నావికుల తిరుగుబాటులో పాల్గొన్న మన స్వాతంత్య్ర సమరయోధులు - రాజన్న
1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ నేతలు, స్వాతంత్ర్య సమరయోధులు ఖైదు చేయబడ్డారు. అలా కొంతకాలం స్వాతంత్ర్య పోరాటంలో స్తబ్దత నెలకొన్న సమయంలో రెండు ఘటనలు భారతదేశంలో బ్రిటీషు వారి మూలాలను
కదిలించి దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం కాగా రెండోది 1946లో భారత నావికా దళంలో తిరుగుబాటు
రాయల్ ఇండియన్ నేవీ (RIN Matinee)తిరుగుబాటులో పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన రాజన్న గారు కూడా ఉన్నారు
రాజన్న గారిది అనంతపురం జిల్లా కదిరి మండలం కాళసముద్రం గ్రామం. SSLC వరకు చదివి రాయల్ ఇండియన్ నేవీలో చేరారు.
1946 ఫిబ్రవరి 18న తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నాటి బాంబాయి హార్బరులోని తల్వార్ ఓడకు(HMIS Tawar) చెందిన రేటింగ్స్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
త్వరలోనే ఈ వార్త, తిరుగుబాటు దేశంలోని ఇతర పోర్ట్లు, ఓడలకు పాకింది. తిరుగుబాటు జరిగే సమయానికి రాజన్న పోర్ట్ బ్లెయిర్ లో పనిచేస్తూ ఉన్నారు. తిరుగుబాటు సమయంలో ఓడపై యూనియన్ జాక్ జెండాను దించి భారతదేశ జెండాను (గాంధీజీ చారఖా వడుకుతున్న మూడు రంగుల జెండా)ను ఎగిరేశాడు.
తరువాత తిరుగుబాటులో పాల్గొన్న నావల్ రేటింగ్స్ ను కోర్ట్ మార్షల్ చేసి డిస్మిస్ చేశారు. తరువాత రాజన్న స్వగ్రామానికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.
భారత స్వాతంత్ర్య పోరాట గతిని మార్చిన నావికాదళ తిరుగుబాటులో రాయలసీమ వాసి పాల్గొనడం ఎంతో గర్వకారణం.
చిత్రం మరియు మూలం : స్వతంత్ర భారత స్వర్ణోత్సవ సావనీర్ - రాయలసీమలో స్వాతంత్ర్యోద్యమం (1998) పుస్తకంలో "మహత్తర నావికాదళ తిరుగుబాటులో 'అనంత' యోధుడు రాజన్న" పేరిట విద్వాన్ పి. దస్తగిరి గారు రాసిన వ్యాసం
550 సంవత్సరాల క్రితమే హేలీ తోకచుక్కను ప్రస్తావించిన మల్లికార్జున రాయల శ్రీశైల తామ్ర శాసనం
*First Indian Epigraphical Reference to Halley's Comet found in Srisailam Copper Plate Charter,Andhra Pradesh,dated 1456 CE*
Halley's Comet is the only known short-period comet that is consistently visible to the naked eye from Earth, appearing every 72–80 years.Due to its intrinsic brightness, about one eighth of all comet sightings mentioned in historic records belong to Halley's Comet.
This Unique inscription written in Sanskrit language &Nāgari characters of the reign of the Vijayanagara king Mallikārjuna.For the *first time in the Indian context gives us a rare epigraphical reference to the appearance of Halley's comet &the resultant meteor shower in 1456 CE
1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని