#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల
సీనియర్ గా పిలవబడే #సముద్రాల_రాఘవాచార్యులు కాగా సుస్వరాలని అందించింది #సుసర్ల_దక్షిణామూర్తి,

ఈ సినిమాకి సాంకేతిక వర్గమంతా కలిపి ఒక స్థంభమైతే, అర్జునుడిగానూ, బృహన్నలగానూ నటించిన #ఎన్టీఆర్, సైరంద్రి పాత్రలో #సావిత్రి, కీచకుడిగా కనిపించిన #ఎస్వీరంగారావు మిగిలిన మూడు స్థంభాలూ
అనడానికి సందేహం లేదు.

కథ కొత్తదేమీ కాదు. అనాది కాలం నుంచీ, నిన్న మొన్నటివరకూ - అంటే కేబుల్ టీవీలో ప్రవేశించనంత వరకూ - వర్షాల కోసం పల్లెటూళ్ళ చెరువుగట్ల మీద భక్తితో చదివించిన #విరాటపర్వమే. మహాభారత కథ. అరణ్య వాసం పూర్తి చేసుకున్న పాండవులు ఒక ఏడాది అజ్ఞాత వాసం పూర్తి చేయడం కోసం
#విరాటరాజు కొలువులో మారువేషాల్లో చేరడం, గడువు పూర్తయ్యాక #ఉత్తర_గోగ్రహణంలో #కౌరవులపై విజయం సాధించి హస్తినకి తిరిగి వెళ్ళడం.

సినిమా ప్రారంభమే ఇంద్రసభకి అతిధిగా వెళ్ళిన అర్జునుడికి స్వాగతం పలుకుతూ ఆస్థాన నర్తకి #ఊర్వశి ' నరవరా..' పాట పాడుతూ చేసే మెరుపు నృత్యంతో.
అటుపై ఉర్వశి అర్జునుడిపై మనసు పడడం, మాతృ సమానురాలవంటూ అర్జునుడామెని తిరస్కరించడం, అవమానభారంతో ఉర్వశి పీడిగా జీవించమని #అర్జునుడికి శాపం ఇవ్వడం, ఇంతలో అక్కడికి వచ్చిన #ఇంద్రుడు ఆ శాపాన్ని అజ్ఞాతవాస కాలంలో వరంగా మార్చుకొమ్మని అర్జునుడికి సలహా ఇవ్వడం చకచకా సాగిపోతాయి.
#ధర్మరాజు #విరాటరాజు సలహాదారుగానూ, #భీముడు వంటవాడుగానూ, #నకుల #సహదేవులు గుర్రాల శాల, గోశాలల్లోనూ పనులకి కుదరగా, #ద్రౌపది అంత:పురంలో పూలమాలలల్లే #సైరంద్రిగా చేరుతుంది.

రాకుమారి #ఉత్తరకి నాట్యం నేర్చే గురువుగా #బృహన్నల అవతారం ఎత్తుతాడు అర్జునుడు. ఓపక్క పాండవుల అజ్ఞాతవాసాన్ని
భగ్నం చేసేందుకు కౌరవులు చేసే కుటిల యత్నాలు, వాటిని తిప్పి కొడుతూనే అజ్ఞాతంలో వచ్చే సమస్యలని #పాండవులు ఎదుర్కొంటూ ఉండగా ప్రవేశిస్తాడు #కీచకుడు, మహారాణి #సుధేష్ణ సోదరుడు. అత్యంత శక్తివంతుడు. తొలిచూపులోనే సైరంద్రిని మోహిస్తాడు. అంతే కాదు, సైరంద్రిని తన బసకి పంపకపోతే రాజ్యం
సర్వ నాశనం చేస్తానని సుధేష్ణని బెదిరిస్తాడు కూడా. మరోపక్క తన తండ్రులని వెతుకుతూ వచ్చిన అర్జునకుమారుడు #అభిమన్యుడు #ఉత్తరతో ప్రేమలో పడిపోతాడు. భీముడి చేతిలో కీచకుడు మరణించడం, ఇంతలోనే #సుశర్మ, #కౌరవులు దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకి పాల్పడడం, పాండవుల అజ్ఞాతవాసం ముగియరావడం దాదాపు
ఒకేసారి జరుగుతాయి. యుద్ధం గెలిచి, విరాటరాజుకు తమ నిజరూప దర్శనం ఇచ్చి, #ఉత్తరాభిమన్యుల పెళ్ళి జరిపించడంతో 'శుభం' కార్డు పడుతుంది సినిమాకి.

