#DosaDay 🥘🍳 #Dosa #dosarecipes
దోశ/అట్టు, దక్షిణభారతీయులకు ఇష్టమైన అల్పాహారం. దోశ పుట్టుపూర్వోత్తరాలు అంతగా తెలియదు. ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయో కచ్చితమైన ఆధారలు లేవు. దోశ భారతీయులకు అందరికీ పరిచయమైన అహారమే అయినా దక్షిణ భారతీయులకు మాత్రం ఇది అత్యంత ఇష్టమైన అల్పాహారం.
దీనిని దోశ, దోసె, దోసై, అట్టు అని కూడా ప్రాంతాల వారిగా అంటూ ఉంటారు. అంతేకాదు అట్లకోసం ఒక పండుగ కూడా ఉంది. అదే అట్ల తద్ది.అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుతూ ఈ నోము చేస్తారు. వివాహము అయిన తరువాత ఈ నోము తప్పక తీర్చుకోవడం కొంత మందిలో
ఆనవాయితీగా వస్తుంది. స్త్రీలు అట్లతద్ది నాడు శుచిగా అట్లు పోసి వాటి మధ్య పప్పు, బెల్లం, నెయ్యి ఉంచి ఇంటి సింహద్వారం పూజించి అట్లను నైవేద్యంగా ఉంచి నమస్కరిస్తారు.
దీనిని ఎక్కువగా తెలుగు వారు ఆచరిస్తారు. నోము నోచుకున్న వారు అట్లు పోసి ఒక్కొక్కరికి అట్లను పప్పు, బెల్లం, నెయ్యి చేర్చి ముత్తైదువలకు వాయనం ఇస్తారు. ఇలా అట్లకు సంప్రదాయంలో కూడా చోటు ఉంది.
పాత కాలంలో స్త్రీలు ఉద్యోగాలు చేయరు కనుక ఆర్థికంగా జరుగుబాటు తగ్గిన సమయంలో ఇంట్లో అట్లు తయారు చేసి అమ్మడం ద్వారా జీవనం సాగిస్తుంటారు. ఇవి కూడా తెలుగు నాట ప్రసిద్దం. తెలుగు వారికి చాలా మందికి ఇవి పరిచయమే. ఇంటి రుచితో అందిస్తారు కనుక అలాగే కొంత అందుబాటు వెలలో లభ్యమవుతాయి కనుక
వీటికి ప్రజాదరణ అధికంగానే ఉంటుంది. వీటిలో తెలుగు వారి ప్రత్యేకం పెసరట్టు. పెసరట్టు అల్లం చట్నీతో తినడం ఆనవాయితీ. పెసరట్టు పులవబెట్టనవసరం లేదు. ఇలా దోశలతో దక్షిణ భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా తెలుగు వారికి మరింత ఇష్టమైన అల్పాహారం.
ఇవి ఉడిపి హోటళ్ళలో బాగా ప్రసిద్ధిచెందాయి. దోసెలతో సహా పచ్చడి, కూర కూడా ఇస్తుంటారు. దీనిలో ముఖ్యమైన పదార్థం మినుములు.

దోసె దక్షిణ భారతదేశానికి చెందినది; కాని, ఈ ప్రాంతంలోనే కచ్చితమైన దీని జన్మస్థలం అనేది మాత్రం ఊహాజనిత విషయం.
ఆహార చరిత్రకారుడు కె.టి. ఆచయ, సంఘం సాహిత్యంలో సూచించిన ప్రకారం, ప్రాచీన తమిళ దేశంలో దోసె (దోసాయ్) వంటిది 1 వ శతాబ్దం ఎ.డి. ప్రాంతంలో అప్పటికే వినియోగంలో ఉందని తెలియజేసాడు. అదేవిధంగా, చరిత్రకారుడు పి. థానపాన్ నాయర్ అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత కర్నాటకలోని ఉడిపి పట్టణంలో
దోసె పుట్టింది అని చెప్పాడు. ప్రసిద్ధ సంప్రదాయంలో, దోస యొక్క మూలం ఉడిపితో ముడిపడి ఉంది. అందుకు కారణం బహుశా ఉడిపి రెస్టారెంట్ల లోని పదార్థాలు దోసకు అనుబంధంగా ఉండటమే కారణం కావచ్చును. అంతేకాకుండా, అసలు తమిళ దోస అనేది మృదువుగా, మందంగా ఉంటుంది.
ప్రస్తుత కర్ణాటకలో మొట్టమొదటిసారిగా రూపొందించబడినది పలుచగా, కొద్దిగా కరకరలాడుతూ ఉండే ఈ దోస మాత్రం భారతదేశం అంతటా జనాదరణ పొందింది. ప్రస్తుత కర్నాటకను పాలించిన సోమేశ్వర III చేత వ్రాయబడ్డ (రచించబడ్డ/లిఖించబడ్డ) 12 వ శతాబ్దపు సంస్కృత ఎన్సైక్లోపీడియా అయిన మానసోల్లాస నందు
దోస (దోసక వలె) అనే ఒక వంటకం గురించి చూడవచ్చును. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత, దక్షిణ భారతదేశానికి చెందిన వంటకం ఉత్తర ప్రాంతంలో క్రమంగా విస్తరించి ప్రజాదరణ పొందింది. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్ లోని మద్రాస్ హోటల్ దక్షిణ భారత వంటకాల్లో మొదటి రెస్టారెంట్ అనే పేరు గాంచింది.
ఇది 1930 సం.ల్లో ఉడిపి రెస్టారెంట్లతో ముంబాయి ప్రాంతానికి వచ్చారు. 1940 దశాకాల ప్రారంభంలో కె. కృష్ణరావు అనే వ్యక్తి చెన్నై ప్రాతంలో ఓల్డ్ ఉడ్‌ల్యాండ్ హోటల్స్‌ను నడిపించాడు. ఇప్పటి ఆధునిక రూపంలో ఉన్న మసాలా దోసకు ఆరంభకుడుగా, మూలకర్తగా కొన్నిసార్లు పరిగణించబడుతూ ఉంటాడు.
పోషకాలు
సంప్రదాయబద్ధంగా సామాన్యంగా చాలా చోట్ల అరటి ఆకులో వేడి దోసె, చట్నీ, సాంబార్ వేసి ఫలహారంగా వడ్డిస్తారు. దోసె ఏవిధమైన చక్కెరలు లేదా సంతృప్త కొవ్వులు ఉండకుండా కేవలం కార్బోహైడ్రేట్లను అధికంగా కలిగి ఉంటుంది. దీనిలో కేవలం ప్రొటీన్‌కు మంచి మూలపదార్థమయిన
మినుము, బియ్యపు పిండి ముఖ్యమైన పదార్థాలు మాత్రమే ఉంటాయి. దోసెకు కావలసిన పిండి కిణ్వ ప్రక్రియ ద్వారా తయారవుతుంది కాబట్టి విటమిన్ బి, విటమిన్ సి మూలపదార్థంలో పెరుగుతాయి.
అప్పటికప్పుడు దోసెను తయారు చేయడానికి సాధారణంగా అధిక మొత్తంలో బియ్యపు పిండి ఉన్నటువంటి తక్షణ మిశ్రమాహార ఉత్పత్తులు కూడా ఉన్నాయి.
తయారీ విధానం
దోసె తయారీకి ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు అటుకులు, రెండు గ్లాసుల బియ్యం, కొద్దిగా మెంతులు 6 గంటలు నానపెట్టుకోవాలి. వీటిని బాగా మెత్తగా మిక్సీ లేదా గ్రైండర్ లేదా రోట్లో కాని రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు లేదా సరిపడా వేసుకోవాలి.
ఈ రుబ్బుకున్న పిండిని సుమారు 8 గంటలు ఉంచి ఆ తర్వాత దోసెలు వేసుకోవాలి.

రకాలు

పంచ రత్న దోశ, పంచ రత్న దోశ, కాలిఫ్లవర్ దోశ, పొడి దోశ, కొబ్బరి దోశ, ఉప్పు పుళి దోశ , అటుకుల దోశ, అమెరికన్ చాప్ స్యూ దోశ, 70 ఎమ్ ఎమ్ దోశ, క్యాబేజి దోశ, నీర్ దోశ , బెన్నే దోదోశ,సెట్ దోశ, ఊతప్పం,
గుడ్డు దోశ, రాగి దోశ, వెళ్ల దోశ, గోధుమ పిండి దోశ, రవ్వదోశ, కోన్ దోశ, మెంతి దోశ, చౌ చౌ దోశ, ఆకుపచ్చని దోశ, పేపర్ దోశ, కుటుంబ దోశకేరళా దోశ, కాల్చిన దోశ, వెన్న దోశ, నెయ్యి దోశ, ఎర్రగడ్డ దోశమసాలా దోశ, కారపు దోశ

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

24 Oct
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం
#UnitedNationsDay
ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది.
అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
Read 5 tweets
24 Oct
#MotherInLawDay #motherinlaw
అత్తగారు అనగానే చాలామందికి కోడల్ని తిడుతూ నిష్ఠూరాలాడే సూర్యకాంతం పాత్ర కళ్లముందు కదులుతుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. మరిప్పుడు అమ్మతో ఉండే సాన్నిహిత్యం, అక్క దగ్గరుండే చనువూ అత్తగారితోనూ ఏర్పడుతున్నాయి. మెట్టినిల్లూ పుట్టినిల్లుగా మారిపోతోంది.
ఈరోజు అత్తగార్ల దినోత్సవం సందర్భంగా అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు.
తల్లి సోదరుడి భార్యను, నాన్న సోదరిని కూడా అత్త అంటారు.నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.
సంబంధాలు:-
మేనత్త తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
Read 21 tweets
23 Oct
పరాయి దేశానికి చెందిన హ్యూలెట్ పాకర్డ్ (hp) కంపెనీ తన ప్రింటింగ్ మెషిన్ యాడ్ ను ఎంతో సభ్యత సంస్కారాలతో తయారుచేసింది.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, దీపావళి పండుగకు దేశీయ ఉత్పత్తులు కొనమంటూ ఈ యాడ్ నడుస్తుంది.
@ivak99

తన ఉత్పత్తిని ప్రమోట్ చేసుకోవడానికే ఈ యాడ్ తయారుచేసుకున్నా, Go Local అంటూ పిలుపునిచ్చింది. ఇంకా ఈ యాడ్ లో ....
#VocalForLocal

మన నిరక్షర గ్రామీణ వృద్ధురాలిని అందంగా చూపించారు.

