#అట్లతద్దె
ఇవాళ  అట్లతద్దె /చంద్రోదయ ఉమా వ్రతం 13-10-2022.
ఆశ్వీయుజ బహుళ తదియ నాడు ఈ పండగ జరుపుకుంటాం.ఇది కూడా ఉండ్రాళ్ళతద్దె లాగానే ఉంటుంది దాదాపు. నివేదన,వాయనదానాల్లో అట్లు(దోసెలు కాదు😃)ఇస్తారు.

ఈ నోము ఆడపిల్లలు(పెళ్లి కాని వారూ, పెళ్ళైన వారు)నోచుకుని 3,5,7 ఇలా బేసి సంఖ్య గల
ఏడాది ఉద్యాపన చెయ్యాలి.
ముందు రోజు సాయంత్రం గోరింటాకు రుబ్బి చేతులకి,కాళ్ళకి పెట్టుకోవాలి.
ఒక వెడల్పాటి ప్లేటులో  గోరింటాకు ముద్ద వేసి నీళ్లు కలిపి రెండు పాదాలు సగం వరకు  దాన్లో మునిగేలా ఉంచి,
కొంత సేపు అయ్యాక తీస్తే చక్కగా పాదాలు,వేళ్ళు,అరికాలు మొత్తం పండుతుంది ఎర్రగా...
వీటినే "సిరిపాదాలు"/"లక్ష్మీ పాదాలు" అంటారు.ఈ మాసం కూడా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి,గోరింటాకు పెట్టుకుంటే నీళ్ళల్లో తడవడం వల్ల వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
గోరింటాకు బహిష్టు సంబంధిత దోషాలు (irregular periods)   పోగొడుతుంది.
అట్లతద్దికి ముందురోజును "భోగి" అంటారు
విదియ నాడు వాయనం తీసుకొనే ముత్తైదువులకు సున్నిపిండి,కుంకుడుకాయలు,నువ్వుల నూనె,పసుపు,కుంకుమ ఇచ్చి మర్నాడు తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాలి.
తదియ నాటి తెల్లవారుజామున తలంటు పోసుకుని చద్ది అన్నంలో పొట్లకాయ కూర,గోంగూర పచ్చడి,నువ్వుపొడి,పెరుగు
వేసుకుని భోంచేసి,సాయంకాలం వరకు ఏమి తినకూడదు.
పొట్లకాయ శరీరాన్ని డీటాక్సీఫీకేషన్ చేస్తుంది.ఇది చలికాలం మొదలయ్యే రోజులు కాబట్టి నువ్వులు, గోంగూర తినడం వల్ల శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత అందిస్తుంది.
సాధారణంగా పెళ్లి కాని వాళ్ళు తాంబూలం వేసుకోరు.కానీ ఈ ఒక్క రోజు మాత్రం వేసుకోవచ్చు.
తాంబూలం సౌభాగ్య చిహ్నం.అమ్మవారి "తాంబూలపిడచ" తిని పుట్టుమూగవాడు ఐన "మూకశంకరుడు" అమ్మవారి మీద ఆశువుగా ఐదు శతకాలు(మూకపంచశతీ) చెప్పిన గురించి తెలుసు కదా మనకి🙏
అసలు ఇంటికి వచ్చిన వారికి పండూ తాంబూలం ఇచ్చి గౌరవించడం మన సంప్రదాయం.
ఇక అట్ల  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
పూర్వం మినపప్పు మాత్రం రోట్లో కాటుకలాగా రుబ్బి,అందులో నానపెట్టి రోట్లో దంచిన బియ్యపిండి కలిపి వేసేవారు అట్లు.ఇవి తెల్లగా,మెత్తగా,దూదుల్లాగా చూడటానికి చంద్రబింబంలాగా
ఉండేవి.ఇప్పట్లగా రోష్టు, డబల్
రోష్టు చేసి ఎర్రగా ఉండేవి కావు😃.
నువ్వుల నూనె వేసి చేసేవారు ఆ అట్లని.నువ్వులనూనె ఎముకపుష్టి ఇస్తుంది.అట్లతో అనుపానంగా "తిమ్మనం"వండుతారు.సాధారణంగా అన్యోన్య దాంపత్యానికి కారకుడు,మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు చంద్రుడు.
వీర్యపుష్టి,సంతాన కారకుడు రాహువు.స్త్రీలు మంచి భర్త కోసం,మంచి సంతానం కోసం, చేసే ఈ నోములో
వారివురికి సంబంధించిన( చంద్రుడికి బియ్యము,రాహుగ్రహానికి మినుములు)వస్తువులతో చేసిన ఆహారాన్ని(అట్లు) నైవేద్యంగా అర్పించడం అనేది
ఆయా గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోవడానికే.అలాగే నవగ్రహాలలో "కుజుడికి"అట్లు అంటే ప్రీతి అని శాస్త్ర వచనం. వివాహానికి అడ్డంకిగా భావించే "కుజదోష"పరిహారానికి గాను,
అలాగే ఋతుచక్రం 
సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు.
ఈ రోజు చెయ్యవలసిన మరో ముఖ్యమైన పని.బాగా ఆటలు ఆడి, ఉయ్యాల ఊగడం.వీటి ద్వారా శరీరానికి అవసరమైన ఎక్సర్సైజు దొరుకుతుంది.పొట్ట,నడుము,చేతులు,కాళ్లు దగ్గర ఉండే నరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.ఊపిరి బిగపట్టి ఊగుతారు
కబట్టి breathing exercise కూడా అవుతుంది.
సాయంత్రం చంద్రోదయమయ్యాక గణపతి ని,గౌరీ దేవిని,పూజించి,11మంది ముత్తైదువులకు నల్లపూసలు,లక్కజోళ్ళు,రవిక గుడ్డలు,పసుపుకుంకుమలు,దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. ఒక్కొక్కరికి 11 చొప్పున అట్లు పోసి,ఒక దొంతరగా పేర్చి,దాని
మీద చిన్న బెల్లం ముక్క పెట్టి,ఆవునేతి చుక్క వేసి వాయనమివ్వడం ఈ నోము ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు నలుగురితో,తెలియని వాళ్ళకి తెలియచెప్పడమే ముఖ్యఉద్దేశం. 
మరో 11 అట్లు గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టి నోము చేసిన వాళ్ళు,కుటుంబసభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి.
వివాహానికి,గర్భధారణకి
అడ్డుగా ఉన్న దోషాల్ని ఆహారం,వ్యాయామం,దైవభక్తి ద్వారా తొలగించి ,స్త్రీలకు మాతృత్వపు వరాన్ని ఇస్తుంది అట్లతద్దె పండుగ.

భాద్రపద మాసంలో చేసే "ఉండ్రాళ్ళతద్దె"....తరువాతి మాసం ఐన ఆశ్వీయుజ మాసం లో చేసే "అట్లతద్దె"...ఆచరించే  విధానం ఒకేలా ఉన్నా...రోజుల తేడాతో మళ్ళీ చెయ్యడం ఎందుకు అంటే,
ఇప్పుడు మనం తీసుకున్న covid వాక్సిన్ "సెకండ్ డోస్" లాగా అన్నమాట😃.

అందరికీ అట్లతద్దె శుభాకాంక్షలు.💐💐
గౌరీ అనుగ్రహ ప్రాప్తిరస్తు.🙏
【అ ల సు】

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with లక్ష్మి

లక్ష్మి Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @jayahanuma

Oct 13
1st Answer

#భాగవతం_అష్టమ_స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది అండీ.(అందుకే పురాణాలు చదవాలి, అది మన కర్తవ్యం. ఋషి ఋణం అని ఒకటి ఉంటుంది అది తీరాలి అంటే వారు రాసినవి చదివి అర్థం చేసుకుంటేనే తీరుతుంది..రామాయణం భారతం,భాగవతం,భగవద్గీత లో లేని విషయం ఇంకేం లేదు ఈ ప్రపంచంలో..మీరు
కూడా ఆ పుస్తకాలు చదివితే అన్ని సందేహాలకీ సమాధానం లభిస్తుంది 🙏🙏)

నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము"లో27 మహాయుగాలు ఐపోయి,28వ మహాయుగంలో కృత,త్రేతా,ద్వాపరయుగాలు ఐపోయి,కలియుగములో ఉన్నాము.ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు
ఇంద్రుడు, సురలు మారుతుంటారు.(పేర్లు మాత్రమే)  చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. తరువాత వైవస్వత మన్వంతరం మొదలయ్యింది.
Read 5 tweets
Oct 12
#యుగం_మన్వంతరం_కల్పం.
కృత యుగం-17,28,000 సంవత్సరాలు.
త్రేతాయుగం-12,96,000 సంవత్సరాలు.
ద్వాపరయుగం-8,64,000 సంవత్సరాలు.
కలియుగం- 4,32,000 సంవత్సరాలు.
కలియుగం 5,123 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుతం 2022 (ఇది క్రీస్తుశకం లెక్కల ప్రకారం!!) సంవత్సరానికి ఇంకా 4,26,877 సంవత్సరాలు మిగిలివుంది.428,899లో అంతమవుతుంది.

3101 +present year =కలియుగం ప్రారంభం అయ్యింది.ఇదే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన సంవత్సరం కూడా!!
ఆయన అవతారం చాలించిన మర్నాటి నుంచి కలియుగం ప్రారంభం అయ్యింది.(ఇది NASA వారు కూడా ధృవీకరించారు.)

కలియుగం కిdouble/రెట్టింపు ద్వాపర యుగం (432000×2=864000)

కలియుగం కి మూడు రెట్లు =త్రేతాయుగం.(432000×3=1296000)

కలియుగం కి నాలుగురెట్లు=కృతయుగం (432000×4=1728000)
Read 8 tweets
Sep 25
#దసరా_దేవీ_నవరాత్రులు_శరన్నవరాత్రులు

శరదృతువు,ఆశ్వీయుజ మాసం మొదటి తొమ్మిది రోజులని "దేవీ నవరాత్రులు"గా జరుపుకుంటాం.

ఇది వర్షాకాలం,చలికాలంకి మధ్యలో వచ్చే సంధికాలం.వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే రోజులు.
యమధర్మరాజు దంష్ట్రలు(కోరలు) సంవత్సరంలో రెండు సార్లు బైట పెడతాడట!అందువల్ల
ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయి.కానీ ఆ బాధలు లేకుండా చెయ్యడానికి ప్రకృతిలో దొరికే ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించవచ్చు.

ఉగాది సమయంలో,ఎండాకాలం మొదలయ్యే ముందు ఒకసారి,మళ్ళీ దసరా సమయంలో రెండో సారి ఇలా జరుగుతుంది.
వాటికి  నివారణగా ప్రకృతి ఇచ్చిన  ఓషధాలే -వేపపువ్వు &ఉసిరికాయలు.వీటిని ఆయా
సమయాల్లో ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటాము.
నవదుర్గ పూజ
అమ్మవారిని తొమ్మిది రూపాలుగా అలంకరణ చేసి, పూజిస్తాము. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం.
Read 20 tweets
Sep 25
#దేవీ_నవరాత్రుల్లో_నైవేద్యాలు.

ఒకటవ పద్ధతి.

#లలితాసహస్రనామాల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల గురించిన నామాలు ఉన్నాయి..వాటిని పెట్టడం అన్నిటి కంటే శ్రేష్ఠదాయకం

