం సన్నంగా మారి ఈలలో గాలి సన్నని మార్గం గుండా వెళ్ళేటప్పుడు శబ్దం వచ్చేలాగా ఈ గురక వస్తుంది.వయసు పైబడటం, ఊబకాయం, కొంతమందిలో పుట్టుకతో గాలిమార్గం సన్నంగా ఉండడం, రక్తపోటు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధులు మొదలైనవి గురక వచ్చే అవకాశాల్ని ఎక్కువ చేస్తుంది.
ఈ గురక వచేటపుడు, ఊపిరితిత్తులలోకి దాదాపుగా గాలి వెళ్ళటం తగ్గిపోతుంది.దానివలన రక్తంలో ప్రాణవాయువు శాతం తగ్గి నిద్రపోతున్న మెదడు చికాకుకు గురవుతుంది.దాంతో అది లేచి పడుకున్న వ్యక్తిని లేపి శ్వాస సరిగా తీసుకోమని చెప్తుంది,సదరు వ్యక్తి మేల్కొని రెండుసార్లు సరిగా ఊపిరి తీసుకున్నాక
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఈరోజు. కొన్ని విషయాలు తెలుసుకుందాం.
క్యాన్సర్ రాని అవయువం లేదు మన శరీరంలో. కొన్ని పూర్తిగా జన్యులోపం వలన వస్తాయి అటువంటివాటిని ఆపటానికి మనమేం చెయ్యలేం. కొన్నింటిని రాకుండా ఆపగలం. వాటికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం.
పచ్చళ్ళు,నిల్వఉన్న పదార్ధాలు,పొగతో వండిన పదార్ధాలు తినకపోవడం.
కొన్ని రకాల పెట్రో కెమికల్స్, రంగులు, క్యాన్సర్ కారక రసాయనాలకు దూరంగా ఉండటం.
మందు,సిగరెట్ తాగకపోవటం
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఆడవాళ్లు వాక్సిన్ వేసుకువడం
సాధారణంగా క్యాన్సర్ తీవ్రతని నాలుగు స్థాయిల్లో చెప్తారు. ఒకటి రెండు స్థాయిల్లో, లేదా అందకుముందు ఉండే స్థాయిల్లో ఉండే క్యాన్సర్ ని ముందుగా గుర్తు పడితే సులువుగా వైద్యం చెయ్యవచ్చు. కానీ మూడు, నాలుగు స్థాయిల్లో ఉన్నవి కొంచెం కష్టం, లేదా వైద్యానికి లొంగవు. క్యాన్సర్ రకం,
CPR లేదా కార్డియో పల్మనరీ రిససిటేషన్ ఎప్పుడు ఎలా చేయాలి?
గమనిక-ఇది ఒక మార్గదర్శకం మాత్రమే, ఏదైనా అత్యవసర/మత్తు వైద్యుల సంఘం నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా తర్ఫీదు పొంది ధ్రువపత్రం పొందవచ్చు.
