శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 🙏🏼🙏🏼
లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ
నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం
కోసం బాలార్చన చేస్తారు.
అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది.
త్రిపుర సుందరి అంటే " మనలోని ముడు అవస్థలూ...జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈ ముడు అవస్థలు ...లేద పురములకు బాల అధిష్ఠాన దేవత!
ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ...."బాలగా.."....అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు
అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.
అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది....ఆవిడ ఆత్మ స్వరూపురాలు....ఆవిడను పూజిస్తే....ఙ్ఞానము కలిగి .. ...తానె శివ స్వరూపము తో...చైతన్యము ప్రసాదించి...మోక్షమునకు...అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది...ఈ కరుణామయి..
సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది.
ఈ రోజు రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.
అమ్మవారికి పాయసం నివేదన చెయ్యాలి.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
శుభోదయం 🌹🌹🌹
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం.తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటారు.. అవి..ముక్త, విద్రుమ,
హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తారు.
పురాణాల ప్రకారం.. ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపలో రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింప బడుతుంది.
గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత
ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ధర్మం నాలుగుపాదాల ఉండేటట్లుగా అత్యంత జనప్రియంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. ఒక రోజు రాజకుమారుడు నగర సందర్శనం
చేస్తుండగా అతని రథచక్రాల కింద ఒక బాలుడు ప్రమాదవశాత్తూ పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు దుఃఖించి రాజును న్యాయం చేయమని వేడుకుంటారు. రాజు విచారంతో తన కుమారుడే ఈ సంఘటనకు కారణమని తెలిసి మరణశిక్ష విధిస్తాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడంతో పాటూ
మాతృదేవో భవ! పితృదేవో భవ!
నేడు మహాలయ అమావాస్య నేడు పితృదేవతలకు తర్పణం విడిచి పితృదేవతల అనుగ్రహానికి పాత్రులు అవుదాము🙏
మాతాపితరలను కలిపి పితరులు అంటాము. వారిని సరిగ్గా చూసుకుని ఆనందపరిస్తే వారు ఆనందించడమేకాక పితృదేవతా వ్యవస్థ ఆనందిస్తుంది. మరి దేవతలకు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి.మరి
పితృదేవతలకు.?ఉంది. బ్రుహద్ధర్మ పురాణంలొ పితృస్తుతి అనేది ఉంది.ఇది చాలా మహిమాన్వితమైనది.సాక్షాత్తు బ్రహ్మదేవునిచే చేయబడిన స్తోత్రరాజము. దీనిని ప్రతిరోజూ లేదా శ్రాద్ధ దినములందు చదువవలెను. మన పుట్టినరోజునాడు తప్పక చదువవలసినది. పితృదేవతల అనుగ్రహం ఉంటే అందరు దేవతల అనుగ్రహం ఉన్నట్లే.
ఆ ఇంట్లో అక్కా చెల్లెళ్లు ఐదుగురూ కలెక్టర్లే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కలెక్టర్ కావాలన్న తమ తండ్రి కోరిక మేరకు వారంతా సివిల్స్కు ప్రిపేర్ అయి.. అనుకున్నది సాధించారు. తమ తండ్రి కోరికను నెరవేర్చేలా చేశారు. అయితే ఆ కుటుంబంలో తొలుత ఇద్దరు..
తర్వాత ఇప్పుడు ఏకంగా ముగ్గురు కలెక్టర్లుగా మారారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రాజస్థాన్లోని హనుమాఘర్కు చెందిన సహదేవ్ సహరన్ ఒక సాదాసీదా రైతు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు. వీరికి రోమా, మంజు, అన్షు, రీతు, సుమన్ అని
పేర్లు పెట్టారు. తనకు కొడుకులు లేరని సహదేవ్ ఏనాడూ కుంగిపోలేదు. అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా... ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు