BJP Telangana President | MP – Karimnagar |
Member :
Committee on Welfare of OBC | State level Committee on Minority Affairs | Tobacco Board | AIIMS-Bibinagar
కేసీఆర్ విచిత్రమైన వ్యవహారశైలి చూస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఏం నష్టం జరుగుతుందో చెప్పలేని కేసీఆర్ అకారణంగా వ్యతిరేకించడం సిగ్గుచేటు.
రైతులను పండించిన పంటకు స్వయంగా ధరను నిర్ణయించుకోవడంలో తప్పేముంది..?
పంటను దేశంలో ఏ ప్రాంతంలో అయినా గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తారా..?
రైతులకు అన్యాయం జరిగితే మూడు రోజుల్లో సమస్య పరిష్కరించడాన్ని వ్యతిరేకిస్తారా..?
రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా స్పష్టం చేయాలి. సన్నవడ్లు పండించే విషయంలో కేసీఆర్ తెలంగాణ రైతుల పొట్టగొట్టిండు
గత ఆరేళ్ల టీఆర్ఎస్ సర్కారు పాలనలో అకాలవర్షాలు,వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు.
ఈనెల 8వ తేదీన కొన్ని రైతుసంఘాలు, ముఖ్యంగా పంజాబ్ కు చెందిన రైతు సంఘాలు, కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు.
గత ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రైతులకు ఒరగబెట్టింది ఏంటో స్పష్టం చేయాలి. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రైతుల పంటరుణాలు మాఫీ పేరుతో హామీలు గుప్పించి గద్దెనెక్కాక పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా రైతులను మోసం చేసింది.
ముందు తెలంగాణ రైతులకు టీఆర్ఎస్ సర్కారు రుణమాఫీ చేసి,ఆతర్వాత రైతు సమస్యలపై స్పందిస్తే బాగుండేది. రుణమాఫీ ఆలస్యం చేసినందుకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. రూ.లక్ష లోపు వడ్డీలేని రుణాలు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వని కారణంగా రైతులు 13% వడ్డీలు చెల్లిస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేషనల్ హైవే రోడ్ల పనుల పురోగతిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రీజనల్ అధికారి శ్రీ కృష్ణ ప్రసాద్ గారితో హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని NH 563 ఎల్కతుర్తి నుండి కరీంనగర్ వరకు నాలుగు లైన్ల రహదారి రోడ్డు భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజల సౌకర్యార్థం అతి తొందరలో నూతన రహదారిని అందుబాటులోకి తెచ్చే విధంగా హైవే రోడ్ల పనులను వేగవంతం చేయాలని కోరాను.
కరీంనగర్ నుండి జగిత్యాల వరకు కూడా ఈ రహదారి నిర్మాణం అతి త్వరలో పూర్తి చేయాలని ఆదేశించాను. రాజకీయ పనులు ఎన్ని ఉన్నా అభివృద్ధి విషయంలో నాకు పట్టం కట్టిన కరీంనగర్ ప్రజల సౌకర్యార్థం నావంతు కృషి చేస్తాను.
48 మంది గ్రేటర్ ఎన్నికల విజేతల్లో 38 మంది గ్రాడ్యుయేట్స్ ఉండగా, అందులో యువతే ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే 25 సీట్లు అదనంగా గెలిచేవాళ్లం. ప్రచార సమయం ఇంకా ఉంటే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించేవాళ్లం.
2023 లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం.
రాష్ట్రంలో కుటుంబ పాలన, గడీల పాలనను ఎదుర్కొనే ఏకైక పార్టీ బిజెపియే అని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదంతోనే గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాం.
రెండు మూడు రోజుల్లో గెలిచిన అభ్యర్థులందరితో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటాం. ప్రజాసమస్యలపై పోరాడే బాధ్యతను ప్రజలు మాకు అప్పజెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో మీనమేషాలు లెక్కపెట్టకుండా కేంద్రప్రభుత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలి.
భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు అందరికీ అభినందనలు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి సీట్లతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. కేసీఆర్ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమంలో, అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేశాడు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అంటకాగి డీజీపీ, ఎస్ఈసీ సాయంతో ఎన్నికల్లో అక్రమంగా గెలవాలనుకున్నారు. దుబ్బాక ఫలితంతో ఉలిక్కిపడ్డ కేసీఆర్, ప్రజా వ్యతిరేకత మరింత పెరగకముందే ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లి అక్రమ దారిలో గెలవాలనుకున్నారు.
దుబ్బాకలో మాదిరిగానే బిజెపి కార్యకర్తలు కేసులు, బెదిరింపులు, ఎంఐఎం గూడాయిజానికి వెరవకుండా పార్టీ విజయం కోసం శ్రమించారు. రాష్ట్ర ప్రభుత్వం వదరలతో అతలాకుతలమైన భాగ్యనగరం గురించి ఆలోచించకుండా ఎన్నికలకు వెళ్లింది.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్..,బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేసింది. ప్రజల్లో భయానక వాతావరణం, మత విధ్వేషాలు సృష్టిస్తారంటూ దుష్ప్రచారం చేసింది. ఎంఐఎం పార్టీతో అంటకాగిన టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు గ్రహించారు.టీఆర్ఎస్ మద్యం ప్రవాహం,డబ్బుల పంపిణీతో అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నించింది.
తప్పుడు సర్క్యలుర్ జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర చేశారు.బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి దౌర్జన్యంగా వ్యవహరించారు.దుబ్బాకలో కేసీఆర్ అల్లుడికి,గ్రేటర్ లో కుమారుడికి ప్రజలు తగిన బుద్ధిచెప్పారు.టీఆర్ఎస్ గడీల పాలనను బద్దలుకొట్టేందుకు ప్రజలు బిజెపికి అండగా నిలిచారు.
టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది...
కౌంట్ డౌన్ మొదలైంది.
కారు.. సారు.. ఇకరారు..అని జీహెచ్ఎంసీ ఫలితాలతో నిరూపితమైంది. టీఆర్ఎస్ ఫేక్ లెటర్లు సృష్టించి ఫోర్జరీ సంతకం చేసి వరద బాధితులకు రూ.10వేల సాయాన్ని ఆపింది.
కేసీఆర్ కు బిజెపి అంటే భయం పట్టుకుంది. ఊపర్ షేర్వానీ..అందర్ పరేషానీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ను ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడు.
కేసీఆర్, ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడి దారుస్సలాం, మక్కామసీద్ కు వెళ్తాడు. కానీ, హిందూ దేవాలయాలకు రావడానికి మాత్రం సంకోచిస్తారా..?
చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయానికి నేను ఎందుకు వెళ్లకూడదు..? అసలు భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద.
అలాంటి భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి ఎందుకు పోకూడదు. అది ఏమన్నా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉందా ?
టీఆర్ఎస్ నేతలకి సవాల్ విసురుతున్నా, ఏ గుడికి రమ్మంటారో చెప్పండి.
ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో, ఎవరు తప్పు చేశారో అందరికీ తెలుసు. వరద సాయంపై ఈసీకి మేం లేఖ రాయలేదు.
ముస్లిం మైనారిటీలకు బి.సి రిజర్వేషన్ల పేరిట హిందువులైన బలహీన వర్గాల విద్యార్థులు యువతకు, విద్యా, ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో అన్యాయం చేస్తున్న కేసీఆర్ సర్కార్ తీరును ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చి బిసిలు కేసీఆర్ సర్కారు ను సమాధి కట్టాలని, బిజెపికి సంపూర్ణ మద్దతు ఇచ్చి,...
...ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరాను. గత జిహెచ్ఎంసి ఎన్నికలి బిసిల కోటాలో చాలా మంది ముస్లిం మైనారిటీలు, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల తరుపున కార్పొరేటర్లు గా పోటీ చేసి గెలిచిన విషయాన్ని హైదరాబాద్ నగర ప్రజలు గుర్తించుకోవాలని తెలుపుతున్నాను.
అన్నివర్గాలకు చెందిన బి.సి సోదరి, సోదరీమణులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి కి మద్దతు ఇచ్చి అన్ని డివిజన్లలో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు సహకరించి కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను దైవసాక్షిగా ప్రజలకు వివరించేందుకే భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చా. వరదసాయం నిలిపివేతకు బిజెపియే కారణమంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు.
