#KalidasDivas #KalidasJayanti
కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించారు.
#Kalidas
రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే మూడు మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.
కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి. ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు. ఐదవ శతాబ్ది వారని అనుకుంటారు.
అభిజ్ఞాన శాకుంతలం నాటకం తో విశ్వ వ్యాప్త కీర్తి నార్జించిన వారు. ఉపమా కాళిదాసస్య అనే టాగ్ ఉన్న కవి.కుమార సంభవ కావ్యం లో హిమాలయ సౌందర్యాన్ని అత్యద్భుతం గా కీర్తినారు కనుక హిమాలయ సానువులలో ఉండే వారెమో నని కొందరి ఊహ. మేఘదూతం కావ్యం లో ఉజ్జయిని ని కమనీయం గ చెప్పారు కనుక
ఉజ్జయిన వాసుడని మరి కొందరి అభిప్రాయం. రఘువంశ కావ్యం లో కలింగ రాజు హేమాన్గదుడి గురించి రాశారు కనుక కలింగ వాసి అని ఇంకొందరి అనుమానం.లక్ష్మీధర కల్లా అనే పరిశోధకుడు వీరికి భిన్నం గా కాశ్మీరుకు చెందిన వాడని చెప్ప్పారు.అధిక సంఖ్యాకుల మనోభావం ప్రకారం కాళిదాస మహాకవి ఉజ్జయిని ప్రాంతం వారే
ఒక రాజ కుమారిని వివాహం చేసుకొని ,చదువేమి లేక పోవటం తో సవాలు గా కాళికా దేవిని ప్రసన్నం చేసుకొని నాలుక పై బీజాక్షరాలు రాయించుకొన్న అదృష్ట వంతుడు. దానితో ఆయన మహా కవిగా రూపు దాల్చాడనే కథ అందరికి తెలిసిందే.
శ్రీ లంక రాజు కుమార దాసును కలిశాడని అక్కడ జరిగిన కుట్రలో హత్య చేయబడ్డాడనే కధనమూ ఉంది.కాని కాళిదాసు కాలం నాలుగవ శతాబ్దికి విక్రమాదిత్య మహారాజు కాలంతో సరిపోతోందని కొందరు వాదిస్తే, కాదు అయిదవ శతాబ్దపు చంద్ర గుప్తుని సమకాలీనుడని మరి కొందరి వాదన.
ఇదంతా శుద్ధ తప్పు క్రీ పూ. ఒకటవ శతాబ్దం లోని అప్పటి ఉజ్జయిని పాలకుడు విక్రమాదిత్యుని కాలంవాడని అన్నారు మరింత వెనక్కి నెట్టేసి.ఆధునికులు మాత్రం అయిదు ఆరు శతాబ్దికి చెందిన వారని అంటారు. 634శిలాశాసనం ప్రకారం బారవి కాళిదాసు పేర్లు ఒకే చోట కనిపించాయి.
ఈ శాసనం కర్నాటక లోని ఐహోల్ లో లభించింది. కాళిదాస కాలం పై చర్చను వదిలేసి ఆ మహాకవి రచనా వైవిధ్యాన్ని సామర్ధ్యాన్ని గురించి తెలుసు కొందాం.
మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ,మాళవికాగ్ని మిత్రం ,విక్రమోర్వశీయం అనే మూడు నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధ నాటకం గా గుర్తింపు పొందింది. జర్మనీ ఫిలాసఫర్ కవి విమర్శకుడు నాటక కర్త శాకుంతలాన్ని చదివి యెగిరి గంతేసి నాట్యం చేసాడని ‘
’దివిని భువిని ఏకం చేశాడు కాకాళి దాసు ‘’అని సంభ్రమాశ్చర్యాలతో ఆనంద బాష్పాలు కార్చాడని చెబుతారు. అంతటి కీర్తి పొందింది.ఇందులో నాలుగో అంకం నాలుగో శ్లోకం అన్నిటికంటే గొప్పది అనే పేరుంది కాన్వ మహర్షి పెంచిన కూతురు శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు కాలి దాసు ఆయనతో అనిపించినా
శ్లోకే ఇది పెంచిన తండ్రి తానె దుఖాన్ని ఆపుకోలేక పోతుంటే కానీ పెంచి పెళ్లి చేసి అత్త వారింటికి కూతుర్నిపంపించే తల్లిదండ్రుల మనోక్షోభ ఎంతటిదో అనే భావం ఇందులో ఉంది.
వీరేశలింగం గారు ఈ నాటాకాన్ని తెలుగులో గొప్పగా అనువదించారు. మాళవికాగ్ని మిత్రం అంటే ఆ ఇద్దరి కదా. మాళవిక అనే ఒక దాసీ పై ప్రేమలో పడిన రాజు అగ్ని మిత్రుడి కథ.బ్రాణి గారికి వీరి ప్రేమాయణం తెలిసి దాసిని నిర్బందిస్తుంది. మాళవిక రాజ పుత్రికయే నని తెలుస్తుంది. రెండవది అభిజ్ఞాన శాకుంతలం
దీని కథ అందరికి తెలిసిందే .మూడవది విక్రామోర్వశీయం –పురూరవ రాజు దేవతా స్త్రీ ఊర్వశి ల ప్రణయం ఇతి వృత్తం. వీరి ప్రేమ అనేక ఆటంకాలకు లోననై చివరికి ఇద్దరూ ఏకమై ఊర్వశి విజయ విక్రమ అవుతుంది.
కాళిదాస మహా కవి మహా కావ్యాలు కుమార సంభవం ,రఘువంశం.
పార్వతి దేవిజననం శివునితో కల్యాణం తాటక సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భావం కద కుమారా సంభవం. రఘు వంశ రాజుల చరిత్రను తెలిపేది రఘువంశం.
ఈ రెండు కావ్యాలలో కాళిదాస ప్రతిభ బహుముఖీనం గా విస్తరించింది. గీర్వాణం అంటే దైవ స్వభావాన్ని పొందింది. వీటితో బాటు ఋతు ఘోష ,మేఘ దూతం అనే రెండు ఖండ కావ్యాలు రాశాడు కాళిదాసు భారత దేశ ఋతు వర్ణనను ప్రతిభావంతం గా ఋతు ఘోషలో వర్ణించారు.
మేఘ దూతం లో మేఘాన్ని రాయ బారిగా ఒక యక్షుడు తన ప్రియురాలికి పంపిన సందేశాన్ని కవితాత్మకం గా దారిలో కనిపించే ప్రదేశాల వివరాలతో సహా రాశారు.
కాళిదాసు కవితా ప్రతిభ
శృంగార రసాన్ని పిండి వడ బోశాడు కాళిదాసు. ఆయన దృష్టిలో ప్రపంచం రాగమయం గా దర్శన మిస్తుంది. వైదర్భీశైలి తో నాటకాలు రాశాడు. సులభ శైలిలోనే రాశాడు .ఆయన సూక్తులు రసమాదుర్యం తో తోణికిస లాడతాయి .శకుంతల సొందర్యమే కాళిదాసు కవితా సౌందర్యం ‘’అనాఘ్రాతమ్ పుష్పం కి.
సలయ మలూనం కరరుహై –రానావిధం రత్నం మధునవ మనాస్వాదిత రసం –అఖండం పుణ్యానాం ఫల మివచ తద్రూప మనఘం ‘’ కవుల్లో అగ్రేసరుడు కాళిదాసు.దీన్ని ఒక కవి తమాషాగా చెప్పాడు ‘’కవులు ఎవరెవరు అని లెక్కించటానికి చిటికెన వేలుతో ప్రారంభిస్తే మొదటివాడు కాళిదాసు రెండవవాడు తగలనే లేదట అదీ ఆయన గొప్పతనం అంటాడు
శాస్త్ర సంబంధ ఉపమానంకాలారాలు విరివిగా వాడారు.‘’తతో మందానిలోద్ధత కమలాకర శోభినా –గురుం నేత్ర సహ్శ్రేనా నోదయామాస వాసవః ‘’ఇంద్రుడు తనకున్న వెయ్యి కళ్ళతో గురువు బృహస్పతిని చూశాడట. ఆ కదలిక మెల్లని చల్లని గాలి చేత కమల వనం కదిలి నట్లు గా ఉందట.
మరో ఉపమాలంకారం –ఇందుమతీ స్వయం వరం లో రాజులు వరుసలో కూర్చున్నారు.ఆమె ఒక్కొక్కరిని చూస్తూ తిరస్కరిస్తూ వెడుతుంటే ప్రతివారికి తననే వరిస్తుందనే ఆశ తో ముఖం వెలిగింది. దాటిపోగానే ముఖాలు చిన్న బోయాయి. దీన్ని దీప శిఖ తో పోల్చాడు దీపం ముందుకు వెడుతుంటే వెనకాల చీకటిని వదిలి పెట్టటం
సహజం కదా అలా ఉంది ఈ సీను.దీప శిఖా వర్ణన కాళిదాసు చాలా చోట్ల చేశారు. దేని ప్రత్యేకత దానికి ఉంది. ఉత్ప్రేక్ష లను ,అర్ధాంతర న్యాసాలను అర్ధవ వంతం గా వాడారు. వాల్మీకి తర్వాత ప్రక్రుతి వర్ణనలకు కకాళిదాసుకే పేరు. ప్రకృతిని కవిత్వం లో చిత్రం గీసి చూపిస్తారు.
స్త్రీలను కోమలం గా వర్ణించారు.వారికి ప్రత్యెక వ్యక్తిత్వం ఉంటుంది.సంవాదాలు నాటకీయం గా నడిపిస్తారు. ఋతు సంహారం లో ఒక్కో సర్గలో ఒక్కో రుతువును వర్ణించారు.మల్లినాద సూరి కాళిదాస కావ్యాలకు గొప్పగా టీకా తాత్పర్యాలు సంస్కృతం లో రాస్తే వేదం వెంకటరాయ శాస్త్రిగారు చక్కని తెలుగులో చెప్పారు.
కాళిదాస రచనలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదం పొందాయి. కొందరు ఆంగ్ల కవి నాటక రచయితా షేక్స్ పియర్ తో కాళిదాసును పోలుస్తారుకాని కాళిదాసు ప్రతిభ ముందు ఆయన సరిపోలడని ఎక్కువ మంది అభిప్రాయం.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

10 Jul
#DontStepOnABeeDay
#BeeFriendly 🐝🍯
భూగోళం మీద ఉన్న జీవ జాతుల్లో అత్యంత
ముఖ్యమైన, విలువైన జీవి 'తేనెటీగ' అని రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్దారించారు.ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందని ప్రకటించారు.
ఇటీవలి అధ్యయనాలు దాదాపుగా 90% తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించాయని తెలిపారు. అడవుల నరికివేత, గూళ్లు కట్టడానికి అనువైన స్థితి లేకపోవడం, పురుగు మందుల వాడకం, నేలల్లో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్టు వెల్లడించారు.
వ్యవసాయ ఆవిష్కరణల ఫౌండేషన్‌ సహకారంతో అపికల్పర్‌ ఎంట్రపెన్యూర్‌షిప్‌ సెంటర్‌ ఆఫ్‌ యూనివర్సదద్‌,అపికల్చర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ చిలే సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తేనెటీగల గురించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్దారించింది. ఈ భూగోళంపై ఉన్న జీవ జాతుల్లో కేవలం తేనెటీగలు మాత్రమే..
Read 9 tweets
10 Jul
#GlobalEnergyIndependenceDay
స్థిరమైన మరియు పరిశుభ్రమైన శక్తి ఉత్పాదనకోసం సౌరశక్తి, గాలి, మొక్కలు, నీరు వంటి తరగని ప్రాకృతిక వనరులను పునర్వినియోగ ఇంధనంగా వినియోగిస్తారు. దీనిలో ఇమిడి ఉన్న పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలు:
#GlobalEnergy
♻️🌀🌊☢️🌞
♻️గ్రీన్ హౌస్ వాయు రహితంగా మరియు వాయు కాలుష్యం తగ్గిస్తూ ఇంధన ఉత్పాదన.
♻️ ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని ఇంధన వైవిధ్యం తగ్గిస్తుంది.
♻️ఆర్థిక అభివృద్ధి మరియు మ్యాన్ఫ్యాక్చరింగ్, ఇనస్టలేషన్ ఇతరత్రా ఉద్యోగాలు.

