ప్రతిభకు, పట్టుదలకు, సృజనాత్మకతను వైకల్యమేమీ అడ్డుకాదని నిరూపిస్తున్నారు దివ్యాంగులు. నిజానికి నూటికి నూరు పాళ్లూ ఇది నిజం. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న కొందరు చేయలేని పనులను కూడా అవయవాలు సరిగా లేని వాళ్లు అవలీలగా చేసి చూపిస్తున్నారు.
నిజానికి తాము వికలాంగులమన్న భావన తమకు ఇసుమంతైనా లేదంటున్నారు వారు. వాస్తవానికి అది వారి భావన కాదు.. ఆత్మవిశ్వాసం. నేటి సమాజంలో వికలాంగులు సాధారణ వికలాంగులేమీ కాదు.. విభిన్న ప్రతిభావంతులు కూడా.. #InternationalDayofPersonsWithDisability
డిసెంబర్ 3. ప్రపంచ వికలాంగుల దినోత్సవం.
1976లో నేషనల్ జనరల్ అసెంబ్లీ.. వికలాంగుల దినోత్సవం జరుపుకునేందుకు నిర్ణయించింది. ఆనాడు ఒక వికలాంగ మిత్రుడు అందరితో సమానంగా వికలాంగులకు హక్కులు కల్పించాలని వారి దృష్టికి తేవడంతో వారు వికలాంగుల సమస్యల గుర్తించి వికలాంగుల దినోత్సవం జరిపేందుకు నిర్ణయించారు.
అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 3న వికలాంగుల దినోత్సవం జరుగుతోంది. వికలాంగులుగా ఉన్న వారిని దివ్యాంగులకుగా పిలవాలని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని నాడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
విభిన్న ప్రతిభా వంతులు..
వైకల్యం ఉన్న వారందరూ వికలాంగులు కాదు..
విభిన్న ప్రతిభావంతులు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సకలాంగులతో సమానంగా వారు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే సాధిస్తున్నారు....
నా కలం...,. ఎన్నెన్నో ప్రపంచ దినోత్సవాలకు.
అద్భుత అక్షరపద మాలలను అల్లింది...,
మాతృమూర్తి పండుగ నాడు అమ్మప్రేమను
అపురూపంగా పంచింది..,
కార్మిక దినోత్సవాన్ని ఏకంగా ఎర్రటి సిరాలో
అద్ది పిడికిలి బిగించి వ్రాసింది ....,.
వివిధ మీడియాలో ఎన్నింటికో శుభాకాంక్షలు తెలుపుతూ దినమంతా చిందులేసింది...,
కానీ నేడు డిసెంబర్ 3న ఎప్పటిలాగే నా కాలానికి..
వికలత్వం సోకింది....,
"ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం" అన్న
వూసే లేకుండా .. అక్షరమే నేర్వని నిరక్షరాసిగా తీవ్రవికలత్యంతో మూల కూర్చుంది...,
" వికలాంగులకు శుభాకాంక్షలు " రాయడానికి నామోసిగా తలుస్తూ... తలవంచుకింది!!
కవితా సేకరణ:- వియస్సార్ పాముగారి అనంతపురం.
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#DiceDay#Dice 🎲
పాచికలు🎲 చిన్నవి, విసిరివేయగల వస్తువులు, ప్రత్యేకంగా గుర్తించబడిన భుజాలతో బహుళ స్థానాల్లో విశ్రాంతి తీసుకోబడతాయి. అవి యాదృచ్ఛిక సంఖ్యలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయి మరియు సాధారణంగా వైకుంఠపాలిళి ఆటలలో ఉపయోగిస్తారు.
సాంప్రదాయిక డై అనేది ఒక క్యూబ్ , దాని ఆరు ముఖాలలో ఒకటి నుండి ఆరు వరకు వేరే సంఖ్యలో చుక్కలు ( పిప్స్ ) తో గుర్తించబడతాయి.
విసిరినప్పుడు లేదా చుట్టబడినప్పుడు, డై దాని ఎగువ ఉపరితలంపై ఒకటి నుండి ఆరు వరకు యాదృచ్ఛిక పూర్ణాంకాన్ని చూపిస్తుంది, ప్రతి విలువ సమానంగా ఉంటుంది. పాచికలు పాలిహెడ్రల్ లేదా సక్రమంగా లేని ఆకృతులను కలిగి ఉండవచ్చు మరియు పిప్లకు బదులుగా సంఖ్యలు లేదా చిహ్నాలతో గుర్తించబడిన
వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. నేడు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా #WorldwildlifeConservationDay
మృగాల వల్లే మానవ మనుగడ....
