విజయ్ సారథి వడ్డి గారి వ్యాసం

ఈ చిత్రంలో కనిపించుతున్న వ్యక్తి డాక్టర్ #కేశవరావ్_బలీరాం_హెడగేవారు. #రాష్ట్రీయస్వయంసేవకసంఘ (#RSS) స్థాపకులు. ఇప్పటికి 97 సంవత్సరాల క్రితం విజయదశమినాడు సంఘాన్ని ప్రారంభించారు. ఆయన సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా?

మనదేశం పరాయిపాలనలో ఉండటం
ఆయనకు చిన్ననాటినుండి భరించరానిదిగా ఉండేది. భారత సామ్రాజ్ఞి #విక్టోరియారాణి జన్మదినోత్సవం సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన లడ్డూను తినకుండా విసిరి కొట్టాడు. ఆ రాణి మరణానంతరం ఇంగ్లాండు రాజైన #ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లోని ఎంప్రెస్ మిల్లువారు తారాజువ్వలతో వెలుగుపూల
ప్రదర్శన ఏర్పరిచినదాన్ని పోయి చూద్దామని స్నేహితులు బలవంతపెట్టినా వెళ్లలేదు. ఆరువేల మైళ్ల దూరం నుండి కొన్నివేలమంది వ్యాపారం కోసంవచ్చి, ఇంతవిశాలమైన దేశాన్ని వశపరచుకొని, అధికారం చలాయించటమేమిటని మథనపడుతుండేవాడు.

ఆయన పెద్దవాడైన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఒక ప్రశ్న
వేస్తుండేవారు. ప్రపంచంలో ఏడువింతలు అని మీ చరిత్రపుస్తకంలో ఉంటుంది. ఇవిగాక ఎనిమిదో వింత ఒకటి ఉంది, మీకు తెలుసా? అని. అలా మొదలుపెట్టి ఆంగ్లేయుల పాలనను పెకలించి పారవేయాల్సిందేనన్న భావాన్ని వారి మనస్సులలో నాటుతుండేవారు.

ఆనాటికి ఆంగ్లేయుల పాలనాకేంద్రంగా కోలకత్తా నగరం ఉండేది.
ఆంగ్లేయుల పాలనను తుద ముట్టించాలనే దీక్షతో పనిచేస్తున్న రహస్య సంస్థలు ఎన్నో అక్కడ ఉండేవి. వాటితో సమన్వయం ఏర్పరుచుకొనే దృష్టితో స్వాతంత్ర్య పిపాసులైన నాగపూర్ వాసులు కొందరు ఆర్థిక సహాయమందించి కొలకత్తాలోని జాతీయ వైద్య కళాశాలలో వైద్యవిద్య నభ్యసించేందుకు కేశవరావును పంపించారు.
కొలకత్తా చేరిన కేశవరావ్ #అనుశీలనసమితి అనే రహస్యవిప్లవ సంస్థలో సభ్యుడైనాడు. వివిధ కార్యకలాపాలలో పాల్గొని అనుభవం గడించాడు. ఎంతో శ్రమపడి, సాహసికులైన యువకులు రూపొందించిన ప్రణాళికలు పోలీసులకు చిక్కిన ఒకరిద్దరు అర్భకులు ఆ రహస్యాలను దాచలేక బయటకు కక్కితే మొత్తం ప్రణాళిక వ్యర్థమై పోతుండటం
ఆయనను ఎంతగానో బాధించేది.

వైద్యవిద్యలో పట్టా పొంది నాగపూర్ కి తిరిగి వచ్చిన తర్వాత కూడా తన బహుముఖ కార్యకలాపాలను కొనసాగించారు. #పాండురంగ_ఖాంఖోజేతో కలసి విప్లవ కార్యక్రమాల రచనలో నిమగ్నులైనారు. కాంగ్రెసు సంస్థలో చేరి సామాన్య ప్రజానీకాన్ని మేల్కొలిపి స్వాతంత్ర్యోన్ముఖులను చేసే కార్య
కలాపాలలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1920 డిశెంబరులో అఖిల భారత కాంగ్రెసు మహాసభలు నాగపూర్లో జరిగినపుడు ఆ సభల ఏర్పాట్లలో ప్రధాన పాత్ర ఆయనదేనని చెప్పవచ్చు. ప్రశంసాపత్రంగా ఆ పని నిర్వహించారు.

కాటోల్, భరత్ వాడ అనే పట్టణాల్లో జరిగిన సభల్లో ఆయన చేసిన ప్రసంగాలకు బెంబేలెత్తిపోయిన
ఆంగ్ల ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం నేరం మోపి కేసు నడిపించింది. తన దేశ ప్రజలను స్వాతంత్ర్యోన్ముఖులను చేస్తూ, తమదేశాన్ని తాము రక్షించుకొంటూ తామే పరిపాలించుకోవాలని, ఆంగ్లేయులవలె ఇతరుల భూములను కబళించటం తగదని తానుచెప్పిన మాట నిజమేనని వివరణాత్మకంగా ఇచ్చిన ఉపన్యాసం చిరస్మరణీయమైనది.
"రాజద్రోహకరమైన ఏ ఉపన్యాసానికి విచారిస్తున్నామో, దానికి మించి రాజద్రోహకరంగా ఉంది ఈ వాఙ్మూలం" అంటూ జడ్జి ఒక ఏడాది జైలుశిక్ష విధించాడు.