పునర్వినియోగ ఇంధన వనరులు
🌞సౌరశక్తి అనేది సూర్య కాంతిని వినియోగించుకుని చేసే విద్యుచ్ఛక్తి. దీనిని వేడి పుట్టించడానికి, నీళ్లను మరిగించడానికి, చల్లబరచడానికి వాడవచ్చు. ఇంకా పలు విధాలైన వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు.
Read 11 tweets
10 Jul
నికోలా టెస్లా (ఆంగ్లం : #NikolaTesla #Tesla) (1856 జూలై 10 - 1943 జనవరి 7) ఒక ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్. నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్, తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు.
ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా మరియు ఆవిష్కర్తగా కీర్తించబడ్డాడు.19వ శతాబ్దాంతంలో మరియు 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్ మరియు అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త.
నికోలా టెస్లా పేటెంట్లు మరియు పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.
1894లో వైర్‌లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో
Read 4 tweets
9 Jul
#KebabDay #kebab #kabab
కబాబ్ అంటే గతంలో మటన్‌తో చేసేది అని అర్థం. ఇప్పుడు చికెన్ కబాబ్... ప్రాన్స్ కబాబ్ అని రకరకాల కబాబులు రెడీ అయిపోతున్నాయి. పూర్తి స్థాయి వంట చేసుకోవడానికి వీల్లేని రోజుల్లో సైనికులు మాంసాన్ని ఎండబెట్టి దాచుకొని అప్పటికప్పుడు నిప్పుల్లో కాల్చుకొని తినేవారు. Image
ఈ ఎండు మాంసమే కబాబ్ మారింది. ఇప్పుడు ఇన్‌స్టాంట్ కబాబులు వడ్డిస్తున్నారు. నాన్‌వెజ్‌లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువా కాకపోయినా కబాబ్‌లకు రాచరికపు హోదా దక్కింది. కబాబ్‌లు వడ్డించారంటే అదో పెద్ద హోదా కిందే ఇప్పటికీ. కబాబ్ ను ఏ సందర్భంలోనైనా తయారు చేసుకోవచ్చు. ImageImageImageImage
ముఖ్యంగా వర్షాకాలంలో వేజిటేరియన్ స్నాక్స్ తో పాటు, కబాబ్ లు కూడా చాలా ప్రసిద్ధి. వర్షాకాలంలో నోటికి రుచికరంగా వేడి వేడిగా కబాబ్ తింటే ఎలా ఉంటుంది. చాలా మందికి మాంసాహార ప్రియులు కబాబ్ లను ఇష్టపడుతారు.

అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఈ కబాబ్ ను ఒక్కో రకంగా వండుతారు. ImageImageImageImage
Read 12 tweets
9 Jul
సంజీవ్ కుమార్ (జన్మ నామం: హరిహర్ జెఠాలాల్ జరీవాలా 9 జూలై 1938 – 6 నవంబర్ 1985) ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. వీరు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలోఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. వీరు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి Image
ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.
సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా వ్యవహరించబడేవాడు)
#Sholay #SanjeevKumar
వీరు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం సూరత్‌లో గడచింది.తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది.
అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందారు. తద్వారా బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డారు. ఇతని ఇరువులు సోదరులు ఒక సోదరి ఉన్నారు.షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నయాదిన్ నయీరాత్ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించారు.
Read 8 tweets
9 Jul
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ "అఖిల భారతీయ విద్యార్థి పరిషత్" ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #NationalStudentsDay

ఏబీవీపీ అనే నాలుగు అక్షరాలు తెలియని విద్యార్థి కళాశాల క్యాంప స్‌లో ఉండడు.
@ABVPVoice @Abvp_Andhra @ABVPTelangana #StudentsDay
#NationalStudentDay #youth Image
73 ఏళ్ళుగా విద్యార్థి లోకంతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుండటమే దీనికి కారణం. 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమై, నేడు దేశంలో 33 లక్షల సభ్యత్వం గల అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది. Image
ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో… అక్కడ దేశభక్తి ఉంటుంది. ఈనాడు విద్యార్థి పరిషత్ (#ABVP) పని దేశంలోని మారుమూల ప్రాంతాలలో సహితం వ్యాపించింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అంటూ నినదిస్తూనే ఉంటారు. ఇవి వారికి నినాదాలే కాదు జీవన నిష్ఠ కూడా.
Read 23 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(