ఎవరూ కొనడం లేదనే ఆమె బాధను మౌనంగా చూపించారు.
తల్లి నిర్లక్ష్యం చేసినా, పసి మనసులో ఉన్న ఔన్నత్యమైన మానవత్వాన్నిచూపించారు...

ఆ పిల్లవాడి మనసులో ఏదో చేయాలన్న తపన చూపించారు...

అతనిలో ఉన్న క్రియేటివిటీని, మార్కెటింగ్ స్కిల్స్ ని చూపించారు.

తాతమ్మ వయసున్న ఆమెను ఆటపట్టించడం చూపించారు...
Read 7 tweets
23 Oct
#SnowLeopardDay ❄🐆 #Snow
మీరు చిరుత పులుల గురించి వినే ఉంటారు.కానీ మంచు చిరుతల గురించి ఎప్పుడైనా విన్నారా? భారత దేశంలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వీటి అరుదైన దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. @LakshmiManchu @HeroManoj1 @iVishnuManchu
మంచు చిరుతలు

'ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెన్‌ ఇదే'...
ఇండియాలో కనిపించిన మంచు చిరుత...

ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెన్‌' సముద్ర మట్టానికి 9,800 నుంచి 17 వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై మాత్రమే కనిపించే అరుదైన చిరుతపులి.
మామూలు చిరుతకు పసుపు రంగు కళ్లుంటాయి.
కానీ వీటికి మాత్రం పచ్చగా, బూడిద రంగులో కళ్లు ఉంటాయి. వీటి తోకలు కూడా చాలా పొడవు. చలి నుంచి శరీరాన్ని తట్టుకునేలా ఐదు అంగుళాల మేరకు వెంట్రుకలను కలిగివుంటాయి. ఈ అందమైన మంచు చిరుత పులుల యొక్క దృశ్యాలను భారత విదేశాంగ సేవ అధికారి ఆకాశ్ కుమార్ వర్మ తన ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్నారు.
Read 9 tweets
23 Oct
*సంగటి ముద్ద..!!

"పంత పొయ్యిమీద కుండపెట్టి..
దాంట్లో నీళ్లు పోసి..
రెండుగలాసులు కందివాళ్లుపోసి..
కోసిన టమోటాలు, వట్టి మెరపకాయలేసి...
చిటెకెడు పసుపు, రెండేళ్లతో ఉప్పు వేసి...
బ్యాల్లపుల్చుకలు వేచ్చాండ.
తపేలాలో..
పటికి పటికి మని బియ్యం ఉడికి...
గంజి బుడగలు ఎగిరెగిరి చిందుతొక్కుతాంటనే...
బూపుల్లతో కలపెబెట్టేది.
కుండలోని బ్యాల్ల నీళ్లు...
మూకటి మూతికి పసుపు పూసుకునేది.

బువ్వ గంజిపడ్తాంటే...
సిల్వర డబ్బాలోని ఓ పిరికెడు రాగిపిండిని...
ఆ తపాల్లో వేసేది..
బాగా కల్పుకున్నాక..
టైముచూసి పొయ్యిమీదనుంచి దింపేసి...
సంగటి తెడ్డుతో గెలికేది.
మా నాయినకో ముద్ద...

టోపీ గిన్నెలో నాకు రెండు సంగటిముద్దలేసశేది..
ఆతర్వాత మా చెల్లెలికి...
చివరన మాయమ్మ చిన్న పల్లెంలోకి
రాగి సంగటి వేసేది.
నిమ్మట్లోకి బ్యాల్లపుల్పు చేసేది.
Read 7 tweets
23 Oct
#CradleDay #Cradle
ఊయల లేదా ఉయ్యాల ఊగడం ఒక సరదాయైన పని. పిల్లలు ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక లోలకం లాగా ఊగుతూ ఉంటుంది.
ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.
కర్ర బల్లను బలమైన తాళ్ళతో పెద్ద చెట్టుకొమ్మకు కట్టి పెద్ద్ పిల్లలు, పెద్దవాళ్లు కూడ ఊగుతారు. మామూలు ఊయ్యాలలో 1-2 మీటర్లు ఎత్తుకు పోతే, ఈ రకమైన పెద్ద ఉయ్యాలలో 5-6 మీటర్ల ఎత్తుకు పోవచ్చు.

ఒక త్రాడుకు పాడైపోయిన రబ్బరు టైరుని చెట్టుకు కట్టి దాంట్లో కూర్చుని ఊగడం కూడా ఒకరకమైన ఊయల.
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(