#BabyDay 🍼👼🚼
అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు,
క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.
👶చంటిపిల్లలకు తల్లిపాలు ఆరు నెలల వరకు సరిపోతాయి. తల్లిపాలతో పాటు అదనపు ఆహారం 6 నెలల నుండి ప్రారంభించాలి, మొదటిగా పండ్లరసం వంటి ద్రవాలు తరువాత ఆకుకూరలు, కూరగయలు ,పప్పులు ,ధాన్యాలు కలగలిపినటువంటి గుజ్జు పదార్థాలు, క్రమేపి ఇడ్లి , అన్నం వంటి ఘనపదార్థాలు ఇవ్వాలి .
👶పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్ళు , తాజా ఆహారం ఇవ్వాలి, లేకుంటే నీళ్ళవిరోచనాలు కలుగుతాయి .
👶సంవత్సరం వయస్సు పిల్లలకు అన్ని ఆహారపదార్థాలు తినడం అలవాటు చేయండి .
👶పిల్లలకు ఇష్టంలేని ఆహారం తినమని బలవంతం చేయడం వలన వారికి ఆహారం మీద అసహ్యం కలుగుతుంది కాని పిల్లలకు అన్ని రుచులు ,
అన్ని రకాలయిన ఆహారపదార్థాలు తినిపిస్తుండాలి
👶మన రాష్ట్రంలో పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు,పుట్టిన బిడ్డ 2.5 కిలోల కన్నా తక్కువ బరువు వుంటే వైధ్య సంరక్షణ ,పర్యవేక్షణ చాలా అవసరం .
👶బిడ్డ అనారోగ్యం నుండి కుదుటపడ్డాక కనీసం ఒకవారం పాటు ఎక్కువ ఆహారాన్ని పెట్టాలి, ఆవిధంగా బిడ్డ పొగొట్టుకున్న బరువుని,బలాన్ని తిరిగి పొందుతారు .
👶కుటుంబం రోజు తినే ధాన్యాన్ని శిశువుకి తొలి ఆహారం తయారుచేయడానికి వాడాలి.రవ్వ ,గోధుమపిండి, దంచిన బియ్యం, రాగులు, సజ్జలను ఉడికించి
చేసిన జావకు కొద్దిగా పాలు లేదా నీళ్ళు కలిపి తినిపించవచ్చు.
👶ఏదయినా ధాన్యాన్ని వేయించి పొడి చేసి మరుగుతున్న నీటితో కలిపి చక్కరవేసి కాసింత నెయ్యి లేదా నూనెను జోడించి 2నిమిషాలు ఉడికించి తొలి అనుబంధ ఆహారాన్ని తయారుచేసి శిశువుకు ఆరవ నెల నిండిన వెంటనే తినిపించవచ్చు.
చక్కర లేదా బెల్లం లేదా నెయ్యి లేదా నూనె కలపటం చాలా ముఖ్యం.
👶అరటిపండు, బొప్పాయి, సపోటా, మామిడి పండు మొదలైన వాటిని కూడా గుజ్జుగా చేసి తినిపించవచ్చు.
👶ధాన్యం లేదా పప్పు మొలకెత్తిన తరువాత, నీడలో ఆరబెట్టి పొడి చేసి మాల్ట్ లాగా చేసి జావలాగా త్రాగించాలి,
చిక్కటి మిశ్ర మంగా కూడా తినిపించాలి.
🍼చిన్నారికి పాలుల పట్టేముందు, పాలు పట్టాక చేతులు శుభ్రం
చేసుకోవాలి. డజైపర్లు మార్చేటప్పుడు, పెంపుడు జంతువులను తాకిన తర్వాత కూడా కనీసం 30 సెకన్ల పాటు హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలి. మధ్యమధ్యలో చేతులకు శానిటైజర్‌ రాసుకుంటూ ఉండాలి.
తల్లితో వాటు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే. ఎవరైనా సరే..
👶పాపాయిని చేతిలోకి తీసుకొనే ముందు తమచేతుల్ని శుభ్రం చేసుకోవాలన్న విషయం మరవకూడదు. ఇక పిల్లలు కూడా నిరంతరం ఇంట్లో పాకడం, నేలపైనే పడుకోవడం,బొమ్మలతో ఆడుకోవడం... వంటివి చేస్తుంటారు.
కాబట్టి వారి చేతులనుఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
🤱వైరస్‌ వ్యాప్తి తగ్గేంత వరకూ పిల్లల్ని బేబీ వాకర్‌లో కూర్చోబెట్టుకొని అలా వాకింగ్‌ అంటూ బయటికి వెళ్లకపోవడమే మంచిది.
🍼పాలు తాగే చిన్నారులైతే.. తల్లిపాలు పట్టాలి. ఈ క్రమంలో తల్లి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఎంతో అవసరం.
అలాకాకుండా ఘనాహారం తినే పిల్లలక్రైతె పిల్లల ఆరోగ్య నిపుణులు సూచించిన పౌష్టికాహారం అందించాలి.
🎎పిల్లల్లో జలుబు, దగ్గు.. వంటి లక్షణాలుంటే అంతకుముందు మీ పిల్లల కోసం వాడిన మందులు కాకుండా.. ఓసారి మీకు దగ్గర్లో ఉండే వైద్య నిపుణులను కలిసి చికిత్స తీసుకోవడం మంచిది.
👗 పిల్లల దుస్తులు వేరుగా ఉంచాలి.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

2 May
#WorldLaughterDay 😆
1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లుబ్ గా ప్ర్రరంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి.

ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం
నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు.దాంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు.
మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల మొదటిసారిగా కోపెన్‌హాగెన్‌లో నిర్వహించారు. జనవరి 9వ తేదీన జరిగిన ఈ దినోత్సవానికి పదివేలమంది హాజరయ్యారు.
Read 33 tweets
1 May
#SchoolPrincipalsDay
#HeadMasterDay
ఈ మధ్య కాలం లో ఒక వ్యక్తికి రెండు చేతులూ జోడించి నమస్కరించాలని ఉంది.....ఎవరో కాదు....ప్రధానోపాధ్యాయుడు గా ఉంటూ... మానందరిలో ఉన్నా...కుటుంబసభ్యులతో ఉన్నా...ఏవో ఆలోచిస్తూ...ఎంతో కొంత ఆందోళనతో...కాస్తా అసహనంతో....
@telugumaster
బైటికి చెప్పుకోలేని ఒత్తిడి లో ఉంటున్న ప్రధానోపాధ్యాయుడా నీకు వేల దండాలు.....🙏🙏🙏🙏 నీ ఒత్తిడి ఎవరు అర్థం చేసుకోగలరు.... *చిక్కుముడుల అమ్మ ఒడి...తరగని సముద్రంలా...నాడు..నేడు...తరుముకొస్తున్న...డ్రై రేషన్...నిను వీడని నీడను నేనే అనేట్టు...
దీక్షా ట్రైనింగ్...MDM, STMS, పోర్ట్ ఫోలియో ల అప్డేట్స్....* ఏమని చెప్పను...ఎన్నెన్ని చెప్పాను...HM ల తిప్పలు....ఒకప్పుడు సమర్థుడైన HM పాఠశాలని... ని స్టూడెంట్స్ ని నిరంతరం పరిశీలిస్తూ...పాఠశాలను ఒక క్రమపద్ధతిలో ఉంచేవారు.
Read 7 tweets
1 May
#WildfireCommunityPreparednessDay వేసవి వచ్చిదంటే చాలు.. అడవులను కార్చిచ్చు కాటేస్తుంటుంది. విలువైన అటవీ సంపదను దహిస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఆస్తి నష్టం, వన్యప్రాణులకు ప్రాణ నష్టం, మనుషులకు అటవీ సంపద నష్టం వాటిల్లుతుంటుంది.
#Wildfire #Seshachalam #Nalamalla @RayaIaseema
భూగోళంపై అడవుల క్షీణత మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వృక్ష సంపద తరిగేకొద్దీ కరవు కాటకాలు, తుపాన్లు, వరదలు, ఇతర వాతావరణ మార్పులు మానవాళికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎదుర్కొనబోయే ఘోర పరిస్థితులు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి.
కొన్నేళ్లుగా భారత్‌లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కార్చిచ్చు పెద్దయెత్తున అడవులను భస్మీపటలం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కార్చిచ్చును నియంత్రించడం అభివృద్ది చెందిన దేశాలకు సైతం కష్టతరంగా మారుతోంది.
Read 17 tweets
1 May
#MaharastraDay
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర, (మరాఠీ: #महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ
సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.
మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది.
Read 6 tweets
1 May
మే దినోత్సవం లేదా మే డే (#MayDay)
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, #అంతర్జాతీయ_కార్మిక_దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. #InternationalLabourDay
భారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను సరఫరా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి
కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.
Read 19 tweets
30 Apr
#FatherOfIndianCinema #DadaSahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది.వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి Image
దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు. Image
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. Image
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!