CMD, TSGenco and Transco Sri Devulapalli Prabhakar Rao informed Chief Minister Sri K. Chandrashekar Rao that the Power utilities are on a high alert following the heavy rains and flash floods all over the State and are involved in the restoration measures.
In the backdrop of heavy floods and rains hitting the state, the CM spoke to CMD on Wednesday and inquired about the power situation. CM wanted the CMD to review the situation on a regular basis with the Transco, Genco and Discom officials and take the necessary measures.
"Electricity Department has also suffered huge losses at several places in the State. The electricity employees are working very hard despite the adverse weather conditions. Continue this spirit of work till everything is restored to normalcy,” the CM directed the CMD.
“Due to heavy rains and floods, there were several interruptions in the power supply in the state. Transformers in large numbers have been washed away. At several places, poles were uprooted or twisted and power transmission cables were snapped.
The intensity of rain and floods has not been reduced as yet. Electricity employees are unable to reach flooded areas. Shutting down power became necessary as rainwater flooded the cellars of apartments in Hyderabad and other cities.
The power supply was stopped as a precautionary measure to avert any accidents. The power supply is being restored based on the emerging situation. The restoration work is taking place in all the places where the employees & staff were able to reach,” the CMD explained to the CM.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం శ్రీ కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ప్రతీ ఇంటికి 3 చొప్పున రగ్గులను వెంటనే అందించాలన్నారు.
హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని సీఎం స్పష్టం చేశారు.
Chief Minister Sri K. Chandrashekar Rao will hold a high-level emergency review meeting at 3 PM today at Pragathi Bhavan to discuss the prevailing situation in the State following heavy rains and floods.
Hon'ble CM has asked all the officials concerned to come prepared for the meeting, as the State government has to submit a report to the Centre on the damage caused by the heavy rains and flash floods.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని, తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
మున్సిపల్, వ్యవసాయ, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ కె.టి. రామారావు, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రీ శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహమూద్ అలీ,
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటి వల్ల పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు జెన్ కో – ట్రాన్స్ కో సీఎండి శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు వివరించారు.
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం ఇవాళ సీఎండితో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
‘‘చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారు. వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తి కొనసాగించండి’’ అని ముఖ్యమంత్రి సీఎండిని ఆదేశించారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదలతో సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.
జిల్లా వ్యవసాయ అధికారులు ఎవరికి తోచినట్టు వారుగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, పై అధికారుల ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలి. మార్కెట్లో సరైన ధరలు లభించే అవకాశం ఉన్న పంటల రకాలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యత అధికారులదే: సీఎం
రైతు సంక్షేమం దృష్ట్యా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆలోచనా ధృక్పథాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలి. తెలంగాణ సాగు బాగు కోసం వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి కుటుంబంలా సమన్వయంతో పనిచేయాలి: సీఎం
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది: సీఎం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం: సీఎం