చిరు నవ్వు..మౌనం..రెండూ గొప్ప ఆయుధాలు..
చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచు..
మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు.🤗
Mar 14 • 15 tweets • 3 min read
🙏మన్రో గంగాళాలు" అంటే ఏవో తెలుసా
🙏
కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే.
తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి.
ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..
1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు,
నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు.
అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో
Mar 2 • 11 tweets • 2 min read
తిరుమల విమాన వేంకటేశ్వరస్వామి
ఆనంద నిలయ విమానం మీద వాయవ్యమూలకు గూడులాంటి చిన్న మందిరం వెండి మకరతోరణంతో అలంకరింపబడింది.ఆ మందిరంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు,హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై
వేంచేసి ఉన్నందువల్ల ఆయన "విమాన వేంకటేశ్వరుడు"గా పిలువబడుచున్నాడు.
ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని "వేంకటాచలమాహాత్మ్యం" ద్వారా తెలుస్తోంది.ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి
Nov 29, 2023 • 9 tweets • 2 min read
శ్రీ వ్యూహ లక్ష్మి 🙏
తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన మూలవిరాట్టు వక్ష స్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది. అందుకే వైకుంఠ నాధుడ్ని శ్రీనివాసుడు గా పిలుస్తారు.ఈ శ్రీ మహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో
లేని తంత్ర శాస్త్ర విశేషమైన కార్యక్రమం.. ఒకానొక సంధర్భంలో స్వామి వారు ఎవరు అనే ధర్మసందేహం కలిగిన రోజుల్లో భగవత్ రామానుజుల వారే స్వామి వారు సాక్షాత్తు వైకుంఠ నాధుడని, వైకుంఠంనుండి భూలోకంలో అర్చ
వతార మూర్తిగా అవతరించారని, స్వామి వారికి శంఖు చక్రాలను ఏర్పాటుచేసిపచ్చకర్పూరంతో
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.
వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.
{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}
కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)
ప్రాణాయామం
సంకల్పము: (ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే,
భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)
సంపూర్ణ శ్రీ వరలక్ష్మీ వ్రత పూజా విధానం🙏
మనం ఎదురు చూసే వరలక్ష్మి అమ్మవారి వ్రతం🙏
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేయాలి
భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది
శ్రీవరలక్ష్మి పూజ సామగ్రి🙏
పసుపు, కుంకుమ,
గంధం, విడిపూలు, పూల మాలలు,
తమలపాకులు, 30
వక్కలు, ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు, తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ,
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,
కలశం,
కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది
శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.
ప్రాణాయామము 🙏
ఓం భూః, ఓంభువ, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.
సంకల్పం 🙏
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, ....పక్షే , ....తిధౌ, శుక్రవాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంచా పరిపూర్తర్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే
ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు
*********************************
శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే
వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు
కొంతమంది స్వయంగా చేతిలో తీసుకుంటారు ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి
ఒంపుకుంటారు
అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి
తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి
తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు
అలా చేయకండి
Jul 5, 2023 • 10 tweets • 2 min read
#దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా🙏 1. #శైలపుత్రి
ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం,
ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు. 2. #బ్రహ్మచారిని
ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను
Jul 3, 2023 • 13 tweets • 2 min read
*మధ్యప్రదేశ్ రాష్ట్రం*
*అత్తింటి వేధింపులే ఐ.ఏ.ఎస్ ని చేశాయి...*
ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే ! కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్ సాధించి...
‘హిమ్మత్వాలీ లడ్కియా’ పేరుతో నేటితరం ఆడపిల్లల్లో ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ నూరిపోస్తోందిలా..
*తెలివైన ఐఏఎస్ అధికారిణిగా గుర్తింపు...*
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, చంబల్కు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదా, ఇది ప్రస్తుతం...
Jul 2, 2023 • 11 tweets • 2 min read
*వ్యాసపౌర్ణమి అనగా ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి.*
*చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి బాబా అంటూ, గురువు అంటూ పూజలు చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికి చెయ్యాలి ఎలా చెయ్యాలి అని పెద్దలు ఒక పద్ధతిని తీసుకొనివచ్చారు.*
*అదే వ్యాస పౌర్ణమి నాడు జగద్గురువులైన వేదవ్యాసులవారికి చేసే గురు పూజ.*
*సాధారణంగా గురుస్వరూపాలకి ఆరాధన ప్రక్రియ లేదు కానీ ఏ మహాపురుషుడి వలన వేద విభాగం జరిగిందో, సమస్త వాఙ్మయం భూమిమీదకు వచ్చిందో అట్టి జగద్గువులైన వేదవ్యాసులవారికి శిష్యులు మరియు మిగతా గురు పరంపర అంతా కలిసి
Jun 27, 2023 • 8 tweets • 2 min read
ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తిర్చేస్తాడుట............!!
ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి
అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా
Jun 26, 2023 • 7 tweets • 1 min read
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు
ఇక పొలం పనులు చేసుకునేవారు. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటించలేరు.అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.ఆషాఢమాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటుంది
Jun 24, 2023 • 11 tweets • 2 min read
" తిరుమల శ్రీవారి పుష్కరిణి పక్కనున్న శ్రీఆదివరాహస్వామి వారి గుడిలో స్వామివారు తమకెదురుగా వచ్చే భక్తులను చూడకుండా అమ్మ వారితో ఏదో రహస్యంగా చెప్తున్నట్టుగా ఉంటారు. అలా పక్కకు తిరిగి ఎందుకున్నారు?
కలియుగంలో శ్రీవారు ఆదివరాహస్వామి వారికి ఒక వరమిచ్చారు. "ప్రధమపూజ, ప్రధమ నైవేద్యం,
ప్రథమదర్శనం నీకే వరాహా!" అని. వైఖా నస ఆగమశాస్త్రప్రకారం, క్షేత్రనియమం ప్రకారం
స్వామివారి దర్శనానికెళ్లేముందు ప్రతి భక్తుడూ ముందుగా పుష్కర స్నానంచేసి, వరాహస్వామి దర్శనంచేసుకుని, ఆ స్వామి అనుమతితో మాత్రమే ఆనంద నిలయంలోనున్న శ్రీవారిదర్శనం చేసు కోవాలి.
Jun 19, 2023 • 15 tweets • 2 min read
నిత్య పారాయణ శ్లోకాలు🙏
మనలో చాలామందికి తెలియని శ్లోకాలు
ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...
🌷ప్రభాత శ్లోకం :🌷
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!
ప్రభాత భూమి శ్లోకం :
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!
నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడి వరాన్ని ఉద్దేశించి స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి.
హిందు పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి, ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణుభగవానుడు లోకకళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు.
May 3, 2023 • 27 tweets • 4 min read
ఈరోజు "శివుని ఆత్మలింగం", "గోకర్ణ" క్షేత్రం కర్ణాటక రాష్ట్రం గురించి తెలుసుకుందాం
మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం,
ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నదిఉన్నాయి.
ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.
స్కాందపురాణం నంధు తెలిపిన ప్రకారం రామాయణకాలములో రావణుడు ఈ ఆత్మలింగమును హిమాలయ ములలోని కైలాశ పర్వతమునుండి తెచ్చినాడని పురాణ ప్రవచనము.
May 2, 2023 • 19 tweets • 3 min read
🌷🌻ఈరోజు కర్ణాటక లో "మురుడేశ్వరస్వామి" ఆలయం గురించి తెలుసుకుందాం.🌻🌷
🌻శివ దేవుని ఆత్మలింగం 5 భాగాలులో ఒక భాగం పడిన ప్రదేశం మురుడేశ్వర ఆలయం ఉన్న ప్రాంతం:మిగిలిన క్షేత్రాలు గోకర్ణ, సజ్జేశ్వర, గుణవంతేశ్వర, ధారేశ్వరాలు.వీటిలో గోకర్ణ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఇతిహాసం ఉంది.
