ప్రస్తుతం పార్లమెంట్ లో పాస్ ఐన రైతుల బిల్లు రాష్ట్రపతిఆమోదంతో చట్టం అయ్యింది. దీని మీద నేను ఏమి వ్యాఖ్యానించదలచలేదు. ఐతే ఈ చట్టాలు చేసేవారు అమెరికా యూరోప్ తదితర దేశాల లో వ్యయసాయ సరళి గమనించారో లేదో తెలియదు కానీ నేను వెబ్ విహారం లో ఆయా దేశాల్లో వున్న ఒక చిన్న ఆలోచనతో నేను మా
ఆగ్రో ఫార్మ్ నష్టాలను తగ్గించుకుని లాభాల బాటలో పయనించాను. ప్రస్తుతం ఆ ఆగ్రో ఫార్మ్ అమ్మేయడం జరిగింది. ఇది 1999-2005 మధ్య జరిగింది. మొదట్లో అందరి లాగే ఎరువులు, కలుపు తీతలు మొదలైన ఖర్చులు చేసి గిట్టుబాటు ధర రాక నష్టాలు పొందాము. 2001 లో వెబ్ లో మనదేశంలో 1925 ప్రాంతంలో బాగా
అవలంబించిన బయో డైనమిక్ ఆగ్రో పద్ధతులు గురించి తెలుసుకుని వివరాలు సేకరించాను. అప్పటికే అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4000 కోట్ల పైగానే ఈ విధాన వ్యవసాయం లో పరిణితి సాధించింది. దక్షిణ భరతం లో కోడై కెనాల్ లో biodynamic సొసైటీ ఆధ్వర్యంలో 30 రోజుల శిక్షణ ఇస్తున్నారని మా పెద్దబ్బాయి
వెళ్లి అనుభవం పొంది వచ్చాడు. ఈ విషయం చెప్పినది సలహా ఇచ్చినది హైదరాబాద్ లో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని ఒక సహాయక డైరెక్టర్. అంటే మన శాస్త్రవేత్తలకు అన్ని విషయాలు తెలుసు. అయితే వారిని కొన్ని శక్తులు పైకి రానీయవు. ఇదే విశ్వవిద్యాలయంలో తయారు చేసి (అప్పట్లో 500 గ్రాముల ధర
7రూపాయలు మాత్రమే ఎకరానికి) విక్రయించే pbb లాంటి మైక్రోబ్ వాటి వినియోగం వలన మా సాగు ఎకరానికి (ఎరువుల నిమిత్తం) 15 రూపాయలు దాటలేదు. వీటి వాడకం వలన కలుపు పెరగలేదు. తద్వారా కలుపు తీత ఖర్చులు తగ్గిపోయాయి. చీడ పీడల కొసం biodynamic పద్ధతుల ద్వారా తయారు చేసుకున్న కాషాయాలు వాడుకున్నాము.
ఈవిధంగా మా ఖర్చు అప్పట్లో 1500 దాటలేదు. అప్పటి ధరల ప్రకారం ఎరువులు, pesticides కలుపుల కోసం 6000 రూపాయలు అయ్యేవి. ఎవరు నమ్మినా నమ్ముకున్నా మా పెసర పంట దిగుబడి ఎకరానికి 8 క్విన్తాళ్లు వచ్చింది. సరే దీనిని అమ్మకుండా ఆ పంటని వేల్యూ అడిషన్ పద్ధతిలో పప్పుచేసి అమ్మితే? కొనే వాళ్ళు ఎవరు?