క్రూర మృగాలు లేకపోతే మానవ మనుగడే లేదనడం అతిశయోక్తి కాదు. #Wildlife
వన్యప్రాణులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవనం కొనసాగిస్తాయి. వన్య ప్రాణుల సంఖ్య భూమి మీద విపరీతంగా పెరిగి వినాశనం చోటు చేసుకోకుండా క్రూర మృగాలు వన్య ప్రాణులను వేటాడుతూ పర్యావరణాన్ని సమతూకంలో ఉంచుతాయి. క్రూరమృగాలు తమ జాతి సంతతి పెరగకుండా కూడా తమవంతుగా ముందస్తు చర్యలు తీసుకుంటాయి.
తమ చుట్టు ఉన్నవాటితో సంపర్కం కొనసాగించకుండా సుదీర్ఘ ప్రాంతంలోనున్న క్రూర మృగాలతో సంపర్కం కొనసాగించి మళ్లీ తమ యథాస్థానానికి వచ్చేస్తాయి. ఒక పులి సంవత్సరానికి 52 నుంచి 60 వన్య ప్రాణులను చంపి ఆహారంగా తీసుకుంటుంది. రోజుకు పులి 7 నుంచి 8 కిలోల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది.
"చీతా" (చిరుత) అనే పదాన్ని హిందీలో चीता cītā పదం మీదగా, citrakāyaḥ అనే సంస్కృత పదం నుంచి సేకరించారు, దీనికి "రంగురంగుల శరీరం" అనే అర్థం వస్తుంది.
ఏసినోనైక్స్ అనే ప్రజాతి పేరుకు గ్రీకు భాషలో "వెనక్కుతీసుకోలేని పంజా" అనే అర్థం ఉంది, #InternationalCheetahDay #Cheetah#Chita
జాతి పేరు జుబాటస్కు లాటిన్లో "జూలు కలిగిన" అనే అర్థం వస్తుంది, చీతా పిల్లలకు కనిపించే జూలుకు ఇది ఒక సూచన. #InternationalCheetahDay 🐆🐅
చీతా ను (ఏసినోనైక్స్ జుబాటస్ ) పిల్లి కుటుంబంలో (ఫెలిడే) ఒక విలక్షణమైన వర్గంగా పరిగణిస్తారు, వేగంతో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగివున్న ఈ జాతికి,
చెట్లు ఎక్కే సామర్థ్యం ఉండదు. ఏసినోనైక్స్ ప్రజాతిలో ఇప్పటికీ ఉనికిపట్టు కలిగివున్న జీవజాతి ఇదొక్కటే కావడం గమనార్హం. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా చీతా గుర్తింపు పొందింది, దీని యొక్క గరిష్ఠ వేగాలు 112 and 120 km/h (70 and 75 mph) మధ్య ఉంటాయి, అయితే
#Ghantasala దేశభక్తిని రగిలించాలన్నా.. జానపదాలతో ఉర్రూతలు ఊగించాలన్నా..ప్రేమగా పాడుకోవాలన్నా..దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా... తెలుగు పద్యాలను అలవోకగా ఆలపించాలన్నా ఆయన గొంతే కేరాఫ్. గానగాంధర్వుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయనే ఘంటశాల వెంకటేశ్వరరావు.. ఈయన మన వాసి కావడం మనకే
గర్వకారణం.. ఈ రోజు ఆయన జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుదాం....🎵🎶👨🎤📻🎙️
ఘంటశాల వెంకటేశ్వరరావు 1922 డిశంబర్ 4న గుడివాడ మండలం చౌటపల్లిలో ఘంటశాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుండే భజనలు, కీర్తనలు తండ్రి వెంట పాడుతూ ఉండేవారు.
తండ్రి ఆశయం నెరవేర్చాలనే లక్ష్యంతో సంగీత గురుకులంలో చేరారు. అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక తిరిగి సొంత ఊరికి వచ్చేశారు. తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పని ఒత్తిడి పెరగడంతో ఆయన సంగీత కళాశాలలో చేరాలని అనుకున్నారు.
భారత దేశములో నౌకాదళ దినోత్సవం(అంగ్లం: Navy Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు.దేశానికి నౌకా దళాల విజయాలు మరియు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం మరియు భారతదేశ రాష్ట్రపతి #IndianNavyDay
నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు.
17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి , ఛత్రపతి శివాజీ భోంస్లే
"భారత నావికా పితామహుడి" గా భావిస్తారు.
భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో మరియు ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో
ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు.ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది,
#GeetaJayanti#BhagavadGita
గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. #GeetaDay#GeetaJayanti 📖🚩
ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో
శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.
కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో