సామజిక మాధ్యమాలు వాడేటప్పుడు మానసిక ప్రశాంతత కాపాడుకోవటం ఎలా ?
1.ముందు ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్ మొ. వాటికి నోటిఫికేషన్స్ తీసేయాలి. అవి మోగినప్పుడు కాకుండా మీకు నచ్చినప్పుడు వాటిని తెరవాలి. 2. మీకున్న అభిరుచులు ఉన్నవారితో పరిచయం ఏర్పాటు చేసుకోండి. గోప్యత విషయంలో జాగ్రత్త.
3.మన అభిరుచులకు, విలువలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవారు ఉంటారు అని గమనించండి. వీరితో వీలైతే సంవాదం చేయండి.వారి తరుఫు నుంచి వారు సరి అని గుర్తించండి.బూతులకు,వ్యక్తిగత విమర్శకు తావు ఇవ్వొద్దు, ఇతరులనుండి వాటిని సహించవద్దు. అవసరం అయితే వారిని బ్లాక్ చెయ్యండి.
4. ఈ మాధ్యమాల పట్ల జాగరూకత అవసరం, ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ అవసరం. 5. ఆన్లైన్ పరిచయాలు వ్యక్తిగత పరిచయాలుగా దారి తీయటానికి సమయం తీసుకోండి .తొందరపాటు నిర్ణయాలు వద్దు.
6.నొప్పించే వ్యాఖ్యలు చెయ్యొద్దు, వీలైతే క్షమాపణ చెప్పండి లేదా తొలగించండి.
7.కొంతమంది కేవలం విషం చల్లే ప్రక్రియలోనే ఉంటారు, వారి పట్ల వారికున్న ఏహ్యభావాన్ని,జుగుప్సని,ఆత్మవిమర్శని ఇతరులపై రుద్ది అందిస్తారు, అటువంటివారిని గుర్తించి స్పందించకపోవటం ఉత్తమం. స్పందించటమే వారికి ప్రోత్సాహం, వాళ్ళనలా వదిలెయ్యటం వాళ్ళకి శిక్ష.
8.మనకుండే కొన్ని నమ్మకాలు, విలువలు తర్కానికి అందనివి, వాటికి మన దగ్గర వివరణలు ఉండవు కానీ మనం వాటిని వదులుకోలేం,అదేం తప్పు కాదు, వీటి గురించే వాదించే వ్యక్తులకి మీరే తెలివైనవారు, మీరు చెప్పిందే సరైంది అనండి. వాళ్ళకి కూడా అదే కావాల్సింది.
9. ఇక్కడ రకాల వ్యక్తులు ఉంటారని తెలుసుకోండి, విద్యావంతులు,సోమరులు, నాయకులు, స్ఫూర్తి దాయకులు, మోసగాళ్లు, మూర్ఖులు ,సాయం చేసేవారు,అన్ని రకాల వృత్తులవారు, ప్రెడేటర్స్ (గాలం వేసి వంచించే వాళ్ళు ),సైబర్ నేరగాళ్లు,ఏడిపించేవాళ్ళు అందరూ. మనం ఏది తీసుకుంటాం అన్నది మనమీదే ఆధారపడి ఉంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
జననాంగాల గురించి తెలుసుకుందాం
వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపు రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో పని చేస్తాయి. ఇవి శుక్రకణాలను తయారు చెయ్యడమే కాకుండా మగ వారి లైంగిక పటుత్వానికి అలాగే మిగిలిన క్రియలకు అవసరం అయిన టెస్టోస్టెరోన్ హార్మోను ని ఉత్పత్తి చేస్తాయి.
ఇందుకోసం ఇవి శరీరం బయట వదులైన సంచిలో ఉంటాయి .అయితే చాలా మంది బిగుతైన లోదుస్తులు వేసుకువడం , ఒడిలో లాప్టాప్ పెట్టుకుని ఎక్కువసేపు పని చెయ్యటం వంటి వాటి వలన వృషణాల పనితీరు తగ్గుతుంది. ఇది సంతాన లేమికి దారి తీయొచ్చు. గత ఇరవై ఏళ్లలో వీర్యం నాణ్యత దాదాపు సగానికి పడిపోయింది.
అయితే ఒత్తిడి , కాలుష్యం, ఆహారం ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ ఇతమిద్దంగా ఇవే అని తెలీదు. ఇక పోతే అంగాన్ని ఎప్పటికప్పుడు చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ముందు చర్మం వెనక్కి లాగి శిశ్నము దగ్గర పేరుకుపోయిన స్మేగ్మాని కడగాలి. స్మెగ్మా అనేది చనిపోయిన కణాలు, మట్టి, వీర్యం మొదలైన
తలనొప్పి - రోగులు వైద్యుల దగ్గరికి వచ్చే ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ తలనొప్పి రెండు రకాలు - ప్రాథమిక ( ఎటువంటి ఇతర కారణం లేనివి ) లేదా పర్యవసాన ( ఇతర కారణాల వలన). అయితే ఈ తలనొప్పికి భయపడాలా ! వద్దా !
జలుబుతో వచ్చే తలనొప్పి చాల సాధారణం కానీ ప్రమాదం లేనిది అలాగే
ప్రాణాపాయ తలనొప్పి అరుదు కానీ దానిని గుర్తించి వెంటనే చికిత్స చెయ్యాలి. ఎలా గుర్తించాలి ఇటువంటివి అంటే కింద తలనొప్పి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి అశ్రధ్ధ చెయ్యకుండా.
1.హఠాత్తుగా వచ్చిన తలనొప్పి ( అంటే సెకండ్ల వ్యవధిలో )
2.మొదటిసారి వచ్చిన తీవ్రమైన తలనొప్పి
3.ఇంతవరకు వచ్చిన తలనొప్పుల్లో ఇదే అధమం అయినప్పుడు
4.రోజులు లేదా వారం వ్యవధిలో అంతకంతకు పెరిగే తలనొప్పి
5.వంగినప్పుడు,బరువులెత్తినపుడు,దగ్గినప్పుడు వచ్చే తలనొప్పి
మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది, ఈసారి గుండె గట్టిగా
కొట్టి ఒక స్పందన లో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి, కానీ దీర్ఘకాలంలో గట్టిపడతాయి దానివలన సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగా
కొడుతుంది. దాంతో అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రం లోంచి వెళుతుంది.
లైటర్
మాస్టారు అగ్గిపెట్టుందా ?
ఏం ఏ కొంపకి నిప్పెట్టేద్దామనీ ? అన్నాన్నేను అది వినగానే ...
అదేంటండీ అలా అంటారు ? మీక్కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువే , పళ్ళు రాలిపోకుండా చూసుకోండి అని జేబులో సిగరెట్టు తీసి సుతారంగా అప్పటికే నల్లబడిపోయిన పెదాల చివర నొక్కి పట్టాడు . వెధవకి నిండా
పాతికేళ్ళు లేవు.
సర్లేవోయ్ , నేనేదో సరదాకి అన్నాను , కుర్రాడివి కదా తట్టుకోలేకపోయావ్ . సరే ఇంద అని జేబులోంచి లైటర్ తీసి సప్ మని వెలిగించి అతని సిగరెట్ కి నిప్పు అందించాను . అతను ఒకసారి బాగా లోపలికి లాగి బిగబట్టి హా అని వదిలాడు . నా వంక చూసాడు, అతని కళ్ళలో ఒక రిలాక్సేషన్ .
కింగ్స్ పాకెట్ తీసి నాకొకటి ఇవ్వబోయాడు . నేనిప్పుడే ఒకటి తాగా అని చెప్పి మరో గంట తర్వాతే అని వద్దన్నాను . మళ్ళీ లోపల పెట్టేశాడు . ఏదైనా నాలుక జివ్వున లాగుతున్నప్పుడు సిగరెట్టు తాగితే వచ్చే కిక్కు వేరు, ఒక అమ్మాయి పెట్టే తొలి ముద్దు లా ! అన్నాన్నేను.
Dr Ananthram was an MBBS graduate who secured state 1st rank in AP PG entrance test and he wanted to join Radiology in Osmania medical college, however he was denied that seat because the so called seat was reserved for some category in rostered system.
Distraught Dr Ananthram had filed a case against Dr NTR University of health sciences and voiced his demand -“Is there anything else other than first rank to secure radiology seat in Osmania medical college? If so I am ready to achieve that!”,the court has ruled in favour of him.
The University cancelled the counselling and allocated the seat to Dr Ananthram. This incident happened while I was still studying MBBS. In this background I would like to tell few of my experiences during my PG preparation. I was shortlisted for interview for admission into +
నేను ఎంబీబీస్ చదివే రోజుల్లో ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీస్ చదివిన డా అనంత రామ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్షలో ఒకటో ర్యాంక్ సాధించారు . ఈయన స్వయానా మన వీ వీ ఎస్ లక్ష్మణ్ గారికి బావమరిది . ఆయనకు రేడియాలజీ పీజీ చెయ్యాలని ఉండేది. అయితే ఆ సీట్లు చాలా తక్కువ,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో +
మొత్తం మూడో నాలుగో సీట్లు ఉండేవి. అయన లోకల్ ఏరియా ఒస్మానియా కాబట్టి అక్కడే సీట్ తీసుకోవాలి ,అయితే రోస్టర్ సిస్టం మూలానా ఉన్న ఒక్క సీటు కూడా ఒక రిసర్వుడు వర్గానికి కేటాయించారు . ఎలా చూసినా ఆయనకి ఆ సీట్ రాదు. దాంతో ఆయన చాలా బాధ పడి హై కోర్టుకి వెళ్లారు .+
అక్కడ ఆయన "నేను రేడియాలజీ చదవాలంటే ఒకటో ర్యాంక్ ని మించి ఇంకేదైనా ర్యాంక్ ఉంటే చెప్పండి అది సాధిస్తాను "అని వాదించారు , చేసేది లేక కోర్టు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఏ సీటు కోరుకుంటే అదివ్వాలని ,రోస్టర్ వ్యవస్థ రెండో ర్యాంక్ నుంచి అమలు పరచాలని తీర్పు ఇచ్చింది .