సేకరణ :- రవీంద్ర గారు

ప్రతి మనిషిలోనూ తప్పనిసరిగా ఉండాల్సిన గుణం "కృతజ్ఞత".. అది రానురానూ ప్రజలలో తగ్గిపోతుంది. తనకు సహాయం చేసినవారి పట్ల ఎలా కృతజ్ఞత చూపాలో తెలియజేసిన ఒక ఆదర్శపురుషుడి గురించి తెలుసుకుందాం!!

"#పుణ్యమూర్తుల_అప్పలరాజు, పశ్చమగోదావరి జిల్లా నర్సాపూర్ నివాసి. Image
సన్నగా వుండేవాడు పిల్లాడు. అయితే బాగా హుషారుగా వుండేవాడు. బుర్రకథలంటే ఇష్టం. అందువలన పాఠశాలలో చదివేకాలంలోనే బుర్రకథలు చెప్పడం నేర్చుకున్నాడు. బుర్రకథలను తనదైన స్టైల్ లో రిక్షావాళ్ళకు చెప్పేవాడు. వారు ఆ అబ్బాయి చెప్పే జోక్స్ కు నవ్వుతూ అభినందించేవారు. వారు అలా మెచ్చుకోవడంతో ఇంకా Image
రెచ్చిపోయేవాడు ఆ అబ్బాయి.

పదవ తరగతి అయిపోయింది. ఇంటర్ కు కళాశాలలో చేరాడు. ఇంటర్ అయిన తరువాత టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగు పంతులుగా చేరాడు. అయినా నాటకాలపై మక్కువ తగ్గలేదు. మళ్ళీ కళావేదికపై కాలుమోపాడు. అద్భుతంగా నటిస్తుండటంతో ఒక స్నేహితుడు సినిమాలలో చేరమన్నాడు. అంతే Image
సినిమాలలో నటించాలని కలలు కనసాగాడు. ఒకరోజు ఇంట్లో చెప్పాపెట్టకుండా చెన్నై చెక్కేశాడు.

అయితే అక్కడేమీ అవకాశాలు తన్నూకురాలేదు. సార్ పర్సనాలిటీ చూసి పెదవి విరిచారు సినీపెద్దలు. ఒకప్రక్క ఆకలిబాధ. సినిమాలు లేవు. ఊరికి వెళ్ళలేడు. అలా ఆలోచిస్తూ నటి రాజసులోచన ఇంటిదగ్గరకు Image
వచ్చాడో రోజు. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె ఇంటి ముందుకొచ్చి నీరసంగా కుర్చొండిపోయాడు. అది గమనించి ఆ ఇంటి వాచ్ మన్ ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పరిస్థితి జాలేసి త్రాగడానికి నీళ్ళు, బిస్కెట్ ఇచ్చాడు. కృతజ్ఞతగా చూసాడు అతని వైపు అప్పలరాజు. ఇంతలో రాజారావు అనే నటుడి పిల్లలకు ట్యూషన్ Image
చెప్పేందుకు చేరాడు. అయితే నాటకాలు మాత్రం మానలేదు..

ఒకరోజు రాజారావు అతనికి ఒక సినిమాలో అవకాశం ఇప్పించాడు. చాలా సంతోషపడిపోయాడు. సినిమా పేరు "సమాజం". అది ఫెయిల్యూర్. తర్వాత కులగోత్రాలు, పుణ్యవతిలాంటి సినిమాలలో చిన్న, చిన్న పాత్రలు వేశాడు. పేరురాలేదు.

అయితే 1960లో జగపతి ఆర్ట్స్ Image
అధినేత వి.బి రాజేంద్రప్రసాద్ తన సొంతసినిమా "అంతస్థులు" లో అప్పలరాజుకు ఒకపాత్ర ఇచ్చారు. పారితోషికం ₹1300. అంతస్థులు సూపర్ హిట్ అయింది. అప్పలరాజు #రాజబాబు గా మారిపోయాడు. అంతే ఇంక వెనుక తిరిగి చూడలేదతను. తనకే సొంతమైన, ఎవరూ అనుకరించలేని హాస్యనటనతో తెలుగుప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. Image
ఒకానొక సమయంలో అగ్రహీరోలతో సమానంగా పారితోషికం తీసుకొనే స్థాయికి ఎదిగారు రాజబాబు.
ఉదాహరణకు యన్ టి రామారావు, రాజబాబు గారు ఒక సినిమాలో నటిస్తున్నారు. రామారావుగారికి పారితోషికం₹ 30000 కాగా, రాజబాబుకు ₹20000 ఇస్తామన్నారు. కానీ రాజబాబు నాకూ ₹30000 కావాల్సిందేనని పట్టుబట్టాడు. Image
ఇవ్వక తప్పింది కాదు నిర్మాతకి. అంత స్థాయికి ఎదిగాడు ఆయన.

