ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టిన ప్రతిసారి దేవుడు ఆరగిస్తారు. ఇది నిజం… ఒక్కసారిగా అక్కడ ఆ దేవుడికి అర్చకులు ఏకంగా ఏడుమార్లు నైవేద్యం పెడతారు.
ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు ఆశ్చర్యపోవడంలోనూ తప్పులేదు. అలాగని అక్కడ జరుగుతున్న తప్పో, కల్పితమో అస్సలు కాదు.
నిజంగా ఆ దేవుడు నైవేద్యం ఆరగిస్తాడు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడా అనేగా మీరు అడుగుతున్నది.
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా తిరువరపు శ్రీ కృష్ణ దేవాలయం. ఇక్కడ కృష్టుడు చాలా చాలా ఆకలి మీద ఉంటాడు. గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంచుతారు.
ఇక్కడ స్వామికీ అర్చకులు రోజుకు 7 సార్లు
స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నైవేద్యం పెట్టిన ప్రతీమారు కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇందులో తలుపులు మూసినప్పుడో లేదా అక్కడ ఎవరు లేనప్పుడో కాదు.
అందురూ చూస్తుండగానే, అర్చకులు అక్కడే ఉండగానే కాస్తంత తగ్గుతుంది. స్వామి స్వయంగా నైవేద్యాన్ని తింటారని ఇక్కడి ప్రజల నమ్మకం.
విశ్వాసం. అందుకే నైవేద్యం తగ్గుతోందని భావిస్తారు.
కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవుతుందట. ఇందుకు నిదర్శనం కూడా చూపుతన్నారు.
స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు.
పూర్వం గ్రహణం సమయంలో ఆలయం
మూయడం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడంతో గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ ఆలయాన్ని మూయ కూడదని నిర్ణయించారు.
ఇక్కడ స్వామికి నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ఇక్కడ ఇంకో నియమం ఉంది.
ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో
వెళ్ళకూడదు. అందుకే అర్చకులు ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా? అని పెద్ధగా అరిచి మరీ ప్రసాదం పంపిణీ చేస్తారు.
ఈ ఆలయంలో దేవుడు నైవేద్యాన్ని ఆరగించడంపై శాస్త్రవేత్తల తేల్చాలని చూసి అంతు చిక్కక మిన్నకుండిపోయారట.
అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం
సమర్పిస్తారు. కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.
ఇక్కడి అర్చకుడి చేతిలో ఎప్పుడూ గొడ్డలి ఉంటుంది. అదేదో క్రూర జంతువులను నరకడానికి కాదు.
ఆలయాన్ని తెరవడంలో ఆలస్యం అయితే ఏమాత్రం ఆలోచించకుండా తాళం బద్దలు
కొట్టి ఆలయం తెరచి స్వామికి కైంకర్యాలు చేస్తారు.
గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శిస్తారు. స్వామిని కొలుస్తారు.
వాసుదేవయనమః🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన నల్లమల అడవిలోకష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. పక్షుల కిలకిలలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా .
శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన కలుగుతుంది.
ఈ ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతోదర్శనమిస్తుంది. రెండు చేతులలో తామర పుష్పాలను మిగతా రెండు చేతుల్లో జపమాల , శివలింగంధరించి కనిపిస్తుంది. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించబడింది.
అందుకే ఈ అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు.
ఇష్ట కామేశ్వరి అమ్మ వారు నుదురు మెత్తగాఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. ఇష్టకామేశ్వరి నుదుటిపై బొట్టు పెడితే తమ కోరికలు 41 రోజుల్లో తప్పకుండా నెరవేరతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించి తమ
తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి
పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్ ఫుడ్ ఆఫ్ గాడ్’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. దాని తొలి ప్రతిని ఆయన ఇటీవల
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించారు. ఏడు కొండల వాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
🙏ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం🙏
🙏సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి,
ఓం నమో వేంకటేశాయ
సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి.
మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట.
అలా.. శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది.
శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి.
గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటారు.
శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, 🙏
దైవదర్శనం తరువాత
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..
"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి,కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.
"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
82 ఏళ్ల వయసు.. అడుగు తీసి అడుగు వేయాలంటేనే కష్టం. పైగా ఉండేది ఒంటరిగా.. అందులోనూ లాక్డౌన్ పరిస్థితుల్లో. ఇలాంటి స్థితిలో ఓ వృద్ధుడు పోలీసులను చూసి కిటికీలో నుంచి చేతిని ఊపి, రమ్మని సైగ చేశాడు.
కరోనా వైరస్పై పోరు కోసం దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది.
స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అత్యవసర మందులు, వైద్య సామాగ్రి కోసం, పేదలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో వెచ్చిస్తోంది. దీంతో ప్రభుత్వాలను ఆదుకోవడానికి కార్పొరేట్ సంస్థల నుంచి సామాన్యుల వరకు ముందుకొస్తున్నారు. తమ వంతు విరాళాలు ఇస్తున్నారు
. కోవిడ్పై పోరాటంలో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 80 ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు చేసిన సాయం ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే..
సుభాష్ చంద్ర బెనర్జీ అనే 82 ఏళ్ల వృద్ధుడు డమ్ డమ్ ఎయిర్పోర్టు వెనుక ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు