శీఘ్ర వివాహం,పిల్లలు పుట్టడం కోసం,సంతానాభివృద్ధి కోసం, జంతుదోష పరిహారార్థం,కుజదోష, నేత్ర వ్యాధి నివరణార్ధం,మార్గశిర శుద్ధ
షష్ఠి నాడు చేసే పండుగే
"సుబ్రహ్మణ్య షష్ఠి/స్కందషష్ఠి/కుమార షష్ఠి/షష్టీదేవి పూజ"
సుబ్రహ్మణ్య జననం,తారకాసురవధ, స్వామి సర్పరూపం దాల్చినరోజు ఇవాళే.
తారకాసురుడి సంహారం కోసం పుట్టిన కుమారస్వామి గణాధిపత్యం పోటీలో నెగ్గిన(గణపతి శివపార్వతులకు మూడు సార్లు ప్రదక్షిణలు చేసి గెలిచిన కథ
మనకి తెలుసు కదా)అన్నగారి మీద అలిగి,భూలోకానికి (శ్రీ శైలం)వచ్చేస్తాడు.అప్పుడు పాతాళ లోకంలో ఉండే ఆదిశేషుడి కుమారుడైన కుముదుడి కూతురు ఐన వల్లీదేవితో వివాహం కోసం సర్పరూపంలో మారి సుబ్రహ్మణ్య స్వామి అయ్యారు.
ఈ రోజు షష్టీదేవిని కూడా పూజించడం చేయాలి.
బ్రహ్మదేవుడి మానస పుత్రిక ఐన
షష్టీదేవి ని మానసాదేవి/మంగళషష్టీ/దేవసేన అని కూడా పిలుస్తారు.ఈవిడ సుబ్రహ్మణ్యేశ్వరుని భార్య.శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది.
పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,పుట్టిన శిశువుకు క్షేమం.
ఏం చేయాలి
పుట్టలో పాలు పొయ్యడం,
జంటనాగుల పూజ,ఆవుపాలతో అభిషేకం,వెండి పడగ సమర్పించడం,కావిళ్ళతో పాలు,పానకం సమర్పించడం,నువ్వులు,బెల్లంతో చేసిన నువ్వుండలు(చిమ్మిరి/తిలపిష్టం),చలిమిడి(గుడపిష్టం) బెల్లపుపొంగలి,పానకం, వడపప్పు,అరటిపళ్ళు నైవేద్యం గా సమర్పించాలి.
శాస్త్రవిరుద్ధంగా కోడిగుడ్లు పుట్ట దగ్గర వెయ్యడం,దీపావళి కి కొన్న టపాకాయలు కాల్చడం లాంటివి చెయ్యకూడదు.
వాల్మీకి రామాయణం లోని బాలకాండలో "కుమారసంభవం" శ్లోకాలని గర్భిణీ స్త్రీలు చదివినా,విన్నా సత్సంతానం కలుగుతుంది.
ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను #ఇంద్రయాగం అనేవారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు.వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.అందుకే ఈ పండుగ రోజు
ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల,గోపాలకుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పించే వారు. అందుకే ఈపూజకు #అన్నకూటం అని మరొక పేరు కూడా ఉంది.
#కార్తీక_మాసం #Dos_Donts.
ఈ సంవత్సరం 26-10-2022 నుంచి 23-11-2022 వరకూ కార్తీక మాసం.
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు;
గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
🕉అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
#భాగవతం_అష్టమ_స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది అండీ.(అందుకే పురాణాలు చదవాలి, అది మన కర్తవ్యం. ఋషి ఋణం అని ఒకటి ఉంటుంది అది తీరాలి అంటే వారు రాసినవి చదివి అర్థం చేసుకుంటేనే తీరుతుంది..రామాయణం భారతం,భాగవతం,భగవద్గీత లో లేని విషయం ఇంకేం లేదు ఈ ప్రపంచంలో..మీరు
కూడా ఆ పుస్తకాలు చదివితే అన్ని సందేహాలకీ సమాధానం లభిస్తుంది 🙏🙏)
నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము"లో27 మహాయుగాలు ఐపోయి,28వ మహాయుగంలో కృత,త్రేతా,ద్వాపరయుగాలు ఐపోయి,కలియుగములో ఉన్నాము.ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు
కలియుగం 5,123 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుతం 2022 (ఇది క్రీస్తుశకం లెక్కల ప్రకారం!!) సంవత్సరానికి ఇంకా 4,26,877 సంవత్సరాలు మిగిలివుంది.428,899లో అంతమవుతుంది.
3101 +present year =కలియుగం ప్రారంభం అయ్యింది.ఇదే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన సంవత్సరం కూడా!!
ఆయన అవతారం చాలించిన మర్నాటి నుంచి కలియుగం ప్రారంభం అయ్యింది.(ఇది NASA వారు కూడా ధృవీకరించారు.)
కలియుగం కిdouble/రెట్టింపు ద్వాపర యుగం (432000×2=864000)
కలియుగం కి మూడు రెట్లు =త్రేతాయుగం.(432000×3=1296000)
కలియుగం కి నాలుగురెట్లు=కృతయుగం (432000×4=1728000)