పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
రోజు ఒక గోపికను నిద్రలేపడమేంటి అనిపించవచ్చు కాని గోపికలనే ఆళ్వారులను కీర్తిస్తూ నిద్ర మేల్కొలిపి వారిని తోడ్కొని ఆ పరమాత్మ సన్నిధికి చేరాలి అనే అద్భుతమైన భావం ఈ పాశురాలలో ఉంది. ఈనాడు మేల్కొలిపే
గోఫిక నేత్రాలు చాలా అందమైనవి. అందరినీ ఆకర్షించే తుమ్మెదతో కూడిన తామరపూవులాంటి కళ్లు, లేడి చూపులు కలిగి ఉన్నది. ఈ నేత్ర సౌందర్యమే ఆ శ్రీకృష్ణుని తన వద్దకు తీసుకొస్తుందనే నమ్మకం కలిగి ఉన్నది. ఇక్కడ నేత్రమంటే జ్ఞానం. జీవుడు పరమాత్మకే చెందినవాడు రక్షింపబడేవాడు,
దాసుడు అని తెలుసుకున్నవారు ఆ పరమాత్మను పొండడానికి ఎటువంటి ప్రయత్నము చేయరు. ఈ స్థితిలో ఉన్న గోపికను గోదాదేవి మేల్కొలుపుతుంది.
బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని, దుష్టుడైన రావణాసురుని చంపిన శ్రీరాముని కీర్తిని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ అప్పుడే వ్రతక్షేత్రానికి చేరారు.
తుమ్మెద కలిగిన తామరపూవులలాంటి కళ్లు ఉన్న చినదానా! శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు. లేడి చూపులు కలిగినదానా! పక్షులు కూయుచున్నవి. ఈ శుభదినాన శ్రీకృష్ణవిరహం తీరి చల్లబడేట్టుగా నీటమునిగి స్నానం చేయకుండా ఇంకా శయ్యపై పడుకుని ఉన్నావా?ఓ సుకుమరి తొందరగా వచ్చి మాతో కలువుము
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🌺పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.
ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.
🌺తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలనిఅనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు.
శిల్పి నక్త వ్రతాన్ని(పొద్దున్నించీ భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన
నందులను తయారు చేశాడు.
🌺కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు.కానీ ఏమి లాభం?వెంటనే విచారం లో మునిగి పోయాడు . ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి?అన్నదే అతని బాధ.
మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి. నిద్రకూడా పట్టలేదు.
అందరికంటే ముందు లేచి అందరినీ మేల్కొలుపుతాను అని మాట ఇచ్చి మరచిపోయి ఇంకా నిద్రపోతున్న గోపికను ఈరోజు మేల్కొల్పుతున్నారు. ఈ గోపిక ఉన్నది ఒక విశాలభవనం. దాని వెనకాల తోటలో అందమైన కొలను.
అందులో కలువలు తామరలు కదలాడుతూ అందంగా ఉన్నాయి. "అమ్మా! చూశావా? కలువపూలు ముడుచుకుంటున్నాయి. తామరపూవులు వికసిస్తున్నాయి. తెల్లవారిందమ్మా లే! ఎర్రని కాషాయవస్త్రాలు ధరించి, తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు దేవాలయాలు తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు.
కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్టతో పూజిస్తారు. దీని వెనక ఓ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య
చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాన్నుంచి పాపవిమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరతారు. ఎన్నో రోజులు కష్టించి గాలించినా శివదర్శనం కాదు. చివరికి కేదార్ నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే
పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తు పట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
నిన్నటి పాశురంలో గోపాలురు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా స్వధర్మాన్ని ఆచరించేవారని చదువుకున్నాం కదా. ఈరోజు ఆ స్వధర్మం కూడా అవలంభించని ఓ గోపిక గురించి తెలుసుకుందాం. ఈ గోపికనే గోదాదేవి, ఇతర గోపకాంతలు మేల్కొల్పుతున్నారు.
ఈమె స్ధితప్రజ్ఞత అవస్ధలలోని తొలిదశ యతమానావస్ధలో ఉంది. తాబేలు తన అవయవములను మొత్తం లోపలికి లాక్కుని ఉంటుంది అదేవిధంగా ఈ గోపిక వలెనే ఇంద్రియములను ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించినవాడే స్ధితప్రజ్ఞుడు అవుతాడు. ఈ గోపిక శ్రీకృష్ణుడి ఆప్తమిత్రుడు శ్రీదాముని సోదరి.
ఈరోజు నిద్ర మేల్కొల్పే గోపిక కులంలో, గుణంలో, అందంలో మిన్నయైనదై కృష్ణుడివలెనే వ్రెపల్లెలో అందరి మన్ననలను పొందింది. భగవంతుని కైంకర్యమే ఐశ్వర్యంగా భావిస్తుంది ఈ గోపిక.
వివిధములైన ధర్మములను ఆచరిస్తూ వాటి ఫలితములకోసం ఎదురుచూడక అవి భగవదారాధనా రూపాలని భావిస్తుంది.
ఈ గోపికను గోదాదేవి ఇలా మేల్కొపుతుంది. "లేగదూడలు కల ఆవులైనా దూడలవలె ఉన్న పలు ఆవుల మందల పాలు పితికేవారు, శత్రువులను బలాన్ని నశింప చేయడానికి యుద్ధం చేసేవారు, ఎట్టి దోషము
😎😎😎😎
SK : "ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది."
RK : "అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు?"
SK : "ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే..."
RK : "అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."
SK : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"
RK : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగ ఉంటుంది."
SK : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను,
వ్రాసుకోండి."
RK : "సరే చెప్పు..."
SK : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."
RK : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"
SK : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."
RK : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"