సినిమా రంగంలో అవసరం తీరగానే మరచిపోతారని, విలువలు ఉండవని ఎందరో చెప్తారు. అయితే, కృతజ్ఞత అన్న పదం తలుచుకున్నప్పుడు నాకు గుర్తుకువచ్చే సంఘటన సినిమా రంగంలోనే జరిగింది. ఎన్టీ రామారావుకు, కె.వి.రెడ్డికి మధ్య జరిగిన ఈ సంఘటన కృతజ్ఞత అన్న పదానికే నిర్వచనంగా నిలిచిపోతుంది. #NTR
కె.వి.రెడ్డి - అలనాటి సినిమాలు ఇష్టపడేవారికే కాక, మాయాబజార్ దర్శకునిగా చాలామందికి, మహానటి, కథానాయకుడు సినిమాల ద్వారా ఈమధ్య ఇంకొందరికీ ఈయన పేరు, తీరు కొంత తెలుసు.
మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ వంటి సినిమాలు తీసిన దిగ్దర్శకుడు - కెవి రెడ్డి. తెలుగు సినిమా రంగానికి 1940లు, 50ల్లో స్వర్ణయుగాన్ని చవిచూపించిన బ్యానర్లలో అగ్రతాంబూలం అందుకునే వాహినీ, విజయా సంస్థలకు ఆయనొక మూలస్తంభం. ఎందరో రచయితలు, నటులను తెరపై వెలిగించిన వ్యవస్థ ఆయన.
కె.వి.రెడ్డి కంటూ కొన్ని పద్ధతులు, విధానాలు ఉండేవి. ఎంతైనా 1942 నుంచి అగ్రదర్శకుడిగా కొనసాగుతూ వచ్చిన వ్యక్తి మరి.
అయితే, ఈ పద్ధతుల వల్లనే ఆయన సినిమాలు ఎక్కువగా తీసిన విజయా సంస్థ అధిపతులు నాగిరెడ్డి-చక్రపాణిలతో వివాదాలు, సమస్యలూ ఉండేవి.
పాతాళ భైరవి విడుదల అయిన నాటి నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన ఈ మనస్పర్థలు ముదిరి కె.వి.రెడ్డి విజయా బ్యానర్లో 1960ల్లో తీసిన చివరి మూడు సినిమాలకు నాగిరెడ్డి-చక్రపాణిల పేర్లు కాకుండా కె.వి.రెడ్డి తన పేరే నిర్మాతగా వేయించుకోవడం దాకా పోయింది.
కె.వి.రెడ్డి పేరు 1942లో భక్త పోతన మొదలుకొని 1964లో శ్రీకృష్ణార్జున యుద్ధం వరకూ తెలుగు సినిమా రంగంలో ఘన విజయాలకు పర్యాయపదంగా సాగింది. దాదాపుగా తీసిన ప్రతీ సినిమా సంచలన విజయమే. కాబట్టి, నాగిరెడ్డి-చక్రపాణిలు ఇదంతా ఎలానో సహించి ఊరుకున్నారు.
కాలం ఎప్పుడూ ఒకతీరున ఉండదు కదా. కె.వి.రెడ్డికి 1965-68 మధ్యకాలంలో వరుసగా మూడు పెద్ద ఫ్లాపులు వచ్చాయి. అందులో రెండు (సత్య హరిశ్చంద్ర, ఉమా చండీ గౌరీ శంకరుల కథ) విజయా సంస్థ నిర్మించినవే.
విజయా ప్రొడక్షన్స్లో 1950ల నుంచీ కె.వి.రెడ్డి సాంకేతిక బృందం నెలజీతానికి పనిచేసేవారు. వారిలో- పింగళి, కళాధర్-మా గోఖలే వంటి మహామహులు ఉండేవారు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఫ్లాప్తో కె.వి.రెడ్డి హవా ముగిసిందన్నట్టు ఆ బృందాన్ని మొత్తంగా విజయా ప్రొడక్షన్స్ వారు ఉద్యోగంలోంచి తొలగించారు.
కె.వి.రెడ్డికి పెట్టే ఆఫీసు కారును కూడా వెనక్కి తీసేసుకున్నారని ఆయన సన్నిహితుడైన రచయిత, ఆయన ద్వారానే సినిమా రంగంలోకి ప్రవేశించినవాడూ అయిన డి.వి.నరసరాజు రాసుకున్నారు. అదేమీ జరగలేదని కె.వి.రెడ్డి పిల్లలు అంటారు. ఏమైనా - కె.వి.రెడ్డి ఒక్కసారిగా పెద్ద దెబ్బ తిన్నారని చెప్పక తప్పదు.
ఒకవైపు ఈ అవమానానికి తోడు తన స్వంత బ్యానర్లో తీసిన భాగ్యచక్రం సినిమా కూడా పరాజయం పాలయింది. దీనితో ఆయనకు చేతిలో ఒక్క అవకాశమూ లేకుండా పోయింది.
పైగా కె.వి.రెడ్డికి ఎలా పడితే అలా సినిమా తీసే అలవాటు లేదు. శ్రద్ధగా స్క్రిప్టు రాసుకుని, దాన్ని విజువలైజ్ చేసి, రిహార్సల్స్ చేయించుకుని పద్ధతిగా సినిమా తీసి బ్రహ్మాండమైన హిట్ కొట్టడం, ఇంతకన్నా ఈ సబ్జెక్ట్ బాగా తీయలేమన్న పేరు సంపాదించడం ఆయన విధానం. ఇందుకు సమయం, డబ్బు, ఓపిక అవసరం.
దీంతో - ఒకనాడు కె.వి.రెడ్డితో సినిమా తీయించుకోవాలన్న ఆశతో ఏళ్ళ పాటు నిర్మాతలు వేచిచూసిన స్థితి నుంచి, మాయాబజార్ ఆగిపోయిందని తెలిసి మేం తీస్తామని తమిళ చిత్ర సీమలో అగ్రనిర్మాతలు రాయబారాలు పంపిన స్థితి నుంచి - చివరకు సినిమా తీస్తానన్నా పెట్టుబడి పెట్టేవారు కరువైన స్థితి వచ్చింది.
అలా రెండు సంవత్సరాలు గడిచిపోతూ, ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిపోతున్న దశలో ఈ సంగతులు ఎన్.టి.రామారావు చెవిన పడ్డాయి. కె.వి.రెడ్డి అంటే రామారావుకు ఎంతో అభిమానమూ, ఇంకెంతో గౌరవమూ ఉన్నాయి.
1951లో నాగేశ్వరరావు అగ్రనటుడిగా దూసుకుపోతున్న సమయంలో అప్పుడే రంగంలోకి వచ్చిన రామారావు ఆవేశాన్ని ఓ టెన్నిస్ మ్యాచ్లో చూసి, ఇదీ జానపద నాయకుడికి ఉండాల్సిన ఫోర్సు అని తన పాతాళ భైరవిలో హీరోగా పెట్టుకున్నది- కె.వి.రెడ్డే. ఆ సినిమాతో రామారావు తిరుగులేని మాస్ హీరోగా నిలిచారు.
కృష్ణుడి పాత్రకు నేను తగను అని రామారావు మొత్తుకున్నా వినకుండా పట్టుబట్టి అతనితో కృష్ణ పాత్ర వేయించి కృష్ణుడంటే ఇలానే ఉండాలని మాయాబజార్ సినిమాతో బెంచ్మార్క్ సెట్ చేసిందీ కె.వి.రెడ్డే.
కె.వి.రెడ్డికీ రామారావు మీద నటన మీద విశ్వాసం ఎక్కువ, వ్యక్తిగా అతని మీద వాత్సల్యమూ ఎక్కువే. 1951 తర్వాత పాతాళ భైరవి నుంచి భాగ్యచక్రం వరకూ కె.వి.రెడ్డి పది సినిమాలు తీస్తే అందులో ఏడు సినిమాల్లో రామారావే కథానాయకుడు.
రామారావు దర్శకత్వం వహించిన తొలి సినిమా మొదలుకొని చివరిదాకా పాటించింది కె.వి.రెడ్డి విధానాలే. స్క్రిప్టు చాలా సమయం తీసుకుని పక్కాగా రాయించుకోవడం, బాగా వర్క్ చేసి సినిమాను విజువలైజ్ చేయడం, ప్రతీ వివరం ముందుగా రాసిపెట్టుకోవడం, రిహార్సల్స్ చేయించడం - ఇవన్నీ కె.వి.రెడ్డి పద్ధతులే.
అయినా కె.వి.రెడ్డిని దర్శకునిగా పెట్టుకుని స్వంత బ్యానర్లో సినిమా తీసే వీలు అంతవరకూ NTRకి దొరకలేదు. కెవి రెడ్డి అప్పట్లో అంత బిజీ.
తిరిగి 1960లు చివరికి వస్తే - కె.వి. అనారోగ్యంతో, ఫ్లాపుల్లో, అవమాన భారంతో ఉన్నారు. ఒక్క అవకాశం దొరికితే మంచి హిట్ ఇచ్చి రిటైర్ అయ్యే ఆశతో ఉన్నారు.
కె.వి.రెడ్డికి రామారావు ఆ అవకాశం ఇచ్చారు. "గురువు గారూ, మీ పింగళి గారే రాసిన స్క్రిప్టులు రెండు ఉన్నాయి నా దగ్గర - చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణసత్య. ఇందులో ఏదోకటి నా బ్యానర్లో చేసిపెట్టండి" అని అడిగారు NTR. పరమానందభరితుడైన కె.వి.రెడ్డి శ్రీకృష్ణ సత్య చేస్తాలే రామారావ్ అన్నారు.
ఆ దర్శకత్వం చెయ్యడం కూడా ఇదివరకులాగా చేసేంత ఆరోగ్యం లేదు. దానితో కె.వి.రెడ్డితో స్క్రిప్టు మీద రామారావు తానే కూర్చొని మొత్తం ఫైనలైజ్ చేశారు.
ఆపైన కె.వి.రెడ్డిని సెట్లో కుర్చీ వేసుకుని కూర్చోబెట్టి, మాట్లాడి ఆయన చెప్పినదాని ప్రకారం కెమెరా సెట్ చేసి, ఆయన ముందు రిహార్సల్స్ చేయించి (చేసి) చూపించి, ఆపైన కెమెరాలోంచి పరిశీలించి వచ్చి ఇలా ఉంది గురువు గారూ అంటే ఆయన ఆమోదిస్తే చేసి షాట్ పూర్తిచేయడం. లేదంటే మార్పులు చేయడం.
ఇలా- ఒకటికి రెండు రెట్లు శ్రమ తీసుకుని మరీ "శ్రీకృష్ణ సత్య"ని కె.వి.రెడ్డి సినిమాగానే దాన్ని పూర్తిచేయించారు రామారావు.చివరకు, ఆ సినిమా విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. కె.వి.రెడ్డికి చెప్పలేనంత సంతృప్తి కలిగింది.
"రామారావు, నన్ను మళ్ళీ నిలబెట్టాడు. ఇన్ని విజయాలు చూసి చివరకు ఫ్లాప్ డైరెక్టరుగానే నా కెరీర్ ముగించాల్సి వస్తుందేమోనని బాధపడ్డాను. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు. మరొక్క సినిమా సంతృప్తిగా తీసి, మా తాడిపత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను" అంటూండేవారు.
కాకపోతే, అంతలోనే కె.వి.రెడ్డి అనారోగ్యంతో మరణించారు. కానీ, సంతృప్తిగా మరణించారు.
సినిమా రంగం అంటేనే కృతజ్ఞత లేని రంగం అని అందులోని వారే అంటారు. హిట్లు వస్తున్ననాడు ఎలాంటివాడికైనా నీరాజనం పడతారు. ఫ్లాపులు వస్తే ఎంతటి మహానుభావులనైనా పక్కనపెట్టేస్తారు. మళ్ళీ చనిపోయాకే వాళ్ళ గొప్పదనం గుర్తుకువస్తుంది.
ఆఫ్కోర్స్ డబ్బుతో చెలగాటం మరి.
అలాంటి పరిస్థితిలోనూ ఇంతటి నీతిని, ఇంతటి కృతజ్ఞతని ప్రదర్శించాడని తెలియడం ఎన్.టి.రామారావుపై నాకున్న గౌరవాన్ని ఎంతగానో ఇనుమడింపజేసింది. ఈ సంఘటన ఎన్నిసార్లు తలుచుకున్నా తప్పులేదనిపిస్తుంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
చెరుకూరి రామోజీరావు. గత అర్థశతాబ్ది కాలంగా తెలుగు రాజకీయాలపై లోతైన ప్రభావం చూపించే మార్పుల్ని, మలుపుల్ని తెచ్చిన గుప్పెడుమంది పేర్లు రాస్తే అందులో ఈ పేరు నిస్సందేహంగా వస్తుంది. ముఖ్యమంత్రులను నిలబెట్టారు, పడగొట్టారు, ముఖ్యమంత్రుల వల్ల పడ్డారు, లేచారు. ఆయన సృష్టించినదొక చరిత్ర. ఈ సందర్భంగా ఆయన గురించి నాకు తెలిసిన, తెలుసుకున్న ఆసక్తికరమైన సంగతులు చెప్తాను.
"ఈనాడు" పేరు - బ్రాండింగ్ సూత్రాలు
పూర్వం ప్రముఖ పత్రికల పేర్లు - "ఆంధ్రపత్రిక", "ఆంధ్రజ్యోతి", "ఆంధ్రప్రభ", "విశాలాంధ్ర", "ప్రజాశక్తి", "గోల్కొండ", "మీజాన్", "కృష్ణాపత్రిక". ఈ పేర్ల మౌలిక లక్షణాలు: 1. చాలావరకూ పొడవు పేర్లు. 4-5 అక్షరాలు, 7-9 మాత్రలు ఉన్నవి ఎక్కువ. 2. చాలావరకూ ప్రదేశాన్నో, ప్రాంతాన్నో సూచిస్తున్నాయి,. అరుదుగా సిద్ధాంతాన్ని. 3. చాలామందికి పలకడానికి కష్టమైన పేర్లు.
"ఈనాడు" అన్న పేరులో ఈ మూడు ఇబ్బందులూ లేవు. తేలికైన పేరు, మూడక్షరాలు, ఐదుమాత్రల సులువైన అచ్చతెలుగు పేరు. వార్తాపత్రిక మౌలిక లక్షణమైన ప్రస్తుతం అన్నదాన్ని సూచించే పేరు.
ఈ పేరును ఇలా పలకలు పలకలుగా ఫాంట్ చేయడం వెనుక కూడా మిగిలిన అన్ని పత్రికల డిజైన్కూ దూరంగా స్వంత ముద్ర వేయడం కనిపిస్తుంది.
ఈ ఫాంట్ రూపకల్పన చేసిన వ్యక్తి రాసిన వ్యాసం నా దగ్గర ఎక్కడో ఉండాలి. దొరికితే ఇస్తా.
ఎర్ర స్కెచ్పెన్తో ఈనాడు మీద నిత్యం నోట్స్
కొన్న దశాబ్దాల పాటు రామోజీరావు దినచర్యలో అత్యంత ముఖ్యమైన భాగం ఈనాడు పేపర్లోని ప్రతీ పేజీని క్షుణ్ణంగా చదివి, నిశిత విమర్శనాత్మక దృష్టితో ఎర్ర స్కెచ్పెన్తో తప్పొప్పులను రాసి పంపడం. "ఈ వార్త ఐదవ పేజీలో ఎందుకుంది? దీని ప్రాధాన్యత మొదటి పేజీ కాదా?", "ఈ పదం వాడొద్దని నిర్ణయించాము", "కంగ్రాచ్యులేషన్స్", "మంచి శీర్షిక", "మొదటి పేజీలో దీన్నెందుకు వేశారు?", "పాఠకులకు అయోమయం కలిగించే ఇంట్రో" అంటూ పత్రిక పాలసీని బట్టి మొదటి పేజీ నుంచి ప్రతీ జిల్లా పేజీ వెతికి వెతికి నోట్స్ రాసేవారు. దాన్ని యంత్రాంగం మథించి, మంచిచెడులకు తగ్గట్టు ఆయా విలేకరులకు పంపించేంది.
కర్ణాటక, తమిళనాడు, కేరళ లకు ప్రదేశ్ లేదు కదా, మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రదేశ్ అని ఎందుకు పెట్టారు?
అని కోరాలో ఒక ప్రశ్న అడిగారు గతంలో. చాలా ఆసక్తికరమైన సంగతి ఇది. దానికి నా జవాబు ఇది:
ప్రదేశ్ అన్న పదం మన భాషల్లో ప్రాంతాన్ని సూచించే పదం కాదు కాబట్టి. అసలైతే, మనమే పెట్టుకుని ఉండకూడదు కాబట్టి. తెలుగు నాడు, ఆంధ్ర దేశం, తెలుగు దేశం (పార్టీ పేరు కాదు లెండి, పార్టీ పెట్టింది 1982లో, రాష్ట్ర ఏర్పాటు 1956లో) - ఇలాంటి పేరు ఏదైనా పెట్టి ఉండవచ్చు. అసలు వీటన్నిటి కన్నా "విశాలాంధ్ర/విశాలాంధ్రం" అన్నది సరైన పేరు. (ఎందుకన్నది తర్వాత చూద్దాం)
ఈనాడు 60 ఏళ్ళ పైచిలుకు విని, దానితో మానసికంగా అనుబంధం పెంచుకున్న ఆంధ్ర ప్రదేశ్ వాసులకు ఆ మాట రుచించకపోవచ్చు కానీ ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు అసమంజసం.
ఎందుకంటే...
ముందుగా కొన్ని చారిత్రక వాస్తవాలు చెప్పుకుంటే స్పష్టంగా ఉంటుంది:
- 1948లో భారత ప్రభుత్వం పోలీసు చర్య జరిపి ఏడవ నిజాంని తొలగించి, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపారు. అది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ రాజ్యం అనేవారు దాన్ని, ఆ పేరే కొనసాగించారు. (నైజాం అన్నది కేవలం జన వ్యవహారం) అందులో నేటి తెలంగాణ, ఈనాడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డివిజన్గా ఉన్న మరాఠ్వాడా, ప్రస్తుతం కర్ణాటకలో కళ్యాణ్ కర్ణాటక అని పిలుస్తున్న రాయ్చూర్-గుల్బర్గా ఇత్యాది జిల్లాలు భాగం.
- 1953లో మద్రాసు రాష్ట్రంలో రాజధాని మద్రాసు వదులుకుని, ఎక్కువశాతం తెలుగు జిల్లాలు విడిపోయి ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇందులో ప్రదేశ్ లేదు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు.
- తెలుగు వారి కృషి, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల ఫలితంగా 1956లో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ తుదకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను విధానపరంగా ఆమోదించింది. ఆ క్రమంలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు (లేక తెలంగాణ), ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ఇప్పుడు హఠాత్తుగా ప్రదేశ్ వచ్చేసింది.
ఆంధ్ర అన్న పదం వరకూ 1956 నాటికి విస్తృతమైన ఆమోదం ఉంది. ఈనాడు ఆంధ్ర అనే శబ్దానికి కోస్తాంధ్ర, రాయలసీమ వారన్న అర్థం స్థిరపడుతూ వస్తోంది కానీ బ్రిటీష్ పాలనా కాలంలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దంలోనూ ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా అటు తెలంగాణ వారు, ఇటు కోస్తాంధ్ర-రాయలసీమ వారూ కూడా వాడేవారు.
