*నేర్పు-ఓర్పు*
ఒక పనిని ‘సాధారణంగా’ పూర్తి చేసేవారు కొందరైతే, మధ్యమ స్థాయిలో చేసేవారు కొందరు. ఉన్నతస్థాయిలో చేసేవారు ఇంకొందరు! ఈ స్థాయులన్నీ వారివారి వృత్తి నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. జీవిత ప్రమాణాలు సైతం వారి నేర్పరితనాన్ని అనుసరించి అలరారుతాయి.
ఒక కార్యాన్ని నాసిగా పూర్తిచేసేవారికి పారితోషికం అధమస్థాయిలో ఉంటుంది. మహోన్నత స్థాయి నైపుణ్యాన్ని కనబరచే వృత్తి నిపుణుడికి అందే పారితోషికం ఉన్నతస్థాయిలోనే ఉంటుంది.
నేర్పరితనానికి విద్య అవసరమా అన్నప్పుడు, తరగతి గదిలో నేర్చుకునేదే విద్యకాదని గ్రహించాలి. జీవిత పాఠశాలలో విద్య గడించి
అపార నైపుణ్యసంపత్తిని సొంతం చేసుకొనే ప్రతిభావంతులు కొందరుంటారు. ఏకలవ్యుడిది ఉన్నతస్థాయి విద్య! అతడి
నేర్పు-ఓర్పు
విద్యానైపుణ్యం గురువు ‘సమక్షంలో’ ఉండి నేర్పిన విద్య కన్నా మహోన్నతంగా అలరారింది. అందుకు అతడి కార్యదీక్ష, దక్షత తోడ్పడ్డాయి.
విద్యలో స్థాయీభేదాలుంటాయి. బతుకు సమరాన్ని ఎదుర్కోవడంలో, ధనార్జనకు లౌకిక విద్య సాయపడుతుంది. దైవాన్ని పొందడం కోసం సాధనచేసే ఆధ్యాత్మిక విద్యలో సైతం నేర్పరితనానికి సంబంధించి స్థాయీభేదాలుంటాయా అన్న ప్రశ్న ఉదయించక మానదు. దైవాన్ని పొందడం కోసం సాధకుడు పడే తపనలో సైతం స్థాయులుంటాయి.
అలా అత్యున్నత స్థాయి భక్తి వైభవాన్ని సొంతం చేసుకొనే మహనీయులు ఆధ్యాత్మిక పరీక్షలో కృతకృత్యులవుతారు.
ఆధ్యాత్మికతలోనూ స్థాయులుంటాయి. ధ్యానం లక్ష్యంగా కనులు మూసుకొని సిద్ధాసనంలో కూర్చున్న ప్రతి ధ్యానీ సమాధిస్థితికి చేరుకోలేడు. కనులు మూస్తే అంతరిక ప్రపంచం కనిపించాలి.
అలా ‘లోవెలుగు’ను దర్శించగలవారు కోట్లలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. కన్నులు మూసి చేసే ధ్యాన ప్రయత్నం కొన్ని మంచి ఫలితాలనిస్తుందని, ఆరోగ్యానికి తోడ్పడుతుందని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతారు. అటువంటి ధ్యానప్రయత్నం ఆరోగ్యప్రదాయిని కావచ్చునేమోగాని, ఆధ్యాత్మిక పరిమళం సంతరించుకోదు.
రామకృష్ణ పరమహంస దైవనామం విన్నంత మాత్రాన పరవశించి ధ్యానస్థితిలోకి వెళ్లేవారు. శరీరం ధ్యాననిష్ఠలో వివశమై ఆయన మాటాపలుకూ లేక పడిపోయేవారు. ఆయన జాగ్రదావస్థలోకి వచ్చేదాకా భక్తులు శరీర రక్షణ భారం వహించేవారట! ఈ అంశాలు ఆధ్యాత్మిక జీవితంలోని స్థాయీభేదాలను, కౌశలాన్ని వివరిస్తాయి.
పుట్టిన ప్రతిమనిషీ ఏదోనాటికి ఆధ్యాత్మిక భావనను అందిపుచ్చుకోక తప్పదు. కొందరు యుక్తవయసులో దైవం, సంప్రదాయం, మతం వంటి భావాలను అందుకుంటారు. కొందరు మధ్య వయసులో, ఇంకొందరు వృద్ధాప్యంలో పారమార్థిక జీవితం పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక విద్య బాల్యంలోనే అబ్బిన కొద్దిమంది బాలలు మహనీయులుగా,
భగవంతుడి ప్రియసఖులుగా అలరారిన వైనం మన పురాణాల్లో కనిపిస్తుంది. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు... ఆ కోవకు చెందినవారే! ఆధునికయుగంలో ప్రసిద్ధి పొందిన మహాపురుషులు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద అలా తమ ప్రతిభ చాటినవారే!
నేర్పు-ఓర్పు జంటపదాలు. ఓర్పు ఉన్నవారే కాలక్రమంలో నేర్పరులు కాగలరు. లౌకిక జీవితంలో నేర్పు సంపాదించడానికి ఓర్పు ఎంత అవసరమో ఆధ్యాత్మిక కర్మాచరణలో విజేతలుగా ఎదగడానికి ఓర్పు అంతే అవసరం. ఉపవాసాలు, పూజలు, నోములు, వ్రతాలు... ఇవన్నీ ఆచరించడానికి నేర్పుతోపాటు ఓర్పూ చాలా అవసరం!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఒక బ్రిటిష్ కల్నల్ సాబ్ తన సిపాయిలతో ఎక్కడికో వెళ్తుండగా పొరపాటున చూసుకోకుండా ... నేలబారున ఉన్న నూతిలో పడిపోయారు .... వెంటనే ఎలర్టయిన సైనికులు ఒక తాడు తీసుకొచ్చి కల్నల్ ని పైకి లాగుతున్నారు .... సచ్చిచెడి కల్నల్ నూతి పై అంచుకొచ్చేసరికి .... నిబంధనలు ఖచ్చితంగా పాటించే సిపాయిలు ..
ఎటెన్షన్ లోకి వచ్చి ... తాడు వదిలేసి కల్నల్ కి సెల్యూట్ చేసేసరికి ... కల్నల్ మళ్ళా నూతిలో పడిపోయాడు ....
ఇలా .... మూణ్ణాలుగుసార్లు .... తాడట్టుకుని
కల్నల్ పైకి రావటం ... ఆయన్ని చూసిన జవాన్లు శాల్యూట్ చేసే పనిలోపడి తాడొదిలేయటం .... దొరగారు మళ్ళా నూతిలో పడిపోటం చూసిన
చాలామంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు.. రూమ్ తీసుకోవటం..దర్శనం చేసుకోవడం.. ప్రసాదాలు తీసుకోవడం.. మొక్కులు తీర్చుకోవడం తిరుగు ప్రయాణం అంతే..
కానీ తిరుమల కొండమీద నంది సర్కిల్ దగ్గర లేపాక్షి ఎంపోరియం పక్కనే టిటిడి వారి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య ఆసుపత్రి ఉంటుంది
ఇక్కడ చాలారకాలైన ధీర్ఘకాలిక రోగాలకు చక్కనిఆయుర్వేద మందులు ఉచితంగా లభిస్తాయి..ఇదే పేరుమీద బయట కూడా దొరుకుతాయి కానీ ఈ టిటీడి ఆయుర్వేద మందులక్వాలిటీ రాదు ఎందుకంటే వీరి మందులు తయారు చేసే ఫార్మసీ సొంతంగా ఉంది శ్రీనివాస మంగాపురం వెళ్లేదారిలో..అడవిలో మూలికలు సేకరించి ఇవి తయారు చేస్తారు.
అలిపిరి దగ్గర ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఉన్నది.. ఇక్కడ రకరకాల దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా వైద్యం, మందులు కూడా ఉచితమే.. గతంలో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వర్షం వచ్చేముందు, ఎవరైనా సిగరెట్ తాగిన.. అగర్బత్తి, సాంబ్రాణి పొగాకు విపరీతమైన తుమ్ములు ఊపిరి పీల్చటం కష్టంగా గత 15 సంవత్సరాల
మనవాళ్ళు బొత్తిగా వినపడని వారిని అబ్బ ఆయనకు బ్రహ్మ చెముడండీ అంటూ వుంటారు.ఆ కథా కమామిషూ ఏమిటో తెలుసుకుందాం?
బ్రహ్మదేవుడికి చెముడు రావట మేమిటని ఆశ్చర్య పోతాము.వాస్తవానికి యిది ఆయనకు వచ్చిన చెముడు కాదు.ఆ పదప్రయోగం రావటానికి కారణం మరో విధంగా వుంది
ఇది నాటక సమాజం వాళ్ళు పౌరాణిక నాటకాలు ప్రదర్శించే కాలం లో పుట్టింది.
ఎలాగంటే-
ఒకనాటకం లో తన ప్రియ భక్తునకు మెచ్చి అతను కోరిన వరాన్ని యివ్వటానికి
పైనుంచి క్రిందికి వచ్చి "భక్తా!నీ భక్తికి మెచ్చి వచ్చితిని,యే వరము కావాలో కోరుకో " అనే డైలాగ్ చెప్పాలి. ఆ వేషం వేసే వ్యక్తికీ అక్షర
జ్ఞానం లేదు.ఎవరైనా పక్కనుంచి అందిస్తే చెప్తాడు.అతను నాటకానికి ఎక్కువ విరాళము యిచ్చినందు వల్ల నాకు బ్రహ్మ వేషమే కావాలని పట్టుబట్టి నందువల్ల అతనికి ఆ వేషం తప్పనిసరిగా యివ్వ వలిసి వచ్చింది.
అతనికి బ్రహ్మ వేషం వేశారు..ఇంత కాలానికి మన కులపోడు బెమ్మ యేసికం యేత్తన్నాడు యెల్దామ్ రండహే
ప్రతిరోజు టాటా_మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు.
కానీ, కొన్ని రోజులనుండి సుమంత్_మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం
చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు.
ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ”ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి
నడుస్తున్నప్పుడు— హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే— సుందరి
చేసేపనికి -స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