ఈరోజు పీవీ నరసింహారావు గారి ౧౭వ వర్ధంతి. "పీవీ" గా, "పీవీఎన్నార్" గా మనందరికీ చిరపరిచితులైన పాములపర్తి వెంకట నరసింహారావు గారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అనచ్చు అలాగే బహుముఖ మేధావి అని కూడా పిలవచ్చు ఎందుకంటే ఆయన అనేక రంగాల్లో మేధావి కనుక. Image
పీవీ నరసింహారావు గారు న్యాయవాది, పాత్రికేయుడు, నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజకీయాల్లో తలపండిన దురంధురుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఆయన భారతదేశ ప్రధాని పదవిని అలంకరించిన ఏకైక తెలుగు వ్యక్తి. ImageImage
తన రాజనీతితో అపర చాణక్యుడిగా పేరొందిన ఆయనను భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కూడా పరిగణిస్తారు. పీవీ గారి సాహితీ అన్వేషణ గమనిస్తే ఆయన బహుభాషా కోవిదుడు, పదిహేడు భాషలు మాట్లాడగలరు. అనేక పుస్తకాల్ని రాశారు, అనువాద రచనలు చేశారు. Image
"కవి సమ్రాట్" విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సుప్రసిద్ధ తెలుగు నవల "వేయిపడగలు"ను హిందీలోకి "సహస్రఫణ్" గా తర్జుమా చేశారు. వీరు ఆంగ్లంలో రచించిన ఆత్మకథాత్మక నవల "ద ఇన్సైడర్" చాలా ప్రఖ్యాతిగాంచింది. ఈ పుస్తకమే తెలుగులోకి "లోపలి మనిషి" గా అనువాదమయ్యింది. Image
అట్లాగే ఆయన తెలుగులో లిఖించిన "మంగయ్య అదృష్టం" అనే నవలిక, "గొల్ల రామవ్వ" అనే కథ చాలా ప్రసిద్ధిగాంచాయి. Image
ఇలా న్యాయవాదిగా, పాత్రికేయుడిగా, భారతదేశ స్వాతంత్ర ఉద్యమకర్తగా, రాజకీయ నాయకుడిగా, బహుభాషా భాషిగా, సాహితీవేత్తగా ఎన్నో విశిష్ట పాత్రలను పోషించి చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆయన్ను ఈనాడు భారతదేశానికి చెందిన అత్యున్నత ప్రధానుల్లో ఒకరిగా గుర్తిస్తారు, Image
ఇరవైవ శతాబ్దపు తెలుగు మహనీయుల జాబితాలో మొదటి వరసలో ఉంచుతారు. ఇటువంటి మహానుభావుడు మన తెలుగువారు కావడం మన అదృష్టం. పీవీ గారంటే ఎందరికో గౌరవం మరెందరికో గర్వకారణం. మన తెలుగుబిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు గారిని వారి వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం. ImageImageImage
ఆయన వలె జిజ్ఞాసను, మేధోసంపత్తిని అతి ముఖ్యంగా తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషను పెంపొందించుకుందాం. జై తెలుగు తల్లి. Image
Today is the 17th vardhanthi (death anniversary) of P.V. Narasimha Rao garu. Pamulaparthi Venkata Narasimha Rao (popularly known as "PV" and "PVNR") was a multifaceted personality and genius. He was a renowned expert and unquestionably brilliant in various fields. Image
P.V. Narasimha Rao garu was a lawyer, journalist, statesman in India's political arena and also a freedom fighter who fought against Nizam's oppression. Apart from being the Chief Minister of Andhra Pradesh, he was the one and only Telugu Prime minister of India. Image
He is regarded as "Apara Chanakya" for his political acumen and "The Father of Indian Economic Reforms." Highlighting his literary and linguistic brilliance, he was a scholar in multiple languages and spoke 17 languages. He wrote several books and translated some literary works. ImageImage
He translated "Kavi Samrat" Viswanatha Satyanarayana's renowned Telugu novel "Veyi Padagalu" into Hindi as "Sahasraphan." His hugely popular semi-autobiographical English novel "The Insider" was translated into Telugu as "Lopali Manishi." ImageImage
His Telugu novella "Mangayya Adrushtam" and short story "Golla Ramavva" are also well-known. Image
Undeniably, he indeed played various diverse distinguished roles as a lawyer, journalist, Indian independence activist, politician, polyglot, litterateur therefore earning an everlasting place in the annals of history. Image
Even till today, he is recognized as one of the finest Prime ministers of India and one of the greatest Telugu legends of the 20th century. He is truly the pride of Telugu people. ImageImage
On his vardhanthi, we honour the legacy of our Telugu bidda, Late P.V. Narasimha Rao garu as an irreplaceable icon and a star whose inquisitiveness, intellectualism and love for Telugu language and literature will continue to inspire generations to come. Jai Telugu Thalli. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with The Telugu Project

The Telugu Project Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @TeluguProject

25 Dec
మొన్న విఖ్యాత తెలుగు నిఘంటుకారుడు, రచయిత, విద్యావేత్త, భాషా శాస్త్రవేత్త ఆచార్య జి.ఎన్. రెడ్డి గారి ౯౪వ జయంతి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా, ఉపకులపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా కూడా ఉండేవారు. Image
ఆయన సంపాదకత్వంలో "తెలుగు పర్యాయపద నిఘంటువు," "తెలుగు నిఘంటువు (౧౯౭౩)," "ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు (౧౯౭౮)," "మాండలిక వృత్తి పదకోశం (కుమ్మర, వడ్రంగం)" వంటి పదకోశాలు వెలువడ్డాయి.
ఆయన ఆంగ్లంలో "ఎ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్," "ది ఇన్‍ఫ్లుయన్స్ ఆఫ్ ఇంగ్లిష్ ఆన్ తెలుగు లిటరేచర్" లాంటి సిద్ధాంత గ్రంథాలను రచించారు. ఈ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన తెలుగు భాషా శాస్త్రంకు, నిఘంటు నిర్మాణ శాస్త్రంకు చేసిన విశిష్ట కృషిని గుర్తుచేసుకుందాం.
Read 12 tweets
25 Dec
మొన్న ప్రఖ్యాత తెలుగు కవి, నాటకకర్త, రంగస్థల నటుడు, భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ౧౪౦వ జయంతి. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గా ప్రసిద్ధిచెందిన ఆయన తెలుగు సినీవినీలాకాశంలో నటుడిగా, కథా రచయితగా, సంభాషణ రచయితగా, గేయ రచయితగా కూడా పేరుపొందారు.
ఆయన రచించిన తెలుగు నాటకం "సత్యహరిశ్చంద్రీయము" ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇంకా ఆయన రాసిన ప్రముఖ నాటకాలు ఏమిటంటే, "సాత్రాజితీయము," "ఉత్తరరాఘవము," "బుద్దిమతీ విలాసము." గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించిన ఆయన "పుంభావ సరస్వతి," "కవితా కళానిధి" లాంటి బిరుదులను పొందారు.
ఆది శంకరాచార్యులు వారు రచించిన "శివానందలహరి" ని తెలుగులోకి "శివానందలహరి శతకం" గా అనువాదించారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి జయంతి సందర్భంగా ఆయన తెలుగు సినీ, రంగస్థల, నాటక, సాహిత్య రంగాలకు చేసిన సేవల్ని స్మరించుకుందాం. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
Read 11 tweets
10 Dec
నిన్న ప్రఖ్యాత తెలుగు చరిత్రకారుడు, రచయిత, శాసన పరిష్కర్త మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ౧౩౦వ జయంతి.
ఆయన చారిత్రిక పరిశోధన చేసి, రాసిన పుస్తకాల్లో "ముసునూరి నాయకులు - ఆంధ్రదేశ చరిత్రలో ఒక విస్మృత అధ్యాయం"(ఏ ఫర్‌ గాటెన్‌ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ), "రెడ్డి రాజ్యాల చరిత్ర"(హిస్టరీ ఆఫ్‌ ది రెడ్డి కింగడమ్స్‌) చాలా విశిష్టతను సంతరించుకున్నాయి.