మురుడేశ్వర అలయ చరిత్ర:
మనం అందరం భూకైలాష్ సినిమా చూసే ఉంటాం,శివుని ఆత్మలింగం రావణాశురుడు కే సొంతం కాకుండా గణపతి ఆత్మలింగం మోయలేక పోతున్నానని రావణాసురుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే ఐదు భాగాలుగా విడి పోయి, సముద్రతీరములొని ఐదు చోట్ల పడితే ఆ ఐదు కూడా
May 1, 2023 • 14 tweets • 3 min read
నేడు అన్నవరం సత్యదేవుని కళ్యాణం:
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా , స్మార్తాగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు
.శ్రీ సత్యనారాయణ స్వామివారిని
*" మూలతో బ్రహ్మరూపాయ*
*మధ్యతశ్చ మహేశ్వరం*
*అధతో విష్ణురూపాయ*
*త్ర్త్యెక్య రూపాయతేనమః "* అని స్తుతిస్తారు.
క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామానారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి
Apr 19, 2023 • 11 tweets • 2 min read
తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు........... !!
తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు.
ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో
మూలమూర్తి (ధ్రువబేరం)
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి
Apr 18, 2023 • 10 tweets • 2 min read
నారాయణడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో స్వామివారు ముక్తి నారాయణుడిగా పూజలను అందుకుంటున్నాడు. శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఎనిమిది క్షేత్రాలలో, అమ్మవారి శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. కానీ ఈ ఆలయాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది?
ఈ ఆలయంలో ఉన్న ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నేపాల్ దేశంలో మస్తంగ్ జిల్లాలో 12 వేల అడుగుల ఎత్తులో ముక్తినాధ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో స్వామివారు నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు కానీ చేతిలో ఎటువంటి ఆయుధాలను ధరించి లేకపోవడం విశేషం.
Apr 18, 2023 • 27 tweets • 4 min read
*సుధీరత – ఆత్మ నిర్భరత*------------------------------జాంపేట నుండి దానవాయి పేట గాంధి పార్కుకి వచ్చే రోడ్ పై ఎడమ పక్కన ఉండే పాప్ కార్న్ బండి దాదాపు 6,7 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే..
అక్కడ ఫ్రెష్ గా తయారు చేసే పాప్ కార్న్ తో పాటుగా రకరకాల హాట్ స్నాక్స్ ...గొట్టాలు మొదలైనవి...
తయారు చేస్తూ, ప్యాక్ చేస్తూ... వచ్చిన కస్టమర్స్ కు అమ్ముతూ, శ్రద్ధగా తన పని తాను చేసుకు పోయే కుర్రాడు...తనతో ఎప్పుడు మాటాడుదామని అనుకున్నా ఎదో ఒక బిజీ... పైగా రోడ్ ఎప్పుడూ రద్దీ గా ఉండటంతో కుదరలేదు. సాయంత్రం అటు వైపు గా వచ్చేటప్పుడో, వెళ్ళేటప్పుడో, కొన్నా కొనకున్నా తనకేసి చూస్తూ
Apr 17, 2023 • 5 tweets • 1 min read
మత్స్య రూప వేంకటేశ్వర స్వామి -దేవరంపాడు
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం కు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో, దేవరంపాడు గుట్టపై వేంచేసియున్న ఈ స్వామి వారిని, ఈ ప్రాంతంలో భక్తులు నేతి వెంకన్న గా పిలుచు కుంటారు. భక్తులు తమ పాడిపశువులు ఈనిన తరువాత, తొలిసారి కవ్వంతో
చిలకగా వచ్చిన వెన్నను దాచి, ఉత్సవ వారాలలో స్వామి వారిని ఆ వెన్నతో అభిషేకించడం ఆనవాయితీ.
ఈ ఆలయం లో స్వామి పై కప్పు లేకపోవడంతో, మద్యాహ్న సమాయానికి భానుడి కిరణాలు మూల విరాట్ను నేరుగా తాకడంతో, ఎండవేడికి వెన్న కరిగి నెయ్యిలాగా మారి ఆ నేతిలో స్వామివారు మత్స్య రూపంలో జలకాలాడుచున్నట్లు