CPR మీన మేషాలు లెక్కించకుండా ఎంతత్వరగా చేస్తే అంత మంచిది.ఎలాగో చూద్దాం
ఎవరైనా వ్యక్తి ఏదైనా కారణం వలన (విద్యుదాఘాతం,నీటిలో మునిగిపోవడం, గుండెపోటు) హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినపుడు అలాగే వారి నాడి తెలియనప్పుడు (అంటే గుండె కొట్టుకోవట్లేదని) వారికి CPR వెంటనే ప్రారంభించాలి. ఆలస్యం చేసే ప్రతినిమిషం వ్యక్తి బ్రతికే అవకాశం 15%సన్నగిల్లుతుంది
ముందుగా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని అక్కడున్న ప్రమాద పరిస్థితుల నుంచి బయటకు తేవాలి - రోడ్డు,నీళ్లు, అగ్ని, విద్యుత్ తీగలు మొదలైనవి. ఎప్పుడైనా CPR రక్షిత ప్రదేశంలో చేయాలి. వెంటనే వ్యక్తిని గట్టి ప్రదేశంపై పడుకోబెట్టి ముఖం ఛాతీ పైకి చూసేలా ఉంచి అతన్ని పేరు పెట్టి పిలవడం
అరకులోయ,క్షవరం చెయ్యని గడ్డం, రింగులు తిరిగి చెంపలు దాటిన జుట్టు, దాదాపు అడుగు అరిగిపోయిన వుడ్ ల్యాండ్ జోళ్ళు, సగం ఫ్రేము కళ్లద్దాలు, వీటికి తోడు తెల్ల చొక్కా, నీలిరంగు జీన్సు ప్యాంటు, భుజానికి నడుం వరకు వేలాడుతున్న పాత తోలు సంచీ, చివరిగా పైజేబులో ఒక పెన్ టార్చ్ తో గుబురుగా ఉన్న
చెట్ల మధ్యలో ఒక మునిలా సాగిపోతున్నాడతడు. అతనికో ముఫైయ్యారేళ్ల వయసుంటుంది. చెట్ల కొమ్మల్లోంచి తప్పించుకొచ్చిన సూర్య కిరణాలు అతని నుదిటి నుంచి జాలువారే చెమట చుక్కల్ని ముత్యాలుగా మారుస్తున్నాయి. అదొక దారి కాదు, కానీ అతను నడిచేది ఏదైనా అతనికి దారే, ఆ అడవిలో అతనేదో వెదుకుతున్నాడు.
ఆ అడవి అతనికి పరిచయం, అక్కడి చెట్లూ, కొండలూ,సెలయేళ్ళూ అతన్ని పలకరిస్తుంటాయి, అతను పట్టించుకోడు. అతనికి అలసట లేదు,అతని ప్రయాణానానికి గమ్యం లేదు, అతని ప్రశ్నకి సమాధానం దొరకలేదు. అతనొక దగ్గర ఆగాడు, మనిషి మాత్రమే ఆగాడు మనసు కాదు. సంచిలోంచి ఒక అరటిపండు సగం తిన్నాడు,
విటమిన్ బి12 గురించి.
ఇది మాంసం,గుడ్లు,పాల ఉత్పత్తుల్లో విరివిగా లభిస్తుంది. శాకాహారంలో ఉండదు. విటమిన్ బి 12 లోపం దాదాపు 4%ప్రజల్లో ఉంటుంది. దీని లోపం వలన అలసట,తిమ్మిర్లు,రక్తహీనత, దిగులు, వెన్నుపాములో నరాల క్షీణత వచ్చి తూలిపోవటం, మతిమరుపు,అంగస్థంభన తగ్గటం మొదలైనవి కనిపిస్తాయి.
ఇది నరాల పటుత్వానికి, రక్తం వృద్ధికి అవసరం. సాధారణంగా మనం తినే ఆహారంలో ఇది లేకపోవటం వలన ఒంట్లో దీనిలోపం వచ్చే అవకాశం తక్కువ ఎందుకంటే మనమందరం మాంసం తినకపోయినా కనీసం పెరుగు తింటాం. అయితే ఆహారంలో ఈ విటమిన్ బి12 కొన్ని మాంసకృత్తులకు అతుక్కుని ఉంటుంది. ఈ ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళాక
అక్కడ విడుదలయ్యే ఆమ్లం దీనిని ఆ మాంసకృత్తుల నుంచి విడుదల చేస్తుంది, అక్కడ జీర్ణసయం స్రవించే ఒక రసాయనం ఈ విడుదలైన విటమిన్ బి12ని పట్టుకుంటుంది, అది చిన్నప్రేగు చివరివరకు వెళ్లి అక్కడ శోషింపబడి రక్తంలో కలుస్తుంది. ఈ రక్తంలో కలిసిన విటమిన్ బి 12 కాలేయంలో నిల్వ ఉంటుంది. ఈ నిల్వ