తుమ్ము అనేది మన శ్వాస వ్యవస్థ పై భాగంలో ఏదైనా చికాకు కలిగించేదానిని బయటకు పంపేందుకు ఉండే ఒక రక్షణ చర్య. అలాగే దగ్గు కూడా శ్వాస వ్యవస్థలో కింది భాగంలో అడ్డంకులు, అలాగే పేరుకుపోయిన కఫాన్ని పంపేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండూ సహజమైనవి. కొన్ని రకాల ఎలర్జీ లో తుమ్ములు అదేపనిగా వస్తుంటాయి
వాటివలన ఉపయోగం లేదు, అందుకని మందులు వేసి తగ్గిస్తాం, అలాగే ఉపయోగం లేని దగ్గుకి కూడా చికిత్స చేస్తాం. ఊపిరి తిత్తుల చుట్టూ ఛాతిలో పక్కటెముకలమధ్యలో మూడు రకాల కండరాలుంటాయి. అలాగే ఊపిరితిత్తుల కిందన విభాజక పటలం అని ఉదరాన్ని, ఛాతీని వేరుచేస్తూ అట్టలాంటి పెద్ద కండరం ఉంటుంది.
ఇవి కాక మెడ కింద కొన్ని కండరాలు కూడా ఉంటాయి.తుమ్ము వచ్చే ముందు ఊపిరితిత్తుల నిండా సాధారణం కంటే ఎక్కువ గాలి చేరుతుంది, ఈ చేరినది అంతా ఒకే సారి బలంగా బయటకు రావటానికి ఈ కండరాలన్నీ ఒక్కసారి సంకోచిస్తాయి, దాంతో ఊపిరితిత్తులపై అపారమైన ఒత్తిడి పడి అందులోని గాలి ఒక్కసారిగా బయటకు వస్తుంది
అలా వచ్చేది అప్పటికే కొంచెంగా అంగిలికి అతుక్కుని ఉన్న నాలుకని తోసుకుంటూ, అలాగే చుట్టూ ఉన్న కండరాల బిగింపు వలన చిన్నగా అయిన నాసికా రంధ్రాల గుండా అత్యంత వేగంతో బయటకి వచ్చి అక్కడున్న శ్లేష్మాన్ని, లాలాజలాన్ని చిన్న చిన్న తుంపర్లుగా మార్చి బయటకు పంపిస్తుంది.
ఇటువంటి తుంపర్లలో రోగిలో ఉన్న వైరస్ చేరి అలా గాలిలో విహరించి ఎదుటి వారిని చేరుకుంటాయి. లోపల్నుంచి వచ్చే గాలి పరిమాణం ఎక్కువగా ఉండటం, అది సన్నటి ముక్కు పుటాల గుండా ప్రవహించడం వలన బెర్నాలి నియమం ప్రకారం బయటకు వచ్చే గాలి వేగం తీవ్రంగా ఉంటుంది. అప్పుడది మనం పెయింట్ వేసే స్ప్రే గన్ లా
పనిచేసి అక్కడున్న శ్లేష్మాన్ని(చీముడిని) తుంపర్లుగా మారుస్తుంది. అందువలన ఈ తుంపర్లు బయటకు పోకుండా మాస్కు ధరించటం, మోచేతిలో తుమ్మటం చెయ్యాలి. ఇదే నియమం దగ్గుకి కూడా వర్తిస్తుంది. మనకి చెవిలో మూడు భాగాలుంటాయి, బాహ్య చెవి, మధ్య చెవి ఇంకా అంతః చెవి అని.
మనం పెట్టే రేయినాల్డ్స్ పెన్ క్యాప్ వెళ్ళేవరకు అంటే కర్ణభేరి వరకు బాహ్య చెవి, కర్ణభేరి లోపల మధ్య చెవి ఇందులో వినికిడికి అవసరమైన ముఖ్యమైన మూడు ఎముకలు సున్నితమైన కీళ్లతో బంధించబడి ఉంటాయి. ఇక అంతః చెవి కపాలం ఎముకలో భద్రంగా ఉంటుంది. ఈ మధ్య చెవి లోపల గోడ అంతా శ్లేష్మస్తరంతో ఉంటుంది.
అంటే ముక్కులో ఏ చర్మం ఉంటుందో అదే చర్మం అక్కడ ఉంటుంది. అలాగే కర్ణభేరి ఒక డప్పులాగా పనిచెయ్యడానికి ఇరువైపులా గాలి ఉండాలి, అలా గాలి నింపడానికి, శ్లేష్మాన్ని బయటకు తీసెయ్యడానికి ఆ మధ్య చెవి నుండి ఒక గొట్టం గొంతులోకి తెరుచుకుంటుంది. మనం గుటక వేసిన ప్రతిసారి ఈ గొట్టం తెరుచుకుని గాలి
మధ్య చెవిలోకి వెళ్తుంది. అలా వెళ్లి కర్ణభేరికి ఇరువైపులా ఒత్తిడి ఒకేలా ఉండేలా చేస్తుంది. అందుకే విమానాల్లో తిరిగేటప్పుడు ఒత్తిడి తగ్గడం వలన చెవులు బరువుగా అనిపించి వినికిడి తగ్గడం చెవి నొప్పి రావడం జరుగుతుంది అందుకే ఎక్కువసార్లు గుటక వెయ్యాలి.
ఇదిలా ఉంటే కొంతమంది వచ్చే తుమ్ముని అంగిలి గట్టిగా బిగించి రాకుండా ఆపేస్తారు, దానివలన ఈ ఒత్తిడి గొట్టం ద్వారా సున్నితమైన మధ్యచెవికి చేరి అక్కడ దెబ్బ తీయవచ్చు, అలాగే ఊపిరి తిత్తులకు కూడా మంచిది కాదు. తుమ్ముల వలన మెదడుకు హాని అనేది అపోహ. తుమ్ముల వలన కపాలంలో కొంత ఒత్తిడి పెరిగి
తలనొప్పి రావచ్చేమో గాని,మెదడుకు హానిలేదు. తుమ్మొచ్చిన ప్రతిసారి నేను పరమేశ్వరా అని భగవంతుడ్ని తలుచుకుంటాను,అలాగే ఇక్కడ తుమ్మినవాళ్ళని బ్లేస్యు అని దీవిస్తారు.ఆ విధంగా తుమ్ము భగవంతుడ్ని మర్చిపోకుండా చేస్తుంది అందుకని మంచిది,కాకపోతే ఎదుటివారి ముఖంపై తుమ్మొద్దు,దగ్గొద్దు.శపిస్తారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
హెరాయిన్ గురించి తెలుసుకుందాం. మాదకద్రవ్యాలు అవి పనిచేసే తీరుని బట్టి మూడు రకాలు. ఒక రకం ఉత్ప్రేరకాలు అంటే పొగాకు,కాఫీ,కొకైన్ లాంటివి, ఇంకోరకం మత్తు కలిగించేవి అంటే గంజాయి,సారా,హెరాయిన్ వంటివి, మూడోరకం మతిభ్రమించేవి అంటే లైసెర్జిక్ ఆమ్లం, మ్యాజిక్ పుట్టగొడుగులు మొదలైనవి.
అసలు హెరాయిన్ తయారుచేసింది మార్ఫీన్ ని చూసి, ఇది మధ్యధరా ప్రాంతంలో పెరిగే పపావర్ సోమ్నిఫెరం అనే మొక్క నుంచి ఐదు వేల ఏళ్ళ క్రితమే తీశారు.ఇవి తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి దిగుమతి చేయబడ్డాయి, తద్వారా ఆ కంపెనీ వారు బాగా సంపాదించారు కూడా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం
మార్ఫీన్, కోడీన్ సహజంగా దొరికే ఓపియం మత్తు పదార్ధాలు అయితే వాటిని చూసి శాస్త్రవేత్తలు హెరాయిన్,ఫెంటానీల్,ఆక్సీ కోడోన్,మెథడోన్ అనే మొదలైన కృత్రిమమైనవి తయారు చేసారు.ఇవన్నీ ఒకప్పుడు గానీ,ఇప్పుడు గానీ మందులుగా వాడుతున్నవే.కాన్సర్ వైద్యంలో,నొప్పి నివారణగా,శస్త్ర చికిత్సలో ఇవి వాడతారు.
ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం ఈ సందర్బంగా గుండెని పదిలంగా ఉంచుకోడానికి కొన్ని చెప్తాను. అవి చెప్పేముందు గుండెజబ్బు గురించి కొన్ని విషయాలు. అసలు గుండె అనేది ఒక కండరం. ఈ కండరం లోపల ఖాళీలో రక్తం ఉంటుంది అది పెద్ద ధమనుల ద్వారా ఒంట్లో అవయవాలకి, ఊపిరితిత్తులకు పంపబడుతుంది.
ఈ గుండె కండరం పని చెయ్యటానికి హృదయ ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇవి చాల సున్నితమైనవి పైగా సన్నటివి. గుండె నిరంతరం పనిచేస్తూ ప్రతి గుండె చప్పుడుకి 0.6సెకండ్ల విశ్రాంతి తీసుకుంటుంది, ఆ సమయంలో దానికి కావాల్సిన రక్తం తీసుకుంటుంది, అయితే మనం పరిగెత్తినపుడు, తీవ్రమైన శారీరక శ్రమ లేదా
శృంగారంలో పాల్గొన్నప్పుడు గుండె వేగం పెరిగి గుండె విశ్రాంతి తీసుకునే సమయం 0.2సెకండ్లకి పడిపోతుంది అంటే ఆ సమయంలోనే దానికి కావలసిన రక్తాన్ని ఈ సన్నటి ధమనులు ఇస్తాయి. ఈ ధమనులు ఆరోగ్యముగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ వాటి లోపల కొవ్వు పేరుకుపోయి ఇరుకు అయినప్పుడు గుండె కి కావాల్సినంత
సామజిక మాధ్యమాలు వాడేటప్పుడు మానసిక ప్రశాంతత కాపాడుకోవటం ఎలా ?
