ఓం నమో వేంకటేశాయ
సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి.
మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట.
అలా.. శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది.
శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి.
గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటారు.
శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, 🙏
మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది.
శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు.
శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం
ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి.
సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు.
ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు
సేకరణ...🙏🌹🌹🌹
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి
పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్ ఫుడ్ ఆఫ్ గాడ్’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. దాని తొలి ప్రతిని ఆయన ఇటీవల
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించారు. ఏడు కొండల వాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
🙏ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం🙏
🙏సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి,
దైవదర్శనం తరువాత
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..
"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి,కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.
"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
82 ఏళ్ల వయసు.. అడుగు తీసి అడుగు వేయాలంటేనే కష్టం. పైగా ఉండేది ఒంటరిగా.. అందులోనూ లాక్డౌన్ పరిస్థితుల్లో. ఇలాంటి స్థితిలో ఓ వృద్ధుడు పోలీసులను చూసి కిటికీలో నుంచి చేతిని ఊపి, రమ్మని సైగ చేశాడు.
కరోనా వైరస్పై పోరు కోసం దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది.
స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అత్యవసర మందులు, వైద్య సామాగ్రి కోసం, పేదలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో వెచ్చిస్తోంది. దీంతో ప్రభుత్వాలను ఆదుకోవడానికి కార్పొరేట్ సంస్థల నుంచి సామాన్యుల వరకు ముందుకొస్తున్నారు. తమ వంతు విరాళాలు ఇస్తున్నారు
. కోవిడ్పై పోరాటంలో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 80 ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు చేసిన సాయం ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే..
సుభాష్ చంద్ర బెనర్జీ అనే 82 ఏళ్ల వృద్ధుడు డమ్ డమ్ ఎయిర్పోర్టు వెనుక ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు
మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ: ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి.
కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని
ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో
1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
ఉప్మా: ఏవిటే ఇడ్లీ.. ఓ నిన్నట్నుంచీ నిన్ను తెగ పొగిడేస్తున్నారు.. ఏంటీ కథ.. ??
ఇడ్లీ: ప్రపంచంలో ఎక్కువ మంది తినేది నన్నే అంటాను
ఉప్మా: ఏడిశావ్.. వేరే యే టిఫినూ చెయ్యడానికి ఓపికల్లేక, టైం కుదరక తేరగా దొరికేది నువ్వే గనుక నిన్ను నోట్లో వేసుకుపోతారంటాను..
ఇడ్లీ: డాక్టర్లు సిఫార్సు చేసేది నన్నే అని గుర్తుంచుకో..
ఉ: పెళ్లిళ్లలోనూ, అర్ధరాత్రి కూటములోనూ పెట్టేది నన్నే అని నువ్ గుర్తుంచుకో..
ఇ: ఏం కాదు.. నను చెయ్యడం ఎంత తేలికనుకున్నావ్.. ?? అందరికీ అందుబాటులో ఉంటాను..
ఉ: ఏంటి ఉండేది మినప్పప్పు తొక్కా.. ముందురాత్రి పప్పు నానబొయ్యకపోతే తప్ప తెమలదు నీతో.. పొద్దున్నే లేచి ఈసురోమంటూ రుబ్బాలి.. మిక్సీలో వేసి పడుకున్నవాళ్ళ నిద్రచెడగొట్టాలి.. అదే నేనా.. పదిహేనునిముషాలయితే ఎక్కువ.. పోపులపెట్టెలో ఆవాలు, శనగపప్పు బద్దలు సిద్ధంగా ఉండాలేగానీ