ఇంకా ఆయన చేసిన చారిత్రిక రచనల్లో ప్రముఖమైనవి ఏమిటంటే, "ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము," "అమరావతీ స్తూపము," "చారిత్రక వ్యాసమంజరి," "బౌద్ధయుగము." సుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త సి. నారాయణరెడ్డి గారు "కర్పూర వసంతరాయలు" అనే గేయకావ్యాన్ని రచించి మల్లంపల్లి గారికి అంకితమిచ్చారు.
Read 12 tweets
8 Dec
ఈరోజు విఖ్యాత తెలుగు కవి, ఆధ్యాత్మిక వేత్త భైరవయ్య గారి ౭౯వ జయంతి. తెలుగు సాహిత్యంలో "దిగంబర కవులు" గా ప్రఖ్యాతిగాంచిన ఆరుగురి కవుల్లో "భైరవయ్య" గారు ఒకరు. ఆయన అసలు పేరు "మన్‌మోహన్‌ సహాయ్." ఆయన "నవత" త్రైమాసిక పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. Image
"రా," "విషాద భైరవం" అనే గ్రంథాల్ని రచించిన ఆయన "ఎముకుల కేకలు," "దిగంబరి," "అగ్ని ప్రవేశం," "కరువు బిచ్చం," "నరమాంసం రుచి మరిగి," "నేను దేవుణ్ణి నమ్ముతున్నాను" అనే కవితలను రాశారు. పిమ్మట "భైరవానంద స్వామి" అనే పేరుతో ఆధ్యాత్మిక వేత్తగా మారిన ఆయన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సాహితీవేత్త జయంతి సందర్భంగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని గుర్తుచేసుకుందాం. భైరవయ్య గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
Read 8 tweets
8 Dec
నేడు తెలుగు విప్లవ సాహిత్యంలో పేరుమోసిన కవి, రచయిత, అనువాదకుడు, కమ్యూనిస్టు చలసాని ప్రసాద్ గారి ౮౯వ జయంతి. "విరసం" అనగా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన దానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. "సాహిత్య వ్యాసాలు," "చలసాని ప్రసాద్ రచనలు" లాంటి రచనా సంకలనాలను ఆయన రాశారు. Image
మహాకవి శ్రీ శ్రీ గారి సమగ్ర సాహిత్యం "శ్రీ శ్రీ సాహిత్య సర్వస్వం" అనే పేరుతో ఇరవై సంపుటాలుగా వెలువడింది. దానికి సంపాదకత్వం వహించింది చలసాని ప్రసాద్ గారే. శ్రీ శ్రీ గారి సాహిత్యం మీద "చిరంజీవి శ్రీ శ్రీ" అనే పుస్తకాన్ని కూడా రచించారు.
ఈ సాహితీవేత్త జయంతి సందర్భంగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవల్ని మననం చేసుకుందాం. చలసాని ప్రసాద్ గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
Read 9 tweets
25 Aug
నేడు తెలుగువారికి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలంగాణ వైతాళికుడిగా సుపరిచితులైన సురవరం ప్రతాపరెడ్డి గారి ౬౮వ వర్ధంతి. నిజాం నిరంకుశత్వ పాలనలో మ్రగ్గుతున్న తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన "గోల్కొండ పత్రిక" కు ఆయన సంపాదకత్వం వహించారు.
తెలంగాణలో అసలు తెలుగు కవులు లేరంటూ ఎవరో విమర్శిస్తే, దానికి సమాధానంగా ఆయన తెలంగాణ ప్రాంతమంతటా పర్యటించి, ౩౫౪ మంది కవుల, రచయితల వివరాలను సేకరించి "గోల్కొండ కవుల సంచిక" అనే పేరుతో ప్రచురణ చేశారు.
తెలుగువారి సాంఘిక చరిత్రను తెలుపుతూ ఆయన పరిశోధన చేసి, రాసిన మహత్తరమైన సాధికారిక గ్రంథం "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న తొలి తెలుగు పుస్తకంగా చరిత్రగాంచింది.
Read 15 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(