1.ముందు ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్ మొ. వాటికి నోటిఫికేషన్స్ తీసేయాలి. అవి మోగినప్పుడు కాకుండా మీకు నచ్చినప్పుడు వాటిని తెరవాలి. 2. మీకున్న అభిరుచులు ఉన్నవారితో పరిచయం ఏర్పాటు చేసుకోండి. గోప్యత విషయంలో జాగ్రత్త.
3.మన అభిరుచులకు, విలువలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవారు ఉంటారు అని గమనించండి. వీరితో వీలైతే సంవాదం చేయండి.వారి తరుఫు నుంచి వారు సరి అని గుర్తించండి.బూతులకు,వ్యక్తిగత విమర్శకు తావు ఇవ్వొద్దు, ఇతరులనుండి వాటిని సహించవద్దు. అవసరం అయితే వారిని బ్లాక్ చెయ్యండి.
4. ఈ మాధ్యమాల పట్ల జాగరూకత అవసరం, ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ అవసరం. 5. ఆన్లైన్ పరిచయాలు వ్యక్తిగత పరిచయాలుగా దారి తీయటానికి సమయం తీసుకోండి .తొందరపాటు నిర్ణయాలు వద్దు.
6.నొప్పించే వ్యాఖ్యలు చెయ్యొద్దు, వీలైతే క్షమాపణ చెప్పండి లేదా తొలగించండి.
జననాంగాల గురించి తెలుసుకుందాం
వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపు రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో పని చేస్తాయి. ఇవి శుక్రకణాలను తయారు చెయ్యడమే కాకుండా మగ వారి లైంగిక పటుత్వానికి అలాగే మిగిలిన క్రియలకు అవసరం అయిన టెస్టోస్టెరోన్ హార్మోను ని ఉత్పత్తి చేస్తాయి.
ఇందుకోసం ఇవి శరీరం బయట వదులైన సంచిలో ఉంటాయి .అయితే చాలా మంది బిగుతైన లోదుస్తులు వేసుకువడం , ఒడిలో లాప్టాప్ పెట్టుకుని ఎక్కువసేపు పని చెయ్యటం వంటి వాటి వలన వృషణాల పనితీరు తగ్గుతుంది. ఇది సంతాన లేమికి దారి తీయొచ్చు. గత ఇరవై ఏళ్లలో వీర్యం నాణ్యత దాదాపు సగానికి పడిపోయింది.
అయితే ఒత్తిడి , కాలుష్యం, ఆహారం ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ ఇతమిద్దంగా ఇవే అని తెలీదు. ఇక పోతే అంగాన్ని ఎప్పటికప్పుడు చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ముందు చర్మం వెనక్కి లాగి శిశ్నము దగ్గర పేరుకుపోయిన స్మేగ్మాని కడగాలి. స్మెగ్మా అనేది చనిపోయిన కణాలు, మట్టి, వీర్యం మొదలైన
తలనొప్పి - రోగులు వైద్యుల దగ్గరికి వచ్చే ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ తలనొప్పి రెండు రకాలు - ప్రాథమిక ( ఎటువంటి ఇతర కారణం లేనివి ) లేదా పర్యవసాన ( ఇతర కారణాల వలన). అయితే ఈ తలనొప్పికి భయపడాలా ! వద్దా !
జలుబుతో వచ్చే తలనొప్పి చాల సాధారణం కానీ ప్రమాదం లేనిది అలాగే
ప్రాణాపాయ తలనొప్పి అరుదు కానీ దానిని గుర్తించి వెంటనే చికిత్స చెయ్యాలి. ఎలా గుర్తించాలి ఇటువంటివి అంటే కింద తలనొప్పి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి అశ్రధ్ధ చెయ్యకుండా.
1.హఠాత్తుగా వచ్చిన తలనొప్పి ( అంటే సెకండ్ల వ్యవధిలో )
2.మొదటిసారి వచ్చిన తీవ్రమైన తలనొప్పి
3.ఇంతవరకు వచ్చిన తలనొప్పుల్లో ఇదే అధమం అయినప్పుడు
4.రోజులు లేదా వారం వ్యవధిలో అంతకంతకు పెరిగే తలనొప్పి
5.వంగినప్పుడు,బరువులెత్తినపుడు,దగ్గినప్పుడు వచ్చే తలనొప్పి
మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది, ఈసారి గుండె గట్టిగా
కొట్టి ఒక స్పందన లో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి, కానీ దీర్ఘకాలంలో గట్టిపడతాయి దానివలన సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగా
కొడుతుంది. దాంతో అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రం లోంచి వెళుతుంది.