పద్మావతీ అమ్మవారి తండ్రి ఆకాశరాజు. వారి వంశస్థులు నారాయనవనం రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఒకనాడు నారాయనవనం రాజులు వేటకు అడవికి వెళ్లగా అక్కడ ఒకచోట వారి వేటకుక్కలని ఒక కుందేలు తరమడం చూసి, రాజధాని నిర్మించడానికి అదే ఉత్తమమైన ప్రదేశంగా భావించి అక్కడ అడవిని నరికించి
ఒక నగరం నిర్మించారు. 'కాడు' (తమిళంలో అడవి ) 'వెట్టి' (తమిళంలో నరికి) నిర్మించిన 'నగరం' కాబట్టి కాడువెట్టినగరం అయ్యి అదే కాలక్రమేణా కార్వేటినగరం అయ్యింది.
మరొక కథనం ప్రకారం 'కాడు' లో 'వేట్టై' (తమిళంలో వేట) వెళ్లిన తరువాత నిర్మించిన 'నగరం' కాబట్టి కార్వేటి నగరం అయ్యింది.
ఇంకొక కథనం ప్రకారం నగర పొలిమేరల్లో ఉన్న 'కార్వేటమ్మ' పేరు మీద కార్వేటి నగరం అయ్యింది.
కార్వేటినగరం ముందు ఉత్తర ఆర్కాటు జిల్లాలో ఆ తరువాత చిత్తూరు జిల్లాలోని ఒక జమీందారీ. ఇక్కడి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. #సీమపట్టణాలు#సీమచరిత్ర#chittoor
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ప్రకారం ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో నైనా సరే ఉపయోగించబడ్డ అతిపెద్ద పదం కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల భార్య తిరుమలాంబ రచించిన సంస్కృత చంపూ కావ్యం 'వరదాంబికా పరిణయం'లోనిది.
అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది.
ఇప్పటివరకు ఏ భాషలోనైనా వచ్చిన సాహిత్యంలో ఇన్ని అక్షరాలతో వాడబడిన పదం మరొకటి లేదు.. ఈ వరదాంబిక కడప జిల్లా చెన్నూరు సీమను, ప్రకాశం జిల్లా కొచ్చర్లకోట సీమను ఏలిన సలకం వారి ఆడపడుచు.