ఏడాది తర్వాత ఆయన విడుదలైన సందర్భంలో నాగపూర్ ప్రజానీకమంతా స్వాగతం పలికి సత్కరించారు. ఆంగ్లేయులను వెళ్లగొట్టడానికి ఏమార్గం అనుసరించినా సమ్మతమేనని
అన్ని ప్రయత్నాలను సూక్ష్మంగా అధ్యయనం చేసిన డా౹౹కేశవరావ్ #స్వాతంత్ర్య అనే పత్రికను కూడా నడిపారు. అంతకుముందు 1920-21లో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం కూడా ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. జైలుజీవితం మనదేశ చరిత్రను నెమరు వేసుకొని ఇప్పటి పరిస్థితులలో మన కర్తవ్యమేమిటో ఆలోచించుకొనే అవకాశమిచ్చింది.
ఇంతటి విస్తృత అనుభవాలు, లోతైన అధ్యయనముల లోంచి రూపుదిద్దుకొన్నదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్.

హిందువులు ఈ దేశంలో రాష్ట్రీయులు. వారిని మేల్కొల్పటం, వారిలోని అవగుణాలను వదిలించటం, సంస్కారాల నివ్వటం, సంఘటిత పరచటం ఈ దేశ ప్రగతికి అనివార్యం. ఎన్నో రంగాలలో ప్రగతిగాంచిన హిందువు, ఎన్నో
సద్గుణాలు కలిగియుండిన హిందువు దేశంకోసం జీవించాలని దేశ స్వాతంత్ర్యానికి, సంరక్షణకు తన జీవితంలో ప్రథమ ప్రాధాన్యమివ్వాలని గుర్తించి వ్యవహరించకపోవటమే మనలను బానిసతనంలోకి నెట్టివేసినదని గుర్తించారు. ఆంగ్లేయులను తరిమి కొట్టటం ఎంత అవసరమో, ఆతర్వాత లభించే స్వాతంత్ర్యాన్ని
నిలబెట్టుకొపడానికి, సద్వినియోగ పరుచుకొనడానికి శిక్షణ ఇవ్వటం అనివార్యమని ఆయన గ్రహించారు.

సాధారణ హిందువు అనుదిన జీవితంలో దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకుపోవాలనే ఆకాంక్షను ప్రవేశపెట్టి, రోజులో ఒకగంట ఈ విధమైన ఆలోచనలు చేసేవారిమధ్య గడపటంద్వారా తన జీవనశైలిని, ప్రవర్తననూ
తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనను చిగురింపజేయాలి. అభ్యాసం లభింపజేయాలి. ఈ స్పష్టతతో దేశవ్యాప్తమైన హిందూ సంఘటనా కార్యమే మనం మరోసారి మరో విదేశీ శక్తికి లొంగిపోకుండా రక్షించుకోగల నిత్య జాగృత, నిత్య సంసిద్ధ శక్తిగా మనలను రూపొందించగలదని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం ఆరంభించారు.

ఒకసారి ఈ
నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు బహుముఖమైన తన కార్యకలాపాలన్నింటికీ స్వస్తి చెప్పి, ఆత్మ విస్మృతిని అంతంచేసి, భారతమాత సంతానమైన మనమంతా అన్నదమ్ములము ,మనం హిందూరాష్ట్రానికి అంగభూతులము అనే ఆత్మీయ భావాన్ని వ్యక్తపరిచే సంఘకార్యాన్ని సుదృఢం చేయడానికి అంకితమైనారు.
హిందూదేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నామని బ్రిటీష్ లేబర్ పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి అయిన క్లెమెంట్ అట్లి ప్రకటించినపుడు, వారికి ఆ యోగ్యత లేదు, ఇండియా చీలికలు పీలికలు అయిపోతుందని ప్రతిపక్షనేత, మాజీ ప్రధానమంత్రి అయిన చర్చిల్ చేసిన హెచ్చరిక వాస్తవం కాలేదంటే దేశభక్తిభావాన్ని ప్రజలలో
మేల్కొల్పుతూ, ఉత్తమ సంస్కారాల నందిస్తూ, వ్యక్తినిర్మాణకార్యాన్ని, దేశవ్యాప్తమైన హిందూ సంఘటనా కార్యాన్నీ నిరంతరంగా నడిపించుతున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కర్తృత్వాన్ని అందుకు ప్రధాన కారణంగా చెప్పక తప్పదు.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with ఆదిత్య శివశంకర కలకొండ

ఆదిత్య శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @adithyashiva23

Aug 1, 2023
#తమిళ భాషను #తెలుగువారు "#అరవం"అని ఎందుకు అంటారు?

మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.

మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
Read 5 tweets
Apr 29, 2023
#తెలుగు_భాష

తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?

డోర్ లాక్ చెయ్యకండి..

నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో..

నా కార్ కీస్ ఎక్కడ?

ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..

ఎందుకు ?

ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..

ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
వంటింటిని... #కిచెన్ చేసాం..
వసారా... #వరండాగా మారింది...
ఇలా #చావడి, #పంౘ, #ముంగిలి, #నట్టిల్లు, #తలవాకిలి, #నడవ, #పెరడు, ఇవన్నీ మరచిపోయాం..

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు..
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు..
Read 13 tweets
Mar 21, 2023
*#వదిలెయ్_మిత్రమా*

✒️ ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం
*వదిలెయ్*

✒️ పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాల పడక
*వదిలెయ్*
✒️ కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను
*వదిలెయ్*

✒️ ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా
*వదిలెయ్*
✒️ మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
*వదిలెయ్*

✒️ మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను
*వదిలెయ్*

✒️ ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చకుండా
*వదిలెయ్*
Read 4 tweets
Mar 21, 2023
ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది..
చాలా గర్వంగా ఉంది..

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
Read 8 tweets
Mar 21, 2023
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.

దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..

గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.

"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.

అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
Read 6 tweets
Mar 14, 2023
#సనాతన_ధర్మం - #పునర్జన్మ

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.

”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(