'చదువుకొన్నవాడు' మాత్రమే మేధావా.....!!? 'చదువుకొననివాడు' మేధావి కాదా.........!!?
దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి.
ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు.
అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని
టైర్ మార్చడానికి తనే స్వయంగా సిద్ధమయ్యాడు.
డిక్కీ లోని టూల్స్, స్టెప్నీ టైర్ బయటకు తీసి, ఎంతో కష్టపడి వీల్ నట్లన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ టయర్ నట్ల పైపడి అవన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. సూటు బూటు లో ఉన్న తాను వాటిని తీయలేడు, మరి ఇప్పుడేం చేయాలా
అని ఆలోచిస్తుండగా అటు పక్కగా ఒక వ్యక్తి అక్కడక్కడా చినిగి పోయిన, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అతడు ఈయన్ని చూసి సార్ మీరు ఎవరు, మీ కారుకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీర్ తాను ఎవరో తన హోదా ఏమిటో వివరాలు చెప్పి, టైర్ మార్చబోయే సమయంలో జరిగిన విషయం అంతా చెప్పి
నీవు ఆ కాలువలోకి దిగి ఆ కాలువలో నుండి అందులో పడిపోయిన నట్లను వెతికి బయటకు తీసిస్తే మీకు ఎంత డబ్బైనా ఇస్తానని అన్నాడు.
అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ....చూడండి సార్, కాలువలో దిగి నట్లను వెదికి బయటకు తీయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంతకంటే సులభమైన మార్గం ఒకటి మీకు చెబుతాను.
అలా చేస్తే ఎవరూ మురికి కాలువలో దిగవలసిన అవసరం ఉండదు. అదేమంటే మీ కారుకున్న మిగతా మూడు వీల్స్ ల నుండి ఒక్కోక్క నట్టును తీసి ఈ వీల్ కు వేయండి. దానివల్ల కారును మీరు ఏ ఇబ్బందీ లేకుండా నడిపించవచ్చు.
తరువాత మీరు వెళ్ళే దారిలో వచ్చే మెకానిక్ షాప్ లో మిగతా నాలుగు నట్లు కొని, వాటిని అన్ని
వీల్స్ కు వేసుకుంటే సరిపోతుంది కదా. దానికోసం నేను మురికి కాలువలో దిగి మురికి, బురద అంటించుకోవడం, మీరు నాకు అడిగినంత డబ్బు ఇవ్వడం, ఇవన్నీ అవసరం లేదు కదా అన్నాడు. అంతే అది విన్న ఆ ఇంజనీరు ఇంత మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, ఏమీ చదువుకోని ఈ వ్యక్తికి
ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి, ఆలోచిస్తూ.... సిగ్గుతో తలదించుకొని ఉండి పోయాడు.
#నీతి :- కాబట్టి మిత్రులారా! ఏ మనిషిని పైన చూసి తక్కువ అంచనా వేయకండి, అలాగే చిన్నచూపు చూడకండి. ఎవరి మైండ్ ఎంత పదునుగా ఉంటుందో బయటకు తెలియదు కదా! మీరు గమనిస్తే "ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని పెంచే
విధంగా ఉన్నా, జ్ఞానాన్ని సూన్యం చేస్తున్నాయని " చెప్పవచ్చు. అన్ని తెలివితేటలు ఉన్నా మేధావులు తమ తెలివితేటలను ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియడం లేదు.
మీరు గమనిస్తే "ప్రాణాలతో ఉన్న పక్షికి చీమలు ఆహరం, కానీ అదే పక్షి తాను చచ్చిన తర్వాత తాను తినే ఆ చీమలకే ఆహారం అవుతుంది"
పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు కాబట్టి ఎవరిని తక్కువగా అంచనా వేసి చులకనగా చూడకండి, అలుసుగా మాట్లాడకండి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మన అందరిలో ఎప్పుడో ఒకప్పుడు
దేవుడు ఎలా ఉంటాడు అనే సందేహం కలుగుతుంది.
అలాగే ఒక పిల్లాడికి అదే సందేహం కలిగింది
అమ్మ ఎప్పుడు దేవుడిని తలుస్తుంది
దేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు .
అనుకున్నదే తడవుగా బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు .
అయితే ఇంటినుండి బయలుదేరినపుడు
ఒక బ్యాగ్ లో రెండు జతల బట్టలు
కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు.
నడిచి నడిచి అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు...
దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు .
అక్కడ చక్కని చెట్లు పక్కన ఒక బెంచ్ మీద కూర్చున్నాడు.
ఆ తర్వాత ఆకలి అనిపించింది .
ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు .
ఆ బాలుడు ఎదురుగా పక్కన ఒక ముసలి ఆమె
ఆకలిగా ఉంది అన్నట్లు చూస్తూ కనబడింది .
ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు .
ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా బాబు చల్లగా ఉండాలి అని ఆశీర్వాదంతో నవ్వింది .
ఆ నవ్వు ఆ కుర్రాడికి చాలా ఆప్యాయంగా అనిపించింది
*వాల్తేరు*. (విశాఖపట్నం)
..ఆ పేరు ఎలా వచ్చింది ? వైజాగ్ లో కొన్ని ప్రాంతాలకు ఆ పేరుతో ఉన్న సంబంధం ఏమిటి ?
విశాఖకు జీవ జలాలు ఇచ్చిన వాల్తేరు..అదే
వాల్తేరు ఓ ఝరి.. ఓ జీవన ప్రవాహం. లక్షల మందికి తాగేందుకు నీరు..బతికేందుకు ఆసరా ఇచ్చిన సెలయేరు..తప్పితే ఒక వ్యక్తి పేరు కాదు.
తూర్పు కనుమల్లో పుట్టిన నీటి గెడ్డలు..ఒకప్పుడు రెండు పెద్ద ఏటి ప్రవాహాలుగా విశాఖ మీదుగా ప్రవహించేవి. ఒకటి *హనుమంత వాగు*. ఇది సింహాచలం కొండల్లో పుట్టిన గెడ్డల నుంచి ముడసర్లోవ మీదుగా 15 కి.మీ.ల దూరం ప్రవహించి లాసన్స్ బే వద్ద సముద్రంలో కలిసేది. 1902లో ముడసర్లోవ పార్కు/రిజర్వాయరు
నిర్మించిన తరువాత ఈ ఏరు కనుమరుగైంది. ఇప్పటి హనుమంత వాక జంక్షన్ ఆ వాగు పేరుతొ వచ్చిందే.
ఇంకొకటి *వాలుతేరు*/వాలుటేరు. ఎగువ తూర్పు కొండల్లో పుట్టి మేఘాద్రి గెడ్డలో కలిసి పెద్ద ఏటి ప్రవాహంగా విశాఖ నగరం మీదుగా ప్రవహించేది. 30 కి.మీ. ల దూరం వంపులు తిరుగుతూ... కొండల మధ్య వాలుగా
తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు నెలలు అకాల వర్షాలతో వరి పంట దెబ్బ తిన్నట్టు మనం చూస్తున్నాము.
తడిసిన ధాన్యం తేమ కారణంగా మార్కెట్ లో దళారులు తమ విశ్వ రూపం చూస్తోయించి వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దెబ్బ తీస్తున్నారు.
ఈ సందర్భంగా మన సంప్రదాయ పద్ధతులు ఆచరిస్తే బాగుంటుందని నా భావన.
అవేంటో చూడండి.
సుమారు 40 సంవత్సరాల పూర్వం వారి కోతలు ఐపోయాక పంటను కుప్పలు వేసి 2 - 3 నెలల తర్వాత నూర్పిడి చేసేవారు.
దీని వలన పంట పక్వము ఐయ్యేది.
నూర్పిడులయినాక పంటను పురి లలో గాదెలలో మరొక 3 నెలలువుంచేవారు.
పురి అంటే వారి గడ్డి తోనే తాడు పేని, కిందుగా ఒత్తుగా వరిగడ్డి
వేసి దానిపై ధాన్యం పోస్తూ వారి తాడుతో వారి గడ్డిని చుడుతూ గోళాకారంగా తయారు చేసి పైన కూడా వారి దద్దితోనే కప్పేసి ఆ పైన కొబ్బరి మట్టలు లేదా తాటి ఆకులతో కప్పేవారు.
ఇందువలన ధాన్యం లో ఉండే తేమ సెటిల్ అయ్యేది. ఇలా నిల్వ చేసిన ధాన్యం ఎన్నెన్నో పోషక విలువలు కలిగి ఉండేది.
ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన బొమ్మను గీయించాలని ఎందుకో ఆలోచన వచ్చింది. అప్పుడా రాజు దేశ విదేశాల నుండి
చిత్రకారులను పిలిపించాడు. ఒకరికి మించిన ఒకరు చిత్ర కారులు రాజసభ ముందు హాజరు అయ్యారు. రాజు అందరికి నమస్కరించి వారందరికి తన అందమైన బొమ్మను గీయాలని కోరాడు దానిని రాజదర్బార్ లో ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పాడు.
చిత్రకారులందరూ ఆలోచించడం మొదలు పెట్టారు,
రాజు మొదటి నుంచి వికలాంగుడు కదా, అలాంటప్పుడు అతని చిత్రాన్ని అందంగా గీయడం ఎలా ? ఇది సాధ్యం కానే కాదు మరియు చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తారు అని అలోచించి అక్కడున్న చిత్రకారులు అందరూ కూడబలుక్కొని రాజు బొమ్మను గీయడానికి నిరాకరించారు.