గండికోట ఏకైక పాలకురాలు - మదీనా బీబీ

సుమారు వెయ్యి సంవత్సరాల గండికోట చరిత్రలో అనేక మంది పాలకులు గండికోటను పాలించారు. ఒకప్పుడు స్వతంత్ర కాయస్థ రాజ్యానికి రాజధానిగా ఉండి విజయనగర సామ్రాజ్యంలోని శత్రుదుర్భేద్యమైన దుర్గాలలో ఒకటిగా నిలిచిన గండికోటను పాలించిన ఏకైక మహిళ మదీనా బీబీ.
మదీనా బీబీ కడప సుబాను పాలించిన అతిగొప్ప మాయాణా నవాబు అబ్దుల్ నబీ ఖాన్ కోడలు మరియు కడప నవాబు అయిన మోచ మియ్యా భార్య. మదీనా బీబీ గండికోట పాలనపై కడప కైఫియత్తు మరియు గండికోట కైఫియత్తుల కథనాలలో కొంచెం వైరుధ్యం ఉంది.
అయినప్పటికీ దాదాపు రెండు కైఫియత్తులు గండికోట జాగీర్దార్ గా మదీనా బీబీని, ఆమె చేసిన యుద్ధాలను స్పష్టం చేస్తున్నాయి

విజయనగర సామ్రాజ్యం పతనానంతరం కడప మొదట గోల్కొండ ఆ తరవాత మొఘలుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. కడప సుబాలో మాయణా నవాబులుగా పిలవబడ్డ కడప నవాబులు పాలన మొదలయ్యింది.
వీరు మొదట మొఘలుల సామంతులుగా ఆ తర్వాత హైదరాబాదు నిజాం వారి సామంతులుగా కడప సుబాను పాలిస్తూ వచ్చారు.

మాయనా నవాబులలో అతి గొప్పవాడు అబ్దుల్ నబి ఖాన్. కడప సుబాను క్రీ.శ 1706-1735 వరకు పాలించాడు. ఇతని హయాంలో కడప సుబా ఉత్తరాన కంభం, మార్కాపురం నుండి దక్షిణాన బారమహల్ వరకు విస్తరించింది.
ఇతని హయాంలో గండికోట ఇతని కుమారులలో ఒకడైన అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఆధీనంలో ఉండేది.

అబ్దుల్ నబీ ఖాన్ తరువాత అతని పెద్ద కుమారుడు అబ్దుల్ మహమ్మద్ ఖాన్ /బడే నవాబ్ /గుడ్డి నవాబ్ కడప సుబాను క్రీ.శ 1736 నుండి 1747 వరకు పాలించాడు. ఇతని హయంలో గండికోట ప్రత్యక్షంగా నిజాముల ఆధీనంలోకి వెళ్ళిపోయింది
నిజాం తన ప్రతినిధి కవిదిల్ల ఖాను ను గండికోట ఖిల్లేదారుగా ఉంచి అప్పటి గండికోట ప్రభువైన అబ్దుల్ ఖాదర్ ఖాన్ కుమారులు గన్ని మియ్యా, గఫార్ మియ్యా లకు పెద్ద పసుపుల, చిన్నపసుపుల గ్రామాలను జాగీర్లుగా ఇచ్చాడు.

గుడ్డి నవాబు తరువాత అతని తమ్ముడు మోచా మియ్యా కడప నవాబు అయినాడు.
ఇతని కాలంలోనే కడప, కర్నూలు నవాబులు కలిసి నిజాం నాజర్ జంగ్ ని హత్య చేశారు. నిజాం రాజ్యంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులను అవకాశంగా తీసుకున్న మోచా మియ్య గండికోటను నిజాం ఖిల్లేదారు నుండి స్వాధీనం చెసుకోమని తన సోదరుడి(అబ్దుల్ ఖాదర్ ఖాన్) కుమారుడైన గన్ని మియ్యా ను పురామయించాడు.
గన్నీ మియ్యా గండికోటను స్వాధీనం చేసుకున్న తరువాత కడప నవాబు మోచా మియ్యా గండికోటను తన భార్య మదీనా బీబీకి జాగీరుగా ఇచ్చాడు.

ఆ విధంగా గండికోట మొట్టమొదటిసారి ఒక మహిళా పాలకురాలు ఆధీనంలోకి వెళ్ళింది. కొంతకాలానికి మోచా మియ్యా సోదరుడి(అబ్దుల్ హమీద్ ఖాన్) కుమారుడు అబ్దుల్ మజీద్ ఖాన్
మోచా మియ్యా మీద తిరుగుబాటు చేసి, షాహుకార్ల సహాయంతో కడప నవాబు అయినాడు. కడప నవాబు అయిన తరువాత గండికోటను మదీనా బీబీ నుండి స్వాధీనం చేసుకోవడానికి దండెత్తి వెళ్ళాడు. అయినా మదీనా బీబీ లొంగిపోలేదు. ఇంతకు ముందు గండికోటను స్వాధీనం చేసుకున్న గన్నీ మియ్యా సహాయం అర్థించింది.
గన్నీ మియ్యా పెద్ద సైన్యంతో గండికోట వద్ద ఠాణా వేసి కడప సుబాపై తనకు కూడా హక్కు ఉందని, తన తదనంతరం మోచా మియ్యా తననే కడప నవాబును చేస్తానని మాట ఇచ్చాడని, ఇప్పుడు బలవంతంగా నీవు నవాబు అయినావని, కడప సుబాలో తన హక్కును గుర్తించకపోతే తాను యుద్ధానికి సిద్ధం అని మాజీద్ ఖాన్ కి ఉత్తరం పంపాడు.
గన్ని మియ్యా కూడా అసలైన వారసుడు కావడం చేత, ఒకేసారి ఇద్దరితో యుద్ధం చేయడం ఎందుకని మజీద్ ఖాన్ తాడిపత్రి, యాడికి, కరూరు, పామిడి, పెద్ద కల్లూరు తాలూకాలను గన్నిమియ్యాకు జాగీరుగా ఇవ్వగా అతడు తరలిపోయాడు.

అప్పుడు మజీద్ ఖాన్ గండికోటను స్వాధీనం చేసుకుని మదీనా బీబీని ఖైదు చేయించాడు.
తర్వాత మరాఠుల దండయాత్రలో మజీద్ ఖాన్ ఒడిపోగా, మరాఠులు ఖైదులో ఉన్న మొచా మియ్యాను మళ్లీ కడప సుబా నవాబును చేశారు. అతడు మరాఠులకు కట్టవలసిన పేష్కాస్ నిమిత్తం కడప సుబాలో కొంత భూభాగం వారికి ధారాదత్తం చేసి మళ్లీ మదీనా బీబీని గండికోట జాగీర్దారుగా నియమించాడు.
అయితే అప్పటికే జమ్మలమడుగు తాలూకా మోచా మియ్యా మారాఠులకు ధారాదత్తం చేయడంతో ఆమెకు వారితో కూడా పోరు తప్పలేదు. మదీనా బీబీ తర్వాత గండికోట అనేక మంది చేతులు మారి మైసూరు రాజ్యం పరమై చివరగా బ్రిటీషు వారి పరమైంది.

ఈ విధంగా గండికోట పాలకురాలుగా మదీనా బీబీ చరిత్రలో నిలిచిపోయింద
#సీమస్త్రీలు
Source:

కడప శిలాశాసనములు వగైరా - శ్రీ N వెంకట రమణయ్య, శ్రీ RN సంవత్ (గండికోట దుర్గం కైఫీయత్తు)

మెకంజీ కైఫీయత్తులు - కడప జిల్లా - నాలుగో భాగం (కడప శహరు యొక్క పూర్వోత్తరము)

#సీమచరిత్రలోస్త్రీలు

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

8 Jan
#సీమశాసనాలు #సీమచరిత్రలోస్త్రీలు #సీమచరిత్ర

వెలుగులోకి వచ్చిన రాణి లక్ష్మీదేవి (లక్కుమదేవి) గుండ్లూరు (చిత్తూరు జిల్లా) శాసనం -13 వ శతాబ్దం

రాణి లక్ష్మీదేవి చంద్రగిరి రాజధానిగా చిత్తూరు ప్రాంతాన్ని పాలించిన యాదవరాయ వంశం వారి ఆడపడుచు. నెల్లూరు చోడరాజు తిక్కచోడుడి భార్య
Yādavarāya king Vīra-Nārasingadēva inscription from Gunḍlūru, Andhra Pradesh

This inscription is engraved on a slab kept in front of the Chēnnakēśava temple in Gunḍlūru,Kalikiri Mandalam,Chittoor district,AP.
It is written in Tamil language and characters dated Śaka 1167 (1245 C.E),Vīśvāvasu, Makarasaṅkrānti.

It records the gift of taxfree lands in the village Araisamputtai to the god Kēśavaperumāḷ in Gunḍalūr of Kilaimarayarpaḍi-nāḍu in Iraṭṭapāḍikoṅḍa Chōḷa maṇḍalam by
Read 5 tweets
7 Oct 21
Vijayanagara inscription of Sadāśivarāya from Errakottavāripalli, Andhra Pradesh

It is engraved on a boulder lying near the village Errakottavāripalli in Kalakada mandalam, Chittoor district, Andhra Pradesh.
It is in Telugu language and characters, dated in cyclic year Śobhakṛit, Kārttīka śu. 15 and mentions the rule of mahāmaṇḍalēśvara Jillela Narasiṁharājayyadēva, a subordinate of Vijayanagara king Sadāśivadēvarāya.
Based on this the cyclic year Śobhakṛit falls in Śaka 1465 and the date corresponds to 1543 CE, November 11, Sunday.

It records the gift of dasavadanaṁ and some taxes for the maintenance of a tank constructed at Mustūri by mahāmaṇḍalēśvara Jillēla Narasinghrājayyadēva.
Read 4 tweets
8 Apr 21
మనం మరచిన ధర్మదాతలు - యాదాల్ల నాగమ్మ

కడప పట్టణానికి చెందిన ధర్మాత్మురాలు. వైశ్య ప్రముఖులు. (వీరి వంశం పేరనే కడపలో YV స్ట్రీట్ కి ఆ పేరు వచ్చింది). వీరి గురించి పరిశోధించే క్రమంలోనే అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో పరిచయం ఏర్పడింది.
యాదాల్ల వారు బళ్లారి చెందిన ప్రముఖ వర్తక కుటుంబమట. అప్పట్లోనే బర్మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారట. ఏ కారణంతో వలస వచ్చారో తెలీదు కానీ బళ్లారి నుండి కడపాకు వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో యాదాల్ల నాగమ్మ గారు , యాదాల్ల రంగమ్మ గారు ధర్మదాతలుగా పేరుపొందారు.
నాగమ్మ గారు చేతికి వెన్నెముక లేనట్టు దానాలు చేసేవారని, పేద పిల్లల చదువులకి భూరి విరాళాలు ఇచ్చారని, కరువుకాటకాల సమయంలో పేదలను భోజనం పెట్టి ఆదుకున్నారని చెప్తారు. నేటికీ కడప చుట్టుపక్కల పల్లెలలో యాదాల్ల నాగమ్మ గారి పేరు చెబితే పెద్దలు తమ జ్ఞాపకాలు చెబుతారు.
Read 4 tweets
16 Dec 20
వెలుగోటివారి వంశావళి

వెలుగోడు ఎక్కడ ఉంది ? అసలు వెలుగోటివారు అంటే ఎవరు ?

అనుమనగంటి వారు రేచర్ల వారు ఎందుకయ్యారు ?

రేచర్ల వారు వెలుగోటి వారు ఎందుకయ్యారు ?

వారి రాజధాని దేవరకొండ ను వదిలేసి వెలుగోడుకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు ?

వెలుగోడు అంటే అర్థం ఏమిటి ?
వెంకటగిరి రాజులకు బొబ్బిలి జమీందార్లకు వెలుగోడుతో ఉన్న సంబంధం ఏమిటి ?

బొబ్బిలి జమీందార్ల మూల పురుషుడి గా ఎవరిని భావిస్తారు ?

వెంకటగిరిఅసలు పేరు/ మొదటి పేరు ఏమిటి ?

రేచర్ల పద్మనాయకులలో/వెంకటగిరి రాజుల పేర్లలో యాచెంద్ర / యచమ నాయుడు/యాచ అన్న పదం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది?
వెలుగోటివారైన వెంకటగిరిరాజులకు, కాళహస్తి జమీందారులైన దామెర / దామెర్ల పద్మనాయకులకు సంబంధం ఏమిటి ?

కర్నూలు జిల్లాలోని ఒక చారిత్రక గ్రామం వెలుగోడు. వెలుగోడు జలాశయం ఇక్కడే ఉంది. రేచర్ల పద్మనాయకులు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఈ వెలుగోడును రాజధానిగా చేసుకుని పాలించారు.
Read 34 tweets
9 Oct 20
మ్యాప్ చెప్పే చరిత్ర

1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ మనకు ఎన్నో చారిత్రక విషయాలు చెబుతుంది. అవేంటో చూద్దాం

1. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ - 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు
2.రెండు జిల్లాలు - చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.

3. కడప జిల్లా - ఇప్పుడు కడప జిల్లా చిన్నగా రాష్ట్ర / దేశ సరిహద్దు
లేని జిల్లా కానీ 1840లలో కడప చాలా పెద్ద జిల్లా. ఒకవైపు మైసూరు, మరోవైపు ఆర్కాటు రాజ్యం /గుంటూరు, నెల్లూరు సరిహద్దుగా విస్తరించిన జిల్లా. ఇప్పుడు అనంతపురం లో ఉండే కదిరి, చిత్తూరు జిల్లాలో ఉండే మదనపల్లి, వాయలపాడు, పుంగనూరు, కర్నూలు జిల్లాలో ఉండే కోవెలకుంట్ల, ప్రకాశం జిల్లాలోని కంభం,
Read 11 tweets
8 Oct 20
శీతలా దేవి - సీతాలమ్మ

శీతలా దేవి సర్వ రోగ ప్రశమని. జ్వరం, చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు ఇలా ఏ జబ్బు వచ్చినా, అంటువ్యాధులు వచ్చి ఊర్లకు ఊర్లు వాటి బారిన పడినా ప్రజలను ఆదుకునే తల్లి శీతలా దేవి. 'శీతల' అంటే చల్లదనాన్ని చేకూర్చునది అని అర్థం.

చిత్రం : సీతాలమ్మ తల్లి /యంత్రపు రాయి Imageసీతాలమ్మ తల్లి / యంత్రపు రా...
శీతలా దేవిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మనం అమ్మవారినే అంకాలమ్మ, నూకలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ వంటి పేర్లతో గ్రామదేవతలుగా పూజిస్తూ ఉంటాం. శీతాలాదేవికి విగ్రహాలు ఉంటాయి కానీ చాలా చోట్ల గ్రామదేవతలకు / అక్కదేవతలకు విగ్రహాలు ఉండవు.
ఒక్కో దేవత ప్రతిమగా ఒక్కో రాయిని పెట్టి, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు.
ఈ గ్రామ దేవతలు ఊరిలోకి ఏ చీడ పీడలు రాకుండా అంటువ్యాధులు కలుగ జేసే ఏ మహమ్మారులు పొలిమేర దాటకుండా ఊరికి రక్షణగా ఉంటారు. అందుకే వీరి గుడులు ఊరి పొలిమేర వద్ద ఉండేవి.
Read 8 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(