#WorldMigratoryBirdsDay
జంతువులు, పక్షులు, కీటకాలలో వలస సహజ లక్షణం. వలస (ఆంగ్లం #Migration) అనగా రుతుక్రమంగా, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం. గుడ్లు పెట్టే స్థలాల కోసం, ఆహార సేకరణ కోసం, వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం ఈ వలసలు జరుగుతాయి. @BTelugabbayi
చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు ఒక నిర్ధిష్టమైన మార్గాలలో వలసపోతాయి. వీటిలో ఎక్కువగా ఉత్తర దిక్కు నుండి చలికాలంలో దక్షిణ దిక్కులోని ఉష్ణ ప్రాంతాలకు వలసపోయి గుడ్లను పెట్టి, పొదిగి, పిల్లలతో తిరిగి వాటి ప్రాంతాలకు తిరిగివస్తాయి.
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2006 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మే నెల రెండవ వారాంతంలో జరుగుతున్నది. ప్రతి ఏటా మే నెలలో వచ్చే రెండో శనివారాన్ని ఈ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మే నెలలో 8 తేదీలో వలస పక్షుల దినోత్సవాన్ని జరుపతలపెట్టారు.
ఈ దినోత్సవం నాడు వలస పక్షులు, వాటి నివాస ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం, అవగాహనా కార్యక్రమాలు, పక్షుల పండుగలు, వలస పక్షుల విజ్ఞాన విషయాలు, వలస పక్షుల పరిశీలనకై వాటి నివాస ప్రదేశాల సందర్శన మొదలగునవి జరుపుతారు.
కొల్లేరు, ఉప్పలపాడు, కొండకర్ల.. మన రాష్ట్రంలో పక్షులు, వలస పక్షులకు స్థావరాలివి. పక్షి ప్రేమికులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ ప్రాంతాలనే సందర్శిస్తుంటారు. లేదంటే రాజస్తాన్, గుజరాత్ వంటి చిత్తడి నేలలు ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు.
ఫ్లెమింగోలు, స్టార్కు జాతి కొంగలు, పెలికాను పక్షులు, గద్ధ వంటి అనేక జాతుల పక్షులు సుదూరం ప్రయాణిస్తాయి. ఆయా ప్రాంతాలకు వలస వచ్చే పక్షుల కోసం ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. వలస పక్షులకు ఆయా ప్రాంతాల అభివృద్ధితోనూ ముడిపడి ఉంటుంది.
ఆహారంకోసం సూర్యరశ్మి కోసం పక్షులు అనుకూల పరిస్ధితులు గల ప్రదేశాన్ని ఎన్నుకుంటాయి. పక్షుల ప్రత్యత్పత్తి కాలము కూడా అదేకాలము అవటం వల్ల వలన పోతాయి. ప్రతికూల పరిస్ధితులలో వాటి సంతానం సక్రమంగా పెరగలేకపోవడం, మరణించడం జరుగుతాయి. తమ జాతిని నిలబెట్టేందుకు పక్షులు వలన జరుపుకుంటాయి.
పక్షుల వలసలో భిన్నత్వం కనిపిస్తుంది. కొన్ని పక్షులు పగలు మాత్రమే ప్రయాణం చేస్తాయి. ఉదా : గల్ పక్షులు, కాకులు. కొన్ని పక్షులు రాత్రిపూట ప్రయాణం చేస్తాయి. ఉదా: పిచ్చుకలు. కొన్ని పక్షులు పగలు, రాత్రి నిరంతరము గమ్యం చేరేవరకు ప్రయాణం చేస్తాయి.
ఉదా: ఫ్లోవర్. ఇది ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తుంది. కాబట్టి దీనిని “నాన్ స్టాప్ బర్డ్” అంటారు. పక్షులు వలసపోయే వేగము గంటకు 30కి.మీ నుండి 60కి.మీ ఉంటుంది. ఇవి ఇంచుమించు 900 మీటర్ల ఎత్తునుండి 100 మీటర్లు మించి ఎగరలేవు. సాధారణంగా ఇవి మేఘాల దిగువ స్ధాయిలోనే ఎగురుతాయి.