1.పాయసాన్నప్రియా(పాలతో చేసిన పాయసం)
2.స్నిగ్ధౌదనప్రియా(నెయ్యి వేసిన అన్నం,బెల్లంముక్క)
3.గుడాన్నప్రీతమానసా(బెల్లంతో చేసిన అన్నం-పరవాణ్ణం.
4.దద్యన్నాసక్తహృదయా(పెరుగు అన్నం(దద్ధోజనం)
5.ముద్గౌదనాసక్తచిత్తా(పెసరపప్పుతో కలిపి వండిన అన్నం-పులగం/కట్టె పొంగలి.
6.హరిద్రాన్నైకరసికా(పసుపుపచ్చని అన్నం-పులిహోర(చింతపండు,నిమ్మకాయ,దబ్బకాయ,నారింజకాయ,ఉసిరికాయ,మామిడికాయ.
రెండవ పద్ధతి
#విజయవాడ_కనకదుర్గ  అమ్మవారి అలంకారాల    పద్ధతి.
1.పాడ్యమి-స్వర్ణాలంకృత కనకదుర్గ-వడపప్పు,పానకం,పరవాణ్ణం
2.విదియ-బాలాత్రిపురసుందరి -చింతపండు పులిహోర.
3.తదియ-గాయత్రీదేవి -కట్టె పొంగలి.
4-చవితి-లలితాదేవి-బెల్లంతో చేసిన పొంగలి.
5-పంచమి-అన్నపూర్ణ-పూర్ణాలు.
Read 6 tweets
Sep 24
మంచి ప్రశ్న అడిగారు రవిగారూ...
మనం ఇంట్లో శ్రాద్దం పెట్టడానికి వీలు పడనప్పుడు కదా #స్వయంపాకం(భోజనానికి అవసరమైన పదార్థాలు-బియ్యం,పప్పుదినుసులు,ఉప్పు, కూరగాయలు, నెయ్యి,నూనె వంటివి )ఇస్తాము.
శ్రాద్దం పెట్టినప్పుడు కూడా ఇద్దరు బ్రాహ్మణులకి భోజనం పెడతారు -ఒకళ్ళు మన పితృదేవతల స్వరూపం,
ఇంకొకరు విష్ణుమూర్తి స్వరూపం గా భావించి.వారు ఇద్దరూ సంతృప్తిగా భోజనం చేసి,మన వంశం అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇస్తారు.

స్వయంపాకం ఇచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది indirect గా!!తీసుకున్న బ్రాహ్మణుడు, వంట చేసిన ఆయన భార్య, పిల్లలు కూడా తృప్తిగా భోజనం చేస్తారు ఆ పూట మీరు ఇచ్చిన
స్వయంపాక వస్తువులతో!!
ఆయన "ఏవోయ్,ఇవాళ  వంకాయ కూర అద్భుతంగా ఉంది"అంటే ,ఆవిడ "ఇవి మొన్న రవిగారు ఇచ్చిన వంకాయలండీ,చాలా లేత గా  ఉన్నాయి, బహుశా వారి తోటలోవి కాబోలు  "అందనుకోండి..అప్పడు ఇద్దరూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించినట్లే కదా!!🙂🙂
Read 7 tweets
Sep 24
మీరు చెప్పింది కరెక్టే కల్యాణి గారూ,శ్రావణ మాసం చివర్లో వచ్చే అమావాస్యని #పోలాల_అమావాస్య  అంటారు.నిజానికి అది #పొలాల_అమావాస్య !!
శ్రావణ భాద్రపద మాసాలు వర్షఋతువు కదా..అందుకే ఆ రోజు ఇంట్లో కంద పిలక కి పూజ చేసి,తీసుకువెళ్ళి పొలాల్లో నాటుతారు.కందే ఎందుకు అంటే ఒక్క  కంద దుంప పైన ఎన్ని
కణుపులు ఉంటాయో అన్ని పిలకలు వేసి,అన్ని మొక్కలు వచ్చి మళ్ళీ అన్ని దుంపలుగా పంట పండుతుంది. మనకి ఏరువాక పౌర్ణమి రోజు దుక్కి దున్ని పొలం నాట్లు వెయ్యడానికి సిద్ధం చేసాక అన్ని రకాల #విత్తనాలు,#నారు లాంటివి నాటుతారు. దుంపకూరలు ఐన కంద,చేమదుంపలు, అల్లం,ఆలూ, ముల్లంగి లాంటివి నాటాలంటే భూమి
వర్షంతో బాగా తడిసి ఉండాలి కాబట్టి శ్రావణ అమావాస్య (పొలాల అమావాస్య)రోజు (ఆషాఢం నుంచి తొలకరి జల్లులు మొదలవుతాయి) పూజ తో మొదలు పెడితే పంట బాగా వస్తుంది. 
ఏ పంట ఎప్పుడు వెయ్యాలి తెలియజెయ్యడానికి వీలుగా,ఒక పండగ లాగా ఉంటే అందరికీ గుర్తు ఉంటుంది కదా!!!పైగా గమ్మత్తుగా చదువురాని
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(