అందుకోసం వెబ్ విహారంలో దొరికిన చిన్న క్లూ "CSA" అంటే కన్స్యూమర్ సపోర్ట్ అగ్రికల్చర్. ఈవిధానం లో 50 మంది నమ్మకమైన వినియోగదారులు ఆసక్తి కనబరచగా వారికి ప్రతి దినం సాయంత్రం పాలు, వారానికోసారి కూరలు, పంటలు (పెసర పప్పు, కంది పప్పు, దంపుడు బియ్యం, మామిడి రకాలు) మొదలైనవి క్రమం తప్పకుండా
సరఫరా చేసే వారం. వారి వారి ఇండ్లలోని పిల్లలు మా పాలు రుచి మరిగి వేరే పాలు, పెరుగు నచ్చుకునేవారు కాదు. ఈ పంటలన్నీ biodynamic పద్దతిలోనే పండించాము. ఇలా 2010 వరకు చేసాము. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే పండిన పంట ని వేల్యూ అడిషన్ చేస్తే వచ్చే ధర ఎక్కువ. ఉదాహరణకి దంపుడు బియ్యం ప్రస్తుతం
ఓపెన్ మార్కెట్ లో సుమారు 50 రూపాయలతో దొరుకుతుంది. ఇదే ధాన్యాన్ని దంపుడు మిల్లుల ద్వారా తయారు చేస్తే రెట్టింపు ధర వస్తుంది. దంపుడు మిల్లులు గుజరాత్ లో తయారు అవుతాయి. 15000 లో దొరుకుతాయి. ఒక ఊరిలో ఒక మిల్లు పెట్టుకుంటే ప్రతిదినం 25 క్వింటాల్ బియ్యం ఆడించవచ్చు. ఉపాధి మరియు లాభాలు.
ఒక గ్రామాన్ని ఒక విభాగం గ చేసుకుని అక్కడి ఉత్పాదనలు దగ్గరలోని పట్టణ ప్రాంతాలలో వినియోగదారుల సమాఖ్య నేర్పరుచుకుంటే మార్కెటింగ్ ఇబ్బందులు వుండవు. అలాగే కూరగాయలు. ఉదాహరణకి విశాఖ రైతు బజార్లో నేను గమనించేదేమంటే అక్కడి ఆమె ఆనప, గుమ్మడి మొదలైన వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి
అమ్ముతుంది. ఆమె దగ్గర అమ్మకాలు ఇతర అమ్మకాల కంటే ఎక్కువగా వున్నాయి. ఇందులోని సూక్ష్మం ఏమంటే అవసరమైన వారికి అవసరమైనంత.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.
"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"
"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి
డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"
"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు. నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.
చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో
@ _సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._
@ _కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు.
ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు.. గుర్తుంచుకో!_
@ _'జ్ఞానం'.. ఆలోచించి మాట్లాడుతుంది. 'అజ్ఞానం'.. మాట జారాక ఆలోచిస్తుంది.
_వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది._
_అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు._
_‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. *‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’* అన్నారు స్వామి వివేకానంద._
_మౌనం మూడు రకాలు._ 1. _*ఒకటవది: వాక్మౌనం.* వాక్కును నిరోధించడమే వాక్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు.
ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి._ 2. _*రెండోది అక్షమౌనం.* అంటే ఇంద్రియాలను నిగ్రహించడం._
3. _*మూడోది కాష్ఠమౌనం*. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది.
పని చేయని వాడు
సోమరిపోతనేది పాతమాట..
ఇప్పుడు వాడే
సర్కారు ముద్దుబిడ్డ..
వాడికి తెల్ల కార్డిచ్చి
దానికి జతగా
బోలెడు స్కీములిచ్చి
ఆపై పించనిచ్చి
సోమరిపోతును
సొమ్మరిపోతుగా
తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం..
ఓటుమారి స్కీములు
దండగమారి స్కాములు..
వారు వీరు అంతా
స్వాహాస్వాములు..!
నిజానికి మన వ్యవస్థలే
సోమరిపోతుల
కర్మాగారాలు..
ఎవరికి ఎప్పుడు
ఏమిస్తాయో తెలియదు..
కులవృత్తులను
సబ్సిడీలకు
అనుకూలవృత్తులుగా మార్చి
పంచేస్తున్నాయి సొమ్ములు..
పెంచేస్తున్నాయి అప్పులు..
ప్రతి కులానికి
ఓ కార్పొరేషన్..
డబ్బులు పంచడం..
పంచుకోడమే
వాటి మిషన్..
*_ఇదో రకం వైరల్ ట్రాన్స్మిషన్..!_*
అన్నామంటే
అన్నామంటారు గాని
ఎవడికైనా ఏదైనా
ఎందుకివ్వాలి ప్రభుత్వం..
ఎవడిని వాడు
పోషించుకోలేడా ఏమి..
కుదిరితే ఉద్యోగమివ్వు..
శ్రమ పడి పరిశ్రమ పెడతానంటే..
బుర్ర పెట్టి వ్యాపారం
చేస్తానంటే అప్పివ్వు..
ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.
1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో