చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చుగాని పిండి మరకెళ్ళాల్సిన కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదు. ఆసాంతం చదివి మీరే అవునో, కాదో చెప్పండి. నా బాల్యంలో కొంత కాలం అవనిగడ్డ, గిద్దలూరు, ఇచ్చాపురం వంటి చిన్న ఊళ్ళల్లో గడిచింది. అప్పట్లో అన్నపూర్ణా ఆటాలు,ఆశీర్వాద్ ఆటా ఆశీర్వాదాలు
మాకు దొరకని కష్టకాలమాయే. అందరూ గోధుమలు, ధాన్యం, పప్పులు మర ఆడించుకోవల్సిందే. ఈ పనికోసం అమ్మలు, అమ్మమ్మలు మమ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమరకు తోలేవాళ్ళు. మాకు ఇప్పటి పిల్లలంత అవేర్నెస్ లేకపోవడంతో కార్మిక శాఖకు కంప్లైట్ చేయాలని తెలియదు.
మేము అలా పిండిమర దారిపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జల్లులా మరకు పోయి వస్తే పావలానో, పదిపైసలో ఆకర్ష్ పథకానికి ఆశ పడి ఈ సాహసానికి సిద్దపడితే మేము పడ్డ కష్టాలు పగోడికి కూడా వద్దు.
అమ్మలు మరవాడికి ఒక కేజీ తక్కువ చేసి చెప్పమని చెప్పి పంపేవారు. మరకు పోయి అబద్దం చెప్పడానికి పూర్తిగా సాహసించలేక పిండిమర చక్రాలు కర్కర్ మని చేసే సౌండ్లో అశ్వద్దామ హతఃకుంజరః అన్నట్లుగా మూడు కేజీలని రెండనో నాలుగును మూడనో అనేసేవాళ్ళం. పిండిమర వాళ్ళు
ఇంట్లో మరకు పంపేముందు కణ్వమహర్షి శకుంతలకు చేసే అప్పగింతల కంటె ఎక్కువే మాకూ బోధ జరిగేది. ”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడకు,
పిండికాజేస్తారు జాగ్రత్త” అని, మరుమ్గా పట్టించమనో, మెత్తగా పట్టించమనో, పసుపు తరువాత ఆడించవద్దనో, కారం తరువాత ఆడించవద్దనో ఆంక్షలు చెప్పి పంపేవారు. ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా అని మేము పిండిమరలో అడుగు పెట్టిన దగ్గరనుండి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ
వింగ్ వాళ్ళు డేగ కన్నుతో చూస్తున్నట్లుండే వాళ్ళం. దీనికితోడు ప్రతి పిండి మరలో ఒక సన్న గొట్టం దొంగ చాటుగా వాళ్ళ ఇంట్లోకి ఉంటుందని అందులోనుండి కొంత పిండి మరవాళ్ళు కాజేస్తారన్న బలమైన రూమరుండేది.
మా దుర (అ)భిమాన పిండిమర
పిండిమరకు చేరుకుని హై ఎలర్ట్ లో వెయిటింగ్లో
ఉంటే ఈ లోపు మరవాళ్ళు మేము పిల్లలం గనుక పెద్దల్ని, నోరుగలవాళ్ళని ప్రయార్టీలో పెట్టేసేవారు. ఆ రోజుల్లో కరెంట్ ఉన్న సమయం కంటే కరెంట్ కట్ సమయమే ఎక్కువ కావడంతో వెయిటింగ్ తప్పేది కాదు. ఈవినోదాన్ని గమనిస్తూ కొంత సేపయ్యేప్పటికి మరలో లేచిన పిండంతా తలమీద పడి మాకు
బాలవృద్దుల గెటప్ వచ్చేసేది. కాసేపటికి ఆ గోలలోనే ఆపరేటర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని స్పెసిఫికేషన్స్ చెప్పేలోపే పైనున్న బకెట్ లో పోసేసి పిండి వచ్చే గొట్టానికి వేలాడుతున్న టార్పలిన్ గుడ్డను మడిచి గొట్టం మీదకు తోసి కర్ కర్ మని విష్టుమూర్తిలా రెండు చక్రాలు
తిప్పేవాడు. పైన బకెట్లో వేసిన గోధుమలు గ్రైండర్లో నలిగి క్రింద ఉన్న టిన్లో పడటానికి మూడు, నాలుగు నిముషాలు పట్టేది. పిండి నలిగి కిందకు పడే టైమ్ కు మడచి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డబ్బాలోకి సెట్ చేసేవాడు. ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా
వస్తుందో లేదో అన్న టెన్షన్తో మా నరాలు చిట్లుతుండేవి. (ఇంట్లో పెట్టిన అప్పగింతలు భయాలు సామాన్యమైనవా!) మనపిండి ఆడుతున్నంత సేపూ ఏ చక్రం తిప్పినా ఎటువెళ్ళినా మన పిండి పోతోందన్న అనుమానంతో మాకు మనశ్శాంతి ఉండేదికాదు. కాసేపటికి డబ్బాలో పడ్డపిండిని మన క్యాన్లో వొంపి
పొమ్మనేవాడు. మన కళ్ళన్నీ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో బాలు వైపే తిరుగుతున్నట్లు ఆపరేటర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి.
ఈ అడ్వెంచర్ ముగించుకుని తల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్కో తగిలించుకుని మనకు ఇవ్వబోయే పావాలాకు బడ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ ఇల్లు
చేరేవాళ్ళం. ఇంటికి రాగానే క్యాన్ లో వచ్చిన పిండిని తూనికలు కొలతల శాఖల వలె హోమ్ శాఖవారు కొలిచేవారు. ఇహమొదలు ”ఎటు దిక్కులు చూశావ్! ఆ చచ్చినోడు మోసం చేసి పిండి కాజేశాడు. మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్రయోజనం, అరకేజి తక్కువొచ్చింది. మెత్తగా పట్టమంటే బరగ్గా పట్టాడు.
నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క పనీ వివరంగా చేసుకురాలేవు” అంటూ కేంద్ర్రప్రభుత్వం జి.ఎస్.టీ కాంపెన్సేషన్ ఎగొట్టినట్లో, తగ్గించినట్లో వారి దయాదాక్షిణ్యాలతో కొంత కోత విధించి పదిపైసలే ఇవ్వడమో మరీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు. ఇలాంటి చేదు అనుభవమైన
తరువాత మళ్ళీ మరకు పోకూడదు అనుకునే వాడిని కాని ప్రతీసారీ కొత్త రాయితీలతో నమ్మబలికి పంపేవారు. క్లైమాక్స్ మాత్రం ఒక్కటే, ‘పిండి తక్కువ, మోసం జరిగిపోయింది. మీ వల్ల ఏమీ కాదు’.
Jhoot Bole Kauwa Kaate మై మరకే చలే జాయేంగే
పిండిమర విధులు ఎలక్షన్ డ్యూటీల్లా ఏ
మినహాయింపులు లేనివే. నేను ఇంటర్ చదివేటప్పుడు సెలవలకు మా ప్రసాదన్నయ్య గుడివాడ వచ్చాడు. ఆ రోజుల్లో బాబీ సినిమా విడుదలై ఒక వూపు వూపేస్తోంది. కాలేజి నుండి ఇల్లు చేరుకునేందుకు సందు తిరగ్గానే ప్రసాదన్నయ్య రెండు చేతుల్లో రెండు క్యాన్లతో ఎదురయ్యాడు.‘అన్నయ్యా ఎక్కడికి?’
అని అడగ్గానే నిన్ననే మేము చూసొచ్చిన బాబీ సినిమాలో ‘మై మరకే చలే జాయేంగే` పాటెత్తుకుని ‘పిండిమరకే చలేజాయేంగే’ అని హుషారుగా పరుగెత్తుకున్నాడు. భవిష్యత్ in front crocodiles festival అని తెలియక కదా అన్నయ్య ఇంత ఎగిరెగిరి పడుతున్నాడు అనుకున్నా. నేను ఊహించినంతగా కాకపోయినా
మర నుండి తిరిగొచ్చిన తరువాత హోమియో లో పొటెన్సీ డోసు పడనే పడింది. బావ కొడుకని సంభావింపక మా అన్నయ్యను తగురీతిగానే అమ్మ సత్కరించింది.
ఆ రోజుల్లో పిండిమర స్వానుభవం అయిన సాటి కామ్రేడ్స్ అందరికీ ఒక్క విషయం అర్థమై ఉంటుంది. యూనివర్సిటీ వీ.సీ.గా పనిచేసి విద్యార్థులతో
తిట్టించుకోకుండా ఉండొచ్చేమో, ఎమ్మేల్యేగా నియోజకవర్గ ప్రజలందరితో మంచి అనిపించుకోవచ్చేమో కానీ పిండిమరకెళ్ళొచ్చి మంచి పనిమంతుడనిపించుకోవడం మాత్రం దుర్లభం.
ఎక్కడో మహాకవులు డా.ఎన్.గోపి వంటివారు తప్ప మానవమాత్రులు పిండిమరల పై మరులుగొనలేరు.
వారు వడ్ల గిర్ని పై రాసిన అద్భుతమైన కవితలోని కొన్ని వాక్యాల తో ముగిస్తా.
”యాభైయ్యేండ్ల కిందటి ముచ్చట
ఆ పట్టాచప్పుడు
పేదవారి బతుకు లయను ధ్వనించేది
అతుకుల వల్ల ఏర్పడిన శబ్దాలవి
అతుకు ఒకటైతే టిక్టిక్
అనేకమైతే
టక్ టిక్ టక్ టిక్ టక్ టిక్ ……..
వడ్ల గిర్ని ఫోటో తీస్తే
దాని పక్కన
ఓ పేదకార్మికురాలి అవతారంలో
మా అమ్మమ్మ కనిపిస్తుంది
వడ్లను చేటలతో
ఇనుపతొట్టిలో పోసే కూలిపని ఆమెది
రెండు బస్తాల ఒక్క రైతులు
ఓ పిడికెడు బియ్యం
ఆమె గంపలో పోసి పొయ్యేవారు
మా అమ్మమ్మ కూడ బెట్టిన
ఆనాటి గింజలే
ఇవాళ్టి నా కవితాక్షరాలు ….
ఇప్పటికీ
దారిలో ఎక్కడన్న
వడ్లగిర్ని కనిపిస్తే
కారును స్లో చేస్తాను
మా అమ్మమ్మ కనపడుందేమో అని”
(ఆప్తులు ఆచార్యగోపి గారికి కృతజ్ఞతలతో …)
నా స్వంత పైత్యం:
ఇవే అనుభవాలు ధాన్యం మిల్లులో బియ్యం పట్టించడం, గంగలో నువ్వుల నూనె ఆడించడం కూడా ఈ కోవలోకే వస్తాయి.
ఈ రెండింటిలో నాకు చాల అనుభవాలు అయ్యాయి చిన్నతనంలో.
మరి మీకో!
It is not "gangalo" but "ganugalo"
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
*ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది.
ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం,
ఆ ఆంగ్లేయుడు గమనించాడు.*
*తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.*
*మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు.
'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? '
' రంభా, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ? పైకొచ్చే మగవెధవలందరికోసం కాసుక్కూచోడానికి? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం ఎవరో తెలీని ఆడదానితో పడుక్కోడానికన్నమాట'
కోవిడ్ దెబ్బకు అన్నీ ఆన్ లైన్ విచారణలు జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ఐతే ఈ ఆన్ లైన్ లో కూడా న్యాయవాదులు కోర్టుకు వచ్చినట్లుగానే బ్యాండ్, కోటు, గౌను ధరించాల్సిందే. అలా కాకుండా అపియర్ అయిన వాళ్ళను కేకలేసి కేసు వాయిదా వేసిన సంఘటనలు
కోకొల్లలు.
అలా ఉన్న సమయంలో ఒక సీనియర్ న్యాయవాది గారు సమయం మించిపోతోందని హడావిడిగా కోటు, గౌను, బ్యాండు తగిలించుకుని ఆన్ లైన్ లోకి వచ్చారు, ఆయన తన వాదన వినిపిస్తున్నారు,
మధ్యలో ఆ లాయరు గారి భార్య టిఫిన్ పట్టుకొచ్చి "తినకుండా కూర్చుంటే ఎలా? అడ్డం పడితే చెయ్యడానికి ఎవరూ లేరు" అంటూ
టిఫిన్ ప్లేటు కంప్యూటర్ ముందు పెట్టేసిందట. అనుకోని సంఘటనతో లాయరు గారు బిక్క చచ్చిపోయారు. ఆన్ లన్ లో అవతల ఉన్నది సుప్రీమ్ కోర్టు జడ్జీలు. వాళ్ళు కూడా అవాక్కైపోయారట.
ఐతే లాయరుగారు వెంటనే తేరుకుని "Me Lords, it is easier to face Contempt of Court than Contempt of Housewife" అన్నారట.
🌸 *చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు* 🌸
'' ఈ వాన లో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి , '' అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు. ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. ' ఆమె మన అతిథి . ఆమె టీ , కాఫీ తాగరట. పాలు ఇవ్వు ,
' అని ఆ కూలీ అంటే ' మన పాప కు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంటుంది , ' అంది ఆమె. ' అయినా పరవాలేదు , సగం పాలకు సగం నీళ్ళు కలిపి , చక్కెరతో ఇవ్వు, 'అన్నాడు ఆయన.
ఒరియా తెలిసిన సుధా మూర్తి కి అది వినపడింది. ' ఈ రోజు బుధవారం ,
నేను ఉపవాసం. ఏమీ తీసుకోను , ' అంది ఆమె. ' అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ? అని అతనంటే ' అవును. నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను , ' అన్నారు ఆమె.
ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు. గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షలమంది నాదేశం
*తెలుగు భాష లో దాగి ఉన్న వ్యాయామం గురించి తెలుసుకుందాం.*
☘☘
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.*
🌸🌸🌸
*తేట తేట తెనుగులా.*
🌸🌸🌸
*మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది.*
🌸🌸🌸
*ఏలాఅంటే.*
🌸🌸🌸
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:*
🌸🌸🌸
*ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.*
🌸🌸🌸
*క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం.*
🌸🌸🌸
*చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం.*
🌸🌸🌸
*ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం.*
🌸🌸🌸
*త థ ద ధ న……నాలుక కొస భాగం.*
🌸🌸🌸
*ప ఫ బ భ మ……..పెదవులకు.*
🌸🌸🌸
*య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా.*
🌸🌸🌸
ప్రతిరోజూ ఉదయాన్నే ఓ చిన్నారి ఓ దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి, కళ్ళు మూసుకుని,
చేతులు ముడుచుకుని, కొన్ని నిమిషాలు ఏదో గొణుక్కుంటోంది. తరవాత కళ్ళు తెరిచి నమస్కరించి, నవ్వి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయేది.
ఇది రోజువారీ వ్యవహారం.
పూజారి ఆమెని గమనిస్తూ ఉన్నారు.
ఆ పిల్ల ఏమి
చేస్తోందో అని ఆసక్తి మొదలైంది.
ఆయన ఆలోచించాడు, మతం యొక్క లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ఆమె చాలా చిన్నది,
ఆమెకు ఎలాంటి ప్రార్థనలు తెలియవు.
అయితే ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏమి చేస్తోంది?
పదిహేను రోజులు గడిచాయి. పూజారి ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి మరింత తెలుసుకోవడానికి
ఆలోచన చేస్తున్నారు.
ఒకరోజు ఉదయం, పూజారి ఆ పాప కంటే ముందే
అక్కడికి చేరుకుని ఆమె కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి...
ఆమె తలపై చేయి వేసి, “చిట్టి తల్లి, గత పదిహేను రోజుల నుండి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడకు రావడాన్ని
నేను చూస్తున్నాను. ఏమి చేస్తున్నావు రోజూ?"