ఎంత ఎత్తుకెదిగినా తనకు సహాయం చేసినవారిని మరిచిపోలేదు. తనకు నీళ్ళు ఇచ్చి దప్పిక తీర్చిన వాచ్ మేన్ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు, తనకు నటనలో మెళకువలు నేర్పిన బాలకృష్ణ(అంజిగాడు)ను సన్మానించి ,ఆర్థికంగా చాలా సహాయం చేశాడు. Image
అలాగే ఒక ట్రష్ట్ ను ఏర్పరిచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నటుడిని సన్మానించేవాడు. రేలంగి, సావిత్రి, రాజనాల, రాజారావు, చిత్తూరు నాగయ్యలాంటివారు సన్మానం పొందినవారిలో వున్నారు.

అంతేకాకుండా చిన్నప్పడు తమ చప్పట్లతో ప్రోత్సహించిన రిక్షావాళ్ళకు కొత్తరిక్షాలు, నగదు అందజేశాడు. Image
రాజమండ్రిలో వీధులు ఊడ్చే పనివాళ్ళకు "దానవాయిపేటలో పొలం కొని వారికి ఇచ్చాడు". కోరుకొండలో జూనియర్ కళాశాలను కట్టించాడు. అది ఆయన పేరు మీదనే "రాజబాబు జూనియర్ కళాశాల"గా ఉంది.

నటుడిగా నిలదొక్కుకునే సమయంలో తనకు సహాయపడిన వాళ్ళందరినీ గుర్తుంచుకొని కృతజ్ఞతాభావం చూపిన మహామనిషి రాజబాబుగారు. Image
పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడు రాజబాబుగారే. ఏడుసార్లు ఉత్తమ హాస్యనటుడి అవార్డు పొందారు. 1983లో అకస్మాత్తుగా ఆనారోగ్యం పాలై మరణించారు. 20 వ శతాబ్ధపు ఉత్తమ హాస్యనటుడిగా గుర్తింపుపొందిన రాజబాబు, నిజజీవితంలో "రాజునే".. ఆయనలోని "కృతజ్ఞత" మనందరికీ ఆదర్శం....

వారికి జయంతి నివాళులు.. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with ఆదిత్య శివశంకర కలకొండ

ఆదిత్య శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @adithyashiva23

Aug 1, 2023
#తమిళ భాషను #తెలుగువారు "#అరవం"అని ఎందుకు అంటారు?

మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.

మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
Read 5 tweets
Apr 29, 2023
#తెలుగు_భాష

తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?

డోర్ లాక్ చెయ్యకండి..

నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో..

నా కార్ కీస్ ఎక్కడ?

ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..

ఎందుకు ?

ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..

ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
వంటింటిని... #కిచెన్ చేసాం..
వసారా... #వరండాగా మారింది...
ఇలా #చావడి, #పంౘ, #ముంగిలి, #నట్టిల్లు, #తలవాకిలి, #నడవ, #పెరడు, ఇవన్నీ మరచిపోయాం..

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు..
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు..
Read 13 tweets
Mar 21, 2023
*#వదిలెయ్_మిత్రమా*

✒️ ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం
*వదిలెయ్*

✒️ పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాల పడక
*వదిలెయ్*
✒️ కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను
*వదిలెయ్*

✒️ ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా
*వదిలెయ్*
✒️ మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
*వదిలెయ్*

✒️ మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను
*వదిలెయ్*

✒️ ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చకుండా
*వదిలెయ్*
Read 4 tweets
Mar 21, 2023
ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది..
చాలా గర్వంగా ఉంది..

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
Read 8 tweets
Mar 21, 2023
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.

దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..

గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.

"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.

అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
Read 6 tweets
Mar 14, 2023
#సనాతన_ధర్మం - #పునర్జన్మ

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.

”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(