తెలిసిన కథే అయినా, ఎన్ని సార్లు చూసినా, ఎప్పుడూ ఎక్కడా విసుగు రాకపోడానికి కారణం బలమైన స్కీన్ ప్లే, సంభాషణలు, నటీనటుల నటన
మరియు నిర్మాణ విలువలు. చిన్న చిన్న సంభాషణల ద్వారా జీవిత సత్యాలెన్నింటినో పలికించడం సముద్రాల వారికి పెన్నుతో పెట్టిన విద్య. ముందే చెప్పినట్టుగా ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి నువ్వా-నేనా అన్నట్టుగా నటించారు. ఎక్కడా 'అతి' పోకడలు కనిపించవు. ఆవిధంగా నటన రాబట్టుకున్న ఘనత
దర్శకుడు #కమలాకర_కామేశ్వరరావుదే.

మరీ ముఖ్యంగా ఎస్వీఆర్-సావిత్రి కాంబినేషన్ సన్నివేశాల్లో క్లిష్ట సమాసాలతో నిండిన డైలాగుల్ని ఎస్వీఆర్ #సమోసాలు తిన్నంత సులువుగా చెప్పేస్తుంటే, సావిత్రి కాబట్టి పోటీగా నిలబడింది అనిపించక మానదు.

జకార్తాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో
ఉత్తమనటుడు అవార్డు అందుకున్నారు ఎస్వీఆర్.

సైరంద్రికి పెద్దగా డైలాగులు లేవు. సావిత్రిని ఆ పాత్రకి అనుకున్నాక, ఇక డైలాగులు అనవసరం అనుకుని ఉంటారు. "ప్రభువుల వెంటే నేనూ" అని చెప్పేటప్పుడు ఆత్మాభిమానం, అర్జునుడిని బృహన్నలగా చూసినప్పుడు ఆశ్చర్యం, "జననీ శివ కామినీ" అని పాడేటప్పుడు ఆరి,
కీచకుడి చేతిలో అవమానానికి గురైనప్పుడు ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ కనుపాప కదలికలతో అభినయించింది సావిత్రి, బృహన్నల పాత్ర మీద ఏ ఇతర పాత్రల ప్రభావాన్నీ పడనివ్వలేదు #ఎన్టీఆర్. కేవలం ఈ పాత్ర పోషణ కోసమే శాస్త్రీయనృత్యాన్ని నేర్చుకున్న కమిట్మెంట్ ని అభినందించి తీరాలి. అభిమన్యుడిగా శోభన్ బాబు,
కృష్ణుడిగా కాంతారావు చిన్న పాత్రల్లో మెరిశారు. శోభన్ లో కనిపించే కొద్దిపాటి బెరుకుని సులువుగానే పట్టుకోవచ్చు.

దాదాపు అన్ని పాటలూ ఇవాల్టికీ జనం నాలుకల మీద ఆడేవే కావడం 'నర్తనశాల' కి సంబంధించిన మరో విశేషం. 'నరవరా..' వినగానే జానకి గుర్తొచ్చి తీరుతుంది. ఈ సినిమా పేరు చెప్పగానే
అప్రయత్నంగానే గుర్తొచ్చేసే పాట 'సలలిత రాగ సుధారస సారం..' #మంగళంపల్లి వారిచేత పాడించడం సరైన ఎంపిక.

'జననీ శివకామినీ... 'సఖియా వివరింపవే..' 'దరికి రాబోకు రాజా' ఈ మూడూ #సుశీల మార్కు పాటలు. దేనికదే ప్రత్యేకం.
ఇక డ్యూయెట్ ఎలా ఉండాలో చెప్పే పాట "ఎవ్వరికోసం ఈ మందహాసం.." ఉత్తరకుమారుడిని హాస్యానికి వాడుకున్నారు. '#మాయాబజార్' ఛాయలు పడని విధంగా ఈ పాత్రని పోషించారు రేలంగి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాల్లో రేలంగి నటన మర్చిపోలేం.

భీముడిగా నటించిన #దండమూడి_రాజగోపాల్
నిజజీవితంలోనూ మల్లయోదుడే! #ధూళిపాల దుర్యోధనుడు కాగా, #కైకాల దుశ్శాసనుడు, #ప్రభాకర_రెడ్డి కర్ణుడు. వీళ్ళందరివీ అతిధి పాత్రలే. 1964 సంవత్సరానికి గానూ జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుని అందుకున్న 'నర్తనశాల' ని రంగుల్లోకి మారుస్తారన్న వార్తలు వచ్చాయి.
రంగుల 'మాయాబజార్' విడుదలైన సమయంలో. ఇప్పటివరకూ అందుకు సంబంధించిన వివరాలేవీ లేవు.

స్కీన్ ప్లే, మాటలు, సంగీతం, మరీ ముఖ్యంగా నటన ఎలా ఉండాలో చెప్పే రిఫరెన్స్ సినిమాల్లో
ఒకటైన 'నర్తనశాల' ని మళ్ళీ చూసైనా, "ఫ్యాన్స్ ఒప్పుకోరు" లాంటి శషభిషలు విడిచిపెట్టి ఇప్పటి కథానాయకులు వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటే బాగుండును..

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with శివశంకర కలకొండ

శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @janakishivasha2

Oct 7
సీనియర్ #ఎన్టీఆర్, #నాగేశ్వరరావు మధ్య ఉన్న పోలికలు !

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగానే కాక స్నేహపూర్వకంగా మెలిగిన నటులుగా ఎన్టీఆర్, ఎన్నార్ లకు పేరుంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఎన్టీఆర్, ఎన్నార్ ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. Image
#ఎన్టీఆర్, #ఎన్నార్ స్నేహం గొప్పదనం గురించి ఇప్పటికీ చిత్రపరిశ్రమ అగ్ర రచయితలు, దర్శకులు కథలుకథలుగా చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్, ఎన్నార్ కలిసి 14 సినిమాల్లో నటించారు.

వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన తొలి సినిమా #పల్లెటూరి_పిల్ల కాగా చివరి సినిమా #సత్యం_శివం. ఈ 14 సినిమాలలో దాదాపు Image
అన్నిసినిమాలు అద్భుతమైన విజయాలే కావడం గమనార్హం.

సంవత్సరంలో విడుదలయ్యే మొత్తం చిత్రాల్లో దాదాపు సగం చిత్రాలు ఎన్టీఆర్, ఎన్నార్ లవే ఉండేవని, వాళ్లకు సినిమాల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్ల తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు. Image
Read 7 tweets
Oct 7
#జంతుబలులు

కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి..?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికనీ, మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది. Image
కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం.. దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా..?

#బలి_అంటే...

గుడిలోని బలి పీఠం సనాతన ధర్మంలో భూత బలి అనే ఆచారం Image
స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ, ఇతర పదార్థమును కానీ, #గుడిలో వివిధ దిక్కులలో కానీ #బలి_పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ, ప్రకృతి లోని ఉగ్ర భూతములూ తింటాయి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది. Image
Read 14 tweets
Oct 7
#నల్లీనది #పచ్చడి
- డా. జి.వి పూర్ణచందు గారు
ఆయుర్వేద వైద్య నిపుణులు..

"నల్లీనదీ సంయుక్తం
విచారఫలమేవచ
గోపత్నీ సమాయత్తం
గ్రామ చూర్ణంచ వ్యంజనం" (చాటువు)

ఇది తెనాలి రామకృష్ణ కవి రాసినది. ఇందులో ఓ గొప్ప వంటకం తయారీని అతి రహస్యంగా చెప్పారు. ఒక్కక్క పాదాన్నే జాగ్రత్తగా Image
అర్ధం చేసుకోవాలి:
1. ‘నల్లీ నదీ సంయుక్తం’ నల్లీనది అంటే నల్లి+ఏరు=నల్లేరుకాడలతో ఈ వంటకం తయారౌతోంది.
2. “విచారఫలమేవచ” విచార ఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు.
3. “గోపత్నీ సమాయత్తం” –గో+పత్ని అంటే, ఆవు+ఆలు=ఆవాలు.
4. “గ్రామచూర్ణం” అంటే ఊరుపిండి. రుబ్బిన పిండిని ఊరుపిండి, Image
ఊరుబిండి లేక ఊర్బిండి అంటారు.

ఈ మొత్తానికి భాష్యం ఏమంటే, లేతనల్లేరు కాడలు తీసుకుని, కోణాలు చెక్కేసి చింతపండు, ఆవపిండి కలిపి మెత్తగా రుబ్బితే అది నల్లేరు కాడలపచ్చడి అవుతుందని! తింటానికి ఇంకేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనకండి. నల్లేరుకాడలు, బూడిద గుమ్మడికాయలు, Image
Read 11 tweets
Oct 7
మన '#నటసార్వభౌమ_యస్వీరంగారావు' అలనాటి ఒక అపురూపమైన ఫోటోను మీకోసం...

వర్కింగ్ స్టిల్ ఫోటో: బంగారు కలలు (1974)

ప్రముఖ నవలా రచయిత్రి #యద్దనపూడి_సులోచనారాణి గారి 'బంగారు కలలు' నవలాధారంగా అదే పేరుతో అన్నపూర్ణ వారు #ఆదుర్తి_సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించారు. సంగీతం సారధ్యం
#సాలూరి_రాజేశ్వరరావు మాస్టారు గారు.

దయగల వాడైన గొప్ప వ్యక్తిత్వం పాత్రలో మన నాటి సింహం 'యస్వీరంగారావు' గారు పోషించారు. విధి వంచిత అయిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హిందీ నటి '#వహీదా_రెహమాన్' నటించారు. అందునా తొలిసారిగా యశస్వి #యస్వీఆర్ గారితో #వహీదా నటించారు.
1955 నాటి 'రోజులు మారాయి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కెరియర్ ప్రారంభించిన #వహీదా_రెహమాన్ అడపాదడపా 2-3 సినిమాలు తెలుగులోనే చేసింది. మొట్టమొదటి అవకాశం ఇచ్చింది తెలుగు పరిశ్రమే కావడం విశేషం.

#యస్వీఆర్ #వహీదా మధ్య ఎన్నో రసవంతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.
Read 5 tweets
Oct 7
విజయ్ సారథి వడ్డి గారి వ్యాసం

ఈ చిత్రంలో కనిపించుతున్న వ్యక్తి డాక్టర్ #కేశవరావ్_బలీరాం_హెడగేవారు. #రాష్ట్రీయస్వయంసేవకసంఘ (#RSS) స్థాపకులు. ఇప్పటికి 97 సంవత్సరాల క్రితం విజయదశమినాడు సంఘాన్ని ప్రారంభించారు. ఆయన సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా?

మనదేశం పరాయిపాలనలో ఉండటం
ఆయనకు చిన్ననాటినుండి భరించరానిదిగా ఉండేది. భారత సామ్రాజ్ఞి #విక్టోరియారాణి జన్మదినోత్సవం సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన లడ్డూను తినకుండా విసిరి కొట్టాడు. ఆ రాణి మరణానంతరం ఇంగ్లాండు రాజైన #ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లోని ఎంప్రెస్ మిల్లువారు తారాజువ్వలతో వెలుగుపూల
ప్రదర్శన ఏర్పరిచినదాన్ని పోయి చూద్దామని స్నేహితులు బలవంతపెట్టినా వెళ్లలేదు. ఆరువేల మైళ్ల దూరం నుండి కొన్నివేలమంది వ్యాపారం కోసంవచ్చి, ఇంతవిశాలమైన దేశాన్ని వశపరచుకొని, అధికారం చలాయించటమేమిటని మథనపడుతుండేవాడు.

ఆయన పెద్దవాడైన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఒక ప్రశ్న
Read 18 tweets
Oct 7
మన #ఎస్వీయార్ గారి ఆరాధ్య నటుడు #గోవిందరాజు_సుబ్బారావు గారు

తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యారు.

గోవిందరాజు సుబ్బారావు 1895
సంవత్సరంలో జన్మించారు. ఇతను మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించారు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి,
కొన్ని పరిశోధనలు నిర్వహించారు.

అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు.

అయితే గోవిందరాజు సుబ్బారావు నటునిగానే
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(