నటసార్వభౌముని విశ్వరూపం #సీతారామ_కళ్యాణం

#నందమూరి_తారకరామారావు.. దర్శకుడిగా తెలుగుతెరపై చేసిన తొలిసంతకం.

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు రెండోసారి రావణుడి పాత్రలో మెరిసిన చిత్రం 'సీతారామ కళ్యాణం'. ఇందులో లంకాధీశుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. అలాగే ఈ సినిమాతో తొలిసారి Image
దర్శకుడిగా మారారు తారక రామారావు.

#శ్రీ_సీతారామకళ్యాణం..

ఎన్టీఆర్ కెరీర్​లో అపూరుప చిత్రరాజంగా ఎన్నదగిన.. ఎన్నో వైవిధ్య చిత్రాలు తీయడానికి సూచనగా మారిన నందమూరి వారసుడు బాలకృష్ణకు అత్యంత ప్రీతిపాత్రమైన చిత్రం 'సీతారామకళ్యాణం'.

నందమూరి తారక రామారావు సినీరంగ ప్రవేశం చేసి.. Image
అప్పటికి పుష్కర కాలమైంది. ఈ 12 ఏళ్లలోనే జానపద, పౌరాణిక పాత్రలెన్నింటిలోనో ఆయన మెప్పించారు. 'మాయాబజార్​'లో శ్రీకృష్ణ పాత్రతో ఆరాధ్యుడిగా మారిపోయారు. అంతకుముందే 'భూ కైలాస్' సినిమాలో రావణుడిగానూ మెప్పించారు. అయితే మరోసారి రావణ పాత్రధారిగా సినిమాలో నటించాలని ఎన్టీఆర్ మొదట అనుకోలేదు. Image
అది ఎలా జరిగిందంటే..

#అలా_దర్శకుడిగా_ఎన్టీఆర్.. !

తాను రాముడిగా.. ఎస్వీఆర్ రావణుడిగా.. కేవీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. దాదాపు సినిమా ఖాయమే అనుకుంటున్న తరుణంలో.. ఎన్టీఆర్ సన్నిహితులు ధనేకుల వెంకట కృష్ణ చౌదరి.. శివపురాణం.. తదితర పురాణ గ్రంథాల్లో.. Image
రావణుడిలోని విశిష్టతను ఎలా వివరించారో తెలిపే పుస్తకాన్ని ఇచ్చారు. అది చదివాక ఎన్టీఆర్​కు రావణుడి పాత్రపై మక్కువ పెరిగింది. ఆ పాత్ర తానే వేసేందుకు సిద్ధమైపోయారు. కానీ ఎన్టీఆర్​ను.. కృష్ణుడి రూపంలో దేవుడిగా చూపించిన కేవీరెడ్డి.. రాక్షస పాత్రలో చూడలేనన్నారు. చివరకు ఎన్టీఆరే.. Image
ఆ సినిమాను తెరకెక్కించారు. తాను దర్శకత్వం వహించినా.. తమ కుటుంబ ప్రొడక్షన్స్ నేషనల్ ఆర్ట్ట్స్ థియేటర్ యూనిట్ పేరుతోనే టైటిల్స్ వేయించారు.

#తారాగణం-

శ్రీ రామునిగా అప్పుడు కొత్తగా వచ్చిన హరనాథ్, లక్ష్మణుడిగా శోభన్ బాబు నటించగా.. సీతగా అంతకుముందు 'రాణీ రత్న ప్రభ'లో ఓ నృత్య పాత్ర Image
పోషించిన #మణిని ఎన్నుకున్నారు. ఆమె, ఎవరో కాదు. గీతాంజలిగా ఆ తర్వాత అనేక సినిమాల్లో కనిపించిన ప్రసిద్ధ నటి. ఇక రావణాసురుడి భార్యగా, ఎన్టీఆర్ సరసన ప్రసిద్ధ కన్నడ నటి #బి_సరోజాదేవి నటించారు. జనకుడిగా మిక్కిలినేని, విశ్వామిత్రుడిగా గుమ్మడి మెప్పించారు. అప్పటికే సినిమాలను చాలించి Image
విశ్రాంతి తీసుకుంటున్న గాలిపెంచల నరసింహారావును ఒప్పించి.. సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు ఎన్టీఆర్. వెంపటి చినసత్యం నృత్యాలు సమకూర్చగా.. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం అందించారు. ఎన్ఏటీ బ్యానర్​లో ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్య నిర్మాణ బాధ్యతలు చూశారు. Image
#చిత్రకథ-

అలకాపురిని జయించి పుష్పక విమానంలో లంకకు వెడుతూ రావణ బ్రహ్మ ఈశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్లడం.. అక్కడ నంది చేత భంగపాటు.. కైలాసపర్వతాన్ని ఎత్తి, రుద్రగానం చేసి పరమ శివుని మెప్పించడం. దేవతల వినతితో శ్రీ మహాలక్ష్మి వేదవతిగా మారి భూలోకంలో పెరగడం, నారదుని ప్రోద్భలంతో ఆమె Image
స్వయంవరానికి రావణుడు వెళ్లడం. రావణుని ద్వేషించి ఆమె భస్మంకావడం. ఆ తర్వాత ఆమె బాలికగా జనకుని ఇంట సీతగా పెరగడం. అహల్య వృత్తాంతం, సీతా స్వయంవరం, రావణుడి భంగపాటు, రావణ ప్రేరణతో యుద్ధానికి వచ్చిన పరశురాముడు రాముడిని గుర్తించడం. అవతార పరిసమాప్తి. చివరలో సీతారామకళ్యాణం. ఇదీ సినిమా క్రమం Image
#రావణబ్రహ్మ_విశ్వరూపం--

టైటిల్ 'సీతారామకళ్యాణం' అయినప్పటికీ, సినిమా ఎక్కువుగా రావణునిదే ప్రధాన భూమిక. రావణుడిగా #ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. రావణుడు రాక్షసుడైనా బ్రహ్మ వంశజుడు. శాస్త్రాలను ఔపాసన పట్టాడు. సకల కళాసారంగదుడు. వీటన్నింటికీ ప్రాధాన్యం ఇచ్చారు. చక్రవర్తిగా రాజసాన్ని Image
ఎలా పలికించారో, మండోదరితో వీణానాదం చేస్తూ, సరసాన్ని సమపాళ్లలో ఒలికించారు. ఈశ్వరుడి ఆరాధనను, నారాయణుడి తిరస్కరణను సమరీతిలో చూపించారు.
నంది చేతిలో భంగపడి పరమశివుడు ప్రసన్నం కావడం లేదన్న ఉక్రోషంతో, కైలాసాన్నే పెకిలించుకు తీసుకెళ్తాను అంటూ రావణుడు చేసే ప్రయత్నంలో ఎన్టీఆర్ నటన నభూతో! Image
'జయత్వదభ్రవిభ్రమ భ్రమభుజంగ మస్సుర.. ధగధగ ధ్వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవా..' అంటూ ఎన్టీఆర్ చూపిన నటనకు మది ఉప్పొంగిపోతుంది.

ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి ఆయన చిత్రాలకు పనిచేస్తున్న రెహమాన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉత్తరాదికి చెందిన రవికాంత్ నగాయిచ్ అనే కుర్రాడికి ఛాయాగ్రహణ బాధ్యతలు Image
అప్పగించారు. ఇప్పటిలా గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ట్రిక్ ఫొటోగ్రఫీ ఉపయోగించి, నగాయిచ్ అద్భుత పనితనాన్ని ప్రదర్శించారు. రావణుడు కైలాసపర్వతాన్ని ఎత్తే సన్నివేశంలో పదితలలు కనిపించడం కోసం, నగాయిచ్-ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమించారు. అనుకున్న దృశ్యం రావడం కోసం ఎన్టీఆర్ దాదాపు 10 గంటల పాటు Image
చేతులు చాచి నిశ్చలంగా పైకి చూస్తూ ఉండిపోయారు. యూనిట్ వాళ్లు ఎంత వారించినా ఎన్టీఆర్ వినలేదు. అంతసేపు కళ్లను ఫోకస్ చేసి నించున్న ఎన్టీఆర్ సీన్ పూర్తయ్యాక కళ్లు తిరిగి పడిపోయారు. ( ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్​లో ఈ సన్నివేశాన్ని చూపించారు) శివానుగ్రహం కోసం కడుపులోని పేగులను Image
పెళ్లగించి వాటితో వీణానాదం చేస్తూ ఎన్టీఆర్ తన మోములో పలికించిన భావాలను చూసి చిత్రసీమ దిగ్భ్రమ చెందింది. రౌద్రం, క్రోధం, ఆవేదన కలగలిసిన ఆ భావాన్ని ఎన్టీఆర్ మోములో చూసి అక్కినేని దిగ్భ్రాంతికి గురయ్యారట..! ఈ సన్నివేశం ఆయనను ఎంతో ప్రభావితం చేసింది. ఇంట్లో అద్దం ముందు కూర్చొని తాను Image
కూడా ఆ ప్రయత్నం చేయగా ఆ ప్రభావం మాత్రం ఆయనకే సొంతం అని ఆయన చెప్పడం గొప్ప విశేషం.

#స్వయంవర_ఘట్టాలు-

ఈ సినిమాలో రెండు స్వయంవర ఘట్టాలు అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఆ పాత్రను ప్రేమించారో ఆ సన్నివేశాల్లో అర్థం అవుతుంది. మొదటిసారి వేదవతి స్వయంవరానికి వెళ్లినప్పుడు Image
(ఆమె నీలమేఘశ్యాముడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందని) వన్నే ప్రధానమైతే, నీలాకాశానికి కట్టరాదా.. నెమలి మెడకు ముడిపెట్టరాదా..? సముద్రంలోకి నెట్టరాదా..? అంటూ ఆమె తండ్రిని వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు. రెండోసారి సీతా స్వయంవరానికి తనను ఆహ్వానించలేదని, శివ భక్తుడిగా, జంగమదేవరుడి వేషంలో Image
అద్భుతమైన ఆలోచన..! శివద్రోహం.. ఈ కలాపం అంటూ.. జంగమదేవరుడిగా ఎన్టీఆర్ ప్రవేశం.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శత్రుంజయుడైన శంకరుడికే తిరస్కారం.. మృత్యుంజయుడైన ముక్కంటికే అపచారం. హరహరమహాదేవ శంభోశంకర అంటూ ఆయన చూపిన నటన అనన్యసామాన్యం. ఆ ఆహార్యంలో దుస్తులపై భేతాళుడి బొమ్మ, మధ్యలో Image
శివలింగం దానిపైన లైట్​ను ఫోకస్ చేస్తూ.. కెమెరాను కాళ్ల నుంచి మొహం మీదకు తీసుకెళ్లడం ఆ రోజుల్లో కొత్త క్రియేటివిటీ..! ఇలా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

#అన్నీ_అద్భుతాలే-

ఎన్టీఆర్ గంభీరమైన నటనతో పాటు.. సముద్రాల మాటలు, పాటలు, ఘంటసాల, సుశీల గానం, సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ Image
విలువలు ఇలా అన్ని విషయాల్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. సినిమా చివరిలో వచ్చే శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండీ.. పాట ఎంత ప్రజాదరణ అయిందో చెప్పాల్సిన పనేముంది. అద్భుతమైన సంగీతానికి సుశీల గొంతు అంతే అద్భుతంగా కుదిరి.. ఆ పాటను చిరస్థాయిలో నిలబెట్టింది. అరవైఏళ్లైనా ఇప్పటికీ.. Image
తెలుగువారి వివాహాల్లోనూ.. పెళ్లి వీడియోల్లోనూ.. ఆ పాట ఉండాల్సిందే..!

లంకాధీశుడు రావణుడిగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముని నట విశ్వరూపం..

ప్రతినాయక పాత్రల్లోని ధీరత్వాన్ని.. వీరత్వాన్ని కళ్లకు కట్టిన తేజోరూపం..

90ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అపురూప చిత్రరాజం.. Image
'సీతారామ కళ్యాణం'తో ఎన్టీఆర్​లోని నటవైభవం.. దర్శకత్వ ప్రతిభ శిఖర స్థాయిలో కనబడ్డాయి. ఒక పాత్రద్వారా ప్రేక్షకులను ఇంతటి స్పందనకు గురి చేయడం ఈ చిత్రంతోనే మొదలయ్యినట్లుగా చెప్పుకున్నారు. ఈ చిత్రం వచ్చిన రెండేళ్లకు.. 'లవకుశ' విడుదలైంది. ఎన్టీఆర్ తెలుగునాట ఇంటింటికీ.. ఇలవేల్పయ్యాడు..! Image
అయితే ఆయన ప్రత్యేకమైన ప్రతినాయక పాత్రలు చేయడానికి బీజం వేసిందిమాత్రం రావణబ్రహ్మ వేషమే..! ఆ స్ఫూర్తితోనే ఆ తర్వాత 'శ్రీకృష్ణ పాండవీయం' లో దుర్యోధన వేషం వేశారు. ఆ తర్వాత మరో దశాబ్దానికి 'దాన వీర శూర కర్ణ..' చరిత్ర తిరగరాసింది. ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి బాలకృష్ణకు కూడా ఎన్టీఆర్ Image
సినిమాలలో కెల్లా.. 'సీతారామకళ్యాణం' అంటే ఎక్కువ ఇష్టం. ఈ సినిమా స్పూర్తితోనే తాను 'నర్తనశాల' ప్రారంభించానని ఆయన చెప్పుకున్నారు కూడా..! Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with ఆదిత్య శివశంకర కలకొండ

ఆదిత్య శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @adithyashiva23

Aug 1, 2023
#తమిళ భాషను #తెలుగువారు "#అరవం"అని ఎందుకు అంటారు?

మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.

మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
Read 5 tweets
Apr 29, 2023
#తెలుగు_భాష

తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?

డోర్ లాక్ చెయ్యకండి..

నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో..

నా కార్ కీస్ ఎక్కడ?

ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..

ఎందుకు ?

ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..

ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
వంటింటిని... #కిచెన్ చేసాం..
వసారా... #వరండాగా మారింది...
ఇలా #చావడి, #పంౘ, #ముంగిలి, #నట్టిల్లు, #తలవాకిలి, #నడవ, #పెరడు, ఇవన్నీ మరచిపోయాం..

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు..
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు..
Read 13 tweets
Mar 21, 2023
*#వదిలెయ్_మిత్రమా*

✒️ ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం
*వదిలెయ్*

✒️ పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాల పడక
*వదిలెయ్*
✒️ కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను
*వదిలెయ్*

✒️ ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా
*వదిలెయ్*
✒️ మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
*వదిలెయ్*

✒️ మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను
*వదిలెయ్*

✒️ ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చకుండా
*వదిలెయ్*
Read 4 tweets
Mar 21, 2023
ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది..
చాలా గర్వంగా ఉంది..

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
Read 8 tweets
Mar 21, 2023
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.

దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..

గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.

"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.

అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
Read 6 tweets
Mar 14, 2023
#సనాతన_ధర్మం - #పునర్జన్మ

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.

”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(