*వ్యాసపౌర్ణమి అనగా ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి.*
*చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి బాబా అంటూ, గురువు అంటూ పూజలు చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికి చెయ్యాలి ఎలా చెయ్యాలి అని పెద్దలు ఒక పద్ధతిని తీసుకొనివచ్చారు.*
*అదే వ్యాస పౌర్ణమి నాడు జగద్గురువులైన వేదవ్యాసులవారికి చేసే గురు పూజ.*
*సాధారణంగా గురుస్వరూపాలకి ఆరాధన ప్రక్రియ లేదు కానీ ఏ మహాపురుషుడి వలన వేద విభాగం జరిగిందో, సమస్త వాఙ్మయం భూమిమీదకు వచ్చిందో అట్టి జగద్గువులైన వేదవ్యాసులవారికి శిష్యులు మరియు మిగతా గురు పరంపర అంతా కలిసి
ఒకరోజు కృతజ్ఞతగా పూజ చేస్తారు.*
*అదే గురు పౌర్ణమి. పువ్వు జ్ఞానానికి గుర్తు. కాబట్టి అటువంటి జ్ఞానం మనందరికీ కలగాలని ఆరోజున శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోని, వ్యాసుల వారి ఫోటోని కానీ లేదా వ్యాస పాదుకల దగ్గర శిష్యులు, మిగతా గురుపరంపర ఒక్కో పువ్వుని సమర్పిస్తారు.*
*వేద వ్యాస మహర్షుల వారు
మన జాతికి చేసిన సేవ అంతా యింతా కాదు. కలియుగంలో వేదాన్ని పూర్తిగా చదవలేరని, కనీసం అర్ధం కూడా చేసుకోలేని రోజులువస్తాయని భవిష్యత్తు దర్శనం చేసి…
*ఒక వేదాన్నినాలుగు వేదాలుగా విభజించి, అవి కూడా పఠనం చేయలేకపోతారేమోనని అష్టాదశ పురాణాలను పంచి పెట్టారు, పంచమ వేదమైన మహాభారత
ఇతిహాసాగ్రంధాన్ని ఇచ్చి ఒక్కొక్క వేదాన్ని ఒక్కో శిష్యుడి ద్వారా ప్రచారం గావించి, పురాణాలను శూత మహర్షుల చేత ప్రచారం చేయించారు.*
*ఒకవేళ కలియుగంలో ఈ గ్రంధాలని కూడా మనుషులు అర్ధం చేసుకోగలరో లేదో అన్న దూరదృష్టితో సమస్త వేద, పురాణ, ఉపనిషత్తుల యొక్క సారాంశమైన శ్రీకృష్ణ భగవానుడి కథలను,
హరి నామ వైభవాన్ని శ్రీమద్భాగవతంలో నిక్షిప్తం చేసి ఎప్పుడూ భక్తితత్పరతతో ఉండే తన కుమారుడైన శుకమహర్షుల వారి చేత ప్రచారంగావింపబడి సమస్త మానవాళిని ఉద్ధరించిన మహాపురుషుడు వ్యాస మహర్షి.*
*వ్యాసుమహర్షుల వారు ఇచ్చిన వాఙ్మయాని ఆధారం చేసుకొని తర్వాతి కాలంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య,
మధ్వాచార్య, అన్నమాచార్య, రామదాస, మహర్షులవంటి మహాత్ములు గురుపరంపరగా భగవానుడి యొక్క కథలను, గుణవిశేషాలను శిష్యులకి ప్రచారం గావించి సనాతనధర్మాన్ని మానవాళికి అందించారు, నేటికి మన గురువు చే అందిపుచ్ఛుకుంటున్నాము.*
*సమస్త వాఙ్మయం వ్యాస ఉచ్చిష్టమ్ అంటారు పెద్దలు అంటే ఎవరు ఏ
వాఙ్మయాన్ని చెప్పిన అది వ్యాసులవారు ఏది చెప్పారో దాని నుంచే చెప్పబడింది తప్ప వేరుగా ఏది లేదు అని. అంత గొప్ప వాఙ్మయాన్ని ఇచ్చారు. మనకి ఇంతటి భక్తి, జ్ఞాన బోధనలు చేసి, గురు పరంపరను తీసుకొని వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారంగావించిన అటువంటి మహాపురుషుడికి గురుపౌర్ణమి రోజున
పూజ చేసుకోవడం మన అదృష్టం.*
*అలాంటి గొప్ప అదృష్టం ని అందిపుచ్ఛుకోకుండ మన పురాతనమైన సంస్కృతి ని వేదాలను అపహస్యం చేస్తు మన వేద పండితులను గురువర్యులను పక్కున పెట్టి కొత్త కొత్త బాబా లను గురువులను చేస్తున్నాం*
*మన భారత దేశ సనాతన ధర్మం ని భ్రష్టు పట్టిస్తున్నాం. మన వేలితో మన కంటినే
పొడుచుకుని గుడ్డివాల్లం అవుతున్నాం ఇక నుంచైనా మారుద్దాం మన ధర్మాన్ని సంస్కృతి ని వేదాలను మనకు అందించిన గురువులను గుర్తించి వారిని గౌరవించి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం*
*శ్రీమన్నారాయణుడి అంశావతారమైన వ్యాస మహర్షులవారిని గురు పౌర్ణమి రోజున కేవలం స్మరించినంత మాత్రాన మన పాపరాశి దగ్దమైపోతుంది.*✍️
- శ్రీ గురుభ్యోనమః*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
*మధ్యప్రదేశ్ రాష్ట్రం*
*అత్తింటి వేధింపులే ఐ.ఏ.ఎస్ ని చేశాయి...*
ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే ! కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్ సాధించి...
‘హిమ్మత్వాలీ లడ్కియా’ పేరుతో నేటితరం ఆడపిల్లల్లో ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ నూరిపోస్తోందిలా..
*తెలివైన ఐఏఎస్ అధికారిణిగా గుర్తింపు...*
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, చంబల్కు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదా, ఇది ప్రస్తుతం...
ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్రూమ్లో గుట్టుగా తిన్న చేదు గతం మరోవైపు...
మధ్యప్రదేశ్ లోని మండీ గ్రామం మాది, ఆదివాసి కుటుంబం, అమ్మానాన్నలకు మేం ఏడుగురం, నేను మూడో సంతానం...
బీడీ ఆకులు ఏరుతూ, కూలీ చేసుకుంటూ పొట్ట పోషించుకునేవాళ్లం. చదివించాలని లేకపోయినా
ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తిర్చేస్తాడుట............!!
ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి
అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా
బిక్కవోలు లో ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో
ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు.
క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు
ఇక పొలం పనులు చేసుకునేవారు. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటించలేరు.అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.ఆషాఢమాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటుంది
ఆ సమయంలో గోరింటాకును తెంపడం వల్ల చెట్టుకి ఎంత మాత్రం హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో 'కఫ' సంబంధమైన దోషాలు ఏర్పడతాయి
" తిరుమల శ్రీవారి పుష్కరిణి పక్కనున్న శ్రీఆదివరాహస్వామి వారి గుడిలో స్వామివారు తమకెదురుగా వచ్చే భక్తులను చూడకుండా అమ్మ వారితో ఏదో రహస్యంగా చెప్తున్నట్టుగా ఉంటారు. అలా పక్కకు తిరిగి ఎందుకున్నారు?
కలియుగంలో శ్రీవారు ఆదివరాహస్వామి వారికి ఒక వరమిచ్చారు. "ప్రధమపూజ, ప్రధమ నైవేద్యం,
ప్రథమదర్శనం నీకే వరాహా!" అని. వైఖా నస ఆగమశాస్త్రప్రకారం, క్షేత్రనియమం ప్రకారం
స్వామివారి దర్శనానికెళ్లేముందు ప్రతి భక్తుడూ ముందుగా పుష్కర స్నానంచేసి, వరాహస్వామి దర్శనంచేసుకుని, ఆ స్వామి అనుమతితో మాత్రమే ఆనంద నిలయంలోనున్న శ్రీవారిదర్శనం చేసు కోవాలి.
ఇది తిరుమల యొక్క క్షేత్రసంప్రదాయం.
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ముందు తల్లి ప్రదానం, తర్వాత గురువు, ఆ తర్వాతే భగవంతుడు. కనుక ముందు అలివేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం చేసుకుని, తిరుమలకొచ్చి పుష్కరిణిలో స్నానంచేసి, జ్ఞానాపిరాన్ (గురువు) గా పిలవబడే ఆదివరాహస్వామి వారి దర్శనం
నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడి వరాన్ని ఉద్దేశించి స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి.
హిందు పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి, ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణుభగవానుడు లోకకళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు.
కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపమొనర్చి బ్రహ్మను ప్రత్యక్షం గావించుకొన్నాడు.బ్రహ్మ వలన చావులేని వరం పొందిన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు.దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరు నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు.