#fountainpen #FountainPenDay
సిరా కలము దినోత్సవం ✍️🖋️✒️
ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ పెన్, ఇది మునుపటి డిప్ పెన్ లా కాకుండా ద్రవ సిరా యొక్క అంతర్గత రిజర్వాయర్ ను కలిగి ఉంటుంది. ఈ పెన్ను సిరాను ఒక ఫీడ్ ద్వారా రిజర్వాయర్ నుంచి కలం పాళీ గ్రహించేలా మరియు గురుత్వాకర్షణ మరియు
కేశనాళిక చర్య యొక్క కలయిక ద్వారా కాగితంపై నిక్షేపమయ్యేలా చేస్తుంది. ఈ పెన్నును లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ కనిపెట్టాడు. ఫౌంటెన్ నుంచి నీరు పైకి చిమ్ముతున్నట్లుగా ఈ పెన్ నిబ్ యొక్క రంధ్రం నుంచి ఇంక్ వెలువడుతుంటుంది కనుక ఈ పెన్నును ఫౌంటెన్ పెన్ అంటారు.
ఫౌంటెన్ పెన్నుల యొక్క కొన్ని రిజర్వాయర్లలో ఇంక్ ను నేరుగా పోయవలసి ఉంటుంది, కొన్ని పెన్నులలో ఒత్తివదలడం పద్ధతి ద్వారా పీల్చుకునే రిజర్వాయర్ ఉంటుంది.
ఎడ్సన్ తన ఆశయాలను, పర్యాటక అనుభవాలను గ్రంథస్తం చేయాలనే ఆలోచనతో ఒక మంచి కలం తయారు చేయాలనుకున్నాడు. అప్పటి పెన్నులను మాటిమాటికి సిరాలో ముంచి వ్రాయవలసి వచ్చేది. మాటిమాటికి సిరాలో ముంచకుండా వ్రాయడమెలాగ అనే విధంగా ఆలోచించి ఫౌంటెన్ పెన్నును కనిపెట్టాడు.
దానిపై పేటెంట్ హక్కులు పొందాడు. పెన్నుల వ్యాపారం మొదలు పెట్టి తన పరిశోధనలతో నాణ్యమైన, సౌకర్యవంతమైన పెన్నులు తయారుచేశారు.
#FountainPenDay ఫాంటెన్ పెన్ డే ✒️
రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్. 1930 లో రాజమహేంద్రవరం లో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాలు తయారు చేస్తోంది.భారత్‌ పర్యటనకు వచ్చిన జర్మన్‌ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు.
అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్‌ బ్లాంక్, పార్కర్‌ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత.
దేశ విదేశాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న 'రత్నం పెన్' ఆవిర్భావం వెనుక మహాత్మాగాంధీ ప్రేరణ ఉంది. 1921లో వార్ధాలో కె.వి.రత్నంగారు కలసికొని, హితి బ్లాక్ డైస్ (నగలకు సంబంధించి) తయారు చేసి గాంధిజీకి చూపించారు. త్వరలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వబోతున్నామని, అందుచేత సామాన్యులకు
ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని గాంధీజీ చెప్పడంతో, అయితే ఏ వస్తువు తయారుచేయాలో చెప్పాలని రత్నంగారు అడగడం, పిన్ నుంచి పెన్ వరకు ఏదైనా తయారు చేయవచ్చని గాంధిజీ సూచించడంతో, పెన్ తయారీకే రత్నంగారు మొగ్గు చూపారు. ఏ విధంగా పెన్ తయారు చేయాలనే దానిఫై సర్వే చేసారు.
మచిలీపట్నం అయ్యగారి రామమూర్తి, మద్రాస్ కంపెనీ నుంచి సూచనలు తీసుకుని, 1930 లో పెన్నుల తయారీ ప్రారభించారు. 14 కేరట్ల బంగారు పాళీలు రూపొందించి, ఇంగ్లాండ్ నుంచి ఇరేడియం పాయింట్లు రప్పించి, పెన్నులు తయారు చేసారు. రత్నం పెన్ ని సబ్ జడ్జి కృష్ణమాచార్య తొలిసారిగా వాడారు.
1932లో హిందూ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరైన న్యాపతి సుబ్బారావు పంతులుగారి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా వచ్చిన ఆర్డర్ మేరకు వెండితో రెండు పెన్నులు తయారుచేసి, బంగారం పాళీలు అమర్చి అందించారు. అప్పట్లో ఈ విధంగా రూపొందించిన పెన్ను ఖరీదు కేవలం రెండు రూపాయల పావలా.
దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు రత్నం పెన్నులను వాడారు. మరెందరో రత్నం సంస్థను దర్శించారు. 1936లో తిరువనంత పురం మహారాజా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, వివి గిరి, 1937లో పండిట్ నెహ్రూ, సి.ఆర్.రెడ్డి, మొసలికంటి తిరుమలరావు, ఆచార్య వినోబా భావే,
దుర్గాబాయి దేశముఖ్, కమలాదేవి ఛటోపాధ్యాయ, 1947 లో మద్రాస్ గవర్నర్ ఆర్చ్ బాల్డ్ నై, 1955 లో టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, 1958లో నీలం సంజీవరెడ్డి (మాజీ రాష్ట్రపతి), ఆనాటి గవర్నర్ భీమ సేన్ సచార్, తదితరులు రత్నం పెన్ వర్క్స్ సందర్శించి, పెన్నులు స్వీకరించారు.
రష్యా ప్రెసిడెంట్ బల్కానియాన్ క్రుచేవ్, అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్, జర్మనీ చాన్సలర్ అర్బన్ నాన్ తదితర ప్రముఖులకు రత్నం పెన్నులు పంపబడ్డాయి.

కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి, ప్రస్తుత పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, పూరి శంకరాచార్య,
శివానంద ఆశ్రమ అధిపతి ఇలా ఎంతో మంది స్వామిజీలు రత్నం పెన్నులను స్వీకరించి, ఆశ్సీస్సులు అందించారు.రత్నం బాల్ పెన్ వర్క్స్ కి అనేక అవార్డులు లభించాయి. 2012 డిసెంబరులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన రత్నం సన్ వర్క్స్,2014 మేలో ఎవరెస్ట్ వరల్డ్, సృజన పత్రికలలో చోటు దక్కించుకుంది.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

6 Nov
#BhaiDooj #bhaiduj #భగినీహస్తభోజనం
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో, సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము. ఇది ఒక సనాతన, కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము. ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి. ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ...
అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి, చేయించాలి.ప్ర్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్ర అనుబంధాలు, ఆప్యాయతలు మెండుగా ఉండేవి. పండుగులకు, పబ్బాలకు, ఉత్సవాలకు, గ్రామ వేడుకలకు, ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు.
అది ఎంతో మంచి సంప్రదాయము. నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక, టైం లేదని వాపోతుంటారు. మన సంస్కృతిలోని పురాణ కథలు, వ్రతాలు, నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు,
Read 16 tweets
5 Nov
శ్రామికుల పక్షాన నిలిచిన కవి
దోపిడీ సంస్కృతిని నిరసించిన కవి
ఒక ధృడమైన సంకల్పం వున్న కవి
చేతిలో కలమే ఆయుధం
అలాంటి సంకల్పం వున్న కవి
మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి
ఆయన జయంతి సందర్భంగా.....🌹💐🌺🌼🇮🇳

జననం 5 నవంబరు 1925
మరణం 9 సెప్టెంబరు 1978 Image
కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా కీర్తిని సాధిస్తారు. ఆ కీర్తితో పాటుగా వచ్చే సౌఖ్యాలనూ అనుభవిస్తారు. మరికొందరు ఉంటారు! వారి జీవితం సాహిత్యం కోసమే అన్నట్లుగా సాగుతుంది. ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు.
కీర్తి వస్తోందా లేదా, డబ్బు అవసరమా పాడా... అన్న మీమాంసలేవీ వారిలో కనిపించవు. వారి నిర్లక్ష్యానికి తగినట్లుగానే పేదరికంతోనే సదరు జీవితం గడిచిపోవచ్చు.
Read 4 tweets
5 Nov
నేడు కార్తీక మాసం ప్రారంభం మరియు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు కేదార్ నాథ్ నందు పునః నిర్మించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సమాధికి పూజాధికాలు నిర్వహించి, వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా
#Kedarnath #Pushpagiri #AdiShankaracharya
#KedarnathDham #Kadapa Image
కడప జిల్లా శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాధ స్వామి దేవస్థానం పుష్పగిరి గ్రామం వల్లూరు మండలం లో దేవస్థానం నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. 🙏
#AdiShankaracharya
#Kedarnath #Pushpagiri Image
*ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలోని ఏకైక శంకర ఆద్వైత పీఠం పుష్పగిరి పీఠం. ఇక్కడ అద్వైత పీఠాన్ని ఏర్పాటు చేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. చంద్రమౌళీశ్వర లింగాన్ని పీఠంలో ఉంచారు. పుష్పగిరి కడపజిల్లాలోని చెన్నూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖ హరిహర క్షేత్రం Image
Read 16 tweets
5 Nov
#GunPowderDay 💥
గన్ పౌడర్ అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం, పెట్లుప్పు) మిశ్రమం. ఇది నల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని నల్ల మందు అని కూడా అంటారు. దీనిని మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ లోను, తుపాకులలోను ఉపయోగిస్తారు.ముఖ్యముగా దీనిని తుపాకులలో ఉపయోగిస్తారు కనుక #gunpowder
దీనికి తుపాకి మందు అనే పేరు వచ్చింది. ఇది చాలా వేగంగా మండుతుంది, వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి.
గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి తుపాకి లోపల వుండే తూటా నుండి బుల్లెట్ ను
Read 8 tweets
5 Nov
#GovardhanPuja
శ్రీకృష్ణ పరమాత్మ దేవాధిదేవుడు. సమస్త జీవరాశుల సంరక్షకుడు. ప్రతి జీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవే ప్రకృతి నియమాలు. అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే. ఆ విధంగా ప్రతి జీవికీ ఆయన రక్షణ ఉంటుంది. #JaiSriKrishna #govardhanpooja #govardhanpuja2021
అయితే అన్యదా శరణం నాస్తి అనే విశుద్ధ భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు. ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే, చేసిన శపథాలను పక్కన పెట్టయినా సరే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. తానే సర్వస్వం అని భావించే తన భక్తులను
ఎలా కాపాడుకోగలడో తెలియజెప్పేదే గోవర్ధన లీల. గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు. గిరిరాజ చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడనే మహానుభావుడు పులస్త్య మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు. అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు.
Read 6 tweets
4 Nov
#CandyDay #Candy మిఠాయి , స్వీట్స్ లేదా లాలీస్ అని కూడా పిలుస్తారు, చక్కెరను ప్రధాన పదార్ధంగా కలిగి ఉన్న ఒక మిఠాయి. చక్కెర మిఠాయి అని పిలువబడే ఈ వర్గంలో చాక్లెట్ , చూయింగ్ గమ్ మరియు షుగర్ మిఠాయిలతో సహా ఏదైనా తీపి మిఠాయి ఉంటుంది.
చక్కెరతో మెరుస్తున్న మరియు పూసిన కూరగాయలు, పండ్లు లేదా గింజలు క్యాండీ అని అంటారు. క్యాండీలు సాధారణంగా భోజనం మధ్య అల్పాహారంగా, సాధారణంగా వేళ్ళతో తింటారు. చెక్కర మిఠాయి దినోత్సవం🍡🍭🍬 #CandyDay

కాండీ యొక్క మూలాలు ప్రధానంగా ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి.
చక్కెర అనే పదం సంస్కృత పదం షార్కర నుండి వచ్చింది.పురాతన భారతదేశంలో చెరకు రసాన్ని ఉడకబెట్టడం ద్వారా చక్కెర ముక్కలు ఉత్పత్తి చేయబడ్డాయి మరియు ఖండాగా వినియోగించబడతాయి.

చిన్నప్పుడు నాకు ఆరెంజ్ మిఠాయి అంటే భలే ఇష్టంగా ఉండేది.
Read 9 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(