This the story of a Telugu legend. Please read till end closely:

గాంధేయం ఒక గాండీవం – 28.3. 2021
(శీర్షికా నిర్వహణ – డా. నాగసూరి వేణుగోపాల్)

వందేళ్ళ క్రితం... బెజవాడ కాంగ్రెస్ సమావేశంలో
జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య
(మీకు సిపాయి వెంకయ్య తెలుసా? పోనీ ఇన్స్పెక్టర్ వెంకయ్య? కాదులే, గార్డు వెంకయ్య? పత్తి వెంకయ్య? జెండా వెంకయ్య? డైమండ్ వెంకయ్య? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. అదే పింగళి వెంకయ్య. సరిగ్గా వందేళ్ళ క్రితం తెలుగు ప్రాంతం లో మొట్టమొదటిసారి బెజవాడలో కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి.
సుమారు 2 లక్షల మంది ప్రజలు ఆ సమావేశంలో పాల్గొన్నారని అంచనా. అప్పటి బెజవాడ జనాభా కేవలం 45 వేలే. అయితే గాంధీ మహాత్ముడికున్న ఆ ఆకర్షణ అంతమందిని సమావేశాలకు రప్పించింది. ఈ సమావేశాల తర్వాతనే తెలుగు ప్రాంతాలలో స్వాంతత్ర్యోద్యమం మహాజ్వాలగా మారింది. )
1885లో కాంగ్రెస్ ఆవిర్భవించినా ఒక్కసారి కూడా ఆంధ్రదేశంలో మహాసభ జరగలేదు. కాంగ్రెస్ కమిటీ సమావేశం కూడా నిర్వహించలేదు. ఆ అప్రశస్తం 1921లో తొలగిపోయింది. 1921 మార్చి 31న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం బెజవాడలో జరిగింది.
ఆంధ్రదేశం నలుమూలల నుండి ప్రజలు బృందాలుగా ఏర్పడి ‘దండాలు దండాలు...’, ‘మహాత్మాగాంధీ దర్శనమే పుణ్యం...’, ‘మా కొద్దీ తెల్లదొరతనము… ’ గేయాలు పాడుతూ బెజవాడ చేరితే, పట్టణ ప్రజలు తమ వాకిళ్ళలో పందిళ్ళు వేసి, తోరణాలు కట్టి అందులో పాల్గొనడానికి వచ్చిన గాంధీజీకి, మిగతా కాంగ్రెసు నాయకులకు
ఘనంగా స్వాగతం పలికారు. అప్పుడు బెజవాడ జనాభా నలభై ఐదువేలయితే సుమారు రెండు లక్షలమంది మార్చి 31న నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

మార్చి 31న కాంగ్రెసు కమిటీ సభ్యులు మ్యూజియం హాలులో సమాలోచనలు జరిపి ఎన్నో తీర్మానాలు చేశారు.
అందులో ప్రత్యేకంగా పేర్కొన దగ్గవి మూడు నెలలలో స్వరాజ్యోద్యమం నడపడానికి తిలక్స్ స్వరాజ్యనిధికి కోటి రూపాయల నిధి సమకూర్చు కోవాలి, ఒక కోటిమంది కాంగ్రెసు సభ్యులను చేర్చాలి, పేదసాదలకు బ్రతుకు తెరువు కల్పించేందుకు దేశంలో ఇరవై లక్షల రాట్నాలు నెలకొల్పాలి.
ఆ సమావేశంలోనే పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జండా నమూనాలను గాంధీజీ చూశారు. వెంకయ్య పట్టుదలగా కొన్ని సంవత్సరాలుగా 30 దేశాల జండాలను శ్రద్ధగా పరిశీలించి, ఆధ్యయనం చేసి, మనకు సరిపడే జండా నమూనాలు కొన్ని తయారుచేసి వాటిని A National Flag for India’ (మన జాతీయ జండా)
పేరుతోఒక పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకం చేతపుచ్చుకుని నాలుగేళ్ళుగా కాంగ్రెసు సమావేశాల్లో పాల్గొని కాంగ్రెసు నాయకులు జండా ఆవశ్యకత గురించి, దాని రూపురేఖల గురించి అవగాహన కల్పించారు. 1921లో ఆయన శ్రమ ఫలించింది. ఈ విషయం1921 ఏప్రిల్ 13న యంగ్ ఇండియాలో గాంధీజీ రాశారు.
అందులో “ప్రతి జాతికి జండా ముఖ్యం. జండాకోసం బ్రతకడానికి, జండాకోసం ప్రాణాలు అర్పించడానికి ప్రజలు సిద్ధపడాలి.”

మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలకు చెందిన పింగళి వెంకయ్య జాతీయపతాకానికి కొన్ని నమూనాలు సూచిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించి గత నాలుగు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు.
ఆయన పట్టుదల శ్లాఘనీయం. కానీ ఆయన నమూనాలు నన్ను ఆకర్షించింది. జలంధర్ వాసిలాలాహన్స్ రాజ్ మన పతాకంపై రాట్నం ఉండదగిన చిహ్నమని చేసిన సూచన నాకు నచ్చింది. బెజవాడలో వెంకయ్యను ఆయన గీసిన ఒక నమూనాలో హిందువులను సూచిస్తూ ఎరుపు వర్ణం, ముస్లింలను సూచిస్తూ ఆకుపచ్చ వర్ణంపై మధ్యలో రాట్నాన్ని కూడా
చిత్రించి చూపెట్టమని అడిగితే ఆయన అత్యుత్సాహంతో మూడుగంటల వ్యవధిలో కొత్త నమూనాను అందించారు” అని గాంధీజీ రాశారు. గాంధీజీ చెప్పిన మార్పులతో జండా తయారు చేయడానికి వెంకయ్య అప్పట్లో బందరు జాతీయ కళాశాలలో లలితకళల లెక్చరర్ ఈరంకి వెంకటశాస్త్రి సాయం తీసుకున్నారు. యంగ్ ఇండియాలో అదే సంచికలో
గాంధీజీ ఇంకా ఇలా రాశారు: “కానీ ఆ నమూనాను సమయాభావం వల్ల ఏప్రిల్ 21 సమావేశంలో కాంగ్రెస్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. అది మంచికే జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత తీరికగా ఆలోచన చేస్తే జండా మిగతా మతాలకు కూడా ప్రతీకగా నిలవాలికదా అనితోచింది. అందువల్ల తెలుపు రంగు మిగతా మతాలను సూచించే విధంగా
మువ్వన్నెల జండా రూపుదిద్దుకుంది. మొదట రంగు అత్యల్ప సంఖ్యాకులకు, తర్వాత రంగు ముస్లింలకు, ఆఖరిది హిందువులు ప్రతీకలు. సంఖ్యలో బలిష్టులు అత్యంత దుర్బలులకు రక్షణ ఉండాలని దీని అంతరార్థం. అన్నిమతాల ప్రజలు సమానమే అని సూచించేందుకు మూడురంగులూ సమానంగా ఉండాలి.
ఇండియా ఒక జాతిగా బ్రతకాలంటే రాట్నం ఉండి తీరాలి. ఎందుకంటే రాట్నం పునరుజ్జీవనమే ఆకలితో ఉన్న లక్షలాది జనాలకు అన్నం పెట్టగలదు.”

అలా రూపాంతరం చెందిన జండాలో ఉన్న వర్ణాలను మతాలతో సంబంధం లేకుండా ధైర్యం, త్యాగం, సత్యం, శాంతి, విశ్వాసం, శక్తిలకు ప్రతీకలుగా గుర్తిస్తూ అఖిల భారత కాంగ్రెసు
కమిటీ అధికారికంగా జండాను స్వీకరించడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. 1938 ఏప్రిల్ 17 హరిజన్ సంచికలో గాంధీజీ“మన జండాకు నేను సృష్టికర్తను. జండాను నేను ప్రేమిస్తున్నాను. ఈ జండా దేశ సమాఖ్య కథకు, అహింసకు చిహ్నం. ధనికులు బీదలు లీనం కావాలి రాట్నం సూచిస్తుంది” అని గాంధీజీ చెప్పారు.
ఆ జండా కాంగ్రెస్ జండా. అందువల్ల 1947లో స్వరాజ్య సిద్ధి తర్వాత ఆ జండా రాట్నం స్థానంలో ధర్మచక్రం చేర్చారు. అదే ఇప్పుడు మన జాతీయ జండా. నిస్సందేహంగా మన జాతీయజండాకు ప్రేరణ గాంధీజీయే. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా పింగళివెంకయ్య రూపొందించిన జండా చిన్నచిన్న మార్పులు సంతరించుకున్నా గాని
దాని ప్రాథమిక నమూనా మారలేదు. అందువల్ల మనజాతీయ జండా రూపశిల్పిగా వెంకయ్య పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

పింగళి వెంకయ్య జీవితంలో ఎన్నో రంగులు. లక్ష్యశుద్ధి ఏర్పడని ఆయన జీవనయానం1876 ఆగస్టు 2న కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లిలో కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లిలో మొదలైంది.
ఆయన తల్లిదండ్రులు హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ. బాల్యం భట్లపెనుమర్రులో గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. తర్వాత బందరు హిందూ హైస్కూల్ చదువు కొనసాగించారు. అనంతరం జూనియర్ కేంబ్రిడ్జ్ పరీక్ష కోసం కొలంబో వెళ్లారు.
సీనియర్ కేంబ్రిడ్జ్ తర్వాత ఎందుకో సైన్యంలో చేరాలని వెంకయ్య మనసు పడ్డారు. బొంబాయికి వెళ్లి 1897లో సైన్యంలో భర్తీ అయ్యాయి. అప్పుడు ఆయన పేరు సిపాయి వెంకయ్య’. సైనిక శిక్షణ అనంతరం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో భాగంగా ఆయన 1899-1902 కాలంలో దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు.
అక్కడే వారికి గాంధీజీతో పరిచయం కలిగిందని చెబుతారు కానీ దానికి ఆధారాలు లేవు.

ఇండియా తిరిగి వచ్చిన తర్వాత సైన్యం నుంచి ఎలా డిశ్చార్జి అయ్యారో తెలియదుగాని మద్రాసులో ప్లేగు ఇన్స్పెక్టరు కొన్నాళ్ళు పనిచేశారు. అప్పుడు ఆయన పేరు ఇన్స్పెక్టర్ వెంకయ్య’. కొన్నాళ్ళకే ఆ ఉద్యోగం పై మోజు
తీరిపోతుంది. ఆ ఉద్యోగం మాని రైల్వే గార్డుగా బెంగుళూరులో, బళ్ళారి పనిచేశారు. అప్పుడు ఆయన గార్డు వెంకయ్య అయ్యారు. గార్డుగా యాంత్రికంగా జండా ఊపడం, ఈ వెయ్యడం వెంకయ్య మనసును నొప్పించింది. గార్డు ఉద్యోగానికి రాజీనామా చేశారు.

మనసు కాంగ్రెసు వైపు మరలి 1906లో దాదాభాయి నౌరోజీ అధ్యక్షత
వహించిన కలకత్తా కాంగ్రెస్ సభకు వెంకయ్య వెళ్ళారు. అక్కడ ఆయనకు మునగాల జమీందారు నాయని రంగారావుతో పరిచయమయింది. జమీందార్ ఆహ్వానం అందుకుని సొంతజిల్లాకు వచ్చి వెంకయ్య హైబ్రిడ్ పత్తి విత్తనాల పరిశోధనలు చేశారు. ముఖ్యంగా అమెరికా నుంచి కంబోడియా రకం విత్తనాలను దిగుమతి చేసుకుని,
వాటిని సంకరం చేసి కొత్తరకం హైబ్రిడ్ విత్తనాలను తయారుచేసి ఆ విత్తనాలతో పంట పండించారు. ఆ పత్తిని 1909 వ్యవసాయోత్పత్తుల ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తే, దాని నాణ్యతను బ్రిటిష్ అధికార్లు ఎంతగానో మెచ్చుకున్నారు. అప్పుడు ఆయన పత్తి వెంకయ్యగా ప్రసిద్ధి చెందారు.
1910లో వెంకయ్య చూపు జపాన్ ఆర్థిక ప్రగతి పై ఆనాలి. వెంటనే వ్యవసాయాన్ని వదిలి లాహోర్ వెళ్ళి అక్కడి అంగ్లో వేదిక్ కాలేజీలో చేరి ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. 1913లో బాపట్లలో ఒక గంట సేపు జపనీస్ భాషలో అనర్గళంగా ఉపన్యసించారు. దీంతో ఆయనకు ఇంకోపేరు జతయ్యింది. అది ‘జపాన్ వెంకయ్య’.
1910లో వెంకయ్య బందరు జాతీయ కళాశాలలో లెక్చరర్ గా ప్రాథమిక సైనిక శిక్షణ, గుర్రపు స్వారీ, వ్యవసాయం బోధించారు. ఆ సమయంలోనే ఆయన జాతీయపతాకంపై విస్తృతంగా ఆధ్యయనం చేసి గాంధీజీ ప్రశంసకు పాత్రులయ్యారు. ‘జెండా వెంకయ్య గా గుర్తింపు పొందారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత వెంకయ్య ఖనిజాల పరిశోధనలో మునిగిపోయారు. వజ్రాలు, రత్నాలు అన్వేషణలో ఆయన దిట్ట. నిత్యం క్షేత్ర పర్యటన చేశారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రథమ భారతీయ డైరెక్టర్ ఎం.ఎస్. కృష్ణన్ ‘Geology in India and Burma’ (జియాలజీ ఇన్ ఇండియా అండ్ బర్మా)
పుస్తకం 1960లో ప్రచురించారు. అది జియాలజీ విద్యార్థులకు పాఠ్యగ్రంథం. అందులో ఆయన వెంకయ్యను ఔత్సాహిక జియాలజిస్ట్ గా పేర్కొన్నారు. “వెంకయ్య గుత్తి చుట్టుపక్కల దొరికే వజ్రాలు చాలా ఆసక్తి కనపరచారు. (1955లో) ఆయన వజ్ర స్ఫటికం ఉన్న ఒక ఎపిసోడ్ రాతిని కనుగొన్నట్లు చెప్పారు.
ఆ రాయిలో వజ్రం లభిస్తుందని ఆయన చెప్పారు” అని కృష్ణన్ రాశారు. గుత్తిలో ఉంటూ ఆయన ఒక డైమండ్ కంపెనీ కన్సల్టెంట్ గా పనిచేశారు. జియాలజిస్టులు వాళ్ళ క్షేత్రపర్యటనలలో ఆయన సాయం తీసుకుని, వాళ్ళకి తోచిన ప్రతిఫలం ఆయనకుముట్ట చెప్పేవారు. ఆ సమయంలో ఆయన పేరు ‘డైమండ్ వెంకయ్య’.
అరవై ఏళ్ళ వయసులో వెంకయ్య బెజవాడ చేరారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు సైన్యంలో ఉండగా క్షయ బారిన పడి మరణించాడు. ఇంకొక కొడుకుకు ఆర్థిక పుష్టి లేదు. వెంకయ్యకు ఆదాయం లేదు. ఉండేందుకు ఇల్లు లేదు. అప్పుడెప్పుడో సైన్యంలో పనిచేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం చిట్టినగర్లో స్థలం
ఇచ్చింది. దాన్లో ఒక పూరిపాకలోఒంటరిగా ఉంటూ కాలవస్నానంచేస్తూ, ముతక ఖద్దరు పంచె, చిరిగిన చొక్కాతో, అర్ధాకలితో రోజులు వెళ్లబుచ్చారు. తనకు తెలిసిన కాంగ్రెస్ సహచరులు మిత్రులయ్యారు. కానీ ఆయన మైత్రిని దుర్వినియోగ పరచుకోలేదు. ప్రభుత్వం ఆయనను ఉపేక్ష అండి ఎవరైనా అంటే ఆయన సహించేవారు కాదు.
ఆయన గురించి తెలిసిన వాళ్ళు కొందరు 1963 సంక్రాంతి నాడు జాతీయ జండా రూపకర్తగా ఆయనకు సన్మానం చేసి కొంత నగదును ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన జండా గురించి మాట్లాడారు. తన వీలునామాలో తాను మరణించినప్పుడు తన దేహం పతాకాన్ని కప్పుకున్నారు.
చితికి నిప్పంటించేటప్పుడు ఆ జండాను స్మశానంలోని మర్రిచెట్టుకు వేలాడదీయమని, అదే తాను కోరుకునే నివాళి అన్నారు. వెంకయ్య 1963 జూలై 4న చనిపోయారు. స్మశానంలో ఆయన తుది కోరిక గౌరవించారు.

