#భువిపై_తొలి_విశ్వవిద్యాలయం_నలంద

ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయం #నలంద. అది భారతదేశంలో ఉండటం మనందరికి గర్వకారణం. #హర్షవర్ధనుడు క్రీ.శ.647లో మరణించాడు. ఇతని ఆస్థానంలో దీర్ఘకాలంగా ఉన్న చైనా యాత్రికుడు #హ్యూనాంగ్ తొలుత పశ్చిమోత్తరంగుండా భారతదేశంలో ప్రవేశించాడు. కాశ్మీర్, నియాల్కోట్, Image
జలంధర్ మీదుగా కనోజ్ చేరుకున్నాడు. హరుని సన్మానాలు అందుకుని, ప్రయాగ, కాశీ, బుద్ధగయలు సందర్శించి, అస్సాం, బెంగాలు, ఒరిస్సా మీదుగా ఆంధ్రాలో నాగార్జునకొండను, శ్రీపర్వతాన్ని చూసి, కంచి వెళ్లి, మైసూరు మీదుగా మహారాష్ట్రా వెళ్లి, చాళుక్య రాజధాని వాతాపి చూసి #నలంద చేరుకున్నాడు. Image
అతను భారతదేశం వదలివెళ్లే సమయంలో బుద్ధుని అస్తికలతో పాటు పలు విలువైన తాళపత్ర గ్రంధాలు ఇరవై గుర్రాలపై చైనాకు తీసుకు వెళ్లాడు.

వోల్టేర్, ఏయరిడిసోన్నెరేట్, ఫైలింగ్, జాన్సోల్వెల్వంటి ఐరోపాలోని చాలామంది ప్రముఖ మేధావులు భారతదేశాన్ని “నాగరికత యొక్క ఊయల" గా పిలుస్తారు. Image
భారతదేశం ప్రపంచంలోని దాదాపు ప్రతిపురాతన, మధ్యయుగ నాగరికతతో మేధో సంబంధాలను పంచుకుంటుంది అనేది నిజం. రాజకీయ కారణాల వలన భారతదేశ చరిత్ర, నాగరికత ప్రపంచంలో చాలా తక్కువగా అంచనా వేయబడింది. వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం జ్ఞానరంగంలో ఎంతో దోహదపడింది. Image
పశ్చిమాన మధ్యధర సముద్రం దగ్గర ఉన్న దేశాల నుండి తూర్పున చైనా సముద్రం వరకు ఎందరో విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వచ్చారు.

కానీ ఏ భారతీయ విద్యార్థి కూడా చదువుల కోసం ఈ దేశం నుండి వేరే దేశం వెళ్లినట్లు చెప్పలేదు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు Image
అంతర్జాతీయ అభ్యాస ప్రదేశంగా భారతదేశం వెలుగొందింది. ఎందుకంటే #తక్షశిల, #నలందా, #విక్రమశిల వంటి గొప్ప అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మనకు ఉండేవి. ప్రారంభ, మధ్యయుగ కాలంలో ఈ విశ్వవిద్యాలయాలు కుప్పకూలిన తరువాత కూడా భారతదేశం ముస్లిం ప్రపంచానికి గణితం, సంగీతం, చదరంగం, ఆయుర్వేదం, Image
రసాయనశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, పంచతంత్ర, కొన్ని హిందూ గ్రంథాలు వంటి అనేక ప్రత్యేకమైన విషయాలను నేర్పించినది. అందుకని అల్-ఔరుని, అమీరు, ప్రో వంటి వారు కూడా మన దేశాన్ని అంతర్జాతీయ అభ్యాస దేశంగా స్పష్టపరిచారు.

ప్రాచీన ప్రపంచంలో అలెగ్జాండ్రియాలోని ఏథెన్స్ మ్యూజియంలో లైసియం వంటి Image
అనేక అభ్యాస స్థానాలు ఉన్నాయి. బైజాంటైన్ (క్రీ.శ. 843లో స్థాపించబడింది.), అల్-కరాయిన్ (క్రీ.శ. 859), ఆల్జార్ (క్రీ.శ.975), బోలోగ్నా (క్రీ.శ.1088), పారిస్ (క్రీ.శ. 1160), ఆక్స్ ఫర్డ్ (క్రీ.శ. 1167), కేంబ్రిడి (క్రీ.శ.1209), పలాన్సియా (క్రీ.శ.1212), సలామాంతా(క్రీ.శ 1918), Image
పాడుగా (క్రీ.శ. 1222), టౌల్ (క్రీ.శ. 1229) మెదలైనవి మధ్యయుగకాలానికి చెందిన ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు. కాని వీటిలో వేటికీ మౌలిక సదుపాయాలు, పాఠ్యాంశాలు మన తక్షశిల, నలంద, విక్రమశిల వాటిలోలా లేవు. ఆనాటికే భారతదేశంలో పలు విశ్వవిద్యాలయాలు ఉండేవి.

అలెగ్జాండర్ దండెత్తే నాటికే తక్షశిల - Image
ప్రసిద్ధిచెందింది. #ఉజ్జయిని మరొకటి. దక్షిణాన - #నాగార్జునకొండ విశ్వవిద్యాలయం క్రీ.శ.200 ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అన్నింటిలోకి నలంద విశ్వవిద్యాలయం శిఖరాన్నతం అంటే అతిశయోక్తికాదు. హర్షుని కాలంలో విలసిల్లిన ఈ విశ్వవిద్యాలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది.

నలం అంటే సంస్కృతంలో పద్మం Image
అని అర్థం. ఇది జ్ఞానానికి గుర్తు, ద అంటే ఇవ్వడం. వెరసి.. జ్ఞానాన్ని అందించేది నలందా అని అర్ధం. గుప్తరాజులలో చివరివాడైన బాలాదిత్యుడు నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. ఉత్తరాదిని పాలించిన రాజులు అందరూ నలందను ఆదరిస్తూనే వచ్చారు. #హర్షవర్థనుడు ఇట్టి దాతలలో అగ్రగణ్యుడు. Image
ఈ విశ్వవిద్యాలయంలో పదివేలమంది చదువుకునే అవకాశం ఉండేది. దేశదేశాల విద్యార్థులు, పండితులు ఇక్కడకు వచ్చేవారు. అందుకే నలందా అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా కీర్తికెక్కింది. బౌద్ధతత్వశాస్త్రంతో పాటు, సాంఖ్యా, వైశేషిక, యోగ, తర్కమీమాంసాది దర్శనశాస్త్రాలన్నింటికి ఇక్కడ తరగతులు ఉండేవి. Image
వ్యాకరణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. ఆ కాలంలో విద్యార్ధులు చాలా దూరం వెళ్లవిద్య అభ్యసించేవారు. అప్పట్లో విద్యలను “అష్టాదశవిద్యలు" గా పిలిచేవారు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదాలు అనే నాలుగువేదాలు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్ప, మీమాంస, Image
న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము మొదలగువానితో కలసి పదునాలుగు విద్యలు. వీటికి ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంభీర్యము, అర్థశాస్త్రములను జోడించి అష్టాదశవిద్యలు అనేవారు.

నలందా విశ్వవిద్యాలయ ద్వారపాలకులు సైతం మహాపండితులు. విద్యార్థులను మొదట పరీక్షించేది వీరే. రేయింబవళ్లు వాదప్రతివాదాలతో, Image
చర్చలతో నలందా విశ్వవిద్యాలయం ప్రతిధ్వనిస్తుండేది. ఇక్కడ
ఆచార్యులుగా నిరమత, ధర్మపాల, వసుభంధు, శీలభద్ర వంటివారు ఉండేవారు. నాగార్జుని రచనలు ఎన్నో ఇక్కడ రక్షింపబడి పిమ్మట టిబెట్టు చేరుకున్నాయి. నలందాలో ఎనిమిది కళాశాలలు ఉండేవి.

నుమిత్రాపాలకుడు, బలదేవుడు నిర్మించిన కళాశాలలో రత్నసాగర, Image
రత్నోదధి, రత్నరంజక అనే మూడు గ్రంధాలయాలు ఉండేవి. చైనా, కొరియా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, టర్కి, సుమిత్రా, జావా, సింహళ, మధ్య ఆసియా నుంచి వేలాది మంది విద్యార్థులు ఇక్కడకు తరలివచ్చేవారు. లక్షాయాభైవేల చదరపు మీటర్లకు పైగా వ్యాపించి ఉన్న నలందాలో ఎనిమిది ప్రత్యేక ప్రాంగణాలు, Image
పది ప్రార్ధనా మందిరాలు, ఉద్యానవనాలు, చెరువులు మరెన్నో అపురూప కట్టడాలు ఉండేవి. విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యం కలిగించిన తొలి విశ్వవిద్యాలయం నలంద. అలా ప్రపంచానికి తొలుత విద్యాదానం చేసింది మన భారతదేశమే!

పలు ముష్కరదాడుల్లో నలంద శిధిలమైయింది. 1197లో టర్కిరాజు ఖిల్జీ ఈ ప్రాంతంపై Image
దాడిచేసి ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు. ఇక్కడ మన విద్యా విశిష్టత గురించి కొంత తెలుసుకుందాం! గెర్రి పెటో అనే చరిత్రకారుడు మనదేశం గురించి ఇలా అంటాడు. తూర్పు ఇరాన్లోని ఉన్నత వీరభూమి, టిబెట్ మరుభూములు మంగోలియా, మంచూరియాలు, ప్రాచీన చైనా జపాన్లు ప్రాథమిక నాగరిక దశలో జీవిస్తున్న Image
ఇండో చైనాదీవులు, మలయాద్వీపం, ఇండోనేషియా - వీటన్నింటిలోనూ భారతదేశం తన శాశ్వతమైన ముద్రనువేసింది. ఆ దేశం మతం మాత్రమే గాక, కళా, భాషా, సంస్కారాలన్ని భారతీయ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. గుప్తరాజుల కాలంలో శాస్త్రీయ విజ్ఞానం గణనీయంగా వృద్ధిచెందడం ఆ కాలం ప్రత్యేకత. అన్ని శాస్త్రాలకు Image
మూలం గణితం. వ్యాపార అభివృద్ధి అత్యవసరం బీజగణితం. రేఖాగణితం మరీముఖ్యం.

ఇవన్ని గుప్తరాజు కుమారగుప్తుని కాలంలో క్రీ.శ.427 మొదలై 450 నాటికి పూర్తిస్థాయి నిర్మితమై వృద్ధిచెందింది. పదివేలకు పైగా విద్యార్ధులు, రెండువేలమంది అధ్యాపకులతో కళకళలాడుతూ ఉండేది. Image
గణితశాస్త్రంలో సున్నా భారతీయులు ఏనాడో కనుగొన్నారు.

భారతదేశం నుండి అరబ్ దేశాల మీదుగా ఆ విజ్ఞానం యూరప్ వెళ్లింది.

క్రీ.శ. 476లో పాటలీపుత్రం(నేటి పాట్నా)లో ఆర్యభట్టు జీవించాడు. ఇతను ప్రసిద్ధ ఖగోళశాస్త్రజ్ఞుడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందని Image
కనిపెట్టినవాడు. గ్రహణాలను లెక్కగట్టాడు. దశాంశ గణిత పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇదే కాలంలో మరో శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ప్రకృతి విజ్ఞానశాస్త్రాలను గురించి పరిశోధించి నూతన విషయాలు వెలికి తెచ్చాడు..

చరకుడు, శుశ్రుతుడు అంతకు ముందే ఉన్నారు. వైద్యశాస్త్రం, గుప్తరాజుల కాలంలో బాగా Image
అభివృద్ధి చెందింది. రసాయన, భౌతిక, విజ్ఞాన శాస్త్రాలు లేనిదే వైద్యశాస్త్రం లేదు. వర్తకం కోసం వచ్చిన అరబ్బులు భారతీయ సరుకులతో పాటు ఇక్కడి విజ్ఞానాన్ని తత్వశాస్త్రాన్ని బాగ్దాద్ కి చేరవేశారు.

బీహార్ ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న విశ్వవిద్యాలయం నలందాకి చేరువలో నిర్మించనుంది. Image
ఈ విశ్వవిద్యాలయానికి తమ వద్ద ఉన్న అపురూప కళాఖండాలను ఇస్తామని దలైలామా 2007 లో ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి 400 కోట్లకు పైగా ఖర్చుచేయనున్నారు. అందుకుగాను నియమింపబడిన కమిటి సారధిగా నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ఉంటారు. Image
ఈ బృందంలో సగటాబోస్ (నేతాజి మేనల్లుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్), సింగపూర్ విదేశాంగ మంత్రి, చైనా, జపాన్ దేశాలకు చెందిన మంత్రులు పలువురు విద్యా ప్రముఖులు ఉన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగిన తరువాత తొలిదశలో పి.జి. ఆ పైస్థాయి విద్యను అభ్యసించే వారికి ఏర్పాట్లుచేయనున్నారు. Image
ప్రతి పదిమంది విద్యార్ధులకు ఒక అధ్యాపకుడు చొప్పున ఉంటారు. ఈ విశ్వవిద్యాలయంలో 46 మంది విదేశీ, 400 మంది భారతీయ అధ్యాపకులు ఉండేలా చూస్తారు. నలంద విశ్వవిద్యాలయ శిధిలాల ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని భారత ప్రభుత్వం యునెస్కోకు విజ్ఞప్తి చేసింది. Image
#పునః_ప్రారంభము

భారతదేశంలోని అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం 2014 సెప్టెంబరు 1, సోమవారము నాడు తిరిగి ప్రారంభమైంది. దాదాపు 800 ఏళ్ల అనంతరం ఈ విశ్వవిద్యాలయంలో తరగుతులు ప్రారంభం కావడం విశేషం. బీహార్ రాజధాని పాట్నాకు 100 కి.మీ. దూరంలో రాజ్‌గిర్ వద్ద ఈ Image
విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రాచీన విశ్వవిద్యాలయం కూడా రాజ్‌గిర్‌కు సమీపంలోనే వుండేదని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.భారత ప్రాచీన విజ్ఞానానికి కేంద్రబిందువైన ఈ విశ్వవిద్యాలయం 12వ శతాబ్దంలో విదేశీయుల దాడులతో పూర్తిగా ధ్వంసమైంది. 2006లో అప్పటి రాష్ట్రపతి #అబ్దుల్_కలాం Image
సూచనల మేరకు విశ్వవిద్యాలయాన్ని తిరిగి నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు కోర్సులను మాత్రమే ఏర్పాటుచేసినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. త్వరలో విస్తరణ వుంటుందని వారు వెల్లడించారు.

రచన - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు గారు,
విశాలాంధ్ర Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with ఆదిత్య శివశంకర కలకొండ

ఆదిత్య శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @adithyashiva23

Aug 1, 2023
#తమిళ భాషను #తెలుగువారు "#అరవం"అని ఎందుకు అంటారు?

మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.

మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
Read 5 tweets
Apr 29, 2023
#తెలుగు_భాష

తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?

డోర్ లాక్ చెయ్యకండి..

నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో..

నా కార్ కీస్ ఎక్కడ?

ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..

ఎందుకు ?

ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..

ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
వంటింటిని... #కిచెన్ చేసాం..
వసారా... #వరండాగా మారింది...
ఇలా #చావడి, #పంౘ, #ముంగిలి, #నట్టిల్లు, #తలవాకిలి, #నడవ, #పెరడు, ఇవన్నీ మరచిపోయాం..

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు..
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు..
Read 13 tweets
Mar 21, 2023
*#వదిలెయ్_మిత్రమా*

✒️ ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం
*వదిలెయ్*

✒️ పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాల పడక
*వదిలెయ్*
✒️ కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను
*వదిలెయ్*

✒️ ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా
*వదిలెయ్*
✒️ మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
*వదిలెయ్*

✒️ మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను
*వదిలెయ్*

✒️ ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చకుండా
*వదిలెయ్*
Read 4 tweets
Mar 21, 2023
ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది..
చాలా గర్వంగా ఉంది..

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
Read 8 tweets
Mar 21, 2023
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.

దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..

గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.

"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.

అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
Read 6 tweets
Mar 14, 2023
#సనాతన_ధర్మం - #పునర్జన్మ

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.

”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(