గురువు గారు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో నా పరిచయం
కడప పట్టణానికి చెందిన ధర్మదాత యాదాల్ల నాగమ్మ గారి గురించి పరిశోధన చేసే క్రమంలో గురువుగారు పరిచయం అయ్యారు. అప్పుడే వారి గురించి తెలిసింది అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారని మరియు అన్నమయ్య కీర్తనలు, కైఫీయత్తులు, కడప
చరిత్ర మీద వారికి ఎంతో ఆసక్తి మరియు పట్టు ఉంది అని. 'యాదాల్ల' వారి చరిత్ర సేకరించడంతో పాటు నేను తయారుచేసిన 'అన్నమాచార్య సర్క్యూట్' ఆలోచనను వారికి వినిపించాను.
అన్నమాచార్య సర్క్యూట్ : తాళ్ళపాక అన్నమయ్య తిరుమల శ్రీవారి మీద కాకుండ చెప్పలి, సాంబటూరు, నందలూరు, వెయ్యినూతుల కోన..
ఇలా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణాదిన దాదాపు 40 క్షేత్రాలు పర్యటించి ఆయా దేవుళ్లపై కీర్తనలు రచించారు. అన్నమయ్య దర్శించిన 'చెప్పలి' వంటి క్షేత్రాల్లో నిధులు లేక కూలిపోయిన గోపురం బాగుచేయించలేని పరిస్థితి. కొందరు చరిత్రకారులకు, పరిశోధకులకు తప్ప ఆయా ఆలయాలను అన్నమయ్య దర్శించారని
ఆయా ఆలయాలపై కీర్తనలు రచించారని స్థానికులకు కాదు కదా కనీసం ఆయా ఆలయ అర్చకులకు కూడా తెలీదు.
అలా అన్నమయ్యచే కొలవబడి, కీర్తింపబడిన వందల సాంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ఆలయాలు నిధులులేమితో మామూలు ఆలయలుగా మిగిలిపోయాయి.
కోట్ల ఆస్థులున్న తితిదే, దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా
ఆయా ఆలయాల పునరుద్ధరణకు నిధులు వెచ్చించి, అన్యాక్రాంతమైన ఆయా ఆలయాల మాన్యాలు రక్షించి ప్రతీ అలయంలోనూ అన్నమయ్య విగ్రహం ప్రతిష్టించి, ఆ గుడి మూలవిరాట్టుపై రచించిన కీర్తనలను,అన్నమయ్య, ఆలయ చరిత్రను శిలాఫలకలుగా వేయించి, ఆ కీర్తనలు రికార్డు చేయించి ఆయా ఆలయాలలో వినిపించేలా ఏర్పాటు చేసి
ఏటా ఒక్కో ఆలయంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాల లాగా అన్నమయ్య ఆరాధనా ఉత్సవాలు చేస్తే,
ఆయా ఆలయాలకు పేరు, పూర్వ వైభవం వస్తుంది. అన్నమయ్య కీర్తనల వ్యాప్తి వీలవుతుంది. రాయలసీమలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఆ పదకవితాపితామహుడిని మనం గొప్పగా గౌరవించుకుని ఏటా స్మరించుకున్నట్టు ఉంటుంది
ఇది క్లుప్తంగా 'అన్నమయ్య సర్క్యూట్' ఆలోచన. ఈ ఆలోచన గురువుగారికి చాలా బాగా నచ్చింది. అన్నమయ్య దర్శించి కీర్తనలు రచించిన ఆలయాలు నేడు ఎవరికీ తెలీకుండా ఉండటం గురించి చాలా బాధపడ్డారు. అన్నమయ్య సర్క్యూట్ గురించి వివరాలు నన్ను అడిగి, ఆర్టికల్ ప్రింట్ తీసుకున్నారు. ఆ 40 ఆలయాలలో
అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తా అన్నారు. TTDలో గురువుగారు అనేక హోదాల్లో పనిచేశారు కాబట్టి, వారు తలచుకుంటే అన్నమాచార్య సర్క్యూట్ వైపు అడుగులు పడతాయని నేను కూడా సంతోషించాను. గురువుగారు అన్నమయ్య దర్శించి, కీర్తనలు రచించిన సంబటూరు చెన్నకేశవ స్వామి దర్శనానికి
వెళ్ళినప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఎప్పటికైనా ఆయా ఆలయాలలో అన్నమయ్య విగ్రహం పెట్టించాలన్న వాదనతో వారు పూర్తిగా ఏకీభవించారు.
తరువాత వారిని కలవడం కుదరలేదు. అన్నమయ్య సర్క్యూట్ గురించి నేనూ పట్టించుకోవడం కుదరలేదు. ఇంతలోనే దురదృష్టవశాత్తు వారి మరణవార్త వినాల్సివచ్చింది
ఎప్పటికైనా అన్నమయ్య సర్క్యూట్ కార్యరూపం దాల్చి, అన్నమయ్య దర్శించిన గుడులన్నింటిలో అన్నమయ్య కీర్తనలు నిత్యం వినిపించినరోజు, ఆయా గుడులలో అన్నమయ్య విగ్రహాలు, కీర్తనల శిలాఫలకాలు ఏర్పాటు చేసిన రోజు గురువుగారు ఎక్కడున్నా సంతోషిస్తారు
ఓం నమో వేంకటేశాయ
చిత్రాలు : 1. గురువుగారితో నేను 2. అన్నమయ్య దర్శించి కీర్తనలు రాసిన చెప్పలి ఆలయం 3. కూలిపోయిన చెప్పలి చెన్నకేశవస్వామి ఆలయ గలిగోపురం
4, 5,6 : అన్నమయ్య స్మృతి వనం, తాళ్ళపాక లోని అన్నమయ్య విగ్రహాలు 7. అన్నమయ్య దర్శించి కీర్తనలు రాసిన సంబటూరు చెన్నకేశవ స్వామి ఆలయం
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ప్రకారం ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో నైనా సరే ఉపయోగించబడ్డ అతిపెద్ద పదం కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల భార్య తిరుమలాంబ రచించిన సంస్కృత చంపూ కావ్యం 'వరదాంబికా పరిణయం'లోనిది.
అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది.
ఇప్పటివరకు ఏ భాషలోనైనా వచ్చిన సాహిత్యంలో ఇన్ని అక్షరాలతో వాడబడిన పదం మరొకటి లేదు.. ఈ వరదాంబిక కడప జిల్లా చెన్నూరు సీమను, ప్రకాశం జిల్లా కొచ్చర్లకోట సీమను ఏలిన సలకం వారి ఆడపడుచు.