Telangana CMO Profile picture
Official account of CMO Telangana. Maintained by IT, E & C Dept, Telangana State.
Jan 17, 2022 13 tweets 2 min read
మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్ పూర్ బ్రాంచి కాలువ పనులకు రూ. 144.43 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా ఘన్ పూర్ మరియు అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తపాస్ పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
Jan 16, 2022 7 tweets 2 min read
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలను అధ్యయనం చేయడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిన సీఎం శ్రీ కేసీఆర్ Image స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శ్రీ శేషాద్రి అధ్యక్షతన, సీఎం సెక్రటరీ శ్రీమతి స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ లోకేశ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ శ్రీమతి దివ్య సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
Jul 14, 2021 5 tweets 1 min read
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022–23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5,000, మూడవ సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది.
Jul 14, 2021 11 tweets 2 min read
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం కొనసాగుతున్నది. ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలపై కేబినెట్ చర్చ ప్రారంభించింది. గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. వానాకాలం సాగు నేపథ్యంలో, విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.
Jul 13, 2021 10 tweets 2 min read
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది. ➧ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై కేబినెట్ చర్చించింద. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు కేబినెట్ కు నివేదికలు సమర్పించాయి. వచ్చే నెల రోజుల లోపు, రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు.
Jun 27, 2021 10 tweets 3 min read
స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు 'సీఎం దళిత సాధికారత' పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్ గా, యూనిట్ ఒక్కంటికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అఖిలపక్ష సమావేశం సమిష్టి నిర్ణయం తీసుకున్నది. మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు 1200 కోట్లతో "సీఎం దళిత సాధికారత పథకం" ప్రారంభం చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్షం నిర్ణయించింది.
Jun 26, 2021 7 tweets 2 min read
పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణను దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాలి: సీఎం శ్రీ కేసీఆర్ ImageImage జులై 1 నుంచి పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మరింతగా చైతన్యపరిచి నిర్దేశిత లక్ష్యాలన్నీటినీ చేరుకోవాలి. పదిరోజుల కార్యక్రమం  ముగిసిన తర్వాత ఏ పనికూడా అపరిష్కృతంగా ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.
Jun 25, 2021 5 tweets 1 min read
రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27వ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. Image దళిత ప్రజాప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ప్రతిపక్ష ఎం.ఐ.ఎం, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి.
Jun 25, 2021 4 tweets 1 min read
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు డిజిపి శ్రీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. Image ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు.
Jun 19, 2021 4 tweets 1 min read
The Council of Ministers has decided to lift the lockdown completely in the State. The Cabinet has examined the reports submitted by the Medical and Health Dept. officials that Corona cases and the positivity rate have drastically come down and #Covid19 situation is under control The Cabinet has instructed all the Depts. to lift the restrictions imposed as part of the lockdown. Exhorted the Education Dept. to reopen all categories of educational institutions from 1st July with full preparedness and allow the students to attend the classes physically.
Jun 19, 2021 4 tweets 1 min read
లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.
Dec 27, 2020 17 tweets 2 min read
రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు - కొనుగోళ్లు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం తదితర అంశాలపై సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు. వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, మినుములు తదితర పంటల కొనుగోళ్ల వల్ల ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు.
Dec 13, 2020 12 tweets 3 min read
CM Sri K. Chandrashekar Rao has instructed the officials concerned to ensure that the Non-agriculture lands and properties registrations are done in a very transparent manner, without any official having any discretionary powers and people are not forced to pay any bribes. CM instructed the officials to prepare and finalise guidelines, rules in this regard. CM appointed a Cabinet Sub Committee under R&B Minister Sri @VPRTRS ’s chairmanship to interact with all sections regarding the guidelines on Non-agriculture lands and properties registration.
Dec 13, 2020 10 tweets 2 min read
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు.
Nov 15, 2020 5 tweets 1 min read
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సీఎం తెలిపారు. ఇవాళ ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది.
Oct 19, 2020 6 tweets 1 min read
CM Sri KCR has announced Rs.10,000 financial assistance to each of the households affected by the floods in Hyderabad. Hon’ble CM lamented that people had to face severe hardships due to heavy rains and assured them all the support. The financial assistance would be offered from Tuesday. A compensation of Rs.1 lakh will be given to people whose houses were fully damaged and partially damaged houses to get Rs.50,000: CM KCR
Oct 19, 2020 10 tweets 2 min read
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపుకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.
Oct 15, 2020 16 tweets 3 min read
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం శ్రీ కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ప్రతీ ఇంటికి 3 చొప్పున రగ్గులను వెంటనే అందించాలన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Oct 15, 2020 4 tweets 2 min read
Chief Minister Sri K. Chandrashekar Rao will hold a high-level emergency review meeting at 3 PM today at Pragathi Bhavan to discuss the prevailing situation in the State following heavy rains and floods. Hon'ble CM has asked all the officials concerned to come prepared for the meeting, as the State government has to submit a report to the Centre on the damage caused by the heavy rains and flash floods.
Oct 15, 2020 5 tweets 1 min read
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని, తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
Oct 14, 2020 6 tweets 1 min read
CMD, TSGenco and Transco Sri Devulapalli Prabhakar Rao informed Chief Minister Sri K. Chandrashekar Rao that the Power utilities are on a high alert following the heavy rains and flash floods all over the State and are involved in the restoration measures. In the backdrop of heavy floods and rains hitting the state, the CM spoke to CMD on Wednesday and inquired about the power situation. CM wanted the CMD to review the situation on a regular basis with the Transco, Genco and Discom officials and take the necessary measures.