ఉదాహరణకు తెలంగాణలో తెలుగు వారు తమ భాషా సంస్కృతులను పరిరక్షించే సంస్థ నెలకొల్పినప్పుడు దాని పేరు ఆంధ్ర మహాసభగా పెట్టారు, 1901లో సుల్తాన్ బజార్లో నెలకొల్పిన గ్రంథాలయం పేరు శ్రీకృష్ణదేవరాయాంధ్ర గ్రంథాలయం, తెలంగాణ వారైన సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగువారి సాంఘిక చరిత్ర రాసి దానికి పెట్టిన పేరు "ఆంధ్రుల సాంఘిక చరిత్ర", అసలు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగువారు తమ సంస్కృతి పరిరక్షణకు ప్రారంభించిన ఉద్యమం పేరే ఆంధ్రోద్యమం, దీని గురించి మాడపాటి హనుమంతరావుగారు "తెలంగాణములో ఆంధ్రోద్యమము" అని రాశారు. ఏతావతా, ఆంధ్ర అన్న పదం అత్యధికులకు ఆనాడు ఆమోదయోగ్యమే.
ఐతే, దీన్ని ఆంధ్ర అని ఊరుకోకుండా మరేదో చేర్చడానికి కారణం బహుశా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కలిసినట్టు ఉండకూడదనీ, రెండూ కలిసి కొత్త రాష్ట్రం ఏర్పడిందని సూచించాలని. (మూలం: ఆంధ్రప్రదేశ్ గా కొత్త రాష్ట్రం పేరు మార్చాలని సూచన; ఆంధ్ర ప్రభ, 1956 మార్చి 23, పేజీ 1.)
ఆ ఏర్పడే కొత్త పేరు విశాలాంధ్ర/విశాలాంధ్రం అయితే బాగానే ఉండేది.
నిజానికి, తెలుగువారు రాజకీయంగా ఐక్యత సాధించాలన్న ఉద్యమానికి పెట్టిన పేరు "విశాలాంధ్ర ఉద్యమం". 1949లో విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడినా, ఆ తర్వాత దాశరధి కృష్ణమాచార్యులు మహాంధ్రోదయము కావ్యంలో పలుమార్లు ఉటంకించినా, తెలుగునాట కమ్యూనిస్టులు పరితపించినా దాని పేరు "విశాలాంధ్ర" లేక "విశాలాంధ్రము". పార్టీకి ఆ పదంతో అంత అనుబంధం ఉండబట్టే కమ్యూనిస్టు పత్రిక, ప్రచురణ సంస్థ, పుస్తక విక్రయ కేంద్రాలూ - అన్నీ "విశాలాంధ్ర" పేరుతో ఏర్పడ్డాయి. ఈ పదాన్ని కమ్యునిస్టులు బాగా వాడడంతో క్రెడిట్ వారికి పోతుందని విడిచిపెట్టారో ఏమో తెలియదు. కానీ, సంకుచితంగా పార్టీ దృక్పథంతో ఆలోచించకుండా ఉంటే విశాలాంధ్ర అన్నది మంచి పేరు, ఆంధ్ర ప్రదేశ్ కన్నా మంచి పేరు.
1956 ఫిబ్రవరి నెల వరకూ తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఏర్పడాలని ప్రతిపాదిస్తున్న రాష్ట్రాన్ని విశాలాంధ్ర అని ఎన్నో మార్లు పత్రికల్లో ప్రస్తావన కనిపిస్తుంది. ఉదాహరణకు 1956 ఫిబ్రవరి 19-25 ఆంధ్ర పత్రిక మొదటిపేజీలో విశాలాంధ్ర పదం ప్రస్తావనతో తయారు చేసిన బొమ్మ ఈ కింద చూడండి
మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు? అన్న ప్రశ్నకు నేను గతంలో కోరాలో రాసిన సమాధానం:
మహాత్మా గాంధీ నోబెల్ శాంతి బహుమతి వరకూ చూస్తే బహుమతి అందుకోని పురస్కృతుడు. ఈ మాట నోబెల్ బహుమతి అధికారిక వెబ్సైట్లోని ఒక వ్యాసంలోనే వాడారు. 1948లో ఆయనకు బహుమతి ఇవ్వలేకపోవడంతో "జీవించి ఉన్న అర్హులు ఎవరూ లేరు" అన్న కారణాన్ని కోట్ చేస్తూ ఆ ఏడాది బహుమతి ఎవరికీ ఇవ్వలేదు. ఇలా నోబెల్ బహుమతి చరిత్రలో అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడూ జరగలేదు. (పలుమార్లు చారిత్రక పరిస్థితుల వల్ల బహుమతి ఇవ్వకపోయినా ఇలాంటి కారణంతో రద్దుచేయడం జరగలేదు) పాక్షికంగా గాంధీ స్మృతి కోసం అని ప్రకటించి మారీ దలైలామాకు బహుమతినిచ్చారు.
ఇలా బహుమతి ఇవ్వలేకపోవడమూ, ఆయనను అలా గౌరవించడమూ గాంధీ పరంగా పెద్ద విశేషంగా కన్నా, అసలు నోబెల్ బహుమతి అన్న ఓ తూర్పు ఐరోపా కేంద్రంగా నడిచే పురస్కారం ప్రపంచ దృక్పథాన్ని అలవరుచుకునే ప్రయత్నాల్లో తొలి చిన్న అడుగుగా అధ్యయనం చేయాలని నా అభిప్రాయం.
ఇది అర్థం చేసుకోవాలంటే నోబెల్ శాంతి బహుమతి పరిమితులు గమనించాలి. ఇది పాశ్చాత్య దేశాలు కేంద్రంగా నడిచే పురస్కారం. ఈరోజు సంగతి అటుంచండి, 1936-48 మధ్యకాలం చూస్తే ఇది మరింత సుస్పష్టంగా ఉంటుంది. 1948 వరకూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నవారిలో ఐరోపా, అమెరికాలు దాటి ఎవరూ లేరు. అందునా దక్షిణ అమెరికాకు చెందిన ఒకే ఒక వ్యక్తి - కార్లోస్ సావెద్రా దామాస్ అన్న ఒక అర్జెంటీనా రాజకీయవేత్త.[1]
ఒక ఆసియా రాజకీయవేత్తకు పురస్కారం ప్రకటించడమన్నది వాళ్లకు 1973లో లే డక్ థో (Lê Đức Thọ)కు ఇచ్చేవరకూ సాధ్యం కాలేదు. ఇదైనా అమెరికా-వియత్నామ్ యుద్ధంలో సీజ్-ఫైర్ జరిగి, అమెరికన్ ట్రూపులు వెనక్కు వెళ్ళేందుకు, తద్వారా శాంతి ఏర్పడేందుకు ఉద్దేశించిన ప్యారిస్ అగ్రిమెంటులో ఇరుపక్షాల నేతలుగా హెన్రీ కిసింజర్, లే డక్ థోలకు బహుమతి ప్రకటించారు. ఈ గౌరవాన్ని థో తిరస్కరించాడు. దానికి "ఇంకా శాంతి ఏర్పడలేదు" అని సమాధానమిచ్చాడు. అప్పటికి అమెరికన్ అధ్యక్షుడైన కిసింజర్ పురస్కారం ఆమోదించాడు. కానీ, కార్యక్రమానికి హాజరు కాలేదు, వచ్చిన డబ్బును ఛారిటీకి ఇచ్చేశాడు, ఒక సందర్భంలో మెడల్ వెనక్కి ఇచ్చేస్తానని కూడా ఆఫర్ చేశాడు. ఈ యుద్ధం అమెరికన్ రాజకీయలతో చాలా తీవ్రంగా ముడిపడిన యుద్ధం. దీని ముగింపు సందర్భంగా బహుమతిని అమెరికన్ రాజకీయవేత్తతో కలిపి ఇవ్వడంతో తొలి ఆసియన్ కి ఈ పురస్కారం ఇవ్వడమూ, ఆ వ్యక్తి దీనిని తిరస్కరించడమూ చాలు 1973 నాటికి సైతం ఈ ప్రైజ్ కు సరైన అంతర్జాతీయ దృక్పథం లేదనడానికి.
1973లో పరిస్థితి ఇదీ అంటే 1936-48 ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోగలరు అనుకుంటున్నాను. ఇప్పుడు తిరిగి గాంధీ నామినేషన్ల విషయానికి వెళ్దాం. 1/n
1937-1939
1937లో మొట్టమొదట మహాత్మా గాంధీని నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. నామినేట్ చేసినది "ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా" అన్న ఐరోపా-అమెరికా సంస్థ తరఫున Ole Colbjornsen అన్న నార్వేజియన్ రాజకీయవేత్త.[2] ఈ సంస్థ గాంధీ-అనుకూలురైన అంతర్జాతీయ రాజకీయవేత్తలది. ఆ ఏడాది మహాత్మా గాంధీని నోబెల్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. (షార్ట్ లిస్ట్ కావడం అన్నది పెద్ద విషయం. ఎందుకంటే నామినేషన్ అన్నది ఎవరినైనా చేయవచ్చు, అలా ఆడాల్ఫ్ హిట్లర్ కూడా ఒకసారి నామినేట్ అయ్యాడు. షార్ట్ లిస్ట్ చేస్తే ప్రాబబుల్ కాండిడేట్స్ కింద లెక్క.)
జాకబ్ వార్మ్ మూలర్ (Jacob Worm-Müller) అన్న నార్వేజియన్ చరిత్రకారుడు, రాజకీయవేత్త నోబెల్ కమిటీ సలహాదారుగా గాంధీ గురించి పరిశీలించి రిపోర్ట్ రాశాడు. ఈయన రాసిన రిపోర్ట్ గాంధీ పట్ల విమర్శనాత్మకంగా ఉంది. ఆయన విమర్శించిన అంశాల్లో గాంధీ శాంతికాముకత, యుద్ధ వ్యతిరేకత అన్నివేళలా ఒకలా లేదన్నది ఒకటి (మొదటి ప్రపంచ యుద్ధానికి, బోయర్ యుద్ధానికి వాలంటీర్లను వెతికాడు గాంధీ). అది అలా ఉంచితే, గాంధీ ప్రారంభించిన పలు అహింసాత్మక ఉద్యమాలు హింసలోకి జారిపోయాయి అని రాశాడు. (శాసనోల్లంఘన తర్వాత చౌరీచౌరా జరగడం) ఇది చాలా అన్యాయమైన మాట. గాంధీ వాటిని ఉద్దేశించకపోవడం అలా ఉంచి అవి జరిగినందుకు ఏకంగా మహోధృతమైన పోరాటాలనే నిలుపుదల చేశాడు. గాంధీ రాజకీయ విధానాల్లో విపరీతమైన మార్పుచేర్పులు, నిలకడ లేమి ఉంటుందనీ వాటిని సన్నిహితులు కూడా వివరించలేరనీ, ఒకేసారి అతనొక స్వాతంత్ర్య సమర యోధునిగానూ, డిక్టేటర్ గానూ కూడా ఉన్నాడని రాశాడు. ఇవి గాంధీ పట్ల సుదీర్ఘకాలం నుంచీ ఉన్న విమర్శలే, కొంతమేరకు వాస్తవాలే. దక్షిణాఫ్రికాలో గాంధీ కేవలం భారతీయుల కోసమే పోరాడాడు తప్ప నల్లవారిని పట్టించుకోలేదనీ, ఆయనకు ఉన్నది భారతీయ దృక్పథమేననీ అంతర్జాతీయ దృక్కోణం కాదనీ కూడా రాశారు.
మొత్తానికి ఆ సంవత్సరం రాబర్ట్ సిసిల్ అన్న బ్రిటీష్ రాజకీయవేత్తకు లీగ్ ఆఫ్ నేషన్స్ నెలకొల్పి ఐరోపాలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేసినందుకు లభించింది. తర్వాత 1938, 1939ల్లో కూడా Ole Colbjornsen గాంధీ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు కానీ వారు షార్ట్ లిస్ట్ కూడా చేయలేదు. ఆపైన రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, బహుమతుల ప్రక్రియ ఆగిపోయింది.
1947
1944లో యుద్ధం ముగింపుకు వస్తూండగా తిరిగి బహుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. 1947లో తిరిగి మహాత్మా గాంధీ పేరును నామినేట్ చేశారు. ఈసారి భారతదేశం నుంచి కాంగ్రెస్ నాయకులు గోవింద్ బల్లభ్ పంత్,[3] బి.జి.ఖేర్,[4] మావలంకర్,[5] టెలిగ్రామ్ ద్వారా విడివిడిగా గాంధీని నామినేట్ చేశారు. ఆ ఏడాది 20 మంది నామినేట్ కాగా వారిలో ఆరుగురిని షార్ట్ లిస్ట్ చేశారు.[6] మహాత్మాగాంధీ షార్ట్ లిస్టులో ఉన్నారు.
ఈసారి నోబెల్ కమిటీకి సలహాదారుగా పనిచేస్తున్న Jens Arup Seip అన్న నార్వేజియన్ చరిత్రకారుడు గాంధీ గురించిన నివేదిక రాశాడు. ఇది ప్రధానంగా 1937-47 గాంధీ వ్యవహరించిన తీరు గురించిన నివేదిక. దీనిలో - భారత జాతీయ కాంగ్రెస్ ఎదుర్కొన్న మూడు ముఖ్యమైన అంశాలు ఐన బ్రిటీష్-భారతీయుల నడుమ పోరాటం, భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో చేరాలా వద్దా అన్న ప్రశ్న, హిందూ-ముస్లింల సమస్య - మూడిటిలోనూ గాంధీ నిలకడగా అహింసపైనే నిలబడుతూ వచ్చారని రాశారు.
మొత్తంగా ఈ నివేదిక పదేళ్ళ క్రిందటి నివేదికకు భిన్నంగా సానుకూలమైనది. కమిటీలో ఇద్దరు గాంధీని గట్టిగా సమర్థించారు. నోబెల్ కమిటీ పరిశీలిస్తున్న సమయానికి Reuters సంస్థ ద టైమ్స్ కి పంపిన టెలిగ్రామ్ ఆధారంగా రాసిన "Mr. Gandhi on ‘war’ with Pakistan" అన్న వార్త వచ్చింది. ఇది అసంపూర్తి వార్త అనీ, తాను సుస్పష్టంగా "యుద్ధం విషయంలో మనసు మార్చుకోలేదనీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వంటి సైనిక శక్తులు ఉండడం తప్పనిసరి ఐన తావులో తనకు చోటులేదనీ" చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు.
అయితే, నోబెల్ కమిటీలోని మిగిలినవారు ఈ విషయంలో సందేహంలో పడ్డారు. ఒకపక్క భారత పాకిస్తాన్లు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక దేశానికి ఎక్కువ సన్నిహితుడైన వ్యక్తికి తాము బహుమతి ఇవ్వడం ఏ రాజకీయ ప్రభావం చూపుతుందోనన్నారు. తద్వారా ముగ్గురు వ్యతిరేకించడంతో గాంధీకి రాలేదు. అదికాక, గాంధీ కేవలం శాంతిదూత మాత్రమే కాదనీ, ఆయన ఒక గొప్ప దేశభక్తుడనీ (అదొక నిందలాగా) కూడా భావించి పురస్కారం ఇవ్వలేదు.
ఇదంతా ఇలా ఉంచితే, అసలు స్వాతంత్ర సమరం వంటివి చేసిన నాయకులకు బహుమతి ఇవ్వడం పట్ల వారికున్న సందేహాలు కూడా ప్రభావం చూపాయి. క్వాకర్స్ అన్న సంస్థకు బహుమతి ఇచ్చారు.[7]
ఎస్వీఆర్ మెథడ్ యాక్టర్ అని అంటూ ఉంటారు మనవాళ్ళు. అదే కాదు, ఎవరినైనా మెచ్చుకోవాలంటే "మెథడ్ యాక్టర్" అనడం అలవాటైంది కూడాను. మెథడ్ యాక్టింగ్ నటనలో ఆఖరి మెట్టా? దీన్ని మించిన ధోరణి లేదా? ఎస్వీఆర్ నిజంగానే మెథడ్ యాక్టర్ఆ? కాకుంటే ఇంకెవరైనా ఉన్నారా? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ తీగ.
బిచ్చగాడిలా నటించాల్సి వస్తే బిచ్చగాళ్ళతో కొన్నాళ్ళు స్నేహం చేసి రావడం, మానసిక రోగిగా నటించాల్సి వస్తే కొన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో నివాసం ఉండడం, అడవి మనిషి వేషం వేయాలంటే పచ్చి మాంసాన్ని తినడం - ఇలాంటి పద్ధతులను మెథడ్ యాక్టింగ్ అని భావిస్తోందట హాలీవుడ్ ఈనాడు.
ఇప్పుడు నేను చెప్పినవి extreme ఉదాహరణలు, ఈ ఉదాహరణలేమీ ఊహించి చెప్పలేదు, అచ్చంగా ఇవి చేసినవాళ్ళు ఉన్నారు హాలీవుడ్లో. ఇంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా ఇలాంటి పద్ధతులే సరైన నటనకు మార్గమని నమ్మి వాటిని తన సినిమా నటనలో ప్రవేశపెట్టిన తెలుగు సినిమా నటుడు నాకు తెలిసి ఎన్టీ రామారావు ఒక్కడే.
ఆదిపురుష్ లో పురాణ పాత్రల్ని చూపిన విధానంపై విమర్శలను "కొత్తదనం", "కొత్తతరానికి రామాయణాన్ని పరిచయం" వంటివాటితో కొట్టాలని కొందరు చూస్తున్నారు. ఈ సందర్భంలో ఏనాడో తిలక్ రాసిన ఒక కవిత గుర్తొచ్చింది. ఆ కవిత ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది.
కవితలోని ఈ పదాలను ఇలా మార్చుకుని చదివి చూడండి:
కవిత -->> సినిమా,
రాయడం -->> తీయడం
కవి -->> దర్శకుడు
పాఠకుడు -->> ప్రేక్షకుడు
----------------------------------------
"కవిత - నవత"
"మిత్రమా!
కవిత ఉన్నప్పుడే నవత రాణిస్తుంది
అసలు కవితలోనే నవతకూడా ఉంది
కాని,
మోడరన్గా ఉందామనీ, ఏదో అందామనీ,
తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని
అర్థంలేని ఇమేజరీతో కలగాపులగపు వర్ణనలతో
డిలాన్ థామస్కు చేతగాని అనుకరణలతో
ఒక దేశం నిర్దేశంలేని వాక్యాల వికారంతో
ఎందుకు బాధిస్తావు నన్ను..?
బాధపడతావు నువ్వు!
#నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. చాలమందిమి ఎంతో సంతోషించాం. ఐతే, కొందరు ఈ పాట అంత గొప్ప పాటా?ఈ అవార్డు వచ్చే అర్హత ఉందా అన్న ప్రశ్న వేశారు. సంతోషించిన కొందరి మనసుల్లో ఎక్కడో ఉండి ఉండొచ్చునని నా గమనిక. అందుకే ఈ థ్రెడ్. @ssrajamouli@mmkeeravaani@kanchi5497
సినిమా పాటల గురించి, వాటి గొప్పదనం మనకు ఏళ్ళ తరబడి ఉన్న ఆలోచనలను ఈ పాటకు పురస్కారం రావడం సవాలు చేస్తుంది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి కొత్త చూపు అవసరం.
మొదట - ఈ పాట ప్రత్యేకత ఏమిటో చెప్పుకుందాం.
తర్వాత - ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ఎంతవరకూ సబబు అన్నదీ చూద్దాం.
"నాటు నాటు" పాట ఒక స్థాయిలో చూస్తే "శివ శంకరీ" (జగదేకవీరుని కథ - 1961), "తకిట తథిమి" (సాగర సంగమం - 1983) వంటివాటికి సరి సమానమైనది. ముఖ్యంగా ఈ పోలిక దర్శకుల ఇమేజినేషన్, ఎగ్జిక్యూషన్, అవి ప్రేక్షకుల్లో కలిగించే స్పందన అన్న అంశాల్లో ఒప్పుతుంది.