యన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై ప్రతిష్టించిన తెలుగుతేజాల విగ్రహాలలో
వెంకయ్యది కూడా ఉంది. 2009లో ప్రభుత్వం వెంకయ్య పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 2012లో ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం వెంకయ్యను భారతరత్న పురస్కారంతో సత్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అదే విజ్ఞప్తిని ప్రస్తుతం ఆంధ్ర ప్రభుత్వం పునరుక్తి చేసింది.
వెంకయ్య కూతురుకు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డెబ్భై ఐదు లక్షల రూపాయలు అందజేశారు.

కీర్తి ఒక్కటే స్థిరమైనదనుకుంటే అది వెంకయ్యకు దక్కిందనుకోవాలి.

- కాటా చంద్రహాస్

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

30 Mar
*64 కళలూ పండిన*
*మాయాబజార్ కు*
*64 ఏళ్లు నిండాయి!*

భళిభళిభళిరా దేవా
బాగున్నదయా నీ మాయ..
బహుబాగున్నదయా
నీ మాయ!

ఆ మాయే మాయాబజార్..
ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్..
మహాభారతంలో
శశిరేఖ పరిణయ ఘట్టం
హాస్యానికి పట్టం..
సావిత్రి అనే మొండిఘటం..
కెవిరెడ్డి చేతివాటం..
ఇంతకీ అది సినిమానా..
మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా..
అపురూప దృశ్య కావ్యమా..?

అద్భుతమట స్క్రీన్ ప్లే..
ఘటోత్కచుడిగా
ఎస్వీఆర్ పవర్ ప్లే..
అంతటి మహానటుడి
అభినయానికి సావిత్రి రీప్లే..
కృష్ణుడిగా ఎన్టీఆర్
నట విశ్వరూపం..
అభిమన్యుడు అక్కినేని సమ్మోహన రూపం..
సుపుత్రా నీకిది తగదురా
అంటూ హిడింబిగా సూర్యకాంతం సరికొత్త రూపం..
ఓ చిన్నమయ..లంబు జంబు..
రేలంగి హాస్య విన్యాసం..
పక్కన శాస్త్రి,శర్మ కోరసం..
అంజిగాడి బాబాయిల పద్యం
చెప్పుల నాట్యాలు..
తివాచీ అల్లర్లు..
ఘటోత్కచుడి పదఘట్టనకు
విరిగి పడిన కొండ ముక్క..
పేరు చెప్పి
శరణు కోరమనే వైనం..
సుభద్ర రౌద్రం..
Read 11 tweets
30 Mar
🌞🌎🏵️🌼🚩

*_"మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం"_*

*_స్వామి వివేకానంద._*

📚✍️ మురళీ మోహన్

*_కానీ ఇప్పుడు చాలామంది,_*

*_వ్యక్తిత్వాలను నమ్ముకోవడం కన్నా,_*

*_ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ ప్రయోజనాల కోసం,_*

*_అన్యుల పాదాక్రాంతం చేస్తూ,_*
*_అమ్ముకుంటూ, తాకట్టు పెడుతూ జీవిస్తున్నారు.!_*

*_శాశ్వతం కాని హోదాలను అనుభవించడమే జీవితం అనుకుంటున్నారు._*

*_మనం అసలైన ఆభరణాలము కాదు,_*

*_గిల్టు నగలమని తేలిపోవడం తప్పదు.._*

*_అప్పుడు సమాజమే కాదు,_*

*_మన అనుకునే వారు కూడా,_*

*_మనలను ఛీకొట్టే రోజులు వస్తాయి..._*
*_అందుకే వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు.._*

*_దాన్ని కాపాడుకుంటే అది మనలను మరణించినా,_*

*_మనుషుల్లో వారి మనసుల్లో శాశ్వతంగా నిలబెడుతుంది.._*

*_కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు గా ఉండే కంటే,_*

*_ప్రశాంతంగా ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.._*
Read 4 tweets
30 Mar
మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం.

ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు.

తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు.

తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయుల
ు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు.

మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు.

1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి.

ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.

దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట
Read 18 tweets
30 Mar
*మా అమ్మ (చీర) కొంగు*🙏
.
*ఇప్పటి పిల్లలకు చాలా మందికి తెలియక పోవచ్చు.*

*ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే *.

*చీర కొంగు చీర అందానికే సొగసును పెంచేె మకుట మాణిక్యం* !**

అంతేకాకుండా ..

*పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*
*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*

*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మ ఒడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*

*కొత్త వారు ఇంటి కొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది. *అమ్మ కొంగు వెనకే.*

*అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు
అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*

*అలాగే వాతావరణం చలిగా ఉంటే అమ్మ కొంగు తోనే పిల్లలని వెచ్చగా చుట్టేది !*

*వంట చేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !*

*వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!*
Read 10 tweets
30 Mar
❤️🧡💛💖💚💙💜

“Die Empty”.

పెద్ద నీతితో కూడిన ఈ చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.👇🏻👇🏻

ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.

టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.
‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.
‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.
అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.
‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’
‘ఎందుకంటే...
అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.
‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును,
Read 8 tweets
30 Mar
😃😜గోదారోళ్ళ కితకితలు😃😜

ఇందాక కాతంత పనుండి రాజమండ్రెల్లాక...

మా పెద్దమ్మ పోనుచేసిందండే....!!!

ఒరే...బుజ్జే ఎక్కడున్నావురా?

నేను రాజమండ్రీలో వున్నాను పెద్దమ్మా !

వచ్చీదప్పుడు హార్లిక్సుపొట్లవోటి అట్టుకురామ్మా!!!

అలాగే...నాకో గంటడద్ది...వచ్చీదప్పుడు తెత్తానులే..!!
షాపులోకెల్లి హార్లిక్సు పేకెట్టిమంటే...

మదర్ హార్లిక్సోటే వుందండి...ఇమ్మంటారా?

మా మదరికి కాదండి..మాపెద్దమ్మకి..

పెద్దమ్మ హార్లిక్సివ్వండి..!

పెద్దమ్మ హార్లిక్సులు...

పిన్ని హార్లిక్సులు..

ఆంటి హార్లిక్సులు వుండవండి..

కావల్తే ఇదట్టుకెల్లండన్నాడండే...
తీసుకుని ఇంటికొచ్చేక డౌటొచ్చిందండే!!!

మదరార్లిక్సు పెద్దమ్మకిత్తే సరిగ్గా పంజెయ్యదేమో అని!!!

కానీ మనవేమన్నా తెలివితక్కువోల్లమేటండే!!!

ఎమ్మటనే మాపెద్దమ్మ కొడుక్కి పోన్చేసిరమ్మని...

ఒరే అన్నయ్య ఇది అమ్మకిచ్చేయరా!!

అలాగే వచ్చేవుకదా!!!

నువ్వే ఇచ్చేయొచ్చుకదా!!!
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!