వలసలో పక్షులకు ఎన్నో అటంకాలు ఎదురవుతాయి. కొండలు, సముద్రాలు దాటినపుడు మంచువర్షాలు, తుఫాన్ లు సంభవిస్తే గమ్యస్ధానం చేరకుండానే మరణించడం లేదా దారి తప్పిపోవడం గానీ జరుగుతుంది. ఆహారపు కొరత శత్రువు గమనంలో నిరోధకాలుగా వుంటాయి.
రాత్రి ప్రయాణం చేసినపుడు పక్షులు రంగుల కాంతులకు భ్రమపడి విద్యుద్ఘాతానికి గురి అవుతాయి. తక్కువ ఎత్తులో ప్రయాణం చేసే చిన్న జీవులకు విద్యుత్ తీగలు కూడా మరణానికి హేతువులు.
వలస పోవడంలో ఒక తమాషా ఉంది. పక్షులు ప్రతి సంవత్సరం ఒకే ప్రదేశానికి వెళుతుంటాయి. వలస పోయే సందర్భంలో వలస వెళ్ళే ప్రాంతానికి ముందు సురక్షిత వాతావరణంలో ఆగుతాయి. అందులో మగపక్షులు ఫైలట్ లా వచ్చి కిందటి సంవత్సరం నివసించిన ప్రాంతం జివనయోగ్యమా! కాదా ! అని పరిశిలస్తాయి.
అక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటే వాటి పాట గూడులను పడద్రోసి వెళ్ళిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఆడ మగ పక్షులు కలిసి వస్తాయి. ఇవి ప్రయాణం చేసినపుడు ‘V’ ఆకారంలో చలిస్తాయి.
ప్రతి సంవత్సరము ఒకే ప్రదేశానికి ఏ ఆధారం లేకుండా ఎలా చేరుతున్నాయి?.....
పక్షులు వాతావరణంలో మార్పులను గ్రహిస్తూ, సూర్యకిరణాలు ఆధారంగా చేరుకుంటున్నాయని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తాయి.
వాతావరణంలో కొద్ది పాటి మార్పులు, ప్రకృతి లో వైవిద్యం నీటి ఉష్ణోగ్రతలో గల తేడాలను బట్టి పక్షులు ప్రయాణం చేయడం ప్రారంభిస్తాయి.
పక్షులు వలస రావడానికి ముందు వాటిలో కొన్ని ప్రత్యేకమైన పొందికలను ఏర్పరచుకుంటాయి. కొని వేల మైల దూర ప్రయాణం చేయడానికి వాటికీ శక్తి అవసరము. శక్తిని పొందుటకు అవి ఆహారం స్వీకరించిన తర్వాత కంత జీవవ్యపారులకు వినియోగించిన మిగిలినది క్రొవ్వు రూపంలో నిలువ చేసుకుంటాయి.
ఈ క్రొవ్వును వలస పాయినపుడు ఉపయోగించుకుంటాయి. ఈకలు ఉదా: నిర్మోచనం చేసుకొని, క్రోత ఈకలను పెంపొందించుకుంటాయి. దీనివలన శరీరానికి అదనపు శక్తి వస్తుంది. క్రొత్త ఈకలను పటుత్వం కలిగి సక్రమంగా ఎగిరే శక్తి వస్తుంది. సంతానోత్పత్తికి ముందు అవి కొని రకాల హార్మోన్ లను ఉత్పత్తి చేస్తాయి.
వీటివలన పీడనం అధికం అయి వలస సుగమం అవుతుంది. mag పక్షులలో ప్రత్యేకమైన లక్షణాలు, రంగులు ఏర్పడతాయి.
పక్షులలో ప్రత్యుత్పత్తి కాలము డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు ఉండును. చెట్ల పై జతగూడుటకు ముందు మగ, ఆడ పక్షులు రెండూకలిసి గూళ్ళను నిర్మిస్తాయి.
ఒకే చెట్టు పై అనేక పక్షులు వాటి వాటి గూళ్ళను నిర్నించుకుంటాయి. ఇది ఒక సమాజానికి ప్రతిరూపము. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత కొంతసేపు బయట విహారం చేసి ఎక్కువ కాలం గూడుకు కాపలా కాస్తుంది. మగ పక్షులు ఆహార సంపాదన చేస్తాయి.
పక్షులలో సంతానపాలన కొన్ని వారాల వరకు మాత్రమే ఉంటుంది. ఈకాలంలో పక్షులు ఆహారాన్ని పిల్లలకు అందివ్వడం, ఎగురుటలో మెలకువలను నేర్పుతాయి. చిన్న పక్షి పిల్లలు వాటి రెక్కల్లో పటుత్వం రాగానే తక్కువ ఎత్తులో కొమ్మల పై ఎగరడము సెలయేరులో పారే నీటిలో చేపలను వేటాడటం ప్రారంభిస్తాయి.
పక్షి పిల్లలకు ఎగిరేశక్తి సంపూర్ణంగా అందగానే తల్లిదండ్రులను అనుసరించి స్వదేశానికి చేరుకుంటాయి. అవి చేరేసరికి స్వదేశంలో శీతలం తగ్గి వసంతం ప్రారంభమై ఉంటుంది.
సరస్సులు నిర్మలంగా ఉండటము, జలచరాలు పుష్కలంగా లభించడం వల్ల మన దేశానికి కొన్ని వందలజాతుల పక్షులు వేలసంఖ్యలో వచ్చి మనల్ని
అలరిస్తూన్నాయి. మన రాష్టంలో నెల్లూరు జిల్లా వద్ద పులికాట్ సరస్సుకు 145 రకాల పక్షులు నలుమూలలనుంచి వస్తున్నాయి. ఈ పక్ష్లులు నలుమూలలనుంచి వస్తున్నాయి. ఈ పక్షులు ముఖ్యంగా సైజిరియా, చైనా, ఉత్తరఅమెరికా, దక్షణ అమెరికా, ఉత్తర అట్లాంటిక్ నుండి వస్తాయి.
ఈ ప్రదేశానికి పెయింటెడ్ స్ట్రాక్, పెలికాన్స్ డాక్టర్, గూడబాతులు, స్తున్బిల్, బ్రౌన్ హెడెడ్ గల్, బ్లాక్ హెడెడ్ గల్, ఇండియన్ రీఫ్ హెరాన్, పర్పుల్ రండ్ట్, సన్ బర్డ్ వైట్ ఐబిస్, ఇండియన్ మూర్ హెన్, బిపెన్ బిల్ స్ట్రాక్ మొదలగు పక్షులు ఎక్కువ సంఖ్యలో వస్తాయి.
అవి నవంబరునుండి ఏప్రిల్ వరకు ఉంటాయి. మే నెలలో స్వదేశానికి చేరుకుంటాయి.
మంచినీటి సరస్సు అయిన కొల్లేరుకు కూడా వందల జాతుల పక్షులు వలస వస్తాయి. అవి డిసెంబరు నుండి మార్చి వరకు గడిపి ఏప్రిల్ లో స్వదేశానికి వెళ్ళిపొతాయి.
ఈ ప్రదేశానికి కూడా సైబీరియా, చైనా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, యూరప్, ఫిజి, పర్షియా మొదలగు దేశాలనుండి వలస వస్తాయి. కొల్లేరు ప్రాంతానికి భూచరజీవులు, జలచర జీవులు వస్తాయి. కొన్ని రకాల పక్షులు నీటిలో జీవనం సాగిస్తాయి. కొన్ని రకాల పక్షులు చెట్ల పై జీవనం గడుపుతాయి.
ఈ ప్రాంతానికి ఫైట్ క్రస్టేడ్ కుకూ ఇండియన్ కొయిల్ (హిమాల యాలునుండి), బ్రాహ్మల్ కైట్, రెడ్ క్రి స్టేడ్ ప్రోబార్డ్, గోసిఐబీస్, గార్గినీ, ఫిన్టైల్స్, బ్లాక్ బిట్టరన్, స్కోడ్ డక్, లార్జ్ విజిటింగ్ టైల్ మొదలుగునవి కొల్లేరును చేరుకొని సంతానోత్పత్తి నిర్వహించి స్వదేశంకు చేరతాయి .
ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలీనిలాపురం, తేలుకుంచి వంటి ప్రాంతాలకు సైబీరియా పక్షులు అయిన పెయింటెడ్ స్టార్క్, పెలికాన్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చి సంతానం అభివృద్ధి చెందిన తర్వాత కనుమరుగు అవుతాయి. తేలినీలాపురంలో పక్షులను గమనించుటకు ప్రత్యేకమైన వాచ్ టవర్ కలదు.
వలస పక్షులు పల్లె ప్రజల మధ్య చెట్ల పై జీవనం సాగిస్తాయి. అక్కడ ప్రజలు కూడా వలస పక్షులు ను అతిధులుగా భావిస్తారు. ఈ పక్షులు వాటి పిల్లలలోకోసం గూడు రక్షిస్తున్న పక్షికి 2 లేదా 3 కేజీలు బరువున్న చేవలను తెచ్చి అందిస్తాయి. పొరపాటున చెపక్రిందపడితే అవి ఆహారంగా తిసుకోవు.
క్రింద పడిన పక్షిని కూడా గూటిలో చేర్చకు క్రిందకు తోసివేస్తాయి.పక్షులు విడుదలచేసి రెట్టను పంటపొలాల్లో వేయుట వలన అధిక దిగుబడిని రైతులు సాధిస్తున్నారు.
పిట్టమాంసం రుచి అని హంటింగ్ నా వృత్తి అని షూటింగ్ నాహాబి అనే వారి వల్ల ఎన్నో పక్షులు బలి అవుతున్నాయి. ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా వాటి సంఖ్య తగ్గుతున్నాయి. అతిధులు గా వచ్చిన జీవులను అందరించాలి అనే కనీస ధర్మం ప్రతి ఒక్కరూ పాటిస్తే పక్షులకు స్వరణయుగమే!
ఈ ఏడాది థీమ్ ‘ సింగ్, ఫ్లై, సోర్ లైక్ ఎ బర్డ్'
పక్షిలాగా - పాడండి, ఎగరండి, పై ఎగరండి.
ఈ థీమ్ ప్రజలను ఎక్కడున్న , ఎప్పుడయినా , ప్రకృతితో ముడిపడి పక్షులను వినిండి, వీక్షించండి అని ఆహ్వానిస్తుంది. #SingFlySoar#LikeABird
🎶కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి 🎵🐦🕊🦅
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#EgoAwarenessDay#Ego
తనను తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి మూర్ఖుడు వేసుకొనే ముసుగే 'అహం'. 'నేను' అనే భావన కూడా అహం అవుతుంది. ఆంగ్లంలో అహాన్ని 'ఈగో' అంటారు. మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకం లో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు అవశ్యకాలతో జత చేయడానికి
మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే.
'అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది.
బైబిల్ గ్రంధం ప్రకారం 'అహం' అనేది ఏడు మహా పాపాల్లో ఒకటి. గర్వం వలె అహం కూడా మనిషి పతనానికి దారి తీస్తుంది.
ఒక సంస్కృత వృత్తాంతం ప్రకారం సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరి లో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న
#Salt ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు.
ఉప్పు ఉపయోగాలు అనంతం, ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరే. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది.
ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటితో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటితో కడగ మంటారు. ఇది మంచి ప్రాథమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది.
#GolfDay#Golfing 🏌️♀️🏌️♂️⛳ 🔮
గోల్ఫ్ (#Golf) నిర్ణీత పచ్చిక ప్రదేశములో వివిధ రకాల తెడ్డు వంటి సాధనములతో వేరువేరు ప్రదేశముల నుండి బంతులను నిర్ణీత ప్రదేశములలోని గుంతల లోనికి కొట్టే పశ్చిమ దేశాలవారి ఆట. మన తెలుగు వారి గోళీల ఆట వంటిది.
దీన్ని పెద్ద పెద్ద మైదానాలలో ఆడతారు. గోల్ఫ్ ఆట 14వ శతాబ్దంలో స్కాట్లాండ్లో మొదలయింది.తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.ఈ ఆటలో బంతిని వరుసగా కొన్ని రంధ్రాలలో పడేలా కొట్టాలి. ఏ ఆటగాడైతే తక్కువ సార్లు బంతిని కర్రతో కొట్టి గుంటలలో పడేలా చేస్తాడో అతనికి ఎక్కువ మార్కులు వస్తాయి.
గోల్ఫ్లో రబ్బరుతో తయారైన గట్టి బంతిని ఉపయోగిస్తారు. అమెరికాలో ఈ బంతి వ్యాసం 1.68 అంగుళాలు. బ్రిటన్లో 1.62 అంగుళాలు ఉంటుంది. సాధారణంగా దీని బరువు 46 గ్రాములు ఉంటుంది. ఈ క్రీడలో ఉపయోగించే కర్ర ముందరి భాగం కొంచెం వంపు తిరిగి ఉంటుంది. దీన్ని క్లబ్ అంటారు.
#WorldLupusDay #lupusday 🦋 🎗
లూపస్ ఒక తీవ్రమైన వ్యాధి. దీన్నే ఎస్ఎల్ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్) అని కూడా అంటారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులను ‘ఆటో ఇమ్యూన్ జబ్బులు’ అని అంటారు.
లూపస్ కూడా ఓ ఆటో ఇమ్యూన్ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి దీని లక్షణాలు. వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి దీనికి కారణం. 17 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇది వస్తుంది.
దీనిపై అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన ప్రపంచ లూపస్ నివారణ దినం జరుపుతున్నారు. చిన్న వయసున్న వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంటుంది.
#OneDayWithoutShoesDay 🦶👣
మనిషి జీవితంలో పాదరక్షలు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడవడం అంటే సాహసం చేసినట్లే. అందుకే పాద రక్షకాలను అందరూ ధరిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా పేదరికంతో పాదరక్షణలు కొనే స్థోమత లేక ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి వారికి మద్దతుగా
ఈ రోజు పాద రక్షణలు లేకుండా ఒక రోజు ఉంటూ వారికి పాదరక్షణలు విరాళంగా ఇస్తారు..
ఈ విధంగా నేడు "పాద రక్షణలు లేకుండా ఒక రోజు" దినోత్సవం జరుపుకుంటారు.
అసలు చెప్పులు ఎలా వచ్చాయో తెలుసా?
పూర్వం ఓ రాజుగారికి, తన రాజ్యం మొత్తం చుట్టిరావాలని, మదిలో కోరిక కలిగిందంట.
రాజు తలచుకుంటే..! అన్న చందాన,వెంటనే మంత్రిని పిలిచి,రాజ్యామంతా ఎర్ర తివాచితో కప్పమన్నాడంట!ఆ మంత్రిగారు నేర్పుగా రాజుకి ఇలా చెప్పాడంట.అయ్యా! మహారాజా! రాజ్యమంతా తివాచి పరచాలంటే,మన సంపద సరిపోదు సరికదా!ఒక వేళ, ఆ పని ఆరంభించినా..
పూర్తి కావడానికి జీవిత కాలం చాలదు.
#MotherOceanDay
🌊⛵🚢🚤🏄♀️🏄♂️🤽♂️🚣♂️🚣♀️
సముద్రం ఓ ప్రపంచం. లక్షలాది జీవరాశులకు కన్న తల్లి.
పద్యం రాస్తున్నాను
సముద్రం చూస్తూ ఉంది
స్ర్తిలింగం పుంలింగం ధరించిన జలధి
ఒకరికి తండ్రి సముద్రుడు
ఒకరికి తల్లి సముద్రం! #MotherOcean #oceans#MothersDay
ఉధృతమై అలలు ముందుకురుకుతుంటే
ప్రమాదాన్ని పసిగట్టి సముద్రుడు
ముక్కుతాడేసి లాగుతుంటాడు
అలల్లో చిక్కిన మానవుడు
అసువులు బాసినపుడు
అలలెంతగా కన్నీరు విరజిమ్ముతాయో
వీక్షకులు ప్రత్యక్ష సాక్షులు
విగత జీవుల్ని వొడ్డుకు చేర్చి
సముద్ర గర్భంలో ఎవరూ దాగిలేరని
శే్వతపత్రం విడుదల చేస్తుంది
నిద్రించే చరాచరాలకు
మేల్కొల్పు చెప్పటానికి
సముద్రం నిత్యం ఘోషిస్తుంది
సూర్యుడు చంద్రుడు తన బిడ్డలని
పగలు రాత్రి తోడుండే అమరులని
మురిపెంగా చెప్పి మురుస్తుంది!
సముద్రుడు అరిస్టాటిల్కు
ప్రియాతి ప్రియమిత్రుడు
వొడ్డున నిల్చిన వీక్షకులకు
ఓడను పైనించి కిందికి
అంచెలంచెలుగా చూపి