టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను దైవసాక్షిగా ప్రజలకు వివరించేందుకే భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చా. వరదసాయం నిలిపివేతకు బిజెపియే కారణమంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు.
వరదసాయాన్ని ఆపాలంటూ మేం సీఈసీకి లేఖ రాసినట్లు, అందుకే ఆ నిధులు పంపిణీ నిలిపివేసినట్లు ఫోర్జరీ సంతకంతో కూడిన ఫేక్ లెటర్ ను సృష్టించి అసత్య ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ బిజెపిని బూచిగా చూపెడుతోంది. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వరద బాధితులకు పూర్తి పరిహారం అందాకే ఎన్నికలకు వెళ్లాల్సింది. రూ. 550 కోట్ల వరద సాయం నిధులను టీఆర్ఎస్ నేతల జేబుల్లోకి దారి మరిల్చారు.
పైసల ఆశచూపి పేదలను క్యూలో నిలబెట్టి నానా ఇబ్బందులకు గురిచేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మేయర్ పీఠం అప్పగిస్తే హైదరాబాద్ లో వరద బాధిత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఇస్తాం. వరదబాదితుల వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం అందజేస్తాం.
హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తానని చెప్పి, విషాదనగరంగా మార్చారు. నాలాలు, చెరువుల ఆక్రమణలతో నగరాన్ని ముంచెత్తారు. మూసీనదిని కొబ్బరినీళ్లలా మారుస్తానని ప్రగల్భాలు పలికి తోకముడిచారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఎల్ఆర్ఎస్ దోపిడీపై ఎందుకు నోరు మెదపడం లేదు..?
టీఆర్ఎస్ ఓట్ల రాజకీయం కోసం ఓ వర్గానికి అంటకాగుతూ అడ్డదారులు తొక్కుతోంది. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న చందంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. మేం పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలనుకుంటున్నం. కేసీఆర్ భాగ్యనగరాన్ని పాతబస్తీగా మార్చాలనుకుంటున్నాడు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. నా ఫోర్జరీ సంతకంతో కూడిన నకిలీ లేఖపై నిజానిజాలు తేల్చుకునేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చా.
కేసీఆర్ నా సవాల్ ను స్వీకరించి ప్రమాణం చేసేందుకు వస్తారని ఆశించా...కానీ తోకముడిచారు.
దీంతో, కేసీఆర్ అసలు బండారం, అసలు స్వరూపం బయటపడింది
ఇప్పటికైనా కేసీఆర్ అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలు మానుకోవాలి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కేసీఆర్ కు బిజెపి అంటే భయం పట్టుకుంది. ఊపర్ షేర్వానీ..అందర్ పరేషానీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ను ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడు.
కేసీఆర్, ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడి దారుస్సలాం, మక్కామసీద్ కు వెళ్తాడు. కానీ, హిందూ దేవాలయాలకు రావడానికి మాత్రం సంకోచిస్తారా..?
చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయానికి నేను ఎందుకు వెళ్లకూడదు..? అసలు భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద.
అలాంటి భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి ఎందుకు పోకూడదు. అది ఏమన్నా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉందా ?
టీఆర్ఎస్ నేతలకి సవాల్ విసురుతున్నా, ఏ గుడికి రమ్మంటారో చెప్పండి.
ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో, ఎవరు తప్పు చేశారో అందరికీ తెలుసు. వరద సాయంపై ఈసీకి మేం లేఖ రాయలేదు.
ముస్లిం మైనారిటీలకు బి.సి రిజర్వేషన్ల పేరిట హిందువులైన బలహీన వర్గాల విద్యార్థులు యువతకు, విద్యా, ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో అన్యాయం చేస్తున్న కేసీఆర్ సర్కార్ తీరును ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చి బిసిలు కేసీఆర్ సర్కారు ను సమాధి కట్టాలని, బిజెపికి సంపూర్ణ మద్దతు ఇచ్చి,...
...ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరాను. గత జిహెచ్ఎంసి ఎన్నికలి బిసిల కోటాలో చాలా మంది ముస్లిం మైనారిటీలు, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల తరుపున కార్పొరేటర్లు గా పోటీ చేసి గెలిచిన విషయాన్ని హైదరాబాద్ నగర ప్రజలు గుర్తించుకోవాలని తెలుపుతున్నాను.
అన్నివర్గాలకు చెందిన బి.సి సోదరి, సోదరీమణులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి కి మద్దతు ఇచ్చి అన్ని డివిజన్లలో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు సహకరించి కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశాన్ని అమ్ముతున్నాడంటూ కేసీఆర్ అనుచితంగా మాట్లాడటం దుర్మార్గం. ప్రధాని శ్రీ @narendramodi గారిపై @TelanganaCMO కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ కచరా బుద్ధులు మానుకోవాలి.
(1/11)
ఎన్నికలు రాగానే సీఎం కేసీఆర్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటారు. ఆ తరువాత టెంట్ ఎత్తేస్తారు. హీనమైన, నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కచరాది. తెలంగాణలో కచరాను ఊడ్చేవేస్తాం...అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది.
(2/11)
దేశం కోసం...ధర్మం కోసం, సమాజం కోసం పరితపించే వ్యక్తి, తల్లి భారత్ ను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించేందుకు సంకల్పం తీసుకున్న మహోన్నత వ్యక్తి @narendramodi.
గౌరవప్రదమైన ప్రధాని మోదీ గారిని అవమానించడం సిగ్గుచేటు.
(3/11)
ఎన్నో పోరాటాల ఫలితంగా 1952 ఆగస్టు 31న ప్రభుత్వం సంచార జాతుల్ని విముక్త జాతులుగా ప్రకటించింది. అందుకే ఆ రోజును సంచార జాతుల ప్రజలకు చాలా ప్రత్యేక రోజుగా, నిజమైన స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణిస్తారు.ఈ సందర్భంగా సంచార జాతుల సోదరులకు శుభాకాంక్షలు.
గ్రామీణ సమాజంలో సంచార జాతులది కళాత్మకమైన జీవనశైలి. పల్లెపల్లెలు తిరుగుతూ పొట్ట పోసుకునే సంచార జాతుల్లో చాలా మంది శాశ్వత చిరునామా లేకుండా జీవిస్తుంటారు. పూర్వం సంచార జాతులైన బుడబుక్కల, గంగిరెద్దులు, బాలసంతల వాళ్లు కళల్ని, ధర్మాన్ని, తత్వాల్ని ప్రదర్శించేవారు, ప్రచారం చేసే వారు.
ఒక చోట నుంచి మరోచోటకు సంచరిస్తూ అద్భుతమైన,భావయుక్తమైన సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేవారు.ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి,భాష,సాహిత్యం వాడుకలో ఉంటాయి.సంచార జాతులు తమ కళారూపాల ద్వారా వాటి విస్తృత వ్యాప్తికి కృషి చేశారు.
కెసిఆర్ ఓ తుగ్లక్..ఓ నీరో చక్రవర్తి.
సెక్రెటరీయేట్ కే రానోడికి సెక్రెటరీయేట్ ఏందుకు? ఇదే 500 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేది.చరిత్ర కలిగిన కట్టడం సెక్రెటరీయేట్.
(1/7)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సరిపోయే విధంగా కట్టిన కట్టడాన్ని,కెసిఆర్ పిచ్చి చాదస్తంతో,భూతాలు,ప్రేతాలు పట్టిన మానసిక రోగిలాగా ప్రవర్తిస్తూ,రాత్రికి రాత్రే సెక్రెటరీయేట్ ను కూలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణాలో నిజాం పాలన,నిరంకుశ,నియంతృత్వ పాలన కొనసాగుతోంది.
(2/7)
తెలంగాణ సెక్రెటరీయేట్ ను కూలగొట్టాలని,కెసిఆర్ కేబినేట్ తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైన చర్య.మతిలేని కేబినేట్ నిర్ణయాలవల్ల ఈ రోజు 500 కోట్ల ప్రజా ధనం వృధా అవుతోంది.గతంలో ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టి,అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ కడతానని మాటిచ్చారు.
(3/7)