వరదసాయాన్ని ఆపాలంటూ మేం సీఈసీకి లేఖ రాసినట్లు, అందుకే ఆ నిధులు పంపిణీ నిలిపివేసినట్లు ఫోర్జరీ సంతకంతో కూడిన ఫేక్ లెటర్ ను సృష్టించి అసత్య ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ బిజెపిని బూచిగా చూపెడుతోంది. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వరద బాధితులకు పూర్తి పరిహారం అందాకే ఎన్నికలకు వెళ్లాల్సింది. రూ. 550 కోట్ల వరద సాయం నిధులను టీఆర్ఎస్ నేతల జేబుల్లోకి దారి మరిల్చారు.
చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశాన్ని అమ్ముతున్నాడంటూ కేసీఆర్ అనుచితంగా మాట్లాడటం దుర్మార్గం. ప్రధాని శ్రీ @narendramodi గారిపై @TelanganaCMO కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ కచరా బుద్ధులు మానుకోవాలి.
(1/11)
ఎన్నికలు రాగానే సీఎం కేసీఆర్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటారు. ఆ తరువాత టెంట్ ఎత్తేస్తారు. హీనమైన, నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కచరాది. తెలంగాణలో కచరాను ఊడ్చేవేస్తాం...అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది.
(2/11)
దేశం కోసం...ధర్మం కోసం, సమాజం కోసం పరితపించే వ్యక్తి, తల్లి భారత్ ను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించేందుకు సంకల్పం తీసుకున్న మహోన్నత వ్యక్తి @narendramodi.
గౌరవప్రదమైన ప్రధాని మోదీ గారిని అవమానించడం సిగ్గుచేటు.
(3/11)
ఎన్నో పోరాటాల ఫలితంగా 1952 ఆగస్టు 31న ప్రభుత్వం సంచార జాతుల్ని విముక్త జాతులుగా ప్రకటించింది. అందుకే ఆ రోజును సంచార జాతుల ప్రజలకు చాలా ప్రత్యేక రోజుగా, నిజమైన స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణిస్తారు.ఈ సందర్భంగా సంచార జాతుల సోదరులకు శుభాకాంక్షలు.
గ్రామీణ సమాజంలో సంచార జాతులది కళాత్మకమైన జీవనశైలి. పల్లెపల్లెలు తిరుగుతూ పొట్ట పోసుకునే సంచార జాతుల్లో చాలా మంది శాశ్వత చిరునామా లేకుండా జీవిస్తుంటారు. పూర్వం సంచార జాతులైన బుడబుక్కల, గంగిరెద్దులు, బాలసంతల వాళ్లు కళల్ని, ధర్మాన్ని, తత్వాల్ని ప్రదర్శించేవారు, ప్రచారం చేసే వారు.
ఒక చోట నుంచి మరోచోటకు సంచరిస్తూ అద్భుతమైన,భావయుక్తమైన సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేవారు.ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి,భాష,సాహిత్యం వాడుకలో ఉంటాయి.సంచార జాతులు తమ కళారూపాల ద్వారా వాటి విస్తృత వ్యాప్తికి కృషి చేశారు.
కెసిఆర్ ఓ తుగ్లక్..ఓ నీరో చక్రవర్తి.
సెక్రెటరీయేట్ కే రానోడికి సెక్రెటరీయేట్ ఏందుకు? ఇదే 500 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేది.చరిత్ర కలిగిన కట్టడం సెక్రెటరీయేట్.
(1/7)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సరిపోయే విధంగా కట్టిన కట్టడాన్ని,కెసిఆర్ పిచ్చి చాదస్తంతో,భూతాలు,ప్రేతాలు పట్టిన మానసిక రోగిలాగా ప్రవర్తిస్తూ,రాత్రికి రాత్రే సెక్రెటరీయేట్ ను కూలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణాలో నిజాం పాలన,నిరంకుశ,నియంతృత్వ పాలన కొనసాగుతోంది.
(2/7)
తెలంగాణ సెక్రెటరీయేట్ ను కూలగొట్టాలని,కెసిఆర్ కేబినేట్ తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైన చర్య.మతిలేని కేబినేట్ నిర్ణయాలవల్ల ఈ రోజు 500 కోట్ల ప్రజా ధనం వృధా అవుతోంది.గతంలో ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టి,అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ కడతానని మాటిచ